Posts

Showing posts from February, 2024

కొందరు " స్వయం " పీఠాధిపతులు వివాదాస్పదులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యద్యదాచరతి శ్రేష్ఠః    తత్తదేవేతరో జనః   స యత్ప్రమాణం కురుతే   లోకస్తదనువర్తతే "                - భ.గీత 3:21 " మహనీయుడయిన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును " అని తెలియచేసారు పరమాత్మ. " యధా రాజా తధా ప్రజా " అని సామెత. రాజు ఆదర్శప్రాయుడిగా ఉండాలి. అప్పుడు ప్రజలు కూడా బాధ్యతగా మసలుతారు. రాముడు అందుకే ఆదర్శపురుషుడు అయారు. వేలసంవత్సరాలుగా పూజింపబడుతున్నారు. గురువుమాట వేదవాక్కు. వశిష్టుడు వారి కులగురువు. తిరిగివచ్చి రాజ్యాన్ని స్వీకరించమని ఎవరు చెప్పినా రాముడు వినకపోవడంతో వశిష్టుడిని నచ్చచెప్పమంటారు. " తండ్రి మరణించాక పెద్దకుమారుడు రాజ్యాన్ని స్వీకరించి పాలనచెయ్యడం శాస్త్రసమ్మతమే కాని అధర్మం కాదు, వచ్చి రాజ్యాన్ని స్వీకరించు " అని వశిష్టుడి చెప్పినా రాముడు ఒప్పుకోలేదు. " అది ఋజువర్తనం కాదు, అలా నాలాంటివారు చేస్తే ప్రకృతి ( సూర్యుడు, భూమి, గాలి, నీరు వంటివి ) సహకరించదు, కరువుకాటకాల...

సంసారం బురదలాంటిది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " సంసారపంకనిర్మగ్న సముద్ధరణపండితా " - అమ్మవారి ఒక అత్యద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 880 వ నామం. దీనిలో రెండు అద్భుతపదాలున్నాయి. ఒకటి " పంక " అంటే బురద. రెండు " పండితా " అంటే కుశలురాలు (స్పెషలిష్ట్) అని అర్ధం. ఈ నామానికి అర్ధం " సంసారం అనే బురదలో పూర్తిగా మునిగిపోయినవారిని పైకితీసుకురాగలిగే కుశలురాలు " అని. అంటే రక్షించమని వేడుకుంటే " చెయ్యి " అందించి పైకిలాగుతుంది. సుబ్రహ్మణ్యస్తోత్రం లోనూ లక్ష్మీనృసింహస్తోత్రం లోనూ " మమదేహి కరావలంబం " - " నాకు చెయ్యి అందించి రక్షించు " అని వేడుకుంటాం. సంసారంలో దిగడమంటే బురద/ఊబి లో దిగడమనే భావన మన సనాతనధర్మంలో వేలఏళ్ళుగా ఉన్నట్లు తెలుసుకోవాలి. జీవుల తాపత్రయాల్లో అధికభాగం సంసారానికి సంబంధించినవే అని అందరికీ తెలుసు.  ఈ సంసారబాధలు మనుషులకే కాదు, దేవుళ్ళకీ తప్పవు. శంకరుడు పార్వతి ఏదో అడుగుతే " అవును కాళీ " అన్నారు. కాళీ అంటే నల్లనిది అని అర్ధం. ఆవిడ అలిగి వెళ్ళిపోయి తపస్సు చేసి " గౌరి " అయింది. గౌరి వర్ణం పాలల్లో పసుపు కలిప...

ఆయుర్వేదవైద్యం - అర్ధరాత్రి పెరుగన్నం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  మా అమ్మగారి చిన్నన్నయ్యగారు అంటే నా చినమేనమామగారు సంస్కృతపండితులు. ఆయన ఓ బాలమేధావి. కీర్తనలు అద్భుతంగా పాడేవారుట. ముఖ్యంగా ఆయుర్వేదవైద్యం చేసేవారు. పేదవారికి ఉచితంగా వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. వారు అమలాపురంలో నివసించే సమయంలో వీరి ఇంటికి నాలుగిళ్ళ అవతల ఓ బాగా డబ్బున్నాయన ఉండేవారు. ఓ రోజు ఆ ఇంటి యజమానురాలు ఏదో పనిమీద పిలిస్తే మా అత్తయ్య వారి ఇంటికి వెళ్ళారు. ఏవో మాట్లాడుతూ " మీ అమ్మాయి ఏదీ, కనిపించటంలేదు ఈమధ్య " అని మా అత్తయ్య అడిగితే ఇంటావిడ కళ్ళనీళ్ళు పెట్టుకుని ప్రక్క గదిలోకి తీసుకుని వెళ్ళారు మా అత్తయ్యని. మా అత్తయ్య హతాసురాలయింది వారి అమ్మాయిని చూసి. 10/12 ఏళ్ళు ఉంటాయి, బొద్దుగా అంచక్కా ఉండేది ఆ అమ్మాయి. సన్నగా అయిపోయి మంచానికి అంటుకుపోయి ఉంది. కళ్ళలో చైతన్యంలేదు, మాట్లాడలేకపోతూంది. ఏమయింది అని అడిగితే 20 రోజులయింది జ్వరం వచ్చి, డాక్టరుగారు మందులు ఇస్తున్నారు. ఏమీ పాలుపోవటంలేదు, రోజు రోజుకీ నీరసించిపోతూంది అని బాధపడ్డారు ఆవిడ. ఇంటికొచ్చాక మా మేనమామగారితో విషయం చెప్పి ఓసారి మీరు వెళ్ళి చూస్తే నయమేమోనండి అంటే ఆయన " డాక్టరు...

ఆయుర్వేద వైద్యులు - ఆపరేషన్స్ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 మా అమ్మగారి చిన్నన్నయ్యగారు అంటే నా చినమేనమామగారు సంస్కృతపండితులు. ఆయన ఓ బాలమేధావి. కీర్తనలు అద్భుతంగా పాడేవారుట. ఆయుర్వేదవైద్యం చేసేవారు. ఈయన చదువుతో బాటు లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంధాలన్నింటినీ శ్రద్ధగా చదివేవారు. ముఖ్యంగా శుశ్రుతుడి వైద్యవిధానం, శస్త్రచికిత్సల గురించి. శరీరంలోని భాగాలన్నిటిగురించి చెబుతూ ఉండేవారుట.  చదువు అయిపోయినతరువాత చిన్న చిన్న కత్తులు, సూదులు లాంటివి తయారు చేయించుకుని ఓ కిట్ ఎప్పుడూ దగ్గర ఉంచుకునేవారుట.  శ్రీకాళేశ్వరం ( కరీంనగర్ ) దగ్గర మంథని అని ఓ గ్రామం ఉందని అక్కడ ఎక్కువగా వేదపండితులు ఉన్నారనీ వినడంతో ఈయన అక్కడికి మకాం వెళ్ళిపోయారు 1930లలో. అక్కడ స్మార్తకర్మలు చేస్తూ వేదపాఠాలు చెబుతూ ఆయుర్వేదవైద్యం చేస్తూ గడిపేవారు.  ఆ ప్రాంతం ఏజెన్సీ అవడంతో ఓ పొలీస్ ఉన్నతాధికారి ఆ ఊరిలో మకాం చేసేవారు. ఆయన కూతురు పురిటికి వచ్చింది అక్కడికి 7 వ నెలలో. ఆ ఊరిలో ఉన్న డాక్టర్ గారు చూస్తున్నారు ఆ అమ్మాయిని. ఓ రోజు ఆ ఇంట్లోంచి ఏడుపులు వినిపిస్తే మేనమామ గారు మా అత్తయ్యను వారి ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకునిరమ్మన్నారు.‌ " కడుపులో పిల్ల చనిప...

ముక్కు వైద్యులు - ఆయుర్వేదం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 ప్రాచీనభారతీయవైద్యం ఎంతో ఉత్కృష్టమయినది. ఎంతో సాధనచేసి ఋషులు మనకు అందించిన అద్భుతసంపద. " ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ " అన్నారు. అంటే సూర్యుడు ఆరోగ్యప్రదాత. ఇప్పుడు ఏ వైద్యుడి దగ్గరకు వెళ్ళినా ఓ అరగంట ఎండలో నడవడమో కనీసం కూర్చోవడమో చెయ్యమంటున్నారు. చిన్నప్పుడు మా అమ్మగారు ఎన్నో ఆశక్తికరమైన విషయాలు చెప్పేవారు. ఓ సారి మా అమ్మగారు వేరే ఊరికి ఓ శుభకార్యానికి వెళ్ళారు. అక్కడ అమ్మకు విపరీతమయిన జ్వరం వస్తే కొంచెం భయపడ్డారు బంధువులు. వారి ఆయుర్వేదవైద్యుడిని పిలిచారు. ఆయన ఇంటిపేరు " ఆకెళ్ళ ". ఆయన వచ్చి నాడి పట్టుకుని " ఈవిడ పుట్టింటివారిది ఫలానా ఇంటిపేరా " అని అడగడం అందరూ ఆశ్చర్యపడి " ఎందుకని అలా అడిగారు " అంటే నాడి వారిదిలా ఉంది అని 2 డోసుల మందు ఇచ్చారు. మరునాటికి జ్వరం వచ్చిన సూచనలే లేవుట. మా ప్రక్క గ్రామంలో అన్నదమ్ములు వైద్యం చేసేవారు. ఒకాయనని కుడిముక్కు వైద్యులు అని, ఇంకో ఆయన్ని ఎడమముక్కు వైద్యులు అని పిలిచేవారు. ఏ రోగం వచ్చినా వారు ఆవైపు ముక్కు పరీక్షించి మందులు ఇచ్చేవారు. అంటే ఆ ఆ ( ఇడ, పింగళ ) నాడీపరీక్ష చేసేవారని అన...

శ్రీలలితమ్మవారి జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏 " రామా రమణలంపటా " - అమ్మవారి అద్భుత నామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 319,320 వ నామాలు.  " రామా " అంటే స్త్రీస్వరూపాలన్నీ తానైనది, " రమణలంపటా " అంటే తన భర్త యందు ఆసక్తి/అనురాగం గలిగినది అని అర్ధం.  అనుమామేముంది. ఆకులు అలములు కూడా తినకుండా, మండుటెండలో నిప్పుల మధ్య నిలబడి తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుని అపర్ణగా పూజింపబడుతున్నారు అమ్మవారు. ఆవిడకు భర్త అంటే అంత అనురాగం కనుకే భర్త హాలాహలాన్ని మ్రింగినపుడు ఆపద తప్పితే " జ్వాలాతోరణం " క్రింద నుంచి భర్తతో కలిసి 3 మార్లు ప్రదక్షణం చేస్తాను అని అగ్నిదేవుడికి మ్రొక్కుకుంది.  ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి చేస్తూ ఇలా అంటారు : " శరజ్జ్యోత్స్నా శుద్ధాం    శశియుత     జటాజూటమకుటాం,   వరత్రాసత్రాణ స్ఫటికఘటికా    పుస్తకకరాం, సకృన్నత్వా    న త్వాం కధమివ సతాం     సన్నిదధతే, మధుక్షీర     ద్రాక్షమధురిమ    ధురీణాః ఫణితయః ". శరత్కాలంలోని వెన్నెలలా శుద్ధమై చంద్రుడితో కూడిన జటామండలంతో నిండిన శిరముకలిగి ఉంటుంది అమ్మవారు....

ఆయుర్వేదం కారణం వెనుక కారణం చూస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 నిన్న ఒక అద్భుతమయిన వార్త చదివాను. సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిగారు ఓ చక్కటి విషయం తెలియచేసారు ఈరోజు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ. ఆయనకు 3 సార్లు కోవిడ్ ( కరోనా ) వచ్చిందిట. 3 సార్లూ ఆయుర్వేదం మందే వాడారుట. ఆయుర్వేదం మందులు మంచిఫలితాన్నిస్తాయని ఆయనకు సలహా ఇచ్చింది మన ప్రధానమంత్రిగారే అని కూడా తెలియచేసారు ఆయన. ఇంగ్లీషుమందుల జోలికిపోలేదన్నారు. ముఖ్యంగా ఆయన అన్నది " ఆయుర్వేదమందులు ఇంత అద్భుతంగా పనిచేస్తాయా అని ఆశ్చర్యం వేసింది. ప్రజల్లో సత్వరమే ఆయుర్వేదంమీద అవగాహన పెంచవలసిన అవసరం ఎంతయినా ఉంది " అని. కుహనామేధావులు మన ఆయుర్వేదాన్ని భ్రష్టుపట్టించేసారు. ఇంగ్లీషువైద్యం కారణం చూస్తుంది, ఆయుర్వేదం కారణం వెనుక కారణం చూస్తుంది. ఉదా. శరీరం వేడిగా ఉంటే వేడి తగ్గడానికి మందులు ఇస్తుంది ఇంగ్లీషువైద్యం. అసలు వేడి ఎందుకు పెరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసి మందులు ఇస్తుంది ఆయుర్వేదం.  ఈ వైద్యానికి ఆయుర్వేదం ( ఆయుః + వేదం ) అని పేరుపెట్టి వేదంలా గౌరవించారు మన ఋషులు. మా చిన్నప్పుడు మా అమ్మగారు ఓ అద్భుతమయిన విషయం చెప్పేవారు. 1930లలో ఓ ఆంగ్ల ఉన్నతాధికారి భార్...

హృదయంలో దీపశిఖలా ఉంటారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " మునిమానసహంసికా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 816 వ నామం. ఈనామం అర్ధం " మునుల మనస్సనే మానససరోవరమునందుండు ఆడుహంస " అని భాష్యం చెప్పారు. అమ్మవారు అన్నారు " నాహం తీర్థే, న కైలాసే, వైకుంఠేవా న కర్హచిత్ " అని - అంటే తీర్థాల్లోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో ఉండను నేను " అని. ఋషులు అడిగారు " వసామి కింతు?" - అంటే మరెక్కడ ఉంటావమ్మా అని.  " మత్ జ్ఞాని హృదయాంభోజమధ్యమే " - అంటే " జ్ఞానుల హృదయాలలో ఉంటాను " అని తెలియచేసారు అమ్మవారు. జడులు/అజ్ఞానులు గుడిలోని లింగాన్ని ఎలా చూడగలుగుతారో జ్ఞానులు తమ హృదయంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని అంతే స్పష్టంగా చూడగలుగుతారు. " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య " అన్నారు శంకరులు. అది తెలుసుకోవడమే జ్ఞానం.  మునుల మనస్సు మానససరోవరంలా స్వచ్ఛంగా ఉంటుంది. దానిలో అమ్మవారు హంసలా ఉంటారు. హంస తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అందరికీ తెలుసు.  శ్రీసూక్తంలో అమ్మవారిని ప్రార్ధిస్తూ " లోకైక దీపాంకురాం ( లోక+ఏక+దీప+అంకురాం ) అంటాం అంటే " లోకాలన్నింటికీ ఒకే ఒక...

ధర్మం వేరు. ధర్మసూక్ష్మం వేరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  ధర్మం వేరు. ధర్మసూక్ష్మం వేరు.  కొన్ని విషయాలు పైకి అధర్మంలా కనబడుతాయి. కాని తరచి విచారించి చూస్తే ధర్మమని తెలుస్తుంది. అదే ధర్మసూక్ష్మం. ఈ విషయం తార వాలితో రెండోసారి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెబుతుంది.  వాలి అంటాడు తారతో - రాముడు ధర్మాత్ముడు అంటున్నావు కదా, నాతో అతనికి శత్రుత్వంలేదు కదా, నన్నెందుకు చంపుతాడు. చంపుతే రాముడు అధర్మపరుడేగా - అని. అప్పుడు ధర్మసూక్ష్మం గురించి చెబుతుంది తార. నిన్ను చంపడం అధర్మం కదా అని అంటావు నువ్వు. కాని రాముడు పరమధర్మాత్ముడు. ఆయన ధర్మాన్ని కాదు, ధర్మసూక్ష్మాన్ని చూస్తారు. " సుగ్రీవుడు నీ తమ్ముడు. తమ్ముడు కొడుకుతో సమానం. అతను ఎప్పుడూ నీకు చెడుచేయాలని అనుకోలేదు, చెడు చేయలేదు. ఎల్లప్పుడూ నీ మంచినే కోరాడు. అతను ఎల్లప్పుడూ నీ ప్రక్కన ఉండాలి. అతనితో శతృత్వాన్ని వదిలేసి ఆదరించు " అని చెబుతుంది తార. స్త్రీజాతి ఉన్నతమనస్సును రాజనీతిజ్ఞతను ఎంత అద్భుతంగా తెలియచేసారు వాల్మీకిమహర్షి.  రాముడు బాణం వేసి కొట్టాడు వాలిని. కాని వెంటనే చనిపోయేటట్లు కొట్టలేదు. ఎందుకని?. వాలి సందేహాలు తీర్చాలి కదా. ధర్మసూక్ష్మం తె...

ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ " అభిచార మంత్రములు " అని కొన్ని ఉన్నాయి. అవి ఇంకొకరిని నాశనం చెయ్యడానికి ఉపయోగించే మంత్రాలు.  " సర్వే జనాః సుఖినోభవంతు, లోకాః సమస్తాః సుఖినోభవంతు " అని కోరుకునే సంస్కృతికదా మనది, మరి అటువంటి మంత్రాలను శాస్త్రాలలో ఎందుకు పెట్టినట్లు అన్నది కొందరి సందేహం. తప్పులేదు. వంట్లో సుగర్ బాగా పెరిగిపోయి కాలిమీద పుండు ఏర్పడిందనుకుందాం. వైద్యుడు అయ్యో కాలు తీసెయ్యడం ఏమిటి " హింస " కదా అనుకున్నా, రోగి రేపటినుంచి అందరూ " కుంటివాడు " అని పిలుస్తారేమో అని సిగ్గుపడినా విషం ఒళ్ళంతా ప్రాకడం, రోగి మరణించడం జరుగుతుంది.  " ధర్మో రక్షతి రక్షితః " - ధర్మాన్ని కాపాడితే అది తిరిగి కాపాడుతుంది. అలాగ మన ధర్మానికి, దేశానికి, సంస్కృతికి, ఉనికికే హాని జరుగుతూన్నప్పుడు అలా చేస్తూన్నవారు నశించేలా చేసి " వాటిని " రక్షించమని భగవంతుడిని వేడుకుంటూ చేసే ప్రార్ధనలే ఈ అభిచారమంత్రాలు. పోనీలే వారి పాపాన వారే పోతారు అనో, ఎవరో బాధపడతారనో, మనకెందుకులే అనో భావించి కిమ్మనకుండా కూర్చుంటే అది " మంచితనం "...

భీష్మ ఏకాదశి నేడు - ధర్మసూక్ష్మాలు -- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు" 🙏 " న తత్ పరస్య సందధ్యాత్    ప్రతికూలం యదాత్మనః " భీష్ముడు అంపశయ్యమీద ఉన్నప్పుడు ధర్మరాజు ఆయననుండి ఎన్నో ధర్మసూక్ష్మాలు తెలుసుకున్నాడు.  ధర్మరాజు " మనిషి పాటించవలసిన అతి ముఖ్యమైన ధర్మం ఏమిటి " అని అడుగుతాడు భీష్ముడిని.  అప్పుడు ఆయన పైవిధంగా చెబుతారు - " ఎదుటి మనిషి ఏపని చేస్తే నీకు కోపం, కష్టం, బాధ, అసౌకర్యం కలుగుతాయో ఆపని నువ్వు చెయ్యకపోవడమే అతి ముఖ్యమైన ధర్మం " అని. ఎంత అద్భుతమైన విషయం, 5000 ఏళ్ళ ( కనీసం అందరూ అనుకుంటూన్నట్లుగా ) క్రితం చెప్పబడింది. ఇంకో 10000 ఏళ్ళ తరువాతైనా ఇది కనుక పాటిస్తే ఏ గొడవలు ఉండవు.  మహాభారతయుద్ధం అయినతరువాత చక్రవర్తి పీఠం అధిరోహించినా ధర్మరాజుకి మనశ్శాంతిలేక బాధపడుతూంటాడు. ఆయన శ్రీకృష్ణుడిని సోదరులను తీసుకుని అంపశయ్యమీద ఉన్న భీష్ముడి దర్శనానికి వెళ్ళి " తాతా ఈ సంపదలేవీ నాకు సుఖాన్ని, మనశ్శాంతిని ఇవ్వట్లేదు. ఏమిచెయ్యాలి, ఎవరిని కొలవాలి " అని అడుగుతాడు. అప్పుడు అంతా ఈ పరమాత్మే అని నమస్కారం చేసి పరమాద్భుతమయిన " విష్ణుసహస్రం " స్తోత్రం చేస్తారు. భీష్ముడు అష్టమినాడే పరమాత్మలో లీ...

నవగ్రహదేవతలు అమ్మవారి పాదాలలో ఉన్నారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " దధానో భాస్వత్తామృత   నిలయో లోహితవపుః,   వినమ్రాణాం సౌమ్యో    గురురపి కవిత్వంచ     కలయన్! గతౌ మందో     గంగాధరమహిషి    కామాక్షి భజతాం,   తమః కేతుర్మాతస్తవ    చరణపద్మో విజయతే !!" మూకశంకరులు కామాక్షీ అమ్మవారిమీద పంచశతి చేసారు. పాదారవిందశతకంలో ఇలా ప్రార్ధించారు: అమ్మా, శివుని ఇల్లాలా, కామాక్షీ, నీ పాదకమలము ప్రకాశకత్వమును ధరించునది, మోక్షమును ఇచ్చునది, ఎర్రని ఆకృతి కలది, శాంతమైనది, గురువైనది, కవిత్వము నొనర్చునది, నడకయందు మాంద్యము కలది, తమస్సును బోగొట్టునది. ఈపద్యంలో ఓ అద్భుతం దాగి ఉంది.  1. భాస్వన్ అంటే ప్రకాశమనేకాక సూర్యుడు అని ఇంకొక అర్ధం ఉంది. భాస్వత్త అంటే అమ్మవారి చరణమునందు సూర్యత్వమున్నది అని భావం. 2. అమృతనిలయం - అమృతమంటే దేవతల ఆహారం. చంద్రుడు దేవతలకు అమృతనిలయమైన భోజనపాత్ర అనవచ్చును. అమ్మవారి పాదంలో చంద్రుడు ఉన్నట్లు. 3. లోహితవపువు అంటే అమ్మవారి పాదం ఎర్రగా ఉందని. అంగారకుడి శరీరం కూడా ఎరుపే. అంటే ఆమె పాదంలో అంగారకుడు ఉన్నట్లు. 4. సౌమ్య అంటే శాంతమనే కాక సోముడి కొడుకు సౌమ్యుడ...

మంచిపుస్తకాలే చదువుతూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కావ్యాలాప వినోదినీ " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 613 వ నామం.  " కావ్యాలాప వినోదినీ " అంటే " కావ్యపఠనంతో మిక్కిలి సంతోషించునది " అని అర్థం. " వాక్యం రసాత్మకం కావ్యం " - వాక్యాలు రసాత్మకంగా ఉంటే కావ్యం అంటారు. కావ్యాలను చదువుతూంటే విని ఆనందిస్తుంది అమ్మవారు. వేదాలలో " కావ్యాలాపాంత వర్జయేత్ " అని ఉంటుంది- అంటే కావ్య పఠనం వద్దు అని. అదేమిటీ అనుకోవచ్చు కాని దాని అర్ధం అసత్ కావ్యాలు అంటే చెత్త పుస్తకాలు చదవకండి అని. కావ్యాలు 2 రకాలు సత్ కావ్యాలు అంటే " ధర్మం, భక్తి, జ్ఞానం " లని వృద్ధిచేసేవి. అసత్కావ్యాలు అంటే సత్కావ్యాలు కానివి.  మానవులు 3 రకాలుగా కాలక్షేపం చేస్తారు అని ఈ సందర్భంగా పూజ్యులు సామవేదం వారు తెలియచేసారు. మొదటివారు సత్కావ్యాలు చదువుతూ ఉంటారు . వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే వస్తూంటాయి. అమ్మవారి అనుగ్రహం పొందుతారు. సుఖ దుఃఖాలను ఒకే విధంగా చూస్తూ జీవిస్తారు.  ఇక రెండో రకం మనుషులు. వీరు పాత బాధలను కష్టాలను తలచుకుని తలచుకుని బాధపడుతూ ఉంటారు....

భీష్మాష్టమి నేడు, భీష్ముడు మహాజ్ఞాని, తలుచుకుని తరిద్దాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 " అచింత్యాః ఖలు ఏ భావాః,    నతాంస తర్కేణ సాధయేత్ "               - ( స్మృతివాక్యం ) " మనకు అందుబాటులో లేని ఆధ్యాత్మిక వేదాంతాది విశిష్టవిషయాలను దుర్బలమైన మన హేతువాదాలతోను కుయుక్తులతోనూ సాధించుటకు ప్రయత్నించరాదు. అలా ప్రయత్నిస్తే బుద్ధి, శక్తి క్షీణిస్తుంది " అని అర్ధం. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు అలా మిన్నకుండిపోయారు ఏమిటీ అని చర్చిస్తూంటారు కొందరు కుహనా మేధావులు. భీష్ముడు జ్ఞాని, విష్ణుసహస్రాన్ని ప్రసాదించిన భాగవతోత్తముడు. ఇచ్ఛామరణం వరంగా పొందినవాడు, పరశురాముడి శిష్యుడు, తండ్రి కోరిక తీర్చడంకోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయిన యోగి. ద్రోణుడు ఆచార్యుడు - " ఆచరతి ఆచారయతి ఇతి ఆచార్యః " - అంటే తను ఆచరిస్తూ ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. అటువంటివారికి ధర్మంగురించి, బాధ్యతలగురించి గుర్తుచెయ్యనక్కరలేదు. కొన్ని అలా అలా జరిగిపోతూ ఉంటాయి. మంచి అయితే పరవాలేదు, చెడు అయితే అలా ఎందుకయిందని చూసుకుని జాగ్రత్తపడాలి అంతే కాని బాధ్యత ఎవరిది అని ఎక్కువగా ఆలోచించి ప్రయోజనంలేదు. భీష్ముడి " బాధ్యత" గురించి చర్చించాలి అనుకుంటే ...

ఆరోగ్యప్రదాత సూర్యదేవుడి పుట్టినరోజు నేడు - రధసప్తమి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " బందూకపుష్పసంకాశంం   హారకుండలభూషితం   ఏకచక్రధరం దేవం తం      సూర్యం ప్రణమామ్యహం "  మంకెనపువ్వులా ఎర్రగా మెరిసిపోతూ ఉంటాడు సూర్యదేవుడు. సూర్యుడి రధానికి ఒకటే చక్రంట. అది మన ఋషులు గ్రహించినది, చెప్పినది. సూర్యుడు సంవత్సరం పొడవునా ఒకే మార్గంలో ప్రయాణం చేయరు. ఒక్కో రాశిలో ఒక్కో కోణంలో ప్రయాణం చేస్తారు. ఇప్పుడు కంప్యూటర్ లో ప్రోగ్రాం చేసి కనిపెట్టినది ఏమిటంటే వివిధ కోణాలలో అతివేగంగా ప్రయాణం చేయడానికి ఒక చక్రమే సరైనది అని. ఎంతటి అద్భుతం మన ఋషుల విజ్ఞానం. " జామెక్కి భానుడు     జాజిపువ్వుఛాయ,    జాజిపువ్వుమీద    సంపంగి పూఛాయ,    శ్రీసూర్యనారాయణ మేలుకో    హరిసూర్యనారాయణ " " వాలుతూ భానుడు      వంగపువ్వుఛాయ    వంగపూవుమీద      వజ్రంపుపొడిఛాయ   శ్రీసూర్యనారాయణ మేలుకో   హరిసూర్యనారాయణ " సూర్యుడు ఉదయించే సమయంనుంచి సాయంత్రం వరకూ ఒక్కొక్క సమయంలో ఏపువ్వురంగులో ఉంటారో తలచుకుంటూ సూర్యుడిని మేల్కొల్పడం ఎంత అద్భుతం.  ఇంట్లో పిల్లలకు రకరకాల...

అమ్మవారి స్వభావం తేనెలా మధురం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " స్వభావమధురా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 915 వ నామం. మధురం అంటే తేనె. అమ్మవారి స్వభావం తేనెలా తియ్యగా ఉంటుంది. అమ్మవారికి లేనిదిలేదు, పొందవలసినది లేదు, ఇవ్వలేనిదిలేదు. ఆవిడ స్వభావం మధురంగా ఉండక వేరేలా ఎలా ఉంటుంది. పూజ్యులు గరికిపాటివారు తరచూ అంటూంటారు " అసలు అమ్మవారికి జీవులమీద కోపం ఎందుకు ఉంటుందండి " అని. ధర్మపాలన మూడు రకాలుగా ఉంటుంది అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. మొదటిది స్వభావధర్మం. కొందరికి ఎవరూ చెప్పనక్కరలేదు. స్వతహాగానే ధర్మపాలన చేస్తూంటారు. రాముడు, ధర్మరాజు లాంటివారు ఆ కోవలోకి వస్తారు. రాముడిని ఒక రాక్షసుడు " రామో విగ్రహవాన్ ధర్మః " అని కొనియాడాడు. అంతటి ధర్మమూర్తి. " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ " - " ధర్మంగా ఉండడం నా స్వభావం మరి, ఏమి చేయమంటావు " అంటారు ధర్మరాజు ద్రౌపదితో. ఇక రెండవరకం " ప్రభావధర్మం " - చెప్పగా చెప్పగా సాధన చేస్తూ ఉంటే అలవడుతుంది. ఇదే ఈకాలంలో ఎక్కువగా పొందగలిగినది/పొందవలసినది. సనాతనధర్మ పరిరక్షణకోసం, సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యగా చెయ్యగా అ...

" భూలోకానికి స్వర్గలోకానికి " తేడా ఏమిటి?- చీమలపాటి సూర్యనారాయణ-

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " భూలోకానికి స్వర్గలోకానికి " తేడా ఏమిటంటే భూలోకంలో సుఖానికి దుఃఖస్పర్శ, దుఃఖానికి సుఖస్పర్శ ఉంటాయి. స్వర్గలోకంలో అలాంటివి ఉండవు. అంతా సుఖజీవనమే. దశరధమహారాజు వేటకి వెళ్ళాడు. ఆయనకు శబ్దభేది అనే విద్య తెలుసు. అంటే దూరంగా శబ్దం వినబడితే శబ్దం వచ్చినవేపు బాణంవేసి దానిని చంపగలగడం. సరయూ నది వడ్డున చెట్టు చాటున నుంచుని ఉన్నాడు. నదిలో నీరు తాగుతూన్నట్లుగా " గుడ గుడ " మని శబ్దం వినబడింది. జంతువనుకుని బాణం ప్రయోగించాడు. మనిషి ఆర్తనాదం వినబడింది. గబగబా అక్కడికి వెడితే ఓ మునికుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నీళ్ళ కోసం చెంబు ముంచడంతో అలా శబ్దం వచ్చింది. అతను( శ్రవణుడు) చనిపోతూ " ఈ చెంబులోని నీళ్ళను నా తల్లిదండ్రులకు వెంటనే ఇవ్వండి " అని చెప్పి మరణించాడు. చాలాబాధతో ఆ నీళ్ళను తీసుకొనిపోయి అతని తల్లిదండ్రులకు ఇచ్చి వారి కుమారుడి మరణవిషయం చెప్పాడు. ఆ తండ్రి బాధను తట్టుకోలేక నువ్వు కూడా పుత్రవియోగంతో మరణిస్తావని దశరధుణ్ణి శపిస్తాడు.  ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ శాపం దశరధుడికి బాధకు బదులుగా పరమసంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే అంతవరకూ ఆయన...

మాఘపాదివారం - నూపప్పు జీళ్ళు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 మాఘపాదివారం నేడు. మాఘమాసంలోని ఆదివారాలన్నీ సూర్యభగవానునికి ఎంతో ప్రీతికరమైన రోజులు. సూర్యదేవుని అనుగ్రహం పొందడానికి మిక్కిలి అనుకూలమైన రోజులు. బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యవహం  స్వామి మంకెనపువ్వులా ఎర్రగా ఉంటారు. ఉదయాన్నే తూర్పుదిక్కుకి చూస్తే చాలు, ఆయన ఎలా ఉంటారో తెలిసిపోతుంది. ఆయన ఆరోగ్యప్రదాత. నదీస్నానం చేసి ఆయనకు పొంగలి నైవేద్యం సమర్పిస్తే సంతోషపడతారు స్వామి. మాగ్రామానికి 2 కిమీ ల దూరంలో గోదావరి నది ఉంది. తెల్లవారకట్టే స్నానాలకు వెళ్ళేవారు నా చిన్నతనంలో.  ప్రతీపండుగకీ ముందరరోజు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకే గరికిపాటివారు ఈ ముందరరోజుని " భోగి " అని అంటారు అని చెప్పారు. గోదావరి స్నానానికి మగవారు, పిల్లలు నడిచి లేక సైకిల్ మీద వెళ్ళేవారు. ఆడువారు ఎద్దులబండి , గుర్రపుబండి మీద వెళ్ళేవారు. మా అత్తయ్యగారికి ఎడ్లబండి ఉండేది. 4 గంల కల్లా వెళ్ళిపోయేవారం. బండి అతను ముందర నడుస్తూ వెడితే ఎద్దులు మెల్లిగా అతని వెనక నడిచి వెళ్ళేవి. నేను తొట్టెలో కూర్చుని ఎడ్లని అదిలిస్తూ ఉండడమే. ఎప్పుడయినా ఎడ్లబండి ఖాళీ లేకప...

శ్రీశ్యామలాదేవీనవరాత్రులు నేటినుండి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మంత్రిణీన్యస్తరాజ్యధూః " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 786 వ నామం. " మంత్రిణీన్యస్తరాజ్యధూః " అంటే మంత్రిణి అయిన శ్యామలాదేవికి అప్పగించబడిన రాజ్యభారం గలది.  భండాసురుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజ్యభారాన్ని శ్యామలాదేవికి అప్పగించారు అమ్మవారు. శ్యామలాదేవి ముఖ్యమంత్రిణి, మన బాగోగులు చూస్తారు. వారాహీదేవిని రక్షణమంత్రిణిగా నియమించారు, మన క్షేమంకోసం.  మాఘశుద్ధ పాడ్యమి అనగా నేటినుంచి నవమిదాకా శ్రీశ్యామలాదేవీనవరాత్రులు. భక్తులు అమ్మవారిని తొమ్మిది రోజులూ భక్తితో సేవించుకుని అనుగ్రహాన్ని పొందుతారు. అమ్మవారు ఇవ్వలేనిది లేదు. శ్రద్ధగా రాజశ్యామలయాగం చేస్తే చక్రవర్తిని చేస్తుంది.  అమ్మవారి అవ్యాజకరుణ, మహత్తు తెలియాలంటే మహాకవి కాళిదాసు ని గుర్తుచేసుకుంటే చాలు. 1600 సం.లయిపోయినా మహాకవి అంటే కాళిదాసు అని గౌరవించుకుంటున్నాం. ఆయన నాలుకమీద బీజాక్షరాలు వ్రాయగానే ఆయన చేసిన మొదటి ప్రార్ధన " శ్రీశ్యామలాదేవీదండకం ". ఇప్పటికీ ఎవరు పాడినా మనస్సు పులకిస్తుంది. అంతటి అద్భుత విద్వత్తుని ఇస్తుంది తల్లి. చైత్రశుద్ధ పాడ్యమి నుండి ...

సర్వోపనిషదుద్ఘుష్టా - వేదఘోష - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః 🙏  " సర్వోపనిషదుద్ఘుష్టా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 852వ నామం. ఈ నామానికి అర్ధం అన్ని ఉపనిషత్తులలోనూ అధికముగా " దండోరా " వేయించబడి మరీ చెప్పబడినది. " ఉద్ఘుష్టా " అంటే " ఎలుగెత్తి చాటబడినది " అని అర్ధం. ఉపనిషత్తులలో చెప్పబడినది ఏమిటి - అమ్మవారి అద్భుతగుణగణాలే గా. వేదసారమంతా అమ్మవారి గొప్పదనం గురించేగా. అదేమీ ఆవిణ్ణి పొగడడంకాదు. ఆవిడ చేస్తూన్న అద్భుతమైన కార్యక్రమాలనే చెబుతున్నాం, అది ఎంత " గఠిగా " చెబుతే అమ్మవారు అంతగా మురిసిపోతుంది. అందుకే వేదపారాయణని " వేదఘోష " అని ముద్దుగా పిలుచుకుంటారు. అందుకే శ్యామలాదండకం, శివతాండవస్తోత్రం, కాలభైరవాష్టకం, మహిషాసురమర్దినీస్తోత్రం లాంటివి ఎలుగెత్తి పఠిస్తూంటే మన బుద్ధులు ప్రచోదనచెందుతాయి, అమ్మవారు మురిసిపోతారు.  విష్ణుసహస్రం చెప్పినప్పుడు ధర్మరాజు అంటాడు భీష్ముడితో " తాతా ఇంత అద్భుతంగా ఎలా చెప్పావు " అని. ఆయన అంటారు " నేను పరమాత్మ గుణగణాలని ఉన్నవి ఉన్నట్లుగా చెప్పాను అంతే, ఆయన గుణాలు అద్భుతం కనుక నీకు అద్భుతంగా అనిపించాయి ...

వేదమే ప్రపంచ శాంతికి దిక్కు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  నిన్న తేది.06.02.2024 న మా గ్రామంలో ఋగ్వేదసభల సందర్భంగా పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు " వేదం - దాని ప్రాముఖ్యత " గురించి అనుగ్రహభాషణం చేసారు.  " వేదంలా ఘోషించే గోదావరి " - చుట్టూ గోదావరి. మధ్యలో కోనసీమలోని అగ్రహారం. ఆయన ప్రవచనామృతం గోదావరినదీ ప్రవాహంని తలపించింది. ఆయన ప్రవచనం లోని కొన్ని ముఖ్య విషయాలు: వేదం పరమేశ్వరుడి ఊపిరి. పరమేశ్వరుడే వేదం, వేదమే పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి మూలం లేనట్లే వేదానికీ మూలం లేదు. అది సృష్టించబడినది కాదు. ప్రశ్నలు రెండు రకాలు. ఇంద్రియప్రశ్న, అతీంద్రియప్రశ్న. ఇంద్రియప్రశ్న భౌతికవిషయాలగురించి. అతీంద్రియప్రశ్న కనిపించని/ఊహకందని విషయాలగురించి. మొదటిదానికి పుస్తకజ్ఞానం కావాలి. రెండవదానికి మార్గం తపస్సు. దానిద్వారానే ఋషులు వేదం ను పొందారు. అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసాడు. ఎప్పుడు?. దివ్యచక్షువులు పొందాక. శ్రీకృష్ణుడిది ఎప్పుడూ ఒకటే రూపం. కాని దివ్యచక్షువులు పొందాక అర్జునుడు స్వామి అసలురూపాన్ని/విశ్వరూపాన్ని చూడగలిగాడు. అలాగే ఋషులు తమ తపశ్శక్తితో పొందిన దివ్యకర్ణములతో వేదంని వినగలిగారు...

భ.గీత 7:16 - ప్రవచనాలు " వినడంవల్ల ఉపయోగమేమయినా ఉందా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " చతుర్విధా భజంతే మాం,   జనా స్సుకృతినో2ర్జున,   ఆర్తో జిజ్ఞాసురర్దార్ధీ    జ్ఞానీచ భరతర్షభ "              - భ.గీత 7:16 " ప్రవచనాలు " వినడంవల్ల ఉపయోగమేమయినా ఉందా అని ఎందరికో సందేహం. భక్తులు 4 విధాలు అన్నారు పరమాత్మ:  1. ఆర్తః : ఆపత్తునందున్నవాడు 2. జిజ్ఞాసుః : ( భగవంతుని)  తెలుసుకొనగోరువాడు 3. అర్దార్ధీ : ధనములను  అభిలషించువాడు 4. జ్ఞాని : జ్ఞానము కలవారు నలుగురూ నన్ను సేవించేవారే అన్నారు పరమాత్మ. భక్తులు ఉదా: 1వ రకం. గజేంద్రుడు  2వ రకం. పరీక్షిత్తు, ఉద్దవుడు  3వ రకం. సుగ్రీవుడు ధృవుడు  4వ రకం. శుకుడు సనకుడు నారదుడు. 1వ రకం లో ఒకరే చెప్పుకున్నాం. కాని మనలో చాలా చాలా ఎక్కువమంది ఆ కోవలోకి వస్తాం. ఆపద రాగానే లేక ఏదయినా ఫలితంకోసం మ్రొక్కులు, దేవాలయ సందర్శనలు, పూజలు, జపాలు మొ.గునవి చేస్తూంటాం. కాని ఆ విధంగా చేసినా నన్ను సేవించినట్లే అని అనుగ్రహించారు పరమాత్మ.  భ.గీత 7:17 లో స్వామి చెప్పినది " వీరిలో జ్ఞానులు నాకు ఇష్టులు " అని. సహజమే. కాని పరీక్షిత్తు, ఉద్దవుడు, సుగ్రీవుడు,...

తాంబూలపూరితముఖీ - తాంబూలంలో అంత విషయం ఉందా? - చీమలపాటి సూర్యనారాయణ

🙏" శ్రీమాత్రేనమః "🙏 " తాంబూల పూరితముఖీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 559 వ నామం. " తాంబూల పూరితముఖీ " అంటే తాంబూలం తో నిండిన నోరు ( ముఖం అంటే నోరు ) గలది అని అర్ధం. అమ్మవారికి తాంబూలం అంటే ఎక్కువ ఇష్టం. మహానివేదన అవగానే జాజిపత్రి పుదీనా ఏలకులు వేసిన తాంబూలం సమర్పిస్తారు. సువాసినీలు తాంబూలం తప్పకుండా వేసుకోవాలని చెబుతారు పెద్దలు. మనసంప్రదాయంలో శ్రావణమాసం, దేవీనవరాత్రులు, పువ్వుతాంబూలం, పండుతాంబూలం, పెళ్ళిళ్ళు ఇలా ఇంచుమించు ప్రతీరోజూ ఎదో ఒకరకంగా తాంబూలాలు వస్తూనే ఉంటాయి ఇళ్ళకి, ఇంట్లో పూజలో పెట్టిన తాంబూలం కాక.  మా అమ్మగారు తరచూ తాంబూలం వేసేవారు. చూసి " నాకో " అని ఏడుపు మొదలెడితే నోటిలోంచి కొంచెం పిడచ ( మేము తమ్మి అంటాం ) తీసి మానోట్లో పెట్టేవారు. అమ్మ పెట్టే తమ్మి/పిడచ కి ఎంతమహత్తు ఉంటుందో తెలుసుకోవాలంటే మనం కాంచీపురం వెళ్ళాలి.  కాంచీపురంలో ఓ మూగవాడు ఉండేవాడు. ఒంటరి కావడంతో ఊళ్ళో వాళ్ళకి ఆపనీ ఈపనీ చేసిపెట్టడం రాత్రి గుళ్ళో పడుక్కోవడం చేసేవాడు. ఆ కాలంలో ప్రయాణీకులు రాత్రి అయిపోతే ఆ ఊరిలో ఉన్న గుడిలో పెట్టే ప్రసాదం తిని ...

పాశహస్తా - కోతిని తాడుతో కట్టేసినట్లు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " పాశహస్తా, పాశహంత్రీ " - ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 810, 811 వ నామాలు. " పాశహస్తా " అంటే ( ఎడమ ) చేతిలో పాశము గలది. పాశము దేనికండీ, ఎవరిని కట్టేయడానికీ అని అనుమానం రావచ్చు. అమ్మ కదా, పిల్లల జాగ్రత్త కోసం అనుకోవాలి. ఆవులో ఎద్దులో ఉన్నాయంటే వాటిని పలుపుతాడుతో కట్టి ఉంచుతారు. బయట మేయడానికో నీరు త్రాగడానికో కట్టు విప్పుతాడు యజమాని, మళ్ళీ కట్టేస్తాడు. అమ్మవారికి తెలుసు ఎప్పుడు కట్టి ఉంచాలో ఎప్పుడు విప్పుతూండాలో. మాయలోపడి కొట్టుకుపోకుండా కాపాడుతూ ఉంటుంది. " పాశహంత్రీ " అంటే పాశాన్ని, బాధని తొలగిస్తుంది అని అర్ధం. మన తప్పులేకపోయినా అప్పుడప్పుడు కొన్ని బాధలు కలుగుతూంటాయి. ఆవిడే తొలగించేస్తూ ఉంటుంది. బాధ మరీ ఎక్కువది అయితే ఆవిడకు వదిలేయడమే మంచిది. మనం ప్రయత్నాలు చేస్తూన్నంతవరకూ ఆవిడ " తను చూసుకుంటున్నాడు కదా " అని వదిలేస్తుంది. ఈ విషయం మనం " గజేంద్రమోక్షం " లో చూడవచ్చు. ఇంకనావల్ల కాదు అని గజేంద్రుడు " శరణాగతి, నువ్వే రక్షించాలి " అని అన్నప్పుడే స్వామి వచ్చారు. అలాగే మనం ఏదయినా మంత్రజపం చేస్తూన్నప్ప...

శంకరాచార్యులు తాను అయోగ్యుడిని అన్నారు ఎందుకో?- చీమలపాటి సూర్యనారాయణ

🙏 "శ్రీమాత్రేనమః " 🙏 " పుష్కరా, పుష్కరేక్షణా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 804,805 వ నామాలు.  పుష్కరా అంటే పుష్టిని ఇచ్చునది/పోషించునది - జీవులన్నిటినీ. మరి మళ్ళీ " పుష్కరేక్షణా " ఏమిటి/ఎందుకు. ఇది ఒక అద్భుతనామం. " తామరపువ్వుల వంటి కన్నులు కలది " అని భాష్యం చెప్పారు కాని " పుష్కర + ఈక్షణ - చూపులతోనే పోషించునది " అని అర్ధం చెప్పుకోవచ్చు. శంకరాచార్యులు " నేను అయోగ్యుడిని, వెనుక వరుసలో ఉంటాను ( యోగ్యులు అమ్మవారికి ముందు వరుసలలో ఉంటారని ఆయన భావం ), నామీద కూడా నీ చూపులు ప్రసరించి అనుగ్రహించు " అని ప్రార్ధిస్తారు. దేవతలందరూ ఏవో కొన్ని కోరికలతో అమ్మవారి దర్శనానికి వస్తారుట మణిద్వీపానికి. ఆవిడ చిరునవ్వుతో కూడుకున్న కళ్ళను చూసేటప్పటికే అన్నీ మర్చిపోతారుట. " ఏమి కావాలి " అని అమ్మవారు చిరునవ్వుతో అడిగితే " ఏమీ లేదమ్మా, మీదర్శనంకోసం వచ్చాము " అని తిరిగి వెళ్ళిపోతారుట. కాంచీపురంలో " కామాక్షీ " దేవి కొలువై ఉన్నారు. కామ అంటే కోరిక. ఆవిడ కళ్ళ ( చూపు ) తోనే కోరికలను తీర్చేస్తుంది కనుక...