సనాతనధర్మం భవిష్యత్తు - సంస్కృతి సంస్కృతం 5 - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏 " సంస్కృతి - సంస్కృతం 5 " మా గ్రామవాసి, బంధువు అయిన " పండితరాజ " జగన్నాధపండితులు తన 25వ ఏటే కాశీవిశ్వవిద్యాలయానికి ముఖ్యాధిపతి అయేరు. ఆయన 16వ ఏటకే వేదశాస్త్రాల్లో దిట్ట, ఎందరో పండితులను శాస్త్రవిజ్ఞానంతో ఓడించి ఆ పదవి చేపట్టడం జరిగింది. ఆకాలంలో బాదుషా వారి ఆస్థానంలో ఉండే మౌల్వీలు హిందువులగురించి కొంచెం కించపరిచే విధంగా మాట్లాడేవారు. ముఖ్యంగా 2 విషయాలు బాధించేవి. ఒకటి సంస్కృతం కూడా అరబ్బీనుంచే పుట్టిందని, రెండవది హిందూ పురాణాలే చెబుతున్నాయి " పరశురాముడు 21సార్లు దండయాత్ర చేసి రాజుల్నందరినీ చంపేసాడు " అని, కనుక దేశంలో అప్పుడున్న రాజులందరూ " నకిలీలే " అనీనూ. రాజస్తానీయ " జయపుర " పాలకుడైన మొదటి శ్రీసవాయీ జయసింహ మహారాజు ఈయన్ని కలిసి విషయం చెప్పి " చాలా బాధగా ఉంది, నేను ధనసహాయం చేస్తాను, తమరు ఆజ్మీర్ వెళ్ళి వారి భాషలు అరబ్బీ, పార్శీ, ఉర్దూలను నేర్చుకుని వారిభాషలోనే వారికి సరైన సమాధానం చెప్పి మా ఈ బాధను తొలగించాలి " అని అడగడంతో ఈయన ఆ భాషలలో పాండిత్యం సంపాదించి వచ్చి, మహారాజు పలుకుబడితో ఓ రోజు బాదుషా ...