Posts

Showing posts from February, 2025

ప్రయత్నం అంటూ మొదలుపెడితే మిగతాది అమ్మవారే చూసుకుంటారు - చీమలపాటి సూర్యనారాయణ

  🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఛందస్సారా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో  844 వ నామం. " సారం " అంటే తాత్పర్యం, ఉద్దేశ్యం, బలం అని అర్ధం. ఛందోబద్ధం కనుక వేదం పేరు ఛందస్సు. ఛందస్సు/వేదం యొక్క సారమే అమ్మవారు, గాయత్రి. అందుకే " గాయత్రీం ఛందసాం మాతా " అని ప్రార్ధిస్తాం.  శృతులు స్మృతులు పురాణాలు ఆగమశాస్త్రాలు అన్నీ అమ్మవారి స్వరూపాలే. రసాయనకం, భౌతికం, గణితం అన్నింటినీ " శాస్త్రం " అంటాం. అన్నీ అమ్మవారే, అందుకే ఓ క్రమపద్ధతిలో ఉంటాయి ఛందస్సులా. ఇలాంటి శాస్త్రాలన్నీ వేదంలో ఉన్నా వేదపారాయణ గమ్యం మాత్రం అమ్మవారే.  " మననాత్ త్రాయతే ఇతి మంత్రః " - ఏ మంత్రం జపం చేసినా రక్షణ దొరుకుతుంది. కాని అది అంత సులభంకాదు. ఓ వెయ్యి గాయత్రి చేద్దామని కూర్చుంటే పదిసార్లు చేసేటప్పటికే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. పరవాలేదు మళ్ళీ మనస్సును లాక్కొచ్చి కూర్చోపెట్టడమే. మనస్సు ఎక్కడెక్కడికో పోతూన్నా మంత్రం లోపల తిరుగుతూ ఉంటుంది కనుక ఫలితం తప్పకుండా ఉంటుంది. పరమాత్మ " అభ్యాసేనతు కౌంతేయ  వైరాగ్యేణచ గృహ్యతే ( భ.గీత 6:35 ) " - " వైర...

ఋషులకు దర్శనం, మనకు నమ్మకం ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శాస్త్రసారా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 845 వ నామం. " శాస్త్రసారా " శాస్త్రము యొక్క సారం. " సారం " అంటే తాత్పర్యం, ఉద్దేశ్యం, బలం అని అర్ధం. శాస్త్రీయం అంటే వైజ్ఞానికం. శాస్త్రాలలో చెప్పిన విషయాలు అన్నీ వైజ్ఞానికమయినవి. మూఢనమ్మకాలు అంటూంటారు. శాస్త్రం చెప్పినది నమ్మడంని శ్రద్ధ అంటారు. శాస్త్రం చెప్పినది నమ్మకపోవడం మూఢనమ్మకం. అటువంటి మూఢులు వారు ఏది నమ్మితే అదే నిజము/సరైనది అనుకుంటారు.  నీటిలో సూక్ష్మజీవులు ఉన్నాయి. కనబడుతున్నాయా. లేదు. ఓ టెలిస్కోపు ఉన్నవాడు దానితో చూస్తే కనబడుతాయి. ఋషులకు, జ్ఞానులకు తపోశక్తి ఉంటుంది. దానితో వారు దేవతలను అంటే సూక్ష్మశరీరులను చూడగలరు. మనకు ఆ శక్తిలేదు, చూడలేకపోతున్నాం కనుక దేవతలు లేరు అని అనుకుంటే ఎలా.  టెలిస్కోపు ఉన్నవాడు మీ రక్తంలో వైరస్ ఉంది, మందు వాడండి అంటే వాడుతున్నాం కదా. మరి ఋషులు, శాస్త్రాలు చెప్పినవి కూడా నమ్మాలి కదా.  ఋషులకు దర్శనం, మనకు నమ్మకం ముఖ్యం. శ్రీరాముడు ఎప్పుడూ ఇలా చేద్దాం అనలేదు. శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి, ఋషులు ఇలా తెలియచేస్తున్నారు కనుక ఇలా...

మంత్రం అంటే కఠినంగా పెద్దదిగా ఉండాలనేమీ లేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మంత్రసారా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 846 వ నామం. " మంత్రసారా " అంటే మంత్రం యొక్క సారం. సారం అంటే తాత్పర్యం, ఉద్దేశ్యం, బలం అని అర్ధం చెప్పారు. " మననాత్ త్రాయతే ఇతి మంత్రః " - మననం/జపం చేస్తే రక్షిస్తుంది కనుక మంత్రం.  మంత్రం అంటే కష్టమయిన పదాలతో పెద్దగా ఉండాలని ఏమీలేదు. గురువు ఉపదేశించిన మంత్రం " అయ్యో ఇలా చిన్నగా సులభంగా ఉందేమిటి, పనిచేస్తుందా " అని అనుకోకూడదు. మన సమస్యను, శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని మంత్రోపదేశం చేస్తారు గురువు. ప్రతీ అక్షరానికీ ఓ దేవత ఉన్నారు. అక్షరాలన్నీ మంత్రాక్షరాలే. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ మాట ప్రకృతి/సమాజం మీద ప్రభావం చూపుతుంది. రామనామం తారకమంత్రం. తరింపచేసే మంత్రం. త్యాగయ్య, రామదాసు వంటివారు రామనామజపం చేసుకుని తరించారు, చిరస్మరణీయులు అయారు. ఓం నమో నారాయణాయ మంత్రంతో ప్రహ్లాదుడు, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంతో ధృవుడు భగవంతుని అనుగ్రహానికి పాత్రులయారు, చిరస్మరణీయులు అయారు. హనుమకు రామజపం తప్ప వేరే ధ్యాస లేదు. కఠోపనిషత్తులో ఓ అద్భుత...

శివుడు స్మశానంలో ఎందుకు ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 శివుడిని ఋషులు అడిగారు " స్వామీ అందమైన కైలాసంలో పార్వతితో హాయిగా గడపక ఇలా శ్మశానాలలో తిరుగుతూంటావు, ఎందుకని " అని. స్వామి అన్నారు " జీవుడు పాపప్రక్షాళనకోసం, జన్మరాహిత్యం కోసం జన్మ తీసుకుని చాలా కష్టపడతాడు. వీలయినన్ని పుణ్యకార్యాలు చేస్తాడు. పెళ్ళిచేసుకుని కొందరికి జన్మనిచ్చి వారికోసం నానాపాట్లూ పడతాడు. తన సుఖాన్ని , తనముక్తినీ కూడా మరచిపోయి సంతానంకోసం ఆస్తులు సంపాదించిపెడతాడు. చివరికి చనిపోయాక జీవుడితో ఇంటిగుమ్మందాకా భార్య, ఊరిచివరిదాకా కొందరు, శ్మశానికి కొందరూ వస్తారు. దహనం అవగానే ఒక్కొక్కరు తిరిగి వెళ్ళిపోయాక జీవుడు ఒంటరిగా మిగిలిపోయి తను ఎంత మూర్ఖుడో, సమయాన్ని ఎలా వ్యర్ధం చేసుకున్నాడో తలచుకుని కుమిలిపోతాడు. ఆసమయంలో అతన్ని ఓదార్చడానికి ఎవరూ ఉండరు. అందుకని అటువంటివారిని దగ్గరకు తీసుకుని ఓదార్చడానికే నేను శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాను " అని ఎంతటి అద్భుత విషయం. అవ్యాజకరుణామూర్తి స్వామి. " యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ.గీత 10:25 ) " అన్నారు పరమాత్మ గీతలో.  ఈ పవిత్రమయిన రోజున " నమఃశివాయ " అని జపం చేసుకుని స్వామి అనుగ్రహ...

మహాశివరాత్రి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " దర్శనాత్ అబ్రసదసి   జననాత్ కమలాలయే   స్మరణాత్ అరుణాచలే   కాశ్యాంతు మరణాన్ ముక్తిః "                    - కాశీఖండం  అబ్రసదసి అంటే చిదంబరం. చిదంబరంలో నటరాజేశ్వరుని దర్శించినవారికి, తిరువారూర్ ( కమలాలయం అంటే తిరువారూర్ - అమ్మవారు కమలాంబ ) లో జన్మించినవారికి, అరుణాచలేశ్వరుని స్మరించినవారికి, కాశీలో మరణించినవారికి " ముక్తి " లభించడం తధ్యం అని పురాణం తెలియచేస్తూంది. కాశీఖండంలో "కాశ్యాంతు మరణాన్ ముక్తిః" అన్నారు శ్రీనాధ మహాకవి. కాశీలో మరణిస్తే ముక్తే. ముక్తి ఎలా కలుగుతుంది అంటే: " పాలిండ్లు కదలంగా పసిడి    పైయెద వీచు అచలాధిపుని      కూర్మి ఆడుబిడ్డ, ధుఃకారమొనరించు    తొండంబు ముక్కున  శిఖరారావము    జిలుకు డుంఠి, అని  ప్రత్యక్షమైవచ్చి    భాగీరధీ గంగ మృదుల  హస్తంబు చాచి    మేను  నిమురు, ప్రధమోత్తముండు     భృంగి భయరక్షణార్ధంబు ఫాలాగ్రమున    దీర్చు భసిత  రేఖ, దక్షిణ శృతి    ...

అమ్మవారు ఆలస్యం చేయరు ఆర్తితో పిలిస్తే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " క్షిప్రప్రసాదినీ " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 869 వ నామం.  " క్షిప్ర " అంటే వెంటనే అని అర్ధం. మన వేడుకోవడమే ఆలస్యం, అమ్మవారు వెంటనే వచ్చేస్తారు, అనుగ్రహిస్తారు. ఎవరు పిలిచినా అలా వచ్చేస్తారా?. శ్యామశాస్త్రిగారు అద్భుత వాగ్గేయకారకుడు. శ్రీకామాక్షీదేవీ ఉపాసకులు. ముత్తుస్వామిదీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగయ్యలను త్రిమూర్తులుగా కొనియాడుతారు.  శ్యామశాస్త్రిగారు నివసించే రాజ్యానికి ఓ వాగ్గేయకారుడు వచ్చి రాజుతో " నాతో పోటీచేసి గెలిచేవారెవరయినా ఉన్నారా మీ రాజ్యంలో " అని అడుగుతాడు.  గూఢచారులు చెప్పిన విషయం ఈయన చాలా రాజ్యాలలో గాయకులను ఓడించి ఇక్కడకు వచ్చారని. దానితో రాజు శ్యామశాస్త్రిగారిని కలిసి పరువు దక్కించమని కోరతారు. శ్యామశాస్త్రిగారు తను ప్రతిపాదించిన " చింతామణి " రాగంలో " దేవీ బ్రోవ సమయమిదే, అతి వేగముగ వచ్చి నావెతలు తీర్చి కరుణించవే శంకరీ కామాక్షీ ............" అని అమ్మవారిని ప్రార్ధించడం, వచ్చిన విద్వాంసుడు ఓటమిని అంగీకరించడం జరిగింది. ఈ కీర్తనలో శాస్త్రిగారు " సుజన దాస...

సూర్యునికి ప్రీతికరమయిన ఆఖరి మాఘపాదివారం నేడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భానుమండలమధ్యస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 275 వ నామం . " భానుమండలమధ్యస్థా " అంటే సూర్యబింబం మధ్యనందు ఉన్నది అని. సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు. ఆరోగ్య ప్రదాత. " ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ " అన్నారు. ఆయనను మార్తాండుడు అంటారు. అంటే చనిపోయిన అండానికి కూడా చైతన్యాన్ని కలిగిస్తాడు. ఆయన ఉదయిస్తేనే ప్రకృతిలోను, జీవులలోనూ చైతన్యం కలుగుతుంది. ఈ శక్తులన్నిటికీ మూలం సూర్యుడిలో ఉన్న అమ్మవారి చైతన్యం. రాముడు రావణుడితో యుద్ధం చేస్తూన్నప్పుడు అలసిపోయాడు. దేవతలతోపాటు యుద్ధం చూస్తూన్న అగస్త్యుడు గమనించారు ఆ విషయం. వెంటనే రాముడిని సమీపించి ఆదిత్యహృదయం పారాయణ చేయి. శక్తి, విజయం కలుగుతాయి అన్నారు. రాముడు ఆచమనం, సంకల్పం చేసి ఆదిత్యహృదయం పారాయణ చేసారు. రాముడికి దేవతల మధ్యన సూర్య దర్శనం అయింది. " నిశిచరపతి సంక్షయం విదిత్వా    సురగణ మధ్యగణో వచస్త్వరేతి "  ఇక్కడ " వచస్ త్వర ఇతి " అన్నారు. సూర్యుడు " త్వర " అన్నారు. ఆలస్యం ఎందుకు, త్వరపడు, రావణుడిని చంపు అన్నారు సూర్యుడు. అమ్మవారిని " ధియోయ...

వైరాగ్యం మోక్షానికి మొదటి మెట్టు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విరాగిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 937 వ నామం .  " విరాగిణీ " అంటే వైరాగ్యము గలది. జీవితం సుఖమయంగా సాగాలన్నా, మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా, అమ్మవారిమీద మనస్సు నిలవాలన్నా వైరాగ్యం ముఖ్యం. బంధాలు/మోహం తగ్గించుకునే కొలదీ మనస్సు నిర్మలంగా ఉండి మంచి ఆలోచనలు కలుగుతాయి. విద్య ఉన్నవారు విద్యనిస్తారు. ధనం ఉన్నవారు ధనాన్ని ఇస్తారు. మనకు కావలసిన వైరాగ్యం అమ్మవారి దగ్గర కావలసినంత ఉంది. నమ్ముకున్న వారికి అవసరమయినంత ఇస్తారు. అర్జునుడు పరమాత్మని అడుగుతారు " ఈ మనస్సు కోతి కదా, దీనిని అదుపులో పెట్టడం అంత సులభమా, సాధ్యమా " అని. అర్జునుడే అలా అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?. పరమాత్మ ఇలా అంటారు: " అసంశయం మహాబాహో    మనో దుర్నిగ్రహం చలం   అభ్యాసేన తు కౌంతేయ    వైరాగ్యేణ చ గృహ్యతే "                - భ.గీత 6:35 మనస్సు నిగ్రహించుకోవడం కష్టమే కాని వైరాగ్యంతో కూడిన సాధనతో కష్టం మాత్రం కాదు అన్నారు పరమాత్మ. " వైరాగ్యేణ చ " అన్నారు. అంటే సాధన ఒకటే సరిపోదు. వైరాగ్యం కూడా అవసరం అన్నారు. వైర...

కులాలు కేవలం పని విభజన కోసమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వర్ణాశ్రమవిధాయినీ " - అమ్మవారి అద్భుతనామం. శ్రీలలితాసహస్రరహస్యనామాలలో ఇది 286 వ నామం. " వర్ణాశ్రమవిధాయినీ " అంటే వర్ణాశ్రమాలని ఏర్పాటుచేసినది అని అర్ధం. అంటే బ్రాహ్మణ్యాది వర్ణాలను, బ్రహ్మచర్యాది వర్ణాలను ఏర్పాటుచేసినది అమ్మవారే అని అర్ధం. అంతేకాని ఈధర్మాలన్నింటినీ ఏ మనువో ( మనుష్యులు ) ఏర్పాటుచేసినవి కావు. అజ్ఞానంతో ఇప్పుడు అందరూ అనుకుంటూన్నట్లు బ్రాహ్మణాది వర్ణాలు కులాలు కావు. కొన్ని కొన్ని పనులకు కొందరిని ఏర్పాటుచేసింది ఆవిడ.  " చతుర్వర్ణ్యం మయా    సృష్టం........అవ్యయం "              - భ.గీత 4:13. ఈ నాలుగు వృత్తులవారూ నాచేతనే సృష్టించబడ్డారు అన్నారు పరమాత్మ గీతలో.  ఓ ఉదాహరణ చూద్దాం. ఒకాయన పట్నం వెళ్ళి వ్యాపారం చేసి పెద్ద ధనవంతుడయాడు. తనగ్రామంలోని ఓ నలుగురికి ఉద్యోగాలిచ్చి సహాయం చెయ్యాలనుకున్నాడు. కబురుపెట్టాడు, వచ్చారు. నలుగురికీ మేనేజర్ ఉద్యోగాలిచ్చేయడు. ఏ పనులు చెయ్యగలరో పరీక్షిస్తాడు. మంచి ఆరోగ్యంగా హుషారుగా ఉన్నవాడికి బయట డబ్బు వసూలు చేసే పని ఇస్తాడు. కొద్దిగా మొహమాటస్తుడు భయస్తుడు అయితే ఆఫీసులో ఎక...

గురువు అమ్మవారి స్వరూపం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కులరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 897 వ నామం. " కులరూపిణీ " అని కొలుస్తాం అమ్మవారిని. కులం అంటే " గురుపరంపర ". ఆవిడ గురుస్వరూపిణి. మంచి గురువుని పట్టుకుంటే మనకు మంచి ఆలోచనలు కలిగేలా చేసి మంచి పనులు చేసేలా తోడ్పడతారు. గురువు అంటే అమ్మవారి స్వరూపమే.  తల్లిదండ్రులతో సమానంగా గురువును గౌరవించమంది సనాతనధర్మం. వీరు నిస్వార్థపరులు. భవిష్యత్తులో ఇతను ( సంతానం/శిష్యుడు ) వారికి ఉపయోగిస్తారనే భావన వీరికి ఉండదు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " తద్విద్ధి ప్రణిపాతేన    పరిప్రశ్నేన సేవయా,    ఉపదేక్ష్యంతి తే జ్ఞానం    జ్ఞానినస్తత్త్వదర్శినః "              - భ.గీత 4:34 " మంచి గురువును పట్టుకో, శ్రద్ధగా సేవచేసుకో, మంచి ప్రశ్నలు వేసి మంచి జ్ఞానం పెంచుకో " అని. స్వామి " పరిప్రశ్నేన " అన్నారు. అంటే ప్రశ్న మంచిదయి, గౌరవంగా ఉండాలి అని.  " యదా యదాహి ధర్మస్య ......" అని పరమాత్మ భ.గీత ( 4:7 ) లో తెలియచేసినట్లు ధర్మం దారి తప్పుతూందని అనిపించినప్పుడల్లా ప్రత్యేకంగా ఓ గురువుని అనగా...

అమ్మవారు మంచిపనులు చేసేలా అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పుణ్యకీర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 542 వ నామం .  " పుణ్యకీర్తిః " అంటే పుణ్యమును ఇచ్చునట్టి కీర్తిగలది.  కీర్తి వచ్చేదే మంచిపనులు చేయడం వలన. అమ్మవారు చేసేవన్నీ మంచిపనులే, లోకరక్షణకోసమే కదా. ఆవిడకు కీర్తి రావడంలో ఆశ్చర్యం ఏముంది. జీవులు మంచిపనులు చేస్తే వారికి కీర్తితో బాటు పుణ్యం కూడా ఇస్తారు అమ్మవారు. శ్రీసూక్తంలో అమ్మవారిని ఇలా ప్రార్ధిస్తాం: " మనసః కామమాకూతిం    వాచః సత్యమశీమహి,   పశూనాం రూపమన్నస్య    మయి శ్రీః శ్రయతాం యశః " ఓ శ్రీదేవీ, మా మనస్సులో జనించే ఉదాత్త ఆకాంక్షలను, సంతోషాన్ని, వాక్కులో సత్యాన్ని, గోసమృద్ధిచేత, ఆహారసమృద్ధిచేత కలిగే ఆనందాన్ని నేను చవిచూడాలి. నాకు కీర్తి కలుగుగాక. మనస్సులో మంచి ఆలోచనలు అన్నారు ఇక్కడ. మంచిపనులు, ధర్మకార్యాలు చేయాలంటే శక్తి, ధనం కావాలి. అవి అందరి దగ్గరా ఉండకపోవచ్చు. కాని మనస్సులో కూడా ఎవరికీ చెడు జరగాలని కోరుకోకుండా ఉండడానికి శక్తి, ధనం అక్కరలేదు. మంచి ఆలోచనలు చాలు. అదే మనం అమ్మవారిని కోరుకోవాలి. మనస్సులో ఉదాత్త ( మంచి ) ఆలోచనలు, వాక్కులో సత్యం ఉంటే ఇ...

అమ్మవారి వంశస్థులం, వారసులం మనం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గుహుజన్మభూః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 606 వ నామం .  " గుహుజన్మభూః " అంటే గుహునకు అనగా కుమారస్వామికి జన్మనిచ్చినది అని. జీవులు పుట్టుచోటు అని కూడా భాష్యం చెప్పారు. వేదంలో " అగ్నేర్యధా స్ఫులింగాః ..... " అని ఒక మంత్రం ఉంది. అగ్నినుండి స్ఫులింగములు అంటే అగ్గిరవ్వలు బయలుదేరి పైకి ఎగిరి వచ్చినట్లు పరమాత్మ నుండి జీవులు బయటకు వస్తున్నాయని ఉపమానం. యాజ్ఞవల్క్యస్మృతిలో కాల్చిన ఇనుపగుండునుంచి స్ఫులింగములు వచ్చినట్లు అని తెలియచేసారు. అగ్నిలోంచి పైకెగిరే రవ్వలలో కూడా ఉండేది అగ్నియే కదా. అంటే పరమాత్మలోంచి వచ్చిన జీవులలో ఉండేది పరమాత్మయే. అహం బ్రహ్మాస్మి అంటే ఇదే. మీ గోత్రం ఏమిటి అని అడుగుతూంటారు. ఋషి పేరు చెబుతాం. ఆ ఋషి ఆ గోత్రంవారికి మూలపురుషుడు. మరి ఋషుల జన్మకు కారకులు ఎవరు. అలా ఆలోచిస్తూ వెనక్కు వెడితే పరమాత్మ దగ్గరకు చేరతాం. అంటే జీవులందరకూ మూలపురుషుడు పరమాత్మ.  ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " సర్వయోనిషు కౌంతేయ     మూర్తయః సంభవంతి యాః,    తాసాం బ్రహ్మ మహద్యోనిః    అహం బీజప్రదః పితా...

బ్రహ్మ మొదలుకుని చిన్నపురుగుకు కూడా అమ్మ అమ్మవారే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఆబ్రహ్మకీటజననీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 285 వ నామం. " ఆబ్రహ్మకీటజననీ " అంటే బ్రహ్మగారినుండి కీటకాలవరకూ అందరికీ ఆవిడే అమ్మ. ఎంతటి అద్భుత విషయం. అన్ని జీవుల్లోనూ అమ్మచైతన్యం ఉందనేగా అర్ధం. పరమాత్మ గీతలో ( 6:32 ) " అన్నిజీవులను సమభావంతో చూస్తూ సుఖదుఃఖాలను ఒకేవిధంగా స్వీకరించేవాడే పరమశ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయం " అన్నారు.  కాని అలా ఉండడానికి " మోహం, మమకారం " అడ్డు పడుతుంది. కుక్కలన్నీ ఒకటే. కాని మన కుక్కని ముద్దు చేస్తాం. ఎదరివాడి కుక్కని ఛీఛీ అని కర్ర తీస్తాం. కురుక్షేత్రయుద్ధం జరుగుతూన్నప్పుడు వ్యాసులవారు అలా వెడుతూ ఓ చిన్న పురుగును, దాని ఆరాటాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ పురుగు రథం చప్పుడు వినపడినప్పుడల్లా భయంతో ఇటూ అటూ పరిగెడుతూంది. వ్యాసర్షి చిన్న పురుగుకు ఇంత ఆరాటం ఏమిటి అనుకుని ఎందుకు అంత హైరానా పడుతున్నావు అని అడుగుతాడు. ఆ పురుగు " ఏ జీవి జీవితం దానిది. ఎవరి కష్టాలు, భయాలు వారివి. క్రితం జన్మలో చాలా చెడ్డపనులు చేసాను. కాని నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నాను " ...

సప్తాశ్వం అంటే విబ్జార్ ( VIBGYOR ) - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " సప్తాశ్వరథమారూఢం    ప్రచండం కశ్యపాత్మజం,    శ్వేతపద్మధరం దేవం    తం సూర్యం ప్రణమామ్యహం "  పూజ్యులు సామవేదంవారు సూర్యదేవుడి గురించి ప్రవచనం చేస్తూ కొన్ని అద్భుత విషయాలు తెలియచేసారు. " సప్తాశ్వం " అంటే 7 గుర్రాలు అని చాలామంది భావన. కాని " అశ్వం " అంటే వేగంగా ప్రయాణించునది అని చెబుతూంది వేదం: " ఏకో అశ్వో వసతి సప్తనామా "  " ఒకే కిరణం 7 వర్ణాలుగా ఉన్నది ( కనిపిస్తూంది )" అని. అదే విబ్జార్ ( VIBGYOR ) గా తెలుస్తూన్నది. మార్కండేయపురాణం " ఓంకారం సప్తస్వరాలుగా అయినది " అని తెలియచేస్తూంది. అందుకే సంగీతంలో ఉన్న 7 స్వరాలూ ప్రణవం అంటే ఓంకారం నుంచే వచ్చినవి అని గ్రహించాలి. అందుకే త్యాగయ్య గారు " ప్రాణాలల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై..." అని కీర్తించారు. సూర్యుడి నుంచి వచ్చే నాదాన్ని వింటే " ఓంకారం " లా ఉంది అని కొందరు పరిశోధకులు చెబుతున్నారు ఇప్పుడు. మన ఋషులు ఏనాడో చెప్పిన విషయం ఇది - శక్తివంతమయిన ఓంకార స్వరూపమయిన శ్రీగాయత్రీ మహామంత్రానికి అధిపతి సూర్యదేవుడు.  ఇక కాలపరంగా చూస్త...

జీవించడం వేరు, బ్రతకడం వేరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మృత్యుమథనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 181 వ నామం . " మృత్యుమథనీ " అంటే మృత్యువుని పోగొట్టునది. అదెలాగ. మనం ఉన్నది మర్త్యలోకం. మరణం తథ్యం. మరి మరణాన్ని ఎలా పోగొడుతారు అమ్మవారు. మరణం భౌతికదేహానికే కాని మనిషికి కాదు. ఆదిశంకరులు శివైక్యం చెంది 1200 సం.లు అయింది. ఇప్పటికీ అందరం ప్రతిరోజూ ఆయనను తలచుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం, పూజిస్తున్నాం. కనీసం ఇంకో 2000 సం.లు శంకరులు మనమధ్య జీవించే ఉంటారు. దీనినే అమరత్వం అంటారు. జీవించడం వేరు, బ్రతకడం వేరు. పశుపక్ష్యాదులు కూడా బ్రతుకుతున్నాయి. జీవించడం ఒక మనిషికే సాధ్యం. దానికి సాధన కావాలి.  ఉపనిషత్తులు ఇలా తెలియచేస్తున్నాయి: " అసతో మా సద్గమయ   తమసో మా జ్యోతిర్గమయ,   మృత్యోర్మ అమృతం గమయ   ఓం శాంతిః శాంతిః శాంతిః "        - బృహదారణ్యక ఉపనిషత్తు 1.3.28 " నన్ను అసత్ నుండి సత్ వైపు నడిపించు. నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించు. నన్ను మరణం నుండి అమరత్వం వైపు నడిపించు " అని అర్ధం. బృందావనంలో ఓ గోవు ఇలా బాధపడింది అని ఓ భక్తుడి/పండితుడి భావన: " కృష్ణయ్య...

అమ్మవారి అనుగ్రహం అంత సులభంగా దొరకదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అభ్యాసాతిశయజ్ఞాతా " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 990 వ నామం. "  అభ్యాసాతిశయజ్ఞాతా " అంటే అమ్మవారిని అతిశయించిన అభ్యాసం/సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు " అని అర్థం. మూకశంకరులు తన " మూకపంచశతి " లో శ్రీకామాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తూ అంటారు - " చిరతర సుచరిత సులభః " - అంటే అమ్మవారి అనుగ్రహం పొందడం చాలా సులువుట. కాని దానికి బహుకాలం మంచిగా/శ్రద్ధగా సేవించుకోవాలి అని. ఇదే విషయాన్ని పరమాత్మ భ.గీతలో ఇలా చెప్పారు: " అభ్యాసయోగయుక్తేన ,    చేతసా నాన్యగామినా,   పరమం పురుషం దివ్యం,   యాతి పార్ధానుచింతయన్"                       - భ.గీత 8:8 నా మాయను తప్పించుకోవడం మహామహుల వల్లే కాదు అని చెబుతూ ఈ శ్లోకంలో " అభ్యాసం/సాధనతో నన్ను పొందడం కష్టం కాదు " అని తెలియచేసారు.  మరి " సాధన " అంత సులభమా. సాధకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి?. " అప్రమత్తత/జాగ్రత్త ". సాధకుడికి ఒక ఆశయం ఉంటుంది. అది పొందేవరకూ/పొందినతరువాతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని వేదమాత చెబుతున్నారు....

మమకారం తగ్గించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మమతాహంత్రీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 165 వ నామం .  " మమతాహంత్రీ " అంటే మమకారమును పోగొట్టునది అని అర్ధం. ఈ మమకారం అనేది చాలా భయంకరమైనది. బంధాలను పెంచుతూ నానా చెడ్డపనులూ చేయిస్తుంది. కురుక్షేత్రయుద్ధం మొదలయే ముందు దుర్యోధనుడు తల్లి గాంధారి వద్దకు వెళ్ళి " అమ్మా విజయం నన్ను వరించేలా ఆశీర్వదించు " అని కోరుతాడు. గాంధారి " యతో ధర్మః తతో జయః " అని ఆశీర్వదించి వెళ్ళిరా నాయనా అంటుంది. ఆవిడకు తెలుసు. దుర్యోధనుడు చేసిన పనులు అన్నీ అధర్మమే అని, అతనికి విజయం దక్కదని. ద్రౌపదిని ఏకవస్త్రగా ఉన్నప్పుడు సభలోకి లాక్కురమ్మనడం, కృష్ణపరమాత్మ అంతటివాడు సంధికోసం ప్రయత్నం చేసినప్పుడు కనీస గౌరవం ఇవ్వకపోవడం లాంటి విషయాలన్నీ ఆవిడకు ఎరుకే. కాని దేన్నీ అడ్డుకోలేకపోయింది.  ఇన్ని విషయాలు తెలిసినా కుమారులందరూ యుద్ధంలో మరణించారు అని తెలిసినప్పుడు కృష్ణపరమాత్మని " దగ్గరుండి నా కుమారులను చంపించావు " అని తూలనాడుతుంది. పుత్రులమీద మమకారం అంత చెడ్డది.  ఇటువంటి విపరీతమయిన మమకారాన్ని తగ్గిస్తుంది అమ్మవారు ఆవిడ పాదాలన...

దీపావళి శుభాకాంక్షలు అందరికీ, అమ్మవారు అజ్ఞానాన్ని పోగొట్టే దీపశిఖ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అజ్ఞానధ్వాంతదీపికా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 993 వ నామం. " అజ్ఞానధ్వాంతదీపికా " - అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టే దీపం వంటిది. దీపిక అంటే దీపశిఖ.  అమ్మవారు జ్యోతిస్వరూపం. మన హృదయంలో ఉంటుంది. " దైవీ హ్యేషా గుణమయీ    మమమాయా దురత్యయా"               - భ.గీత 7:14  నామాయను తప్పించుకోవడం కష్టమన్నారు పరమాత్మ. ఆ మాయ కమ్మేయడం వల్ల హృదయంలోని దీపశిఖ కనబడదు. 1950/60 లలో ఇంట్లో చిన్నవి చిమ్నీ దీపాలు ఉండేవి. ఆ చిమ్నీ ని తెల్లటి ముగ్గుతో బాగా తుడిచేవారు. అప్పుడు చిన్న దీపమయినా గది అంతా వెలుగునిచ్చేది. అలాగ ఎప్పుడూ శుభసంకల్పాలనే చేస్తూంటే మాయ తొలగి దీపశిఖ/అమ్మవారు జీవితంలో వెలుగును నింపుతుంది. సందేహం అక్కరలేదు. " శివానుగ్రహదేవా ముముక్షుర్వై       శరణమహంప్రపద్యే " - " ఈశ్వరానుగ్రహం పొందాలంటే భక్తియే మార్గం " అని ఉపనిషత్తులు తెలియచేస్తున్నాయి. భక్తి అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానం పోతే అంతా సచ్చిదానందమే ( సత్ + చిత్ + ఆనందం ) కదా.  " ఉద్దీప్యస్య జాతవేదో ఉపఘ్న నివృ...

శరీరం దృఢంగా ఉన్నప్పుడే చిత్తశుద్ధికోసం ప్రయత్నం చేయాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఆశ్చర్యవద్వదతి తధైవ చాన్యః,      ఆశ్చర్యవచ్చైనమన్యః    శృణోతి శ్రుత్వాప్యేనం    వేద న చైవ కశ్చిత్  "               - భ.గీత 2:29 " ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ( ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేఱొక పురుషుడు  దీనిని ఆశ్చర్యకరమైనదానినిగా వినును. ఆ విన్నవారిలోకూడ  కొందరు దీనినిగూర్చి ఏమియు ఎఱుగరు " అన్నారు పరమాత్మ.  ఎంత చక్కటి విషయం. తరచుగా మనం " ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మ ప్రబోధనానుసారం నిర్ణయం తీసుకోవడం " లాంటి విషయాలు వింటూనే ఉంటాం. అంటే తను ఒక నిత్యము సత్యము అయిన ఆత్మ అని అందరికీ తెలుసు. కాని జన్మజన్మలుగా పెంచుకుంటూ వస్తూన్న ఈ " దేహాభిమానం " పోదు. పోగొట్టుకోవడానికి ప్రయత్నించం కూడా.  ఆత్మ గురించిన ఎన్నో విషయాలను వింటూంటాం, చదువుతూంటాం. కాని ఆ విషయాలన్నీ పనికిరానివిగా అనిపిస్తాయి. బుర్రకు పట్టవు.  ఈ అశాశ్వతమయిన దేహానికి ఎటువంటి దుస్తులు తొడుగుదామా, కేశాలను అందంగా ఎలా అలంకరించుకుందామా...

సత్యం మాట్లాడితే అమ్మవారి పూజ చేసినట్లే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సత్యవ్రతా " - అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 817 వ నామం.  " సత్యవ్రతా " - అంటే " సత్యమే ప్రియవ్రతముగా గలది " అని అర్ధం. సత్యం మాట్లాడడం తపస్సు అన్నారు పరమాత్మ: " అనుద్వేగకరం వాక్యం    సత్యం ప్రియహితం చ యత్,   స్వాధ్యాయాభ్యసనం చైవ    వాజ్ఞ్మయం తప ఉచ్యతే "                - భ.గీత 17:15  ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది అన్నారు పరమాత్మ. భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది. శుక్రాచార్యుడు బలిని దానం ఇవ్వవద్దంటాడు. బలి అలా చేయడం తప్పు అంటాడు. అప్పుడు శుక్రుడు అంటారు: " వారిజాక్షులందు, వైవాహికములందు   ప్రాణవిత్తమాన భంగమందు   చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు   బొంకవచ్చు నఘము పొందదధిప " కొన్ని సందర్భాల్లో అసత్యం ఆడవచ్చు అంటారు శుక్రుడు. కాని బలి వినడు. కాని భారతంలో " అశ్వత్థామ హతః ( కుంజరః ) " అని అనమంటే ధర్మరాజు మొదట ఒప్పుకోలేదు. కాని అందరూ అల...

మాఘపాదివారం నేడు, శ్రీఆదిత్యాయనమః - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ    శివస్కంధః ప్రజాపతిః   మహేంద్రోధనదః కాలో   యమస్యోమోహ్యపాంపతిః "               - ఆదిత్యహృదయం  " య ఏషో అంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే " అను మంత్ర ప్రమాణమును బట్టి యోగులకు సాక్షాత్కరించు ఈ హిరణ్మయపురుషుడే చతుర్ముఖబ్రహ్మ అగుచున్నాడు. తనవలన సృష్టించబడిన ప్రపంచమును పాలించు వాడగుటచే ఇతడే విష్ణువుగాను, అపరిమిత కళ్యాణస్వరూపుడగుటచే సాక్షాత్ శివుడుగాను, శతృవులను నిర్మూలించే కుమారస్వామిగాను, " ప్రజాపతిశ్చరతి గర్భే అంతః " అను శృతిననుసరించి ప్రజాపతిగాను, స్వభావముచేతనే సకలైశ్వర్యములకు పెన్నిధి అగుటచే మహేంద్రుడుగానూ కొలవబడుతున్నాడు. " అన్నాదౌ వసుదానః " అను శృతి ననుసరించి ధనధాన్యములను ఒసగు కుబేరుడితడే. జగత్సంహారగుటచే కాలుడు అనియు, సమస్త ప్రపంచమునకు నియామకుడగుటచే యముడు అనియు, అఖిల ప్రాణులయందు చైతన్యరూపమగు అమృతము చిలుకుటచేత ఉమామహేశ్వరాత్మకమగు అర్ధనారీశ్వరుడు అనియు పిలువబడుతున్నాడు. ఇతడే వరుణుడు, యపాంపతి అయి ఉన్నాడు. ఈ శ్లోకం అగస్త్యుడు శ్రీరాముడికి రావణసంహారం కోసం ఉపదేశించిన ఆదిత్యహృద...

భీష్మ ఏకాదశి నేడు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 "శ్రీరస్తు శుభమస్తు"🙏 " న తత్ పరస్య సందధ్యాత్    ప్రతికూలం యదాత్మనః " భీష్ముడు అంపశయ్యమీద ఉన్నప్పుడు ధర్మరాజు ఆయననుండి ఎన్నో ధర్మసూక్ష్మాలు తెలుసుకున్నాడు.  ధర్మరాజు " మనిషి పాటించవలసిన అతి ముఖ్యమైన ధర్మం ఏమిటి " అని అడుగుతాడు భీష్ముడిని.  అప్పుడు ఆయన పైవిధంగా చెబుతారు - " ఎదుటి మనిషి ఏపని చేస్తే నీకు కోపం, కష్టం, బాధ, అసౌకర్యం కలుగుతాయో ఆపని నువ్వు చెయ్యకపోవడమే అతి ముఖ్యమైన ధర్మం " అని. ఎంత అద్భుతమైన విషయం, 5000 ఏళ్ళ ( కనీసం అందరూ అనుకుంటూన్నట్లుగా ) క్రితం చెప్పబడింది. ఇంకో 10000 ఏళ్ళ తరువాతైనా ఇది కనుక పాటిస్తే ఏ గొడవలు ఉండవు.  మహాభారతయుద్ధం అయినతరువాత చక్రవర్తి పీఠం అధిరోహించినా ధర్మరాజుకి మనశ్శాంతిలేక బాధపడుతూంటాడు. ఆయన శ్రీకృష్ణుడిని సోదరులను తీసుకుని అంపశయ్యమీద ఉన్న భీష్ముడి దర్శనానికి వెళ్ళి " తాతా ఈ సంపదలేవీ నాకు సుఖాన్ని, మనశ్శాంతిని ఇవ్వట్లేదు. ఏమిచెయ్యాలి, ఎవరిని కొలవాలి " అని అడుగుతాడు. అప్పుడు అంతా ఈ పరమాత్మే అని నమస్కారం చేసి పరమాద్భుతమయిన " విష్ణుసహస్రం " స్తోత్రం చేస్తారు. భీష్ముడు అష్టమినాడే పరమాత్మలో లీ...

కేనోపనిషత్తు " ఏమీ (బ్రహ్మం) తెలియదు అన్నవాడు జ్ఞాని " అంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వేద్యవర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 652 వ నామం . " వేద్యవర్జితా " అంటే తనకంటె తెలియదగినది ఏమీ లేనిది అని భాష్యం చెప్పారు. " బ్రహ్మసత్యం జగన్మిధ్య,     జీవో బ్రహ్మ ఏవ నపరః " అన్నారు ఆదిశంకరులు. బ్రహ్మమే సత్యం. ఆ బ్రహ్మమే అమ్మవారు. ఈ విషయం తెలుసుకున్నవాడు జ్ఞాని. ఇంక అతను ఏమీ తెలుసుకునే విషయమే లేదు. ఆశ్చర్యకరంగా కేనోపనిషత్తు జ్ఞానికి నిర్వచనం వేరేగా తెలియచేసింది: " యస్యామతం తస్య మతం   మతం యస్య న వేద సః,   అవిజ్ఞాతం విజానతాం    విజ్ఞాతమవిజానతామ్ " -  ‌(2,3) " ఎవరైతే తనకు ఏమీ తెలియదని అనుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియును.  కారణం అతనికి బ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు, దానిని సమాధి నిష్ఠలో మాత్రమే తెలుసుకోగలమనే జ్ఞానం ఉంది గనుక.   ఎవరైతే తనకు బ్రహ్మము తెలుసుననుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియదు.  దానికి కారణం బ్రహ్మము ఇంద్రియగోచరమనే భ్రమలో అతడు ఉన్నాడు గనుక " అని. ఎంత అద్భుతం మన వాజ్మయం. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " సుఖమాత్యంతికం యత్తత్    బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్, ...

అమ్మవారు చూస్తారు, చూడబడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " జ్ఞానజ్ఞేయస్వరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 981 వ నామం. " జ్ఞానజ్ఞేయస్వరూపిణీ " అంటే చూచునది చూడదగినది రెండును స్వరూపముగా గలది. జ్ఞానం అంటే దృక్కు, చూపు ( చూచునది ). జ్ఞేయం అంటే దృశ్యం ( చూడదగినది ). ఈశావాస్యోపనిషత్తు " ఈ చరాచర ప్రపంచం అంతా ఈశ్వరుడి చేత ఆచ్చాదింపబడిందని, అందుచేత 'నేను', 'నాది' అనే భావాలు పరిత్యజించి, త్యాగబుద్ధితో, లోభరహితంగా, లభించిన దానితో సంతృప్తి చెంది అనుభవించడమే ఉత్తమ నైతిక జీవనము " అని తెలియచేస్తూంది. మనకు ఏది కావలసినా అమ్మవారే ఇవ్వాలి. అందుకని అమ్మవారిని పూజిస్తాం, ప్రార్థిస్తాం. పూజింపదగినది/చూడదగినది అమ్మవారు. అమ్మవారు మనకు కావలసినవి ఇస్తారు, మనల్ని బాగుగా చూసుకుంటారు. చూచునది అమ్మవారు. రెండూ అమ్మవారే. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " అనన్యాశ్చింతయంతో మాం    యేజనాః పర్యుపాసతే,    తేషాం నిత్యాభియుక్తానాం    యోగక్షేమం వహామ్యహం "              - భ.గీత 9:22 " ఇతర ( అక్కర్లేని ) విషయాలగురించి ఆలోచనచెయ్యడం మానేసి నన్నే ధ్యానం చెయ్యి, నీ యోగక్ష...

శ్రద్ధ అంటే శాస్త్రాలు చెప్పినట్లు నడుచుకోవడం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " హేయోపాదేయవర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 304 వ నామం.  " హేయోపాదేయవర్జితా " అంటే విడిచిపెట్టదగినది, గ్రహించదగినది అను రెండింటి చేతను విడువబడినది. ఎంత అద్భుతం. అమ్మవారికి గ్రహించవలసినది లేదు, విడిచిపెట్టవలసినది లేదు. మనకు ( జీవులకు ) కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి అంటూ ఉంటాయి. శాస్త్రములు కొన్ని చేయమంటాయి, కొన్ని చేయవద్దంటాయి. శాస్త్రాలు అజ్ఞానులకు. అమ్మవారు జ్ఞాని. శ్రీరాముడు ఎప్పుడూ ఇలా చేయి, అలా చేయకు అనలేదు. శాస్త్రాలు, ఋషులు ఇలా తెలియచేసారు, అలా చేద్దాం అనేవారు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " తస్మాత్ శాస్త్రం ప్రమాణం    తే కార్యాకార్య వ్యవస్థితౌ,   జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం    కర్మ కర్తుమిహార్హసి "               - భ.గీత 16:24 పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని. ఏదయినా కోరిక తీరాలంటే కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి, కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. అమ్మవారికి కోరిక...

రథసప్తమి ఈరోజు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మార్తాండభైరవారాధ్యా " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 785 వ నామం. మార్తాండుడు అంటే సూర్యభగవానుడు. ఆయనచే ఆరాధించబడినది అని అర్ధం. అమ్మవారి శక్తిస్వరూపాలు ఐదు - మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ, నాలుగవది సూర్యమండలాంతర్వర్తిని అయిన గాయత్రీదేవి, ఐదవది గోకులవాసిని రాధాదేవి. మార్తాండ అంటే చనిపోయిన జీవి ( అండం ) లో కూడా చైతన్యం కలిగించే వాడు అని అర్ధం. ఇంతమంది ఆరాధిస్తున్నారు కదా అమ్మవారిని మరి " సూర్యుడు చే ఆరాధింపబడిన " అని ఎందుకు అమ్మవారి నామాలలో ఒక నామంగా చెప్పబడింది. దీనితోనే తెలుస్తూంది సూర్యుడి గొప్పదనం. సూర్యుడు వేల సంవత్సరాలుగా భారతీయుల జీవితాలలో ఒక ముఖ్యభాగమయ్యాడు. " ఆయనకి నమస్కరిస్తారేమిటో మూఢనమ్మకం కాకపోతే " అని విదేశీయులతో పాటు మనవారు కూడా కొంతమంది అనుకోవడం కద్దు. కాని 2 రోజులు ఆయన కనబడకపోయినా విలవిలలాడిపోతారు అమాయకులు. అమ్మవారు జీవులకు కాలచక్రం ఏర్పాటుకోసం ఆలోచించినప్పుడు సూర్యదేవుడు ఉద్భవించాడుట. " .....పృధివ్యా ఔషధీయః, ఔషధీభ్యో అన్నం, అన్నాత్ పురుషః " అన్నాయి వేదాలు. జీవులమనుగడకు అవసరమైన ...

అక్షరముల దేవతల ఈశ్వరి జయంతి నేడు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వాగధీశ్వరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 640 వ నామం. " వాగధీశ్వరీ " అంటే వాక్కులన్నిటికీ ఈశ్వరి. వాక్కు అంటే అర్ధనారీశ్వరం. వాక్కు ఉంటే దానికి అర్ధం ఉండి తీరుతుంది. వాక్కు అక్షరాల కూర్పు. ఈ అక్షరాలన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. వారిని వాగ్దేవతలు అంటారు. ఆ వాగ్దేవతలందరికీ ఈశ్వరి అమ్మవారు. అదీ మన వాజ్మయం ఉత్కృష్టత. " అ నుండి అః " వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అని తెలియచేసారు.  ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత " వశిని " అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం. "క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అన్నారు. "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని " అగ్ని ఖండం" అన్నారు.  ఈ అక్షరాలన్నీ బీజ శబ్దాలు. ఇవి మనశరీరాన్నే కాకుండా ప్రకృతిని కూడా ప్రభావితం చేస్తున్నాయి అని తెలుస్తూంది. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అంటారు. సౌర ఖండంలోని " క "నుండి "ఙ...

అమ్మవారు అనుగ్రహించేదాని కన్నా పైన ఇంకేమీ ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అనర్ఘ్యకైవల్యపదదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 926 వ నామం .  " అనర్ఘ్యకైవల్యపదదాయినీ " అంటే వెలకట్టలేని కైవల్యమను పదమును ఇచ్చునది. కైవల్యం అంటే " కేవలస్య భావం కైవల్యం ". ఒక్కటే అంటే ఇంక పైన ఏమీ లేనిది - ముక్తి, జన్మరాహిత్యం. అమ్మవారు సదా సిద్ధంగానే ఉంటారు ముక్తిని ఇవ్వడానికి. కాని ఆ అవకాశాన్ని పొందడానికి జీవుడు ఎంత సాధన చేయాలి. జడభరతుడు వానప్రస్థానికని అరణ్యానికి చేరుకున్నాడు. ఆకులు అలములు తింటూ మోక్షానికని కఠినసాధన చేస్తున్నాడు.  ఈ సాధన ఏ స్థితికి చేరిందంటే పూజచేయడం కూడా మర్చిపోయేటంత. భగవదనుభూతి పొందడం కోసం పూజ. ఈయన ఆ అనుభూతిలోనే ఉండిపోయి ఆనందిస్తూ ఉండేవాడు వరుసగా కొన్ని రోజులపాటు.  సూర్యమండలంలో ఇష్టదైవాన్ని ధ్యానించడం ఒక అద్భుత ఉపాసన. ఈయన ఆ స్థితిలోకి కూడా వెళ్ళిపోయాడు. ఆయన కర్మలకు అతీతుడు అంటే అవధూత స్థితిలో ఉన్నాడు. ఇక మోక్షమే తరువాయి అన్న సమయంలో ఆయన ఓ జింకపిల్ల మీద జాలిపడి, బంధం పెంచుకుని, దానిని చేరదీసి, దానితోడిదే లోకమయి మరణించి రెండు జన్మలు ఎత్తవలసి వచ్చింది మోక్షానికి. అంత కష్టమయినది స...