Posts

Showing posts from March, 2025

సౌభాగ్యాన్ని అంటే అనుభవించే అదృష్టాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భక్తసౌభాగ్యదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 117 వ నామం.  " భక్తసౌభాగ్యదాయినీ " అంటే భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది అని. ఆయుష్షు, ఆరోగ్యం, సంపదలు, భోగాలు ఉన్నా భాగ్యం చాలా ముఖ్యం. మిగతావన్నీ ఉన్నా ఈ భాగ్యం ( అనుభవించే అదృష్టం ) లేకపోతే సుఖం ఉండదు. ఈ భాగ్యాన్ని అమ్మవారే అనుగ్రహించాలి. దేవతల కోరిక మేరకు లోక కళ్యాణం, కుమారస్వామి జననం, కోసం మన్మథుడు శివుని మనసులో పార్వతి పట్ల మోహాన్ని కలిగేలా చేయడం కోసం బాణం వేసాడు. శివుడు కోపగించుకుని తన మూడో కంటిని తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు.  మరి రతీదేవి చేసిన పాపమేమిటి. అమ్మవారి పాదాలపై పడింది భర్తను బ్రతికించమని. అమ్మవారు రతీదేవికి సౌభాగ్యాన్ని ప్రసాదించారు మన్మధుడిని బ్రతికించి. ఆదిశంకరులు శ్రీలలితా పంచరత్న స్తోత్రం చేసారు. ఫలశృతిలో ఇలా తెలియచేసారు: " యః శ్లోక పంచకం మిదం    లలితాంబికాయాః      సౌభాగ్యదం సులలితం      పఠతి ప్రభాతే తస్మై    దదాతి లలితా ఝటితి    ప్రసన్నా విద్యం శ్రియం      విమల సౌఖ్యమనంత కీర్తిం " ...

మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి, ఉచ్ఛారణ బాగుండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వ్యాహృతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 421 వ నామం . " వ్యాహృతిః " అంటే ఉచ్ఛారణ రూపమయినది. ఉచ్ఛారణే అమ్మవారు. అందుకే మాట్లాడేటప్పుడు మృదువుగా ఎదుటివారికి సులువుగా అర్ధమయేంతటి స్పష్టత ఉండాలి. వాక్కు స్పష్టంగా ఉంటే వినడానికి ఇంపుగా ఉంటుంది.  వాయుపురాణమందు " నాచే బ్రహ్మచే మొదట ఉచ్ఛరింపబడిన దానివై వచ్చితివి కావున వ్యాహృతి అను పేరు ప్రసిద్ధి కాగలదు" అని ఉంది.  శ్రీసరస్వతీ ద్వాదశనామ స్తోత్రంలో " సర్వసిద్ధి కరీతస్య ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ " అని ప్రార్ధిస్తాం. ఎల్లప్పుడూ నా నాలుకమీద ఉండు తల్లీ. అప్పుడు ఏది మాట్లాడినా స్పష్టంగా, అర్ధవంతంగా ఉంటుంది. ఉచ్ఛారణ స్పష్టంగా ఉండాలి అని అంటే గట్టిగా అరవడం కాదు. వేదమాత నిజమైన సంపదలను ఆరుగా తెలియచేసారు. అందులో ఐదవది " స్వాత్మానం వాచః " - వాక్కు/మాటలు మృదువుగా ఉండడం నిజమైన సంపద అని. వేదాలు వేల సంవత్సరాలుగా మనుగడలో ఉన్నాయంటే కారణం ఈ ఉచ్ఛారణయే. ఒకరినుంచి మరొకరికి చక్కటి ఉచ్ఛారణతో అందించబడ్డాయి వేదాలు. అదే తాళపత్రాలలోనే...

ఉగాది, పరాభవ నామ నూతన తెలుగుసంవత్సర శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 ఉగాది పవిత్రమయిన, శాస్త్రీయమయిన భారతీయుల ముఖ్యపండుగ. తెలుగు వారికి తెలుగుతనం ఉట్టిపడే పండుగ. ఈ పండుగను యుగాది అని కూడా పిలుస్తారు.  ఉగ+ఆది=ఉగాది. ఉగ అంటే నక్షత్రగమనం అని భాష్యం చెప్పారు. మన జీవితమంతా నక్షత్రగమనం మీదే ఆధారపడి ఉందని తెలియచేస్తూంది మన సనాతనధర్మం. విష్ణువు మత్స్యావతారం ఎత్తి వేదాలను అపహరించిన సోమకుడిని చంపి తిరిగి బ్రహ్మకు వేదాలను అప్పగించిన రోజు ఇది. మళ్ళీ తిరిగి సృష్టి ప్రారంభమయిన రోజు. అందుకే యుగాది అని కూడా పిలుస్తారు. ఉగాదిని మనం వేల సంవత్సరాలుగా చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఎందుకు జరుపుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం: యజుర్వేదం ఇలా తెలియచేస్తూంది: " యజ్ఞపతిం ఋషయేవ      సాహుః, ప్రజానిర్భక్తా     అనుతప్త్యమానా,    మధభ్యౌస్తోతా2వపతౌ నరాధ "  దీని అర్ధం " అర్హత కలిగి శాస్త్రాలు తెలిసిన సోమయాజులు మధుమాసాలలో యజ్ఞాలు చెయ్యకపోతే కరువుకాటకాలు వస్తాయి " అని. ఎంత అద్భుత విషయం తెలియచేసారు మన ఋషులు. ప్రకృతి అంటే అంత గౌరవం, అభిమానం మన పూర్వీకులకు. యజ్ఞం చెయ్యడం ప్రకృతిలోని లోపాలను సరిచేయడానికి. కాలక్షేపానికి కా...

శ్రీలలితాదేవీ నవరాత్రులు రేపటినుంచి, శ్రీలలితాదేవ్యైనమః - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏  శ్రీలలితాదేవీ నవరాత్రులు - రేపటినుంచి అనగా చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ - భక్తులు లలితమ్మవారిని పూజించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారు. శ్రీలలితమ్మవారు భండాసురునితో యుద్ధానికి వెడుతూ జీవుల్ని ( మనల్ని ) జాగ్రత్తగా చూసుకోవడానికి బాధ్యతలను ఇద్దరికి అప్పగించారు. ఒకరు శ్రీవారాహీదేవి - రక్షణమంత్రిణి, కష్టసుఖాలు గమనించడానికి. రెండవవారు శ్రీశ్యామలాదేవి, ప్రధానమంత్రిణి, అందరి అవసరాలు గమనిస్తూ అనుగ్రహిస్తూ ఉండడానికి. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీలలితాదేవీనవరాత్రులుగా జరుపుకుంటారు భక్తులు. అషాఢశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీవారాహీదేవీనవరాత్రులుగా, మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీశ్యామలాదేవీనవరాత్రులుగా, ఆశ్వీయుజశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ శ్రీశారదాదేవీనవరాత్రులుగా జరుపుకుంటారు. అమ్మవారు లలితాదేవి భండాసురునితో యుద్ధం చేస్తూన్నప్పుడు ఆ రాక్షసుడు " మహారోగాస్త్రం " ప్రయోగించాడు అందర్నీ రోగగ్రస్తులుగా చేయాలని. అమ్మవారు " నామత్ర్యయాస్త్రం " అంటే " అచ్యుత అనంత గోవింద " అస్త్రాన్ని ప్రయోగించారు. అందుకే ఎవరికైనా ...

గోపికల భక్తి అనన్యభక్తి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అపరం భవతో జన్మ    పరం జన్మ వివస్వతః,    కధమేతద్విజానీయాం    త్వమాదౌ ప్రోక్తవా నితి "  ‌              - ‌భ.గీత 4: 4. " నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటీ అని ఆశ్చర్యంగా ఉంది. నీ జన్మ ఈమధ్యటిది. సూర్యుడు సనాతనుడు. ఎలా నమ్మేది " అంటాడు అర్జునుడు పరమాత్మతో. గీతోపదేశం చేస్తూ పరమాత్మ అర్జునుడితో " ఈ ఉత్తమమయిన యోగాన్ని మొదట సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు. నువ్వు నాకు మిత్రుడవు, భక్తుడవు కనుక నీకు మళ్ళీ చెబుతున్నాను " అంటారు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయి పైవిధంగా అడుగుతాడు. ఇక్కడ గమనించ వలసినది అర్జునుడు అనన్యభక్తుడు కాదు, కేవలం భక్తుడే. భక్తుడికి అనన్యభక్తుడికి తేడా ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని మథురకు తిరిగివచ్చిన కృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి బృందావనం వెళ్ళమన్నారు. దేనికో, ఏమి చేయాలో చెప్పనేలేదు. ఉద్దవుడు అడగనూ లేదు. బృందావనం వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చీకటి పడిపోయింది. పడుక్కుని తెల్లవారుఝామున లేచాడు.  ఎక్కడో ఒకావిడ చల్ల చిలుకుతూన్న చప్పుడుతో బాటు " తెల్లవారవస్తూంది లే...

కోరిక ధర్మబద్ధంగా ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దుష్టదూరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 193 వ నామం . " దుష్టదూరా " అంటే దోషము కలవారిచే పొందశక్యము కానిది. అంటే కల్మషము లేని వారినే అమ్మవారు అనుగ్రహిస్తారు అని. వామన పురాణం/యోగవాశిష్ఠరామాయణం ఏమి తెలియచేస్తున్నాయి అంటే " చిన్మాత్రం అమలం శాంతం - నిర్మలమైన జ్ఞానమయమైన శాంతం వలన మాత్రమే శివుడిని తెలుసుకోగలుగుతారు " అని. మనస్సు శుద్ధంగా ఉండాలి. వేదాలలో " అభిచారమంత్రాలు " ఉన్నాయి. శతృవు కొంచెం బలవంతుడయినప్పుడు శతృవు నాశనాన్ని కోరుతూ ఈ మంత్రాలని ఉపయోగించి హోమం చేస్తారు. వేదమే చెప్పింది కనుక అది ధర్మమే. సతీదేవి ఆత్మార్పణం చేసుకున్నప్పుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి రుద్రగణాలు వచ్చినప్పుడు దక్షయజ్ఞం చేయిస్తూన్న భృగుమహర్షి ఈ అభిచారహోమం చేసి ఋభుగణాలను సృష్టించారు. వారు రుద్రగణాలను తరిమేశారు. త్వష్టప్రజాపతి తన కుమారుడిని ఇంద్రుడు అన్యాయంగా చంపేసాడని బాధపడి ఇంద్రుడిని చంపే వీరుడు కావాలని కోరుతూ ఈ అభిచారహోమం చేసారు. వృత్రాసుర జననం జరిగింది. అలా అమ్మవారు అనుగ్రహించారు. ఇదే హోమం " నికుంభలా యాగం ...

అమ్మవారు మన కళ్ళకు ఎలా కనబడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అదృశ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 649 వ నామం. " అదృశ్యా " అంటే ఇంద్రియగోచరము కానిది అని భాష్యం చెప్పారు. మానవులలోనే గాక స్థావర జంగమాలన్నింటి లోనూ అమ్మవారి చైతన్యం ( ఆత్మ ) ఉన్నదని ఉపనిషత్తులు తెలియచేస్తున్నాయి. అన్ని జీవులలోనూ అమ్మవారి చైతన్యం ఉంది. సృష్టిలో ఇంద్రియాలకు గోచరించని జీవులెన్నో ఉన్నాయి అని తెలుస్తూనే ఉంది, రకరకాల రోగాల మూలాన.  ఇది ప్రాణం ఉన్న చరముల (జీవుల) విషయం. మరి అచరముల విషయమేమిటి. పదార్ధాలలో అణువు చిన్నదనుకున్నారు. తరువాత ప్రోటాన్ ఎలక్ట్రాన్ అన్నారు. ప్రోటాన్ లో క్వార్క్స్, ఎలక్ట్రాన్ లో లెప్టాన్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు హిగ్స్ బోసాన్ అన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి ఇది.  కెన్నెత్ ఫోర్డ్ ( హైడ్రోజన్ బాంబ్ ప్రోజెక్ట్ - 1952 సభ్యుడు, ప్రస్తుతవయస్సు 96 ) అనే శాస్త్రజ్ఞుడు అన్నారు " ఎంత చిన్న పదార్ధాన్ని కనుక్కున్నా దానిలో ఎనర్జీ/చైతన్యం ఉంటూంది, ఎంతటి అద్భుత విషయం " అని. అమ్మవారు ( చైతన్యం ) అంత సూక్ష్మరూపంలో ఉంటుంది అని మన ఋషులు తెలియచేయడం ఎంతటి అద్భుతవిషయం. కఠోపనిషత్తు ఈ ఆత్మని ...

అన్నమయ్య వర్ధంతి నేడు, కారణజన్ములు, నివాళులు అర్పించుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 అన్నమయ్య కీర్తన: నాటరాగం - తాళం ఖండవతి ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు  ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు చరణం : ఎందరికి కొడుకుగాడీ జీవుడు  ఎందరికి తోబుట్టడీ జీవుడు ఎందరికి కొడుకుగాడీ జీవుడు వెనక ఎందరికి తోబుట్టడీ జీవుడు ఎందరిని భ్రమియింపడీ జీవుడు దుఃఖ మెందరికి గావింపడీ జీవుడు ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు….. ఎక్కడెక్కడ తిరుగడీ జీవుడు  ఎక్కడో తన జన్మ మీ జీవుడు ఎక్కడెక్కడ దిరుగడీ జీవుడు వెనుకఎక్కడో తన జన్మ మీ జీవుడుఎక్కడీ చుట్టము ఈ జీవుడు ఎప్పుడెక్కడికి నేగునో ఈ జీవుడు ఎవ్వరెవ్వరి వాడో ఈ  జీవుడు ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు….. ఎన్నడును చేటులే నీ జీవుడు ఎన్ని తనవులు మోవడీ జీవుడు ఎన్నడును చేటులే నీ జీవుడువెనుక ఎన్ని తనవులు మోవడీ జీవుడుఎన్నగల తిరువేంకటేశు మాయలదగిలియెన్ని పదవుల బొందడీజీవుడు ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు  ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు   ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు " కీర్తన అచ్చతెలుగులో ఉంది కనుక అర్ధం మళ్ళీ అక్కరలేదు. ఎంతటి ఉపనిషత్తుల సారాంశం, వేదాంతం నిండి ఉందో ఈ కీర్తనలో. భాగవతంలో జీవుడి గురించిన ఓ అద్భుత కధ ఉంది.  వృ...

రాక్షసులు అంటూ వేరే ఉండరు, మనలోనే ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " రాక్షసఘ్నీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 318 వ నామం. " రాక్షసఘ్నీ " అంటే రాక్షసులను సంహరించువారు అని భాష్యం చెప్పారు. రాక్షసులు అని వేరే జీవులు ఉండరు. మనకు తెలిసిన దేవతలకు రాక్షసులకు తండ్రి ఒకరే. స్వభావాలను బట్టి అలా పిలుస్తూంటాం. అధర్మపరులు అంటే ధర్మానికి హాని చేసేవారు, సమాజానికి, ప్రకృతికి చేటు చేసేవారిని రాక్షసులు అంటాం. అటువంటి వారిని కట్టడి చేస్తారు అమ్మవారు. అటువంటి వారు సమాజంలో ఆనందంగా తిరగడం చూసి అమ్మవారు పట్టించుకోవడం లేదు అనుకుంటాం. తప్పు. వారు కూడా మారడానికి అవకాశం ఇస్తారు అమ్మవారు. ఇక లాభంలేదు అన్నప్పుడే శిక్షిస్తారు. భయంకరమయిన శిక్షల పాలయిన వారిని చూస్తూంటాం కూడా. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " దంభో దర్పో2భిమానశ్చ     క్రోధః పారుష్యమేవ చ,   అజ్ఞానం చాభిజాతస్య        పార్ధ సంపదమాసురీం "                 - భ.గీత 16:4 " ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావముకల వారి గుణములు " అని. దూర్వాసులు శ...

శ్రీశృంగేరీ శారదాపీఠం 33వ పూర్వ పీఠాధిపతుల జయంతి నేడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 శ్రీశృంగేరీ శారదా పీఠం పూర్వ పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి ( 33 వ పీఠాధిపతి 1879 - 1912 ) వారి జయంతి నేడు. శుభాకాంక్షలు. ఆదిశంకరులు కర్మకాండ కన్నా జ్ఞానకాండే తరించడానికి సామాన్యులకు కూడా ఉపయోగమని భావించి కుమరిల్ భట్టు గారి శిష్యులు అయిన మందనమిశ్ర, ఆయన భార్య ఉదయభారతిలతో వాదన చేసి, ఒప్పించి, మెప్పించి, ఓడించారు. పందెం నియమానుసారం మందనమిశ్ర శంకరుల శిష్యుడయారు.  శ్రీశృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి దానికి మొదటి పీఠాధిపతిగా మందనమిశ్రాను " సురేశ్వరాచార్య " గా నామకరణం చేసి నియమించారు.  అప్పటినుండి సనాతనధర్మ పరిరక్షణకోసం అమ్మవారి ఆశీస్సులతో ఈ గురుపరంపర అద్భుతంగా కొనసాగుతూంది.  యజుర్వేదం/అధర్వణవేదాల్లో అధికసంపద కోసం చేసే యాగం ఉంది. కోరికలు తప్పుకాదు. వివిధరకాలైన కోరికలు తీర్చుకోవడానికి వీలుగా చాలా కార్యక్రమాలు తెలియచేసాయి మన వేదాలు/శాస్త్రాలు. ఈ యాగంలో చివరన " సంపదను చేతిలో ఉంచు " అని కోరడం ఉందిట. " ఎవరి చేతిలో ఉంచాలి, ఎందుకు నా చేతిలో ఉంచు అని అనలేదు " అనే సందేహం వచ్చిందిట పండితులకు. " పాహిమాం - న...

నిర్మలమయిన మనస్సుతో అమ్మా అంటే చాలు అనుగ్రహిస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బ్రాహ్మీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 675 వ నామం. " బ్రాహ్మీ " అంటే జ్ఞానస్వరూపురాలు అని భాష్యం చెప్పారు. అమ్మవారు జ్ఞానప్రదాత. ఆదిశంకరులు " బ్రహ్మసత్యం జగన్మిధ్య, జీవో బ్రహ్మ ఏవ నపరః " అన్నారు. అంటే బ్రహ్మ సత్యం, జగత్ మిధ్య, జీవుడు బ్రహ్మ వేరుకాదు ( ఒకరే ) అని. మాయ కారణంగా జీవుడు నిజంగా తను ఎవరో అది తాను కాదనుకుంటాడు, తను ఏదికాదో అది తాను అనుకుంటాడు. జ్ఞానం అంటే అమ్మవారు సత్యం, ఈ కనబడేదంతా అసత్యం అని తెలుసుకోవడం. అలా తెలుసుకోవడమే అసలు విద్య. మిగతా చదువులన్నీ అవిద్యలే. అమ్మవారి రూపం, గుణగణాలు, శక్తులు వంటి వాటిని తెలుసుకోవడం, కీర్తించడం జ్ఞానకాండ క్రిందకు వస్తాయి. వేదాలలో ముఖ్యంగా కర్మకాండ, జ్ఞానకాండ ఉన్నాయి. ఆదిశంకరులు వచ్చేటప్పటికి కర్మకాండ ఉచ్ఛస్థితిలో ఉంది. ఈ కర్మకాండ కామదాయిని, కోరికలు తీర్చేది. దీనిలో శతృవు నాశనమవాలని కోరుతూ చేసే అభిచారమంత్రాల వంటివి కూడా ఉన్నాయి. ఆదిశంకరులు ఈ కర్మకాండ శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడుకున్నది. రాబోయే గడ్డుకాలంలో సామాన్యజనులు బ్రతుకుతెరువు కోసమే ఎక్కువ సమయం వెచ్చించవలస...

అమ్మవారికి మనమీద ఎప్పుడూ కరుణే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సాంద్రకరుణా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 197 వ నామం .  " సాంద్రకరుణా " అంటే ఘనమయిన దయ కలది. అమ్మవారి దయ అపారమైనది. అమ్మవారి చూపులు చంద్రుడి వెన్నెలలా చల్లగా ఉంటాయి, మాటలు అమృతపు గుళికల్లా ఉంటాయి. భక్తులను అన్నివేళలా అన్నివిధాలా ఆదుకుని ఆనందంగా ఉండేలా చేస్తారు. రాసలీలకు ముందు " కృష్ణా, మిమ్మల్ని ఓ విషయం అడగవచ్చా " అని అడుగుతారు గోపికలు. కృష్ణుడు " అడగండి " అనగానే వారు అంటారు: ఈ ప్రేమలు ఆశ్చర్యకరంగా ఉంటాయి: 1. ఎదుటి వారు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు కొందరు. 2. ఎదుటి వారు ప్రేమించకపోయినా      ప్రేమిస్తారు కొందరు. 3. ఎదుటి వారు ప్రేమించినా,      ప్రేమించకపోయినా ప్రేమించరు కొందరు. ఈ ముగ్గురిలో మీరు ఎవరు అని అడుగుతారు కృష్ణుడిని. ఎంత చక్కటి ప్రశ్న. అప్పుడు కృష్ణుడు అంటారు: " నాహం తు సఖ్యో భజతోఽపి జంతూన్     భజామ్యమీషామనువృత్తి వృత్తయే,    యథాధనో లబ్ధధనే వినష్టే    తచ్చింతయాన్యన్నిభృతో న వేద "                - భాగవతం 10(1):31:20 " పైవా...

మన క్రితం జన్మల గురించి వచ్చే జన్మల గురించి అమ్మవారికి ఎరుకే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " సర్వజ్ఞా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 196 వ నామం.  " సర్వజ్ఞా " అంటే సమస్తమును తెలిసినది. త్రికాలదర్శి. ఒక్కో జీవుడు ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాడు. మరి వాడి కర్మఫలాలన్నిటినీ ఎంత జాగ్రత్తగా లెక్క చూడాలి. పుణ్యాత్ములను అనుగ్రహించడం, పాపులను శిక్షించడం చేస్తూండాలిగా. పాపపుణ్యాలు రెండూ నశించిన వారికి ముక్తిని ప్రసాదించాలి కూడా. ముండకోపనిషత్తు ఇలా తెలియచేస్తూంది: " యః సర్వజ్ఞః సర్వవిద్యస్య    జ్ఞానమయం తపః "  - 1.1.9 " భగవంతుడు అన్నీ తెలిసినవాడు, సర్వసాక్షి మరియు సర్వజ్ఞుడు. ఆయన తపస్సు జ్ఞానమయము ” అని. మనం న్యాయస్థానాలలో చూస్తూంటాం. చిన్న చిన్న సమస్యలకే పరిష్కారాలకు ఏళ్ళ తరబడి అవుతూంటుంది. అమ్మవారు అలా చేయనివ్వరు కదా. ఎంత నిక్కచ్చిగా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. అమ్మవారి శక్తులు అనంతం. మన ఊహకు అందవు.  కఠోపనిషత్తు ఇలా తెలియచేస్తూంది: " నైషా తర్కేణ మతిరాపనేయా "                         - 1.2.9 “ భగవంతుడు మన బుద్ధి యొక్క తర్కమునకు అతీతుడు ” అని. పరమాత...

అమ్మవారిని ధ్యానం చేద్దామని అనుకోవడమే ముక్తికి తొలిమెట్టు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దురాచారశమనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 194 వ నామం . " దురాచారశమనీ " అంటే చెడునడవడికను పోగొట్టునది అని భాష్యం చెప్పారు. ఎప్పుడు పోగొడుతారు. తప్పులు చేసాను, క్షమించు, ఇకపై జాగ్రత్తగా ఉంటాను అని అమ్మవారిని వేడుకుంటే తప్పక అనుగ్రహిస్తారు. ధర్మమార్గంలో నడిచేలా ఏర్పాటు చేస్తారు. నరకాన్ని ఎలా తప్పించుకోవాలి అని గరుడపురాణంలో విస్తృతంగా చెప్పబడింది. ఎన్నో ప్రాయశ్చిత్తాలు తెలియచేసారు. " తస్మాత్ పురైవాద్దిహ పాప నిష్కృతౌ    యతేత మృత్యో రవిపధ్యరాత్మనా " ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి. రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " అపి చేత్ సుదురాచారో        భజతే మామనన్యభాక్,   సాధురేవ స మంతవ్యః     సమ్యగ్వ్యవసితో  హి సః "              - భ.గీత 9:30 " మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషు...

కోరిక ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకుని వెళ్ళేలా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కామదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 63 వ నామం.  " కామదాయినీ " అంటే కోరిన కోరికలను తీర్చునట్టిది. ఆమె మాతృమూర్తి కనుక మనం ఏ కోరిక కోరినా తీరుస్తారు. కాని అది ధర్మబద్ధంగా మనకు మంచి చేసేది అయితేనే అనుగ్రహిస్తారు. పిల్లవాడు అడిగినా, ఏడ్చినా సూది, కత్తి లాంటివి తల్లి ఇవ్వదు. మరీ మారాం చేస్తే రెండు తగిలిస్తుంది కూడా. భాగవతంలో యయాతి అంటారు " కోరికలు తీర్చుకోవడం ఎలాంటిది అంటే అగ్నిని ఆర్పడానికి నెయ్యి పోయడం లాంటిది " అని. నెయ్యి పోస్తూ ఉంటే అగ్ని ఆరడం అనేది ఉండదు. కోరిక కూడా అటువంటిదే. ఒకటి తీరగానే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. " ఆప్తకామా, పూర్ణకామా " అంటే కోరికలు లేని స్థితి ఎప్పుడు వస్తుందంటే మనస్సు ఆనందంతో నిండిపోయినప్పుడు. కుండ నిండిపోయాక నీళ్ళు పోయము కదా. మనస్సు ఖాళీగా ఉంటేనే కోరికలు పుడుతూ ఉంటాయి. అందుకే అమ్మవారి స్మరణతో మనస్సు నింపుకోవాలి. అది అంత సులభం కాదు. బంధాలు కూడా కోరికలను పెంచుతాయి. ప్రహ్లాదుడి మనస్సంతా నారాయణుడితో నిండిపోయింది. నిప్పులో పడేసినా, ఏనుగులు త్రొక్కినా, నాగుపాములు కాట...

సుఖం అంటే కోరికలు తగ్గించుకోవడం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సుఖప్రదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 192 వ నామం. " సుఖప్రదా " అంటే అన్నివిధముల సుఖములను ఇచ్చునది అని భాష్యం చెప్పారు. సుఖం అంటే ఏమిటి?. చాలామంది భావన సంపదలు ఉంటే చాలు అంతా సుఖమే అనుకుంటారు.  కఠోపనిషత్తు సంపదలు సుఖసంతోషాలను కలిగించవని తెలియచేస్తూంది. నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని, తత్వాన్ని తెలియచేయమని కోరతాడు యముడిని. ఈ కోరికను విరమించుకుంటే సమస్త సంపదలు, భోగాలు ఇస్తానంటాడు యముడు. నచికేతుడంటాడు:  " న విత్తేన తర్పణీయో మనుష్యో   లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా " ‌                       - 1.1.27 " సంపదతో మానవుడికి తృప్తికలుగదు.  ఒక సంపద సమకూరితే మరొక సంపద కావాలనిపిస్తుంది.  నీ దర్శనం సకల సంపదలూ కలుగజేసేదే కనుక నాకు సంపదల మీద ఆశలేదు " అంటాడు. నరసింహస్వామి ప్రహ్లాదుడితో అంటారు " అందరి కోరికలు తీర్చేవాడిని నేను, నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాను, నీ పట్ల ప్రీతుడయి ఉన్నాను, ఏదయినా కోరిక కోరుకో " అని. అప్పుడు ప్రహ్లాదుడు " మా మాం ప్రలోభయా - నన్ను ప్రలోభపెట్...

శాంతమే కాదు కోపం కూడా అవసరమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 వేదమాతని " ధియోయోనః ప్రచోదయాత్ " అని ప్రార్ధిస్తాం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా అనేకాదు, అవసరమయినప్పుడు తగిన పౌరుషాన్ని కోపాన్ని కూడా ప్రసాదించు తల్లీ అని అర్ధం. రామలక్ష్మణులు వానరవీరులతో లంకను చేరడానికి బయలుదేరి సముద్రపు ఒడ్డుకు చేరారు. సముద్రాన్ని ఎలా దాటి లంకను చేరాలన్నది సమస్య. సముద్రుడు కరుణించాలిగా. రాముడు దీక్ష తీసుకుని ఉపవాసంతో దర్భలమీద పడుకుని మూడు రోజులు ఎదురు చూసారు సముద్రుడు కరుణించి మార్గం చూపుతాడని. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. లేచి కోపంతో కోదండం తీసుకుని ఎక్కుపెట్టగానే సముద్రుడు ఎదురుగా వచ్చి సేతు కట్టమని సలహా ఇచ్చారు. ఈ పని రాముడు ముందే చేయవచ్చుగా, మూడు రోజులు కలిసివచ్చేది అనిపించవచ్చు. తప్పు. అదే‌ సనాతనధర్మం గొప్పదనం. ప్రకృతిని గౌరవించాలి. అరివీరభయంకరుడయినా రాముడు తొందరపడలేదు.  మరి రాముడు గురించి ఆయన పరాక్రమం గురించి అందరికీ తెలిసిన విషయమే కదా. మరి మూడు రోజుల దాకా సముద్రుడు ఎందుకు ఎదరకు రాలేదు. రాడు, రాకూడదు. రాముడు వెడుతూన్నది లోకకంటకుడయిన రావణుడిని చంపడానికి. మరి రాముడు ఎంత కోపం, పౌరుషంతో రగిలిపోతూ ఉండాలి. బుద్ధిమంతుడిలా దర్భల...

వీరులు అంటే నేను, నాది అనే భావనను వదిలేసిన వారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వీరారాధ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 777 వ నామం.  " వీరారాధ్యా " అంటే " వీరులచేత ఆరాధించుబడునది " అని అర్ధం. దీక్ష తీసుకున్న దీక్షితులని వీరులంటారు. అంతే కాని వీరులు అంటే అధికశరీరబలం ఉన్నవారు అని కాదు. దీక్ష తీసుకున్నవారు నియమనిబద్ధతలతో ఉండాలి, అది అంత తేలికకాదు. " నేను, నాది " అన్నది వదిలేయాలి. " అహం మమ ఇత్యభిమాన విరహితః వీరః " అని తెలియచేస్తున్నాయి ఉపనిషత్తులు. నేను నాది అనే అభిమానాలను వదిలేసినవారిని వీరులు అన్నారు. అయ్యప్పదీక్ష తీసుకున్నవారిని చూస్తూంటాం. సూర్యోదయానికే ముందరే స్నానం, పూజలు, నల్లబట్టలు, పాదరక్షలు వేసుకోకపోవడం, సాత్వికమైన ఆహారం, మృదుభాషణ - ఇలా ఎన్నో నియమాలతో 40 రోజుల దీక్ష అంటే అంత తేలికకాదు. అందుకే వారిని చూడగానే నమస్కరించి గౌరవించాలనిపిస్తుంది. దీక్ష తీసుకున్నవారిని ఎవరయినా సహాయం కోరితే అది వారి పరిధిలో ఉన్నట్లయితే నాకు కుదరదు, సమయంలేదు, వీలుకాదు అని చెప్పకూడదు అని శాస్త్రోక్తం. ఇలా దీక్ష తీసుకున్నవారు ఏమి చేస్తారు. కొంతమంది సాయంత్రం అయేసరికి ఓ చక్కని ఏకాం...

మాయను తప్పించుకోలేమా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 "దైవీ హ్యేషా గుణమయీ   మమ మాయా దురత్యయా"                       -  భ.గీత 7:14  " నామాయ నుంచి తప్పించుకోవడం కష్టమే సుమా " అన్నారు కృష్ణపరమాత్మ గీతలో. " మాయ " అంటే మభ్యపెట్టడమో, మోసమో కాదు. మిధ్యకూడా కాదు. అది ఒక అద్భుతప్రక్రియ. దానివల్లనే ఈ సృష్టి, ప్రపంచము, జీవితమూ సుందరంగా ఆనందమయంగా కనిపిస్తున్నాయి. ఇది " మాయ " అని తెలుసుకున్నవాడు జ్ఞాని. అజ్ఞాతవాసం అయిపోయాక దృపదరాజు యొక్క పురోహితుడిని దృతరాష్ట్రుడి వద్దకు రాయబారానికి పంపిస్తాడు ధర్మరాజు, " మారాజ్యాన్ని మాకు ఇప్పించండి, అందరం సంతోషంతో గడపవచ్చు " అని. దృతరాష్ట్రుడు మేమందరం ఆలోచించుకుని మా రాయబారిని పంపిస్తాం అని పంపించేస్తాడు. సంజయుడిని పిలిచి " నువ్వు సమర్ధుడివి, వెళ్ళి ధర్మరాజుకి తియ్యటి మాటలు చెప్పి అతని మనస్సులో యుద్ధం అనే ఆలోచనే లేకుండా చేసిరా " అంటాడు. సంజయుడు వెళ్ళివచ్చి కురుసభలో అందరి సమక్షంలో ధృతరాష్ట్రుడికి ఏమి జరిగిందో ఇలా చెబుతాడు: " ధర్మరాజు సంధే కోరుతున్నాడు. అర్జునుడు ఏదో అనబోతూంటే చిరునవ్వుతో వారించి కృష్ణుడు ఇల...

హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచడం మేమిటి?- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " సహస్ర సూర్యతయా భాంతి - అంతరిక్షంలో వేలసూర్యులు ప్రకాశిస్తున్నారు " - వేదం. హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయి సముద్రంలో దాచడం మహావిష్ణువు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుని చంపి భూమిని రక్షించడం చదివాం, విన్నాం మనం. ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యమే. భూమిని భూమిమీద ఉన్న సముద్రంలో దాచటమేమిటి, కట్టుకథ అని. అసలు అర్ధం ఉందా ఈ చెప్పే విషయానికి అని కూడా కొందరు విమర్శిస్తూ ఉంటారు. తప్పు లేదు.  మన వాజ్మయంని అర్ధం చేసుకోవడానికి చాలా విద్వత్తు ఉండాలి. అది లేనప్పుడు మన ఋషుల విద్వత్తు మీద నమ్మకమయినా ఉండాలి. ఈ రెండూ లేనివారికి అలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. మన తెలుగు అమ్మాయి రాగదీపిక పుచ్ఛా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అమెరికాలో ఖగోళంమీద పరిశోధనలు చేస్తూంది. ముఖ్యంగా కృష్ణబిలాల మీద. విశ్వంలో ఉన్న 4 కోట్ల పాలపుంతలను పరిశీలిస్తున్నారుట వీరు. అంటే ఇంకా ఎన్ని పాలపుంతలు ఉన్నాయో విశ్వంలో. కనీసం 2000 కోట్ల పాలపుంతలు ఉండి ఉంటాయని ప్రస్తుత అంచనా. ప్రస్తుతానికి 2500 కృష్ణబిలాలు పరిశీలించారు అని తెలుస్తూంది.  విశ్వంలో ఇంకా ఎన్ని వింతలు ఉన్నాయో. మన భూమి మనిగిపోయేంత పెద్ద...

శ్రీలక్ష్మీదేవి జయంతి, హోళీ నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " తాం మ ఆవహ జాతవేదో    లక్ష్మీమనపగామినీం "                   - శ్రీసూక్తం. ఇక్కడ " లక్ష్మీమనపగామినీం " అని ప్రార్ధిస్తాం. " అనపగామినీం " అంటే తిరిగి వెనక్కు వెళ్ళనటువంటిది. అటువంటి సంపదను ఇయ్యమని అమ్మవారిని కోరుకోవాలి. శ్రీసూక్తంలో అమ్మవారిని ప్రార్ధిస్తూ " లోకైక దీపాంకురాం ( లోక+ఏక+దీప+అంకురాం ) అంటాం అంటే " లోకాలన్నింటికీ ఒకే ఒక్క దీపమై ఉన్నది " అని. దీపం అంటే జ్ఞానం. లక్ష్మీదేవి జ్ఞానప్రదాత. చీకటి పోవాలంటే దీపం కావాలి. అజ్ఞానాంధకారం పోవాలంటే దీపలక్ష్మి అనుగ్రహం కావాలి. " ధనమగ్ని ర్ధనంవాయుః   ధనంసూర్యః ధనంవసుః   ధనమింద్రో బృహస్పతిః   వరుణం ధనమశ్నుతే "                ‌ - శ్రీసూక్తం " అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు, అష్టవసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు తమతమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు తల్లీ " అని. ఎంత అద్భుతం అమ్మవారి ఐశ్వర్యం. ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు " ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యములతో జీవించుము " అని అంటారు. ఆయువు, ఆరోగ్యం...

మరణం కూడా సుఖంగా ఉంటే అదృష్టం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " ఓం త్ర్యంబకం  యజామహే  ...........   మృత్యోః  ముక్షీయమా2మృతాత్ " మహామృత్యుంజయమంత్రజపం పారాయణ చేస్తే అపమృత్యువు తొలగడం, వ్యాధులనివారణ జరగడం లాంటివి ఉండవు. ఆయన లయకారకుడు, మృత్యువు ని తప్పించడు కాని ఆయన్ని నమ్ముకుంటే మృత్యువు మరీ భయంకరంగా ఉండకుండా అనుగ్రహిస్తాడు. అంతకన్నా కావలిసినది ఏముంటుంది ఎవరికైనా. అమ్మవారి ఒకనామం " సర్వవ్యాధి ప్రశమన్యైనమః " అని. అంటే వ్యాధి తీవ్రతను తగ్గించేది అని. వ్యాధులు రాకుండా చూసుకోవలసినది జీవులే మంచి కర్మలు మాత్రమే చెయ్యడం ద్వారా.  గరికిపాటివారు తరచూ చెబుతూంటారు " దేవతలకి, గ్రహాలకి మనమీద కోపం ఎందుకుంటుందండి " అని. జీవుల చెడుకర్మలే వ్యాధులుగా పీడిస్తాయి. " పూర్వజన్మ కృతంపాపం వ్యాధిరూపేణ బాధితా ". వ్యాధి కూడా అమ్మవారి అనుగ్రహమే. జీవుల చెడుకర్మఫలాన్ని తొలగించి ముక్తిని ఇవ్వడానికి ఆ రూపంలో అనుగ్రహిస్తుంది. ఎంత అద్భుత భావన మన ఋషులది. " అనాయాసేన మరణం   వినా దైన్యేన జీవనం,   దేహాంతే తవ సాయుజ్యం     దేహిమే పరమేశ్వరా " ( సాయుజ్యం బదులుగా సాన్నిధ్యం అని కూడా చదువుతూంటారు ) ఎవరయినా స...

ఏదయినా పని అవనప్పుడు బాధ పడనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విఘ్ననాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 451 వ నామం . " విఘ్ననాశినీ " అంటే విఘ్నములు పోగొట్టునది అని అర్ధం. అమ్మవారిని ప్రార్ధిస్తే విఘ్నాలన్నిటినీ నాశనం చేస్తారా?. చెయ్యరు. ముఖ్యమయిన పనులు మొదలు పెట్టినప్పుడు " ఏ విఘ్నాలు కలుగకుండా పని అయేలా చెయ్యి తల్లీ " అని ప్రార్ధించి మ్రొక్కుకుంటాం కూడా. కొన్ని పనులు అవుతాయి, కొన్ని అవవు.  అవని పనుల గురించి ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే నమ్ముకున్న అమ్మవారి ఆలోచన వేరుగా ఉండవచ్చు. ఆ పని అయితే భవిష్యత్తులో ఏవయినా సమస్యలలో ఇరుక్కోవచ్చు. మన విషయంలోనే కాదు, మన బంధువుల, స్నేహితుల విషయంలో కూడా " అయ్యో ఆ పని ఆ రోజు అయివుంటే ఈరోజు చాలా బాధపడి ఉండేవారం " అని అనుకోవడం వింటూంటాం. మనం అన్ని పనులకూ శ్రద్ధగా భక్తితో అయేలా చూడమని కోరుకున్నా మనకు ఉపయోగపడే పనులనే అమ్మవారు అయేలా చూస్తారు. అందుకే ఎప్పుడయినా ఓ పని అవకపోతే మరీ బాధపడిపోకూడదు. ఇంకో 2,3 సార్లు ప్రయత్నం చేయాలి. అప్పుడు కూడా అవకపోతే అమ్మవారికి ఇష్టం లేనట్లుంది అనుకుని వదిలేయాలి, ముందుకు సాగిపోవాలి.  పరమాత్మ గీ...

ఏ బొమ్మ వేసినా, ఏది వ్రాసినా బిందువుతోనే మొదలవుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బైందవాసనా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 905వ నామం. " బైందవాసానా " అంటే బిందువులో ఆసీనురాలయి ఉంటుంది అని. కనుబొమలమధ్యభాగానికి కొద్దిగా పైన బిందురూపంలో ఉంటుంది అమ్మవారు శ్రీచక్రంలో నవావరణాల మధ్యన బిందురూపంలో ఉంటుంది అమ్మవారు. ఇది అత్యద్భుతనామం. ఏదైనా బిందువు నుంచే మొదలవుతుంది. ప్రధమస్పందన బిందువే, అక్కడనుంచే అన్నీ వచ్చాయి. బిందువునుంచే కదా ఏరూపమయినా వచ్చేది. ఏబొమ్మ వెయ్యాలన్నా అన్నీ బిందుసమూహమే కదా.  ఒక బొమ్మ వేద్దామనుకుంటే ముందర ఒక బిందువు పెడతారు, దానినుంచే చిత్రమంతా వస్తుంది. జీవుల శరీరం కూడా బిందువునుంచే మొదలవుతుంది. బిందువుల సంఖ్య పెరిగి పెరిగి శరీరంగా తయారవుతుంది. చిన్నపిల్లవాడికి ఉన్న చర్మమే పెరిగే కొలదీ సాగుతూ వస్తుంది. కొత్తగా ఎక్కడనుంచీ రాదు. అదే చర్మం ఎంతో అద్భుతంగా పెరుగుతుంది, లోపమేమీ లేకుండా. ఎంత అద్భుత సృష్టి. ఏపదార్ధం తీసుకున్నా అది అతిసూక్ష్మపదార్ధాల సమూహమే కదా. ఆ సూక్ష్మపదార్ధమే అమ్మవారు/చైతన్యం. " యచ్ఛాపి సర్వభూతానాం    బీజం తదహమర్జున "              - భ.గీత 10:39....

అహంకారం మమకారం వదలకపోతే పతనమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " కామమాశ్రిత్య దుష్పూరం       దంభమానమదాన్వితాః,   మోహాద్గృహీత్వా2సద్గ్రాహాన్   ప్రవర్తంతే2శుచివ్రతాః "              - భ.గీత 16:10 " దంభము, దురభిమానము, మదములతో గూడిన  ఈ అసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి, తమవాంచలను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు.   అజ్ఞానకారణముగ మిధ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు.   శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు " అన్నారు పరమాత్మ.    దంభము అంటే అహంకారం. దురభిమానం అంటే మమకారం. ఈ రెండూ మనిషి పతనానికి హేతువులు. పాండవుల అజ్ఞాతవాసం కూడా అయిపోయాక ధృతరాష్ట్రుడికి భయం పట్టుకుంది యుద్ధం తప్పదేమోనని. సంజయుడుని దృతరాష్ట్రుడు పాండవులవద్దకు రాయబారం పంపిస్తాడు. " నువ్వంటే పాండవులకు గౌరవం , అభిమానం. కనుక తీయటిమాటలు చెప్పి పాండవుల బుర్రలోంచి యుద్ధం అనే ఆలోచన తీసేసి రా " అని.  సంజయుడు వెళ్ళివచ్చి కురుసభలో అందరి సమక్షంలో ఏమి జరిగిందో ఇలా చెబుతాడు: ధర్మరాజు సంధే కోరుతున్నాడు. అర్జునుడు ఏదో అనబోతూంటే చిరునవ్వుతో వారించి కృష్ణు...

యముడు సమవర్తి , పుణ్యాత్ములకు కరుణామూర్తి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యమః " విష్ణుసహస్రనామాలలో ఒక అద్భుత నామం. యమః అంటే లోపలనుండి నడిపించువారు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. కాని " లోపల ఉండి నడిపించువారు " అనుకోవచ్చు. శరీరంలోని వెన్నెముక దగ్గరలో ఉండి జీవుడి కర్మఫలాలను నమోదు చేస్తూ ఉంటారు యముడు. ఇది ఆయన సూక్ష్మ శరీరం.  యముడు సమవర్తి. శాంత స్వరూపుడు. మంచిపనులు చేసేవారికి అలాగే కనబడుతారు. మరణానికి ముందు యముడు కనబడుతారు. ఆయన పాపులకు భయంకరంగా కనిపిస్తారు. ఎర్రటి కళ్ళు, కోరలు, పొడుగు ముక్కు, పాశం పట్టుకుని. భయపడిపోతాడు పాపి. కఠోపనిషత్తు " యమ - నచికేతుల " సంవాదం. ఆత్మస్వరూపం గురించిన అద్భుత వివరణ ఈ ఉపనిషత్తు. మన కర్మలను గమనించే వారిలో యముడు ఒకరు.  గరుడపురాణం " ఆదిత్య చంద్రౌ అనిలో అనలశ్చ యౌ భూమి ఆపః హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాధి నరశ్చ వృత్తిం " అని తెలియచేస్తూంది. వీరందరూ సాక్షులు, జీవుల కర్మలను గమనిస్తూ ఉంటారు.  ఈ సాక్షులు - ఉన్నది ఉన్నట్లు చెబుతారు. తెలిసి చేసేవి, తెలియకుండా చేసేవి అన్నీ గమనిస్తారు. వీరిని మంచి చేసుకుని జాగ్రత్త పడవచ్చు. ఎలాగంటే " వ్రతై...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ.

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అంతర్జాతీయ మహిళా దినోత్సవం " నేడు. శ్రీకృష్ణుడు భాగవతంలో స్త్రీల గురించి గోపబాలకులకు చెబుతూ " స్త్రీ అంటే అర్పణ/ఆశ్రయ/అహంకారరాహిత్య భావం, శుద్దమయిన ప్రేమ " అన్నారు. అందుకే గోపకాంతలంటే అంత ప్రేమ కృష్ణుడికి.  చాణుక్యుడు " స్త్రీలకు ప్రేమ, ధైర్యం, సహనం, సమస్యలను పరిష్కరించే జ్ఞానం ఎక్కువ " అన్నారు. స్త్రీలను గౌరవించడంలో అదీ మన సనాతనధర్మం విశిష్టత. ఒకాయన సంతకి వెళ్ళి ఓ మేకపిల్లని కొన్నాడు. నలుగురు దొంగలు అది గమనించి ఎలాగైనా ఆ మేకపిల్లని కొట్టేయాలని అనుకుని ఒక మంచి ఉపాయం ఆలోచించారు. ఆయన మేకపిల్లని తీసుకుని తన ఊరికి నడిచి వెడుతున్నాడు. అరమైలు దూరం వెళ్ళగానే ఒక దొంగ ఎదురుగా వచ్చి " కుక్కపిల్ల బాగుంది, ఎంతకు కొన్నారు " అన్నాడు. ఈయన ఇది మేకపిల్ల అని చెప్పి ఎదరకు వెళ్ళిపోయాడు. అరమైలు వెళ్ళగానే ఇంకో దొంగ ఎదురువచ్చి " కుక్కపిల్ల ఎంతముద్దుగా ఉందో, ఎంతకి కొన్నారు " అన్నాడు. ఈయన " ఇది మేకపిల్లండి బాబూ కుక్కపిల్లకాదు " అన్నాడు. మిగతా ఇద్దరు దొంగలూ కూడా అలాగే అనడంతో ఈయనకి అనుమానం వచ్చింది, ఇది నిజంగానే కుక...

మన సంప్రదాయాలన్నీ అమ్మవారు ఇచ్చినవి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సంప్రదాయేశ్వరీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 710వ నామం.  ' సంప్రదాయేశ్వరీ " - నామం ఎంత అద్భుతంగా ఉంది. ఈ పదాన్ని చదువుకున్నవారు చదువుకోనివారు కూడా ఇంచుమించు ప్రతీరోజూ ఏదో సందర్భంలో వింటూనే ఉంటారు, పలుకుతూనే ఉంటారు. " దాయం " అంటే ఇవ్వబడినది. " ప్ర " అంటే బాగుగా, " సం " అంటే చక్కగా అని అర్ధం. సంప్రదాయం అంటే " చక్కగా బాగుగా ఇవ్వబడినది " అని అర్ధం.  మరి ఇచ్చినది ఎవరు - అమ్మవారు. అందుకే ఆవిడ " సంప్రదాయేశ్వరి " అంటే సంప్రదాయాలకు ఈశ్వరి, నాధ, దిక్కు.  ఒక పని చేస్తే ఉపయోగమేనా మంచిదేనా అనే విషయాన్ని ఆచరించి , పరీక్షించి, మంచి చేస్తుందని అనిపిస్తే ఇలా చెయ్యండి అని చెబుతారు గురువులు. అదే ఒక సంప్రదాయంగా నిలిచిపోతుంది, ఇక పరీక్షించవలసిన అవసరం ఉండదు. విద్యుత్తు ఎక్కడో తయారయి " తీగల " ద్వారా మన ఇంటికిచేరినట్లు ఈ " సంప్రదాయాలు " అమ్మవారి ( గురుమండలరూపిణి ) నుండి " గురువుల " ద్వారా మనకు చేరతాయి. గురువు నుంచి గురువుకు చేరడాన్నే " గురుపరంపర ...

అమ్మవారు గంభీరంగా ఉటారంటే అంత స్వచ్ఛంగా ఉంటారని భావం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గంభీరా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 854 వ నామం. " గంభీరా " అంటే అంతుపట్టనిది, లోతైనది అని అర్ధం. సముద్రాన్ని గంభీరంగా ఉంది అంటాం, లోతుగా ఉండడంవల్ల అలా అనిపిస్తుంది. ఎంత లోతుకువెడితే అంత స్వచ్ఛత, విలువైనవి దొరుకుతాయి. సముద్రం ఒడ్డున గుల్లలు చిల్లపెంకులు దొరుకుతాయి. అదే లోపలికి వెళ్ళేకొలది ముత్యాలు, శంఖాలు మొదలైన విలువైనవి దొరుకుతాయి. అలాగే బావి త్రవ్వినప్పుడు లోతుకు వెళ్ళేకొలదీ స్వచ్ఛమైన నీరు పడుతుంది. " హృదయం చాలా లోతు, ఓ పట్టాన బయటపడరు " అంటూంటాం. హృదయకమలంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది. హృదయపులోతుల్లోకి వెళ్ళేకొలదీ తనెవరో తెలుసుకోవచ్చు, అమ్మ అనుగ్రహం పొందవచ్చు. అది అంత సులభం కాకపోయినా ప్రయత్నం చేస్తూ ఉండాలి.  అలలు లేని సముద్రం చూస్తే ఎంతో గంభీరంగా ఉంటుంది. " ఆయన ఎంత గంభీరంగా ఉంటారో, పలకరించడానికే భయంగా ఉంటుంది " అనే మాటలు తరచు వింటూంటాం. మనుషుల్లోనే అలాంటివారు ఉంటే " అమ్మవారు " ఎంత గంభీరంగా ఉంటారో ఊహకు ఎలా అందుతుంది. అమ్మవారి గంభీరానికి కారణం కూడా ఉంది. ఇన్ని చక్కటి అవకాశాలు ఇచ్...

అమ్మవారికి కొంచెం గర్వం ఎక్కువే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏 " గర్వితా " - అమ్మవారి అద్భుతనామం. ఇవది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 856 వ నామం. " గర్వితా " అంటే గర్వము కలిగినది. అమ్మవారికి కొద్దిగా గర్వం అంటారు. తరచుగా వింటూంటాం " ఏమి చూసుకునో అంత గర్వం " అని. అంటే " ఏమయినా " గొప్పదనముంటే గర్వపడచ్చు అనేగా. మరి సృష్టినంతా ఇంత లయబద్ధంగా దోషరహితంగా నడిపిస్తూందంటే ఆవిడ ఎంత గర్వపడాలి. నిజానికి గర్వపడే హక్కు అమ్మవారికి ఒక్కరికే ఉంది. 84 లక్షల జీవరాసులకీ ఇన్ని సౌకర్యాలు కలిగిస్తూందంటే ఎంత కష్టపడుతూ ఉండాలి. అమ్మవారి సృష్టి అద్భుతాన్ని తెలుసుకోవాలంటే ఎక్కువ కష్టపడక్కరలేదు. నాలుగు పువ్వులని చూస్తే చాలు - వాటి రంగులు, రేకులు, సువాసనలు వేటికవే సాటి. పువ్వులలోని మకరందం ఇంకో అద్భుతం. మరి అంత అద్భుతమైన తన సృష్టి అందాన్ని చూసుకుని అమ్మవారు గర్వపడడంలో ఆశ్చర్యమేముంది. జీవితాన్ని ఆనందమయం చేయడానికి ఎన్ని వింతలు, మాయలు చేస్తారు అమ్మవారు. ఒకటి చూసి కావాలనుకుని కష్టపడి దాన్ని సంపాదిస్తాడు. మరుసటి రోజే దీనికోసమా ఇంత కష్టపడ్డాను అని నవ్వుకుంటాడు/బాధపడతాడు. సమస్య వస్తే తల్లడిల్లి పోతాడు. సమస్య తీరిపోగానే...

వ్యాసర్షి గానయోగం ఉండాలన్నారు పాట వినడానికి కూడా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గానలోలుపా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 857 నామం. " గానలోలుపా " అన్నది ఒక అద్భుతనామం. గానమునందు ఆసక్తి కలది అని అర్ధం. ఆవిడకు గానం అన్నా, గానం చేసేవారన్నా ఎంతో ఇష్టం. ఆవిడ నాదస్వరూపిణి. " నాదరూపాయైనమః " అని పూజిస్తారు అమ్మవారిని. గానం అంటే " ఆనందానుభూతితో చేసే వ్యక్తీకరణ " అని వేదాలు చెబుతున్నాయి. అందుకే అమ్మవారి ఏ స్తుతినైనా రాగయుక్తంగా ఛందోబద్ధంగా పాడుతారు.  " గాతారం త్రాయతే ఇతి గాయత్రి " అన్నాయి ఉపనిషత్తులు. గానం చేసేవారిని రక్షిస్తుంది కనుక గాయత్రి అన్నారు. కేవలం గానంతో త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామిదీక్షితులు, అన్నమయ్య మొ గు వారు ధన్యజీవులయ్యారు, నేటికీ కీర్తింపబడుతున్నారు. వ్యాసమహర్షి " గానయోగం " అని ఒక అద్భుతపదాన్ని వాడారు: " గానయోగేనయోనిత్యం    పూజయంతి జనార్దనం,    తానానయతి భద్రంవో  ‌  యది దేవత్వమిచ్ఛతా "  అంటే గానయోగంతో దైవత్వం పొందుతారు అని. ఈ గానయోగం గానం చేసేవారిదే కాదు, విన్నవారిది కూడా.  పూజ అవగానే " గీతం శ్రావయామి " అంటారు. అమ...

నాదమే స్వరూపముగా గలది అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నాదరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 299 వ నామం . " నాదరూపా " అంటే నాదమే స్వరూపముగా గలది అని భాష్యం చెప్పారు. " శిశుర్వేత్తి పశుర్వేత్తి    వేత్తి గానరసం ఫణిః " - అంటే చిన్నపిల్లలు, పశువులు, పాములు కూడా గానరసాన్ని ఆనందిస్తాయి అని తెలియచేస్తున్నాయి మన శాస్త్రాలు. తను ఇష్టపడే గానానికి అంతటి శక్తినిచ్చింది అమ్మవారు. కృష్ణుడి వేణుగానాన్ని గోవులే కాదు ఇతర జంతువులు వృక్షాలు కూడా విని మైమరచిపోయేవిట బృందావనంలో. 1984 లో చుక్చీ సముద్రంలో 2000 బెలుగా తిమింగిలాలు మంచులో చిక్కుకుపోయాయి. మంచు 12 అడుగుల మందంగా పేరుకుపోయింది. రష్యా మోస్క్వా అనే పేరుగల మంచును బ్రద్దలు కొట్టే ఓడను పంపింది. మంచును బ్రద్దలు కొట్టినా తిమింగిలాలు బయటకు రాలేదు, రావడానికి ఇష్టపడుటలేదు అని గ్రహించారు. అప్పుడు ఓడలోని సిబ్బంది చక్కటి శాస్త్రీయ సంగీతాన్ని వినిపించడం, తిమింగలాలు ఓడవైపుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సంగీతాన్ని కొనసాగిస్తూ ఓడను మెల్లిగా ఎదరకు పోనిస్తూ తిమింగలాలను అన్నింటినీ సముద్రానికి చేర్చడం జరిగింది. ఇది ఒక అద్భుత ప్రక్రియ అ...

ఎంత నిగ్రహించుకున్నా మనస్సు సుఖాలవైపు లాగేస్తూ ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యతతో హ్యపి కౌంతేయ          పురుషస్య విపశ్చితః,    ఇంద్రియాణి ప్రమాధీని       హరంతి ప్రసభం మనః "               - భ.గీత 2:60 " ఓ అర్జునా! ఇంద్రియములు ప్రమధనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు  ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవఱకును  అవి అతని మనస్సును ఇంద్రియార్ధములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును " అన్నారు పరమాత్మ. ఎంతటి అద్భుత విషయం తెలియచేసారు పరమాత్మ. ఇది సహజం. ఎంత నిగ్రహించుకుందామన్నా మనస్సు లాగేస్తూ ఉంటుంది.  రామాయణంలో సీతమ్మ బంగారులేడిని చూసి కావాలంటుంది. అది రాక్షసుల మాయ అని చెబుతారు రామలక్ష్మణులు. ఉన్నది పరాయి ప్రదేశం. అప్పటికే ఖరదూషణాదులు యుద్ధానికి రావడం, వారిని రాముడు చంపడం జరిగింది. శూర్ఫణఖ అవమానింపబడి కోపంతో ప్రతీకారేక్షతో తిరిగి వెళ్ళింది. ఎంత జాగ్రత్తగా ఉండాలి అటువంటి సమయంలో. కాని సీతమ్మ మానవకాంత. ఆవిడ మనస్సు కూడా మన మనస్సు లాంటిదే. రాముడు కూడా మానవుడే. అందుకే సీతమ్మ కోరడం రాముడు వెళ్ళడం జరిగింది. ఆశ్చర్యకరంగా సుగ్...