Posts

Showing posts from November, 2024

ఏ జన్మ అయినా ఈశ్వరుడి ధ్యానంలో గడిపితే నష్టం లేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " నరత్వం దేవత్వం నగవన   మృగత్వం మశకతా,    పశుత్వం కీటత్వం భవతు    విహగత్వాదిజననం,    సదా తత్పాదాబ్జస్మరణ    పరమానందలహరీ,    విహారాసక్తం చేత్ హృదయమిహ   కిం తేన వపుషాం " -10 " మనుష్యునిగా, దేవుడుగా, పర్వతంగా, వనంగా, మృగంగా, దోమగా, పశువుగా, పక్షిగా కాని పుట్టినా ఆ ఆ పుట్టుకలందు నీ పాదపద్మాలను భావించడం అనే ఆనందనదిలో ఈదులాడే తలపు ఉన్నచో ఏ పుట్టుక అయినా లోటేముంది " అని.  ఈ శ్లోకం శంకరాచార్య విరచిత శివానందలహరి లోనిది.  ఏ పుట్టుక అయినా శివుడి ధ్యాసలోనే ఉన్నవారు చరితార్ధులవుతారు అని భావించాలి. "జంతూనాం నరజన్మ దుర్లభం" అన్నాయి శాస్త్రాలు. కాని శివునిధ్యాసలో లేనప్పుడు ఆ నరజన్మ వ్యర్ధం కదా.  దేవతలకయినా ఇదే వర్తిస్తుంది. కుబేరుడు ప్రతిదినమూ ఇద్దరిని దర్శించుకుని పూజిస్తారుట. ఒకరు శివుడు, ఐశ్వర్యప్రదాత, సంపదకోసం. రెండు వెంకటేశ్వరుడు - తను అప్పుగా ఇచ్చిన ధనాన్ని వసూలు చేసుకోవడానికిట. కొన్ని కొండలు ఉంటాయి - అరుణాచలం, సింహాచలం, భద్రాచలం, వేంకటాచలం (తిరుమల), రత్నాచలం (అన్నవరం ) మొ.గునవి. కొండగా పుడిత...

కృష్ణలీలలు అర్ధమవాలంటే సంస్కారం ఉండాలి - వివేకానందుడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " సంస్థాపనాయ ధర్మస్య    ప్రశమాయేతరస్య చ .    అవతీర్ణో హి భగవాన్   అంశేన జగదీశ్వరః " - 27 " స కథం ధర్మసేతూనాం    వక్తా కర్తాభిరక్షితా .    ప్రతీపమాచరద్బ్రహ్మన్    పరదారాభిమర్శనం " - 28 కృష్ణుడి రాసలీల అంతా విన్నాక పరీక్షిత్తు మహారాజు " నాకో చిన్న సందేహం. ధర్మసంస్థాపనకు భగవానుడి అంశ కృష్ణుడిగా అవతరించింది కదా. మరి పరాయివారి భార్యలతో నృత్యాలు సమంజసమా " అని అడుగుతాడు శుకమహర్షిని. ఇది నిజంగా అతని సందేహం కాదు. వేల సంవత్సరాల తరువాత అయినా కొందరు మూర్ఖులకు, వితండవాదులకు అటువంటి సందేహం రావచ్చని భావించి దానికి వివరణ ఇవ్వడం జరిగింది.  ఎంత అద్భుతం మన వాజ్మయం. రామాయణం, భారతం, భాగవతాలలో ఇలా సందేహం కలిగే ఘట్టాలకు అక్కడే సందేహనివృత్తి కూడా చేసారు. శుకుడు అంటారు " ఈశ్వరాణాం వచః సత్యం తథైవా చరితం క్వచిత్ - పరమేశ్వరుడి వాక్కులు సత్యాలే. కాని వారి చరిత్ర కొంచెం సత్యంగా కనబడుతుంది " అని. ఇక్కడ " కొంచెం " అన్నారు అంటే సత్యమేనా అనే అనుమానం కలగవచ్చు అని. అసత్యం అనలేదు మహర్షి. వారు ధర్మాధర్మాలకు అతీతులు. వారి వాక్కులు అనుస...

కృష్ణుడు కోటి మన్మధుల పెట్టు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " తాసామావిరభూచ్ఛౌరిః   స్మయమానముఖామ్బుజః,   పీతాంబరధరః స్రగ్వీ    సాక్షాన్మన్మథమన్మథః "       ‌‌ - భాగవతం 10:32:2 రాసలీలకు ముందు గోపికలు అర్ధరాత్రి అంతర్ధానమయిన కృష్ణుడిని వెతుకుతూ ఉంటే వారిమధ్యన " మన్మధుడికే మన్మధుడయిన కృష్ణుడు ప్రత్యక్షమయారు " అని భావం. శ్రీధరాచార్యులు ఈ శ్లోకంలోని " మన్మధమన్మధః - మన్మధుడికే మన్మధుడు " కి భాష్యం వ్రాస్తూ ఇలా అంటారు: " బ్రహ్మాది జయ సంరూఢ    దర్ప కందర్ప దర్పః    జయతి శ్రీపతి గోపీ    రాసమండల మండలః " " బ్రహ్మాది దేవతలను జయించాననే గర్వము కలిగిన మన్మధుడి గర్వమును అణిచిన గోపీరాసమండలాధీశుడు అయిన కృష్ణుడు ప్రకాశిస్తున్నాడు " అని. దీనికి ఓ అద్భుతమయిన ఘట్టం చెప్పారు: కృష్ణుడికి రాసలీల ప్రారంభసమయంలో మన్మధుడు కనిపించాడు. నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని కృష్ణుడు అడిగితే మన్మధుడు " బ్రహ్మాది దేవతలను, ఇంద్రుడిని కూడా జయించేసాను. మిమ్మల్ని కూడా జయించేస్తే నాకు తిరుగులేదు కదా " అంటాడు. శివుడిని జయించలేదుకదా నువ్వు అంటే అప్పుడు ఆయన తపస్సులో ఉండడంవల్ల కుదరలేదు అంటాడు. రాముడిని క...

రాధాదేవి శక్తిస్వరూపిణి, కృష్ణుడి ప్రేయసి కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 రాధాదేవి శక్తిస్వరూపిణి. అమ్మవారు, గోలోకానికి ఈశ్వరి. విష్ణువు యొక్క ప్రేమ/ఆనంద స్వరూపిణి. విష్ణువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందడానికి రాధాదేవి ధ్యానం ఉత్తమం. కృష్ణభక్తులు అదే చేస్తారు. రాధాకృష్ణులు ఒకరే. చంద్రుడు వెన్నెల, సూర్యుడు వెలుగు లాగ కలిసే ఉంటారు. బ్రహ్మవైవర్తపురాణం/గర్గభాగవతంలో విస్తారంగా తెలియచేసారు రాధాదేవి గురించి. బ్రహ్మ 6000 సంవత్సరాలు ( ఆయన సం.లు - కొందరు 60 వేల సం.లు అని భాష్యం చెప్పారు ) తపస్సు చేస్తే రాధాదేవి కాలిగోరు దర్శనం అయిందిట. బాధతో విష్ణువుకు విన్నవించుకుంటే " కృష్ణావతారంలో బృందావనంలో ఆవిర్భవిస్తుంది రాధాదేవి, అప్పుడు దర్శనం చేసుకుని తరించు " అని చెప్పారు. మనలో చాలామందికి రాధాకృష్ణుల ప్రేమ, రాధ కృష్ణుడి ప్రేయసి అనే తెలుసు. అమ్మవారు రాధాదేవి గోకులంలో వృషభానుడి కూతురుగా, రాధగా ఆవిర్భవించింది. దీనికో చక్కటి వృత్తాంతం చెబుతారు. రాధాదేవికి ఓ కోరిక కలిగిందిట. విరహం చాలా మధురం అంటూంటారు కదా. ఆవిడకు విరహమే లేదు, ఇద్దరూ ఒకరే కనుక. విరహం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఓ గోపికగా పుట్టిందని తత్త్వవేత్తల భావన. వృషభానుడు ఓ గోకులంకి రా...

మరుగున పడిన గీతను కృష్ణుడు మళ్ళీ చెప్పారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఇమం వివస్వతే యోగం    ప్రోక్తవానహమవ్యయం,    వివస్వాన్మనవే ప్రాహ    మనురిక్ష్వాకవే2బ్రవీత్ "               - భ.గీత 4:1  " సనాతనమూ నాశరహితమూ అయిన ఈయోగాన్ని మొదట సూర్యుడికి చెప్పాను. దానిని మనువు ఆధ్యయనం చేసి ఇక్ష్వాకునికి బోధించాడు. తరువాత కాలంలో రాజర్షులు అందుకుని తరువాత తరాలకి అందించారు. తరువాత మరుగున పడిపోయింది. ఇప్పుడు నీకు మళ్ళీ చెబుతున్నాను " అన్నారు పరమాత్మ. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. సనాతనుడు అయిన సూర్యుడు ఎక్కడ, నిన్న మొన్న పుట్టి తనతో పెరిగిన కృష్ణుడు ఎక్కడ అని. అదే అడుగుతాడు ఇలా: " అపరం భవతో జన్మ    పరం జన్మ వివస్వతః,    కధమేతద్విజానీయాం    త్వమాదౌ ప్రోక్తవా నితి "               ‌ - ‌ భ.గీత 4: 4. నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటీ అని. ఆశ్చర్యంగా ఉంది అంటాడు అర్జునుడు. సందేహనివృత్తి. ప్రశ్నలు, సమాధానాలు వాటిలోనే. వేల సం.ల తరువాత కలగబోయే సందేహాలకు కూడా అక్కడికక్కడే ప్రశ్నలు సమాధానాల రూపంలో విషయాలను తెలియచేసారు...

మనం చేయకూడదు అనుకుని కూడా అటువంటి పనులను ఎందుకు చేస్తాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " స్వభావజేన కౌంతేయ    నిబద్ధః స్వేన కర్మణా,    కర్తుం నేచ్ఛసి యన్మోహాత్    కరిష్యస్యవశో2పి తత్ "                - భ.గీ 18:60. " నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి చేయుదువు " అన్నారు పరమాత్మ. ఆశ్చర్యకరంగా మనకు ఏమాత్రం సంబంధంలేని విషయాలలో కలుగచేసుకుని సమస్యలలో కూరుకుపోతూంటాం. అసలు అలా ఎలా జరిగింది అని వింతగా అనిపిస్తుంది. రాముడు 14000 మంది ఖరదూషణాది రాక్షసులను 3 ఘడియలలో ( 72 ని.లలో ) సంహరించడం చూసిన అకంపనుడు అనే రావణదూత లంకనుచేరి రావణుడికి విషయం తెలియచేస్తాడు. " వెంటనే వెళ్ళి రాముడిని చంపేస్తాను " అని రావణుడు అంటే అకంపనుడు అంటాడు " అది అంత సులభం కాదు. అతను ధర్మమూర్తి, పాపులు ఎలా స్వర్గం చేరలేరో అలా మనం రాముడిని జయించలేం " అని " ఆ రాముడికి తన భార్య సీతే బలం. నీకు కక్ష తీర్చుకోవాలని ఉంటే అతను లేని సమయంలో అతని అందమయిన భార్యను అపహరించు " అని సలహా ఇచ్చాడు అకంపనుడు. అప్పుడు రావణుడు మారీచుడు దగ్గరికి వెళ్ళి సీతాపహరణానికి సహాయం చేయమని అడుగుతాడు.  విషయం విని "...

పూజ అయినా జపం అయినా కొన్ని రోజులు చేస్తే అలవాటయిపోతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ శివయ్యను ఇలా స్తుతిస్తారు: " మనస్తే పాదాబ్జే నివసతు    వచస్త్సోత్రఫణితౌ   కరశ్చాభ్యర్చాయాం శ్రుతి   రపి కథాకర్ణనవిధౌ |   తవధ్యానే బుద్ధిర్నయన   యుగళం మూర్తివిభవే   పరగ్రంథాన్ కైర్వా పరమశివ    జానే పరమతః (7వ శ్లోకం)" " ఓ పరమేశ్వరా ! నా మనస్సు నీ పాదపద్మములందునూ , నా వాక్కు నీ స్తోత్రపాఠములు చదువుటయందునూ , నా చేతులు నీ పూజయందునూ , నా చెవులు నీ చరిత్రలను వినుటయందునూ , నా బుద్ధి నీ యొక్క ధ్యానమందునూ , నా యొక్క కన్నులు నీ దివ్యమంగళవిగ్రహం చూచుటయందునూ స్థిరపడియుండుగాక . ఇక మీద నా సర్వేంద్రియములూ పర విషయాలను ఎరుగ కుండును గాక‌ " అని. ఈ శ్లోకంలో ఓ అద్భుతమైన అంతర్భావం ఉంది. పూజ్య గురువులు సామవేదంవారు ప్రవచనం చేస్తూ ( ఈ శ్లోకం గురించి కాదు ) ఓ అద్భుతమైన విషయం తెలియచేసారు. శంకరులు శివయ్యతో " ఆశ్చర్యంగా ఉంది శివయ్యా. ఇదివరకు నేను పూజ చేయండర్రా అని చేతులను, గుడికి వెళ్ళండర్రా అని కాళ్ళను, శివయ్యను చూడండర్రా అని కళ్ళను, ప్రవచనాలు వినండర్రా అని చెవులను, శివస్తుతి చేయవయ్యా అని నాలుకను బ్రతిమలాడేవాణ్...

లోభమే అన్ని అనర్ధాలకు మూలం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 " త్రివిధం నరకస్యేదం    ద్వారం నాశనమాత్మనః,   కామక్రోధః తధా లోభః    తస్మాత్ యేతత్ త్రయం     త్యజేత్ " - భ.గీత 16:21  " కామక్రోధలోభాలు నరకద్వారాలు - కనుక వాటిని వదిలేయాలి " అని తెలియచేసారు పరమాత్మ గీతలో. అసలు నరకం అంటే ఏమిటి. ఎప్పుడయినా ఎవరయినా ప్రయాణంచేస్తూ తుఫాన్ లో చిక్కుకున్నా " అమ్మో నరకం చూసాం/కనబడింది " అంటారు. అంటే అధికకష్టాలు అనుకోవాలి. ఎవరైనా కష్టాలు అనుభవిస్తూంటే ఏ పాపం చేసారో అంటూంటారు. అంటే పాపం, కష్టాలు తోడుదొంగలు.  వ్యాసమహర్షి మహాభారతంలో అసలు పాపాలకి ( కష్టాలకి ) మూలం ఏమిటి అన్నది అద్భుతంగా తెలియచేసారు: " పాపశ్చతు యదధిస్టానం    తత్ శృణుష్వ నరాధిపా,    ఏకో లోభో మహాగ్రాహో    లోభాత్ పాపం ప్రవర్తతే ". అంటే పాపాలన్నిటికీ మూలం " లోభం " అని తెలియచేసారు. లోభం అంటే కావాలనుకోవడం. అది అక్కడితో ఆగదు - తనకే కావాలనుకోవడం, ఇంకెవరికీ ఉండకూడదు, ద్రక్కకూడదు అనుకోవడం, అసూయ, కోపం, హింస అన్నీ ఒకటి తరువాత ఒకటి కలుస్తూంటాయి. అంటే పాపభవంతులకి పునాది "లోభం". మరి పుణ్యం మాటేమిటి? దానికి మ...

MitoChondria - శక్తిస్వరూపిణి అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 ఆదిశంకరులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారిని ఇది స్తుతిస్తారు: " శివః శక్త్యా యుక్తో యది    భవతి శక్తః ప్రభవితుం   న చేదేవం దేవో న ఖలు    కుశలః స్పందితుమపి ।   అతస్త్వామారాధ్యాం  ‌  హరిహరవిరించాదిభిరపి   ప్రణంతుం స్తోతుం వా    కథమకృతపుణ్యః ప్రభవతి"                    - శ్లోకం 1 " సమస్త శక్తిస్వరూపిణివగు ఓ జగన్మాతా! మంగళకారుడగు ఈశ్వరుడు శక్తి(నీ)తో కలిసి ఉండడంవల్ల సృజించుటకు సమర్ధుడగు చున్నాడు. అలా కాకపోతే కదలడానికి కూడా అశక్తుడే అగుచున్నాడు ". ఎంత అద్భుతం మన వాజ్మయం. ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెపుతూన్నది, మనందరికీ తెలిసినది ఏమిటంటే బిడ్డకు 50% డిఎన్ఎ తల్లినుంచి, 50% తండ్రినుంచీ వస్తుందని. ఇప్పుడు కొత్తగా కనిపెట్టినది ఏమిటంటే మన డిఎన్ఎ లో " మైటోకాండ్రియా " అనే పరమాణువు ఉందని. అదే మనకణాలకు అంటే మనకు శక్తిని ఇస్తూందని. ఇంకా తెలుసుకున్నదేమిటంటే ఈ శక్తిని ఇచ్చే పరమాణువు బిడ్డకు అమ్మనుంచి వస్తుందని. అంటే బిడ్డలకు శక్తిని ఇస్తూన్నది తల్లే అని తెలుస్తూంది. లక్షల పోనీ అందరూ ...

స్థితప్రజ్ఞుడు ఎలా కూర్చుంటారు, మాట్లాడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " స్థితప్రజ్ఞస్య కా భాషా        సమాధిస్తస్య కేశవ  !   స్థితధీః కిం ప్రభాషేత     కిమాసీత వ్రజేత కిం "              - భ.గీత 2:54 అర్జునుడు అడుగుతాడు పరమాత్మని " ఓ కేశవా! సమాధిస్థితుడై పరమాత్మప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేమిటి? అతడు ఎట్లు భాషించును? ఎట్లు కూర్చొనును? ఎట్లు నడచును? " అని. ఇక్కడ గ్రహించవలసినది మనిషి స్వభావం అతని సంభాషణలోనూ, నడకలోనూ, ఆఖరికి కూర్చోవడంలో కూడా తెలిసిపోతుంది అని. ఎంత అద్భుత విషయం. ఓసారి శంకరజయంతి ఉత్సవాలలో కంచిపీఠాధిపతి శ్రీవిజయేంద్రసరస్వతీస్వామి వారు అనుగ్రహభాషణం చేసారు. పూజ్యులు సామవేదంవారు కూడా వచ్చారు. ఆయన పీఠాధిపతి కూర్చున్న సింహాసనానికి ముందర క్రింద నేలమీద సుఖాసనం వేసుకుని కూర్చున్నారు. ఎంత వినయం, నిరాడంబరత. స్థితప్రజ్ఞుల లక్షణం కూర్చునే తీరులో కూడా తెలుస్తుంది అంటే ఇదే. కొందరు నోరు తెరిచి మాట్లాడడం మొదలెడితే చాలు చెవులు మూసుకుని దూరంగా పోవాలనిపిస్తుంది. రామలక్ష్మణులు సీతాదేవిని వెదుకుతూ ఋష్యమూక పర్వతం వైపుకు వెడుతూన్నప్పుడు హనుమ బ్రహ...

ప్రశ్న మంచిదయితే జవాబు మంచిదవుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " తద్విద్ధి ప్రణిపాతేన    పరిప్రశ్నేన సేవయా,    ఉపదేక్ష్యంతి తే జ్ఞానం    జ్ఞానినస్తత్త్వదర్శినః "               - భ.గీత 4:34 అర్జునుడు అడుగుతాడు పరమాత్మని " మనస్సుని నిగ్రహించుకోవడం, జ్ఞానం పొందడం అంత సులభమా " అని. అప్పుడు పరమాత్మ అంటారు: " మంచి గురువును పట్టుకో, శ్రద్ధగా సేవచేసుకో, మంచి ప్రశ్నలు వేసి మంచి జ్ఞానం పెంచుకో " అని. స్వామి " పరిప్రశ్నేన " అన్నారు. అంటే ప్రశ్న గౌరవంగా ఉండాలి అని. ప్రశ్న మంచిదయితే జవాబు మంచిదయి జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. శిష్యుడు శ్రద్ధగా గురువును సేవించి విద్యను నేర్చుకుంటే శిష్యుడివల్ల కూడా గురువుకు మంచిపేరు వస్తుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు మొ.గు వారు అలా గురువుల గౌరవాన్ని పెంచారు. పరమాత్మ మంచి గురువును పట్టుకో అన్నారు కాని నిజంగా గురువు కూడా ఒకమంచి శిష్యుడు దొరికితే బాగుండునని ఎదురు చూస్తారుట. గురువు అంటే చీకటి/అజ్ఞానం లోంచి వెలుగు/జ్ఞానం లోకి నడిపించేవారు. గురువు వేసే పునాదిమీదే విద్యార్ధి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పునాది బావున్నప్పుడే భవ...

స్వధర్మమే ఎల్లవేళలా శ్రేయం పరధర్మం కన్నా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " శ్రేయాన్ స్వధర్మో విగుణః    పరధర్మాత్ స్వనుష్ఠితాత్,   స్వధర్మే నిధనం శ్రేయః    పరధర్మో భయావహః "                - భ.గీత 3:35 " పరధర్మమును చక్కగా నిర్వహించుటకన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది. దానిని పాటించుటకన్నను స్వధర్మపాలనమునందు నాశనమును పొందుటయైనను ఉత్తమమైనది " అన్నారు పరమాత్మ. కొద్దిగా లోపాలున్నా స్వధర్మమే మేలు, పరధర్మం భయంకరమైనది అన్నారు పరమాత్మ గీతలో. దేశకాల వర్ణాశ్రమాలను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని శాస్త్రాలే చెబుతున్నాయి. ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్న ఒక ధర్మాన్ని పట్టుకుని విమర్శిస్తూ సనాతనధర్మం అంతా చెడ్డది అనుకోవడం దేనికి. ఇప్పటి పరిస్థితులకు సరిపోయేలా కొద్దిగా మార్పు చేసుకోవడమే నయం కదా. చేసుకుంటున్నాం కూడా - ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి బాల్యవివాహాలు వద్దనుకున్నాం, సతీసహగమనం ఆపేశాం. ఇతరమతాలన్నీ ఎప్పుడు వాడుకలోకి వచ్చాయో అందరికీ తెలుసు. సనాతనధర్మం ఎప్పటినుంచి ఉందో ఎవరూ చెప్పలేరు. అంటే ఈ ఇతరమతాలన్నీ సనాతనధర్మం బిడ్డలే. ఎవరు కాదన్నా ఒప్పుకోకు...

కోరికలకు అంతుండదు బ్రహ్మకైనా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 గరుడపురాణంలో ఓ అద్భుత శ్లోకం ఉంది: " చక్రధరో2పి సురత్వం    సురత్వలాభే  సకలసురపతిత్వం,   భవతిరుం  సురపతిరూర్ధ్వగతిత్వం    తథాపి ననివర్తితే తృష్ణ "  " రాజు చక్రవర్తి అవాలనుకుంటాడు. చక్రవర్తి ఇంద్రుడు అవాలనుకుంటాడు. ఇంద్రుడు బ్రహ్మ అవాలనుకుంటాడు. కోరికకు అంతు లేదు " అని. ఇలా కోరికలు గుర్రాలులా పరిగెట్టడంలో అందరూ ఒకటే.  బ్రహ్మగారికి కూడా ఓ ఆశ/కోరిక కలిగింది. భాగవతంలో ఓ అద్భుత సన్నివేశం ఉంది. బ్రహ్మ కృష్ణుడిని పరీక్షించడానికని ఆవుదూడలను, గోబాలకులను మాయం చేస్తారు. కృష్ణుడు విషయం గ్రహించి తన అంశతో ఆవుదూడలుగానూ గోబాలకులుగానూ మారగా అందరూ ఇళ్ళకు చేరుకుంటారు. అలా ఏడాది గడుస్తుంది. బ్రహ్మ వచ్చి చూసి ఆశ్చర్యపోతారు. తన దగ్గర ఉన్నవారంతా ఇక్కడ కూడా ఉన్నారేమిటి అని. జ్ఞానోదయం అయి కృష్ణుడిని స్తుతిస్తాడు.  అప్పుడు అనుకుంటాడు బ్రహ్మ. ఈ గోబాలకులు ఏమి పుణ్యం చేసుకున్నారు. పరమాత్మతో ఆటలు, భోజనాలు, హాస్యాలు. ఎందుకు నాకీ బ్రహ్మ పదవి. ఈ గోబాలకుల పాద ధూళిగా పుట్టినా నా జన్మ ధన్యమయి ఉండేది అని‌. భగవానుడు ( తనవారు పరాయివారు అనే భేదం ల...

శివస్తుతి సర్వానుగ్రహం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు"🙏 శంకరాచార్యులు " శివానందలహరి " చేస్తూ ఒక అద్భుత శ్లోకంతో శివుణ్ణి ప్రార్ధిస్తారు: " అశనం గరళం ఫణీ కలాపో   వసనం చర్మచ వాహనం     మహోక్షః మమ దాస్యసి కిం     కిమస్తి శంభో తవ     పాదాంబుజ భక్తిమేవ దేహి "  ఇది కూడా నిందాస్తుతి క్రిందకే వస్తుంది.  ఓరోజు శంకరాచార్యులవారికి శివుణ్ణి నేరుగా దర్శించి ప్రార్ధన చేసుకోవాలనిపించింది. కైలాసానికి చేరుకున్నారు. శివుడు పరమానందపడిపోయి " రావోయ్, ఎన్నాళ్ళకి వచ్చావు, కూర్చో " అన్నారు. 10 ని.లు అవగానే తను తిరిగి వెడతానన్నారు శంకరులు. " అదేమిటోయ్ రాకరాక వచ్చావు, నాలుగు రోజులు ఉండి వెడుదువుగాని " అన్నారు శివుడు. అప్పుడు శంకరులు పై శ్లోకాన్ని చెబుతారు. మనం వేరే ఊరిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్ళామనుకోండి. ఇంట్లోకి ఆహ్వానించి సామాను ప్రక్కరూములో పెట్టుకో అంటాడు. లుంగీ ఇచ్చి కట్టుకోమని కాఫీ ఇస్తాడు. స్నానంచేసి రమ్మని టిఫిన్ పెడతాడు. తన స్కూటర్ మీదో కారుమీదో ఊరంతా చూపిస్తాడు. వెళ్ళేటప్పుడు ఏదో చిన్న జ్ఞాపిక ఇచ్చి సాగనంపుతాడు.  ఇదే విషయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఎంత అద్భుతం...

భక్తియే అత్యుత్తమం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " త్రైగుణ్యవిషయా వేదా         నిస్త్రైగుణ్యో భవార్జున  !   నిర్ద్వంద్వో  నిత్యసత్వస్థో     నిర్యోగక్షేమ ఆత్మవాన్ "               - భ.గీత 2:45 " ఓ అర్జునా! వేదములు సత్వరజస్తమోగుణముల కార్యరూపములైన  సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు కూడా ప్రతిపాదించును. నీవు ఆ భోగముల యెడలను వాటి సాధనల యందును ఆసక్తిని  త్యజింపుము. హర్షశోకాది ద్వంద్వములకు  అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము.  నీ యోగక్షేమముల కొఱకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము " అన్నారు పరమాత్మ. విశ్వరూపుడు త్వష్ట ప్రజాపతి కొడుకు. పురోహితులు. బృహస్పతిని అవమానించి శక్తులు కోల్పోయిన ఇంద్రుని విశ్వరూపుడిని కలిసి చండీయాగం మొ.గు యాగాలు చేయించు, మళ్ళీ మీరు, దేవతలు శక్తిమంతులు అవుతారు అని ఆదేశించారు బ్రహ్మ గారు. విశ్వరూపుడి తల్లి రాక్షసవంశం. అందుకని విశ్వరూపుడు దేవతలకోసం యాగం చేస్తూ రాక్షసుల ఉన్నతి కోసం కూడా చేసారు. విశ్వరూపుడికి ఆ కారణంగా " దేవహే...

పుణ్యపురుషులు మన శిరస్సుపై చేతిని ఉంచి ఆశీర్వదిస్తే శుభం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " వ్యక్తం భవాన్ వ్రజభయార్తి   హరోఽభిజాతో దేవో      యథాఽఽదిపురుషః      సురలోకగోప్తా, తన్నో నిధేహి     కరపంకజమార్తబంధో     తప్తస్తనేషు చ శిరఃసు చ కింకరీణాం "    - భాగవతం 10(1):29:41 " నువ్వు ఎవరో తెలిసింది. దేవతల రక్షకుడవయిన ఆదిపురుషుడవు. నీ పద్మహస్తాన్ని మా శిరస్సుపై ఉంచి మా జన్మ జన్మల ఆర్తిని తీర్చు " అని వేడుకుంటారు గోపికలు. పరమాత్మ చేయి తగిలితే ముక్తి తధ్యం. గురువుకు పెద్దలకు వారి పాదాలకు నమస్కరిస్తాం మనం. అప్పుడు వారు వారి హస్తాన్ని మన శిరస్సుపై ఉంచి ఆశీర్వదిస్తారు. అది విశేష ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది బాగా అలవాటు చేయాలి. అప్పుడే వారి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. పూతన రాక్షసి. బాలకృష్ణుడిని చంపడానికి వచ్చి ఆయనచేతిలో మరణించింది. భారీకాయం. ఎందరినో మనుషులను జంతువులను తిని ఉంటుంది. శరీరమంతా విషం పేరుకుపోయి ఉంటుంది. ఎలా వదుల్చుకోవాలి. నందుడు ఆ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికించి ఊరుకు దూరంగా దహనానికి ఏర్పాటు చేసాడు.  ఆశ్చర్యకరంగా దహనమవుతూన్న పూతన శరీరంన...

భార్యాభర్తలు సంబంధం ఎటువంటిదో తెలియచేసింది సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏  " రమణలంపటా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 320 వ నామం.  " రమణలంపటా " అంటే తన భర్త యందు ఆసక్తి/అనురాగం గలిగినది అని అర్ధం. అనుమామేముంది. ఆకులు అలములు కూడా తినకుండా, మండుటెండలో నిప్పుల మధ్య నిలబడి తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుని అపర్ణగా పూజింపబడుతున్నారు అమ్మవారు. ఆవిడకు భర్త అంటే ఎంత అనురాగమో తెలియాలంటే క్షీరసాగరమథనం కధను నెమరువేసుకోవాలి. క్షీరసాగరాన్ని మథించినప్పుడు హాలాహలం పుట్టింది ముందర.‌ బ్రహ్మాది దేవతలతో బాటు అందరూ భయపడిపోయారు. అప్పుడు శివుడిని ప్రార్థించడం, ఆయన హాలాహలం అంతు చూడడానికి ఎదరకు రావడం జరిగింది. హాలాహలాన్ని నోట్లో వేసుకున్నారు. లోకాలన్నీ ఎక్కడ ఉన్నాయి. శివుడి ఉదరంలో. మరి హాలాహలం ఉదరంలోకి వెడితే ఎలా?. అప్పుడు అమ్మవారు ఏ కీడు జరగకూడదని, తను " జ్వాలాతోరణం " క్రింద నుంచి భర్తతో కలిసి 3 మార్లు ప్రదక్షణం చేస్తాను అని అగ్నిదేవుడికి మ్రొక్కుకున్నారు. మన క్షేమం కోసం అమ్మవారు అంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారు.  అప్పటినుండి కార్తీకపౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుపుతారు భక్తులు. అమ్మవారు స్వామిత...

అప్పయ్యదీక్షితర్ - సెల్ఫ్ అసెస్మెంట్ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 శివాంశసంభూతుడు, మహాపండితుడు అయిన అప్పయ్యదీక్షితర్ గురించి కొన్ని అద్భుతమయిన విషయాలు నెమరువేసుకుందాం. " శివరహస్య " అనే గ్రంధంలో శివుడే స్వయంగా తన అంశతో దీక్షితర్ అనే ఆయనగా జన్మిస్తాడు అని తెలియచేసారు.  ఈయన 1554 లో తమిళ్ నాడులోని విరించిపురంలో జన్మించారు. " విరించి " అంటే విష్ణువు. అంటే శివాంశుడు విష్ణుపురంలో జన్మించారన్నది అద్భుతవిషయం. శివవిష్ణువులు ఒక్కరే అన్నది ఈయన బోధన. ఆయన చిన్నతనంలోనే 14విద్యలూ నేర్చుకున్నారు. ఆయన వేదాంతం, శివాద్వైతం, మీమాంస, వ్యాకరణం, అలంకారాలపై 104 గ్రంధాలు వ్రాసారు. ఆయన అద్వైతాన్ని అనుసరించారు.  అప్పుడు చోళరాజుల సంస్థానంలో రత్నఖేత శ్రీనివాస అని పండితుడు ఉండేవారు. ఆయన అప్పయ్యగారి విద్వత్తుగురించి విని ఆయన్ని ఓడించి తనకాళ్ళు పట్టించుకోవాలని తలచి కంచి కామాక్షిని అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. అమ్మవారు " అది అంత సులువుకాదు కాని నీ కూతురిని ఆయనకిచ్చి వివాహం చెయ్యి, నువ్వు మామగారు అవుతావు, ఆయన నీకాళ్ళు ఎలాగూ పట్టుకుంటాడు " అన్నారు. అదేరాత్రి శివుడు అప్పయ్యగారి కలలో కనబడి " వెంటనే కంచి కి వెళ్ళి కామ...

భాగవతరసాన్ని త్రాగాలన్నారు పండితులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 మహాభాగవతంని చదవడం, వినడం కాదండి, త్రాగాలి అన్నారు పండితులు. అది చెరుకురసంలా మంచిరుచిగా ఉంటుంది. " అహం మమాసౌ పతిరేషమే    సుతో వ్రజేశ్వరస్యాఖిలవిత్తపా సతీ, ‌‌  గోప్యశ్చ గోపాః సహ  గోధనాశ్చ మే     యన్మాయయేత్థం కుమతిః స మే గతిః "               - మహాభాగవతం 10:08:42  " నేను నందుని భార్యని. నందుని సంపదలన్నిటికీ రాణిని. ఈ నందుడు నా భర్త, ఈ కృష్ణుడు నా కొడుకు, ఈగోవులు గోపికలు గోపాలకులు అందరూ నావారు అనేటువంటి ఈ ఇచ్ఛాసంకల్పాలు ఎవరి మాయవల్ల నాలో కలుగుతున్నాయో ఆ పరమాత్మే ఇతడు " అని అనుకుంది యశోద. బలరామాదులు వచ్చి కృష్ణుడు మన్ను తిన్నాడని చెప్పగానే యశోద కోప్పడుతుంది. అప్పుడు కృష్ణుడు అవన్నీ అబద్ధాలే, అనుమానముంటే చూడమని నోరు తెరుస్తాడు. యశోద చూసి ఆశ్చర్యపోతుంది, ఆ నోట్లో చతుర్దశభువనాలు కనబడడంతో. యశోదకు జ్ఞానోదయం అయి పైవిధంగా భావిస్తుంది. చిన్నికృష్ణుడి నోటిలోకి చూడగానే యశోదమ్మకు జ్ఞానోదయం అయింది. క్షణకాలమే. మళ్ళీ మాయ కమ్మేస్తుంది. క్షణమైనా ఈ బంధాలన్నీ మాయ, అశాశ్వతం, అటువంటి మాయను కలుగచేస్తున్నది పర...

సుఖపడడం కూడా అలవాటు చేసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " దుఃసహప్రేష్ఠవిరహతీ   వ్రతాపధుతాశుభాః,   ధ్యానప్రాప్తాచ్యుతా   శ్లేషనిర్వృత్యా  క్షీణమంగలాః "                     - 10:29:10 " ( గోపికలకు ) విరహతాపంవలన అశుభాలు తొలగిపోయాయి. ధ్యానంలో కూర్చుని కృష్ణుని దివ్యమంగళ విగ్రహాన్ని కౌగలించుకోగానే పుణ్యాలు కూడా నశించాయి " అన్నారు వ్యాసర్షి భాగవతంలో. పుణ్యాలు నశించడం అన్నది ఆశ్చర్యకరమయిన విషయం కదా. భగవానుడు ( తనవారు పరాయివారు అనే భేదం లేనివారు ) అయినప్పటికీ కృష్ణుడు గోపికలను అనుగ్రహించాలని నిశ్చయించుకున్నారు. ఓ శరత్కాలపురాత్రి చంద్రుడు చక్కటి వెన్నెల కురిపిస్తూన్నప్పుడు శ్రీకృష్ణుడు ఓ కల్పవృక్షం వద్ద నిలుచుని వేణుగానం చేస్తున్నారు.  గోపికలు ఎక్కడ పనులు అక్కడే విడిచిపెట్టేసి వేణుగానం వినిపిస్తూన్న వైపుకు పరిగెత్తారు. కొందరిని వారి భర్తలు, బంధువులు ఆపేసారు. అలా ఆపేయబడినవారు అయ్యో అని బాధపడలేదు. ఉన్నచోటే మఠం వేసుకుని కూర్చుండిపోయారు. విరహతాపం వలన వారి పాపాలన్నీ నశించాయి. కూర్చున్నచోటే ధ్యానంలో మునిగిపోయి కృష్ణపరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని కౌగలించ...

శ్రీయాజ్ఞవల్క్యమహర్షి జయంతి నేడు. - సమాజసేవే ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 శ్రీయాజ్ఞవల్క్యమహర్షి జయంతి నేడు. " శ్రీయాజ్ఞవల్క్యమహర్షి" పలు " ధర్మశాస్త్ర " విషయాలు చెప్పారు. అది " యాజ్ఞవల్క్యస్మృతి " గా ప్రసిద్ధిచెందింది. వేదాలలో ఒకటి అయిన యజుర్వేదాన్ని తరువాత కాలంలో సులువుగా అధ్యయనం చేయడానికి రెండుభాగాలుగా చేసారు. వాటిలో శుక్లయజుర్వేదంని ప్రతిపాదించినది ఈ " యాజ్ఞవల్క్యమహర్షి ". అద్భుతమయిన " ఈశావాస్యోపనిషత్తు " ఈ శుక్లయజుర్వేదంలోనిదే. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యమహర్షి తన భార్య మైత్రేయికి చెబుతారు కొన్ని అద్భుత విషయాలు. ఆయన ఎన్నో విషయాలు ఒక్కొక్కటీ చెప్పుకొస్తారు. ఉదా: పిల్లవాడు మనవాడయితేనే ప్రియం. ఆవులాంటి జంతువులు మనవయితేనే ప్రియం. ఇలాంటివి చాలా చెబుతారు మహర్షి.  " ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతు " - మనదనుకొన్న కోరికలు మాత్రమే అన్నీ ఇష్టమవుతాయి మనుషులకు " అని.  కుక్క ఒకటే కాని మనదయితే ఆప్యాయంగా ప్రేమగా చూస్తాం. వేరే వాళ్ళదయితే " ఛీ ఛీ " అని కర్ర పట్టుకుని తరుముతాం. మనదీ అని ఒక బంధం, మనకు ఉపయోగపడుతుంది అనే కోరిక. " బ్రహ్మ సత్యం " అని ...

సందేహం నివృత్తి చేసుకుంటూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఇమం వివస్వతే యోగం    ప్రోక్తవానహమవ్యయం,    వివస్వాన్మనవే ప్రాహ    మనురిక్ష్వాకవే2బ్రవీత్ "                - భ.గీత 4:1  " సనాతనమూ నాశరహితమూ అయిన ఈయోగాన్ని మొదట సూర్యుడికి చెప్పాను. దానిని మనువు ఆధ్యయనం చేసి ఇక్ష్వాకునికి బోధించాడు. తరువాత కాలంలో రాజర్షులు అందుకుని తరువాత తరాలకి అందించారు. తరువాత మరుగున పడిపోయింది. ఇప్పుడు నీకు మళ్ళీ చెబుతున్నాను " అన్నారు పరమాత్మ. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. సనాతనుడు అయిన సూర్యుడు ఎక్కడ, నిన్న మొన్న పుట్టి తనతో పెరిగిన కృష్ణుడు ఎక్కడ అని. అదే అడుగుతాడు ఇలా: " అపరం భవతో జన్మ    పరం జన్మ వివస్వతః,    కధమేతద్విజానీయాం    త్వమాదౌ ప్రోక్తవా నితి "                ‌ -  భ.గీత 4: 4 నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటీ అని. ఆశ్చర్యంగా ఉంది అంటాడు అర్జునుడు. సందేహనివృత్తి. ప్రశ్నలు, సమాధానాలు వాటిలోనే. వేల సం.ల తరువాత కలగబోయే సందేహాలకు కూడా అక్కడికక్కడే ప్రశ్నలు సమాధానాల రూపంలో విషయాలను తెలియచ...

అసూయ లేకపోతే సహం బాధలు తగ్గుతాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  " ఇదం తు తే గుహ్యతమం    ప్రవక్ష్యామ్యనసూయవే,   జ్ఞానం విజ్ఞానసహితం    యజ్ఞాత్వా మోక్ష్యసే2శుభాత్ "                         - భ.గీత 9:1 " ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం " అన్నారు పండితులు. ఎంతటి అద్భుత ఉపదేశం పరమాత్మ ఇచ్చినది. ఏ సందేహం రాకుండా అన్ని విషయాలు స్వామి స్పష్టంగా చెప్పేసారు. అసలు గీత అర్జునుడికే ఎందుకు చెప్పారు అనే సందేహం రావచ్చు. అందుకని ఈ " రాజవిద్య రాజగుహ్యం " అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే " అర్జునా , నీలో అసూయ అన్నది లేదు, అందుకనే ఈ ఉత్కృష్టమైన అత్యంతరహస్యమైన జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను " అన్నారు. రెండవవాక్యం చివరిలో " ప్రవక్ష్యామి అనసూయవే " అన్నారు. ఈ అసూయ మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. జీవుడు భ్రష్టుడవడానికి మూలం అసూయే. అసూయ కలగగానే అక్కడితో ఆగదు. అసహనం, ఎలాగేనా పొందాలని కోరిక, కోపం, హింస ఒక్కొటొక్కటిగా పెరిగిపోతాయి. ఆశ్చర్యకరంగా మూడవ వాక్యంలో " జ్ఞానం విజ్ఞానసహితం " అన్నారు స్వామి. సాధారణంగా అందరూ ఈ రెండూ " జ్ఞానం , విజ్ఞానం " ఒకటే అనుకుంట...

వ్రేళ్ళు ( మూలాలు ) చెట్టుకు క్రింద మనకు పైనా ఉంటాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఊర్ధ్వమూలమధః శాఖం    అశ్వత్థం ప్రాహురవ్యయం,   ఛందాంసి యస్య పర్ణాని    యస్తం వేద స వేదవిత్ "                  - భ.గీత 15:1 అంటే " మూలం ( వ్రేళ్ళు ) పైకి కొమ్మలు క్రిందకు ఉన్న అశ్వత్థ ( రావి ) చెట్టు రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో, దాని ఆకులను వేదమంత్రాలుగా ఎవరు తెలుసుకుంటారో వారు వేదజ్ఞానాన్ని పొందినవారవుతారు " అని. ఇందులో అద్భుతమయిన తత్వం ఉంది. " శ్వ " అంటే రేపు. " త్థ ( స్థ ) " అంటే ఉండేది. దీనికి " అ " చేర్చి అశ్వత్థ అంటే రేపు ఉండనిది అని అర్ధం. రేపు ఉండనిది అని ఏమిటి?. అంటే రేపు ఈరోజులా ఉండనిది అని. మనుషుల్లో అయినా చెట్లలో అయినా క్షణం క్షణం మార్పు జరుగుతూ ఉంటుంది. కాని రావిచెట్టు 2500 ఏళ్ళు బ్రతుకుతుంది కనుక ఓ మనిషి తన జీవితకాలంలో దానిలో పెద్దగా మార్పుని చూడడు. " నేను " అనే దానిలో కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మార్పు ఉండదు. సంసారం అనే వృక్షం కూడా అలాంటిదే. ప్రతీ క్షణమూ మార్పు జరుగుతూన్నా ఏరోజూ మార్పు తెలియదు, ఒకేలా ఉన్నట్లు, గడిచిపోతూన్నట్లూ ఉంటుంది. తెలియకుండానే ముసలితనం వచ్చ...

తినే ఆహారానికి దోషం లేకుండా చూసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఆహారస్త్వపి సర్వస్య    త్రివిధో భవతి ప్రియః,   యజ్ఞస్తపస్తథా దానం    తేషాం భేదమిమం శృణు "              - భ.గీత 17:7 " ప్రజలు ఇష్టపడే ఆహారం వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది. త్యాగం, కాఠిన్యం మరియు దాతృత్వం పట్ల వారు మొగ్గు చూపే విధం వారు తీసుకునే ఆహారంమీద ఆధారపడి ఉంటుంది‌ " అన్నారు పరమాత్మ. ఎవరయినా గొడవ పడుతూన్నప్పుడు " మేమూ ఉప్పు కారం తింటున్నాం మరి " అనే మాటలు వింటూంటాం. అంటే ఉప్పు కారం తింటే కోపం తాపం అహం పెరుగుతాయి అని అర్ధమవుతూంది.  అలాగే తినే ఆహారం దోషరహితంగా ఉండాలి. పండించే ప్రదేశం కూడా మంచిదయి ఉండాలి. మరి ఎక్కుడ పండించారో మనకు ఎలా తెలుస్తుంది. అందుకే ఆహారాన్ని భగవంతుడికి నివేదనచేసి తీసుకోవాలి. అలా నివేదన చేస్తే దోషం పోతుంది అని శాస్త్రోక్తం. ఆహారం పవిత్రత వండేవారి మనస్తత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. భగవంతుడికి నివేదన కోసం వండుతూన్నట్లుగా నిర్మలమైన మనస్సుతో వండాలి.  ఎవరయినా భోజనానికి పిలుస్తే పిలిచినవారు ఆహారాన్ని లేదా దానికి ఉపయోగించే ధనాన్ని ఎలా సంపాదించారు అని కూడా ఆలోచించా...

భక్తి లేకపోతే యజ్ఞయాగాదులు కూడా నిష్ప్రయోజనం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు      యత్పుణ్యఫలం ప్రదిష్టమ్,అత్యేతి    తత్సర్వమిదం  విధిత్వా యోగీ    పరం  స్థానముపైతి చాద్యమ్ "                    - భ.గీత 8:28 " ఈ రహస్యాన్ని ( భక్తిని ) తెలుసుకున్న యోగులు, వైదిక కర్మలు, వేదాల అధ్యయనం, యాగాలు, తపస్సులు మరియు దానధర్మాల యొక్క ఫలాలను మించిన పుణ్యాన్ని పొందుతారు. అటువంటి యోగులు పరమాత్మను చేరుకుంటారు " అన్నారు పరమాత్మ. రామాయణం ఇలా తెలియచేస్తూంది: " నేమ ధర్మ ఆచార తప    జ్ఞాన జగ్య జప దాన,   భేషజ పుని కోటిన్హ నహిం    రోగ జహిం హరిజన " “మీరు సత్ప్రవర్తన, ధర్మం, తపస్సు, త్యాగాలు, అష్టాంగ యోగం, మంత్రాలు పఠించడం మరియు దానధర్మాలలో పాల్గొనవచ్చు. కానీ భగవంతుని పట్ల భక్తి లేకుండా, ఇతర విషయాలపై ఆసక్తి అనే మనస్సు యొక్క వ్యాధి ఆగదు " అని. భక్తి లేకపోతే మనస్సు అనవసరమయిన ఇతర వ్యాపకాల వైపు లాగబడుతూనే ఉంటుంది. ఈ సత్యం గ్రహించిన యోగులు భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గించి భగవంతుని పాదాలపై దృష్టి పెడతారు. త్యాగయ్య 13వ...

నాగులచవితి శుభాకాంక్షలు - శ్రీనవనాగమాతా శ్రీమానసాదేవ్యైనమః - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్ధించారు: " పాపోత్పాత విమోచనాయ    రుచిరైశ్వర్యాయ  మృత్యుంజయ   స్తోత్రధ్యాన నతిప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే,   జిహ్వాచిత్త శిరోరంఘ్రి హస్తనయన శ్రోత్రైరహం    ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ      ముహుర్మామేవ మా మేఽవచః "  ఓ మృత్యుంజయా, పాపములు నశించి కోరిన కోరికలు నెరవేరుటకు నిన్ను ప్రార్ధించుమని నాలుక, ధ్యానం చేయమని మనస్సు, నమస్కరింపుమని శిరస్సు, ప్రదక్షిణము చేయుమని పాదములు, పూజింపుమని చేతులు, చూడుమని కన్నులు, నీలీలలు వినుమని చెవులును నన్ను కోరుచున్నవి. నీ అనుగ్రహంలేనిదే నాకు అదెలా సాధ్యము. అనుగ్రహం ప్రసాదించడమే కాకుండా మూగ, కుంటి, గ్రుడ్డి, మందమతిత్వము మొదలైన లోపములు నాకు కలుగకుండా చూడు స్వామీ.  ఏలోపాలూ లేని చక్కటి ఆరోగ్యాన్నిచ్చి నిన్ను సేవించుకునేలా చెయ్యమని ఎంత లౌక్యంగా ప్రార్ధన చేసారో శంకరులు. వేదంలో ఆశీర్వచనం ఇలా చేయమని ఉంది: " పశ్యేమ శరదశ్శతం,    శృణువామ శరదశ్శతం,    జీవేమ శరదశ్శతం,    భవామ శరదశ్శతం "  100 సం.లు ఆనందంగా చ...

పవిత్రమయిన కార్తీక సోమవారం - స్వామి నామాన్ని స్మరిద్దాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్ధన చేసారు: " ఏకో వారిజబాంధవః      క్షితినభో వ్యాప్తం      తమోమండలం,   భిత్వా లోచనగోచరోఽపి    ‌ భవతి త్వం   ‌  కోటిసూర్యప్రభః, వేద్యం కిం     న భవస్యహో ఘనతరం     కీదృగ్భవేన్మత్తమస్తత్సర్వం     వ్యపనీయ మే పశుపతే    సాక్షాత్ ప్రసన్నో భవ " ఓ పశుపతీ ! ఒక్క సూర్యుడు భూమ్యాకాశములు నిండిన  చీకట్లు తొలగించి నేత్రములకు అగుపిస్తున్నాడు. మరి నీవో, కోటిసూర్యప్రకాశవంతుడవు, తెలుసుకొనదగినవాడవు. అయిననూ‌ నాకు నీవు కనుపించుటలేదు. నా (అజ్ఞాన) అంధకారము ఎంతదో కదా! కనుక ఆ (అజ్ఞాన) అంధకారము అంతయునూ‌ తొలగించి, ప్రత్యక్షమై అనుగ్రహింపుము. ఎంత చమత్కారంగా ప్రార్ధన చేసారు. ఒక సూర్యుడు వస్తేనే అంధకారమంతా పోయి సూర్యుడు కనిపిస్తారు కదా మరి పరమేశ్వరుడు కోటిసూర్యసముడైనా నా అజ్ఞానాంధకారం తొలగలేదు, పరమేశ్వరుడు కనిపించుటలేదు అంటే నా అజ్ఞానం అంత పెద్దదా అని అడుగుతున్నారు శంకరులు. ఆయనే ఆవిధంగా అనుకుంటే ఇక సామాన్యుల ( మన ) సంగతి ఏమిట...

కర్మలవల్లే జన్మతీసుకోవడం, కర్మలతోనే విలీనమవడం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీర‌స్తు శుభమస్తు"🙏 " కర్మణా జాయతే జంతుః    కర్మణ్యైవ విలీయతే    సుఖం దుఃఖం భయం    క్షేమం కర్మణ్యైవాభిపద్యతే "           - మహాభాగవతం  కర్మలవల్లే జన్మతీసుకోవడం, కర్మలతోనే విలీనమవడం. కర్మలవల్లే సుఖం, దుఃఖం, భయం, క్షేమం కలుగుతాయి. మంచి, చెడు కర్మలకు లెక్కలు చూసి మంచి, చెడు ఫలితాలు ఇచ్చే పరమేశ్వరుడు ఒకరున్నారు. ఈ మాటలన్నది కృష్ణపరమాత్మ.  ఓ సమయంలో గోకులంలో పెద్దలు అందరూ యాగం చేయ సంకల్పించి కావలసిన వస్తువులు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. కృష్ణుడు ఏమిటి విషయం, దేనికోసం ఇవన్నీ అని అడిగితే " ఇంద్రుడి సంతృప్తి, అనుగ్రహం కోసం. ఆయన దేవతలకు ప్రభువు. పర్జన్యాలకు అధిపతి. ఆయనను సంతోషపరిస్తే చక్కటి వానలు కురిపిస్తారు, మన గోకులం సస్యశ్యామలం అవుతుంది " అంటారు. అప్పుడు కృష్ణుడు పైవిధంగా చెప్పి కర్మలకు ఫలితాలనిచ్చే పరమేశ్వరుడు ఉండగా మధ్యలో ఈ ఇంద్రుడు ఎవరు. మీకు అంతగా చేయాలని ఉంటే మీకు సదా రక్షణ, క్షేమం కలిగించే ఈ గోవర్ధనగిరికి చేయండి పూజలు. అనుగ్రహిస్తుంది మిమ్మల్ని అని చెబుతారు. ఎప్పుడూ మంచి ఆలోచనలే చేస్తూ మంచి పనులే చేస్తూన్నప్ప...

మనిషి వృక్షంలా బ్రతకాలంది భాగవతం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " పత్రపుష్పఫలచ్ఛాయా    మూలవల్కలదారుభిః .    గంధనిర్యాసభస్మాస్థితోక్మైః    కామాన్ వితన్వతే "   -మహాభాగవతం 10:22:34 బాలకృష్ణుడు గోపబాలకులతో అన్న అద్భుత విషయం ఇది: వృక్షం ఒక తపస్సు చేసుకునే ఋషి లాంటిది, పవిత్రమయినది. వృక్షం మొత్తం సమాజానికి ఉపయోగపడేదే. ఆకులు, పుష్పాలు, ఫలాలు, వ్రేళ్ళే కాదు ఎండగా ఉన్నా వానవచ్చినా నీడను ఇస్తుంది. కాల్చినా బొగ్గులు, బూడిద కూడా ఉపయోగపడేదే. వృక్షాన్ని చూసి మానవుడు నేర్చుకునేది చాలా ఉంది. వృక్షం ఎప్పుడూ ఇవ్వడమే కాని ఏదీ కోరుకోదు. ఉపనిషత్తులు ఇలా చెబుతున్నాయి : " వృక్షైవ స్తబ్దో దివితిష్టతి "  అంటే చెట్టువలె స్తబ్దుగా ( పరమప్రశాంతంగా, గంభీరంగా ) ఆకాశంలో కూర్చుని ఉంటారు పరమాత్మ అని. ఎంత అద్భుత భావన/పోలిక. చెట్టు చూడండి. ఒకతను కాయలను/పళ్ళను జాగ్రత్తగా గౌరవంగా కోస్తాడు. ఇంకొకతను రాళ్ళతో కొడతాడు కాయల కోసం. చెట్టుకు ఎన్నో చోట్ల రాళ్ళదెబ్బలు తగులుతాయి. అలా అని రాళ్ళతో కొట్టినవానికి రుచిలేని లేక చేదు కాయ ఇవ్వదు. ఇద్దరికీ రుచికరమైన కాయలు, పళ్ళు ఇస్తుంది. మనిషి కూడా చెట్టులా ప్రవర్తించాలి అంటారు పరమాత్...