Posts

Showing posts from August, 2023

వేదో2ఖిల ధర్మమూలం

🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " తస్మాత్ శాస్త్రం ప్రమాణం    తే కార్యాకార్య వ్యవస్థితౌ,   జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం    కర్మ కర్తుమిహార్హసి "               - భ.గీత 16:24 పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని. ఎంత అద్భుతం. పరమాత్మ తను చెప్పింది చెయ్యమనలేదు. శాస్త్రాలు ఏది చెబుతున్నాయో అది చెయ్యి అన్నారు. " వేదో2ఖిల ధర్మమూలం " - అన్ని ధర్మములకూ మూలం వేదమే. వేదం నుంచే ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు వచ్చాయి. ఏది చెప్పినా ధర్మం గురించే. శ్రీరాముడు కూడా ఏది చెప్పినా " శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి, ఋషులు ఇలా తెలియచేస్తున్నారు " అనేవారు ఎప్పుడూ.  సనాతనధర్మానికి పునాదులు అద్భుతమయిన, శక్తివంతమయిన మన " గ్రంధరాశి, ఋషులు, తీర్థాలు, క్షేత్రాలు ". ఋషులు తాము దర్శించి, ఆచరించిన తరువాత దానిలోని మంచిని మాత్రమే లోకకళ్యాణం కోసం మనకు అందించారు. వివేకానందులు చికాగో సర్వమతసమ్మేళనంలో " సోదరసోదరీమణులారా, ప్రపంచమతాలకు తల్లి అయిన సనాతనధర్మం, నా భారతద...

శ్రీసూక్తం

🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " విశ్వప్రియే        విష్ణు మనో2నుకూలే    తత్పాదపద్మం        మయి సన్నిధత్స్వ "                       -  శ్రీసూక్తం. " నీ పాదపద్మమును నాపై ఉంచి కటాక్షించు " అని ప్రార్ధిస్తాం అమ్మవారిని.  మూకకవి/మూకశంకరులు కంచికామాక్షీ అమ్మవారి దర్శనకటాక్షంతో ఆసువుగా 500 శ్లోకాలతో అమ్మవారిని ప్రార్ధన చేసారు. అది " మూకపంచశతి " గా ప్రసిద్ధిచెందింది. అమ్మవారి ఒక్క పాదపద్మాలనే 100 శ్లోకాలతో స్తుతించారు.  ఇలా పాదాలను ఆశ్రయించడం/స్తుతించడం ఏమిటీ అని చాలామందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.  భగవద్గీత గురించి ప్రవచనం చేస్తూ ఒక పండితులు దీని గురించి ఒక అద్భుతమయిన విషయం తెలియచేసారు. " వలలో పడ్డాడు పాపం " అంటూంటారు ఎవరయినా మాయకు/మోసానికి లోనయితే. అమ్మవారు జీవులందరూ ఉత్తీర్ణులవాలని అన్ని అవకాసాలనూ కలిగిస్తుంది కాని ఆవిడపెట్టే పరీక్షలు కొంచెం కఠినంగానే ఉంటాయి.  ఎల్కెజీలో చేరడానికే ఎన్నో పరీక్షలు పెడుతూంటే ముక్తి/మోక్షం పొందడానికి ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి జీవుడు....