Posts

Showing posts from March, 2024

వేదో2ఖిలమూలం - మన వేదాలే అన్నిటికీ మూలం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 జాతకాలు నమ్ముతారేమిటో భారతీయులు అంటారు కొందరు మనవారు కూడా. ఇంకో 100 సం.ల తరువాత కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏరోజున ఎన్నిగంటలకు వస్తుందో కచ్చితంగా చెప్పే మన పండితులు చెప్పే జాతకాలు నమ్మకుండా ఎలా ఉండగలం. వేల సంవత్సరాల క్రితమే భూమికి సూర్యుడికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా ( హనుమాన్ చాలీసా ) చెప్పిన భారతీయ విజ్ఞానం అద్భుతం అని నమ్మకుండా ఎలా ఉండడం. తంజావూర్ బృహదీశ్వరాలయం ఎత్తు 200 అడుగులు. దీని పునాది ఎంతో ఊహించగలమా?. 4 అడుగులు. ఇప్పుడు 50 అడుగుల ఎత్తైన బిల్డింగు కడితే పునాది 8/10 అడుగులు వేస్తున్నారు. గుడిపైన 3/5/7 కలశాలు ఉంటాయి. అవి నిలబెట్టిన భాగాన్ని విమానం అంటారు. ఈగుడియొక్క ఆ విమానం శిల బరువు ఊహించగలమా?. 82 టన్నులు. అసలు అంత బరువు రాయిని అక్కడకు ఎలా తీసుకుని వెళ్ళారన్నది ఇప్పటికీ వింతే. కుతుబ్మీనార్ అసలు పేరు విష్ణుస్తంభం. అసలు దానిలో ఏ మెటల్స్ వాడారో, ఇంతకాలం తుప్పుపట్టకుండా ఎలా ఉందో ఇప్పటికీ వింతే. తక్షశిల విశ్వవిద్యాలయంలో 10వేల మంది విద్యార్ధులు ప్రపంచనలుమూలల నుండి వచ్చి 60 రకాల విద్యలను అభ్యసించేవారు. ఇప్పుడు ఉన్నతచదువులకై విదేశాలకు వెడుతున్...

ప్రకృతి భారతీయం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 భారతీయ సంప్రదాయం శాస్త్రవిజ్ఞానగని. చెన్నైలో తిరువాన్మియూర్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఔషధీశ్వరస్వామి గుడి ఉంది. పేరే ఆశ్చర్యంగా ఉంది కదా. దీని స్థలపురాణం ఏమిటంటే ఇక్కడ శివుడు అగస్త్యమహర్షికి మొక్కలు మూలికల ఉపయోగాలు, అవి నయంచేసే వ్యాధుల గురించి విపులంగా తెలియచేసారుట. శివుడు ఔషధీశ్వరస్వామిగా వెలిసారుట ఇక్కడ. ఈ స్వామిని వాల్మీకి మహర్షి పూజించడంతో ఈ ప్రదేశానికి తిరువాల్మీకియూర్ అని పేరు వచ్చిందిట. ఆపేరు మార్పులు చెంది తిరువాన్మియూర్ అయిందని తెలుస్తూంది. చెట్లని పుట్టల్ని పూజిస్తారేమిటో భారతీయులు అంటూంటారు చాలామంది. మనం చేసేది పూజలు కాదు, కృతజ్ఞత. ఎవరయినా మనకు ఉపయోగపడే చిన్నవిషయం చెబితేనే " ధన్యవాదములు " అంటాము. మరి ఇన్ని ఇస్తూన్న ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదా?. మనకు ఏది కావాలన్నా అన్నీ ప్రకృతే కదా ఇస్తూన్నది. రామాయణం యుద్ధకాండలో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి రామలక్ష్మణులతో సహా అందరూ మూర్ఛపోతారు. జాంబవంతుడు హనుమని కైలాసపర్వతం అవతలనున్న ప్రదేశం నుంచి మృతసంజీవని, సువర్ణకరణి వంటి 4 రకాల మూలికలు వెంటనే తీసుకురమ్మంటారు. మూలిక...

ఉత్తములు అని ఎలా తెలుస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " నహి కశ్చిత్ క్షణమపి    జాతు తిష్ఠతి అకర్మకృత్,   కార్యతే హి అవశః కర్మ    సర్వః ప్రకృతిజైః గుణైః "                      - భ.గీత 3:5  " జీవుడు కర్మ చెయ్యకుండా క్షణం కూడా ఉండలేడు. అది ప్రకృతిపరంగా వచ్చిన గుణాలు ( సత్వ తమో రజోగుణాలు ) కారణంగా " అని పరమాత్మ సెలవిచ్చారు గీతలో. హనుమ " జ్ఞానినాం అగ్రగణ్యం ". " ఋగ్వేదంలో శిక్షణ లేనివారు, యజుర్వేదంలో ధారణ లేనివారు, సామవేదంలో పాండిత్యం లేనివారు ఇలా మంగళకరంగా హృదయానికి హత్తుకునేలా మాట్లాడలేరు " అంటారు రాముడు హనుమ మాటలు విన్నాక లక్ష్మణుడితో. మరి ప్రశాంతంగా ఋష్యమూక పర్వతంమీద ఎక్కడో ఒకచోట కూర్చుని ధ్యానం/తపస్సు చేసుకోక సీతమ్మను వెదకడం దేనికి, అంత శ్రమ పడడం దేనికి?. " ఉత్తమానాం స్వభావోయం   పరదుఃఖ అసహిష్ణుత,    మయం దుఃఖంచ సంప్రాప్తం   మన్యతే అన్యస్యవార్యతే " వ్యాసర్షి భారతంలో అంటారు " ఉత్తములు ఇతరుల దుఃఖాన్ని తట్టుకోలేరు. ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడానికి వారు దుఃఖపడతారు " అని.  హనుమ ఉత్తములు, సత్వగుణ సంపన్నులు. నాకె...

లక్ష్మీదేవిని పూజించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి - నేడు శ్రీలక్ష్మీ జయంతి, హోలీ - చీమలపాటి సూర్యనారాయణ-

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏 " మహాలక్ష్మీః " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 210 వ నామం. " లక్ష్యభూతా లక్ష్మీః " - అందరి లక్ష్యం ( పొందగోరేది ) అమ్మవారే. అందుకే లక్ష్మీ నామం.  శ్రీసూక్తంలో అమ్మవారిని ప్రార్ధిస్తూ " లోకైక దీపాంకురాం ( లోక+ఏక+దీప+అంకురాం ) అంటాం అంటే " లోకాలన్నింటికీ ఒకే ఒక్క దీపంగా ఉన్నది " అని. దీపం అంటే జ్ఞానం. లక్ష్మీదేవి జ్ఞానప్రదాత. విష్ణుసహస్రనామాల్లో ఒక నామం " లక్ష్మీః " - లక్ష్మీ స్వరూపుడు అన్నారు శంకరాచార్యులు తన భాష్యంలో. అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపురాలు. అమ్మవారిని పూజించేటప్పుడు మహాగౌరీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అని సంకల్పం చేస్తాం. అమ్మవారు త్రిగుణమయి - 3 గుణాల రూపిణి.  శ్రీమహాలక్ష్మీ రజోగుణం.  అమ్మవారికి ఆగుణాలేమిటి అనుకోవచ్చు. కాని అవసరమే. ఓ అమ్మ పిల్లాడిని ముద్దుచేస్తుంది, అడిగినవన్నీ పెడుతుంది. తప్పుచేసినప్పుడు కన్ను ఎర్ర చేసి " ఏయ్ " అంటుంది. ఇంకా అవసరమైతే వీపుమీద ఒకటి వేస్తుంది. శాంతంగా " తప్పునాయనా " అంటే ఉపయోగం ఉండదు, కోప్పడితేనే వాడు తప్పు అని తెలుసుకుని బాగుపడ...

" ప " వర్గాలంటే ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 అమ్మవారికి అష్టోత్తరశతనామాలతో పూజ చేస్తూంటాం. వాటిలో ఒక అద్భుతనామం " అపవర్గప్రదాయైనమః " అని ఉంటుంది. స్వామికి పూజ చేసేటప్పుడు " అపవర్గప్రదాయనమః " అంటాము. అంటే పవర్గాల బాధని పోగొడుతుంది అని అర్ధం. ఈ " ప " వర్గాలంటే ఏమిటో తెలుసుకుందాం. హల్లుల్లోని ఐదేసి అక్షరాలని ఓ వర్గంగా చెప్పుకుంటాం. క వర్గం, గ వర్గం అలా. ప వర్గంలోనివి ప, ఫ, బ, భ, మ లు.  ప - పాపం, పుణ్యం ఫ - ఫలం బ - బంధము భ - భయం మ - మరణం* * మరణం అంటే ఉపనిషద్ అర్ధం ఏమరుపాటు. ఇవి ప వర్గాల క్రిందకు వస్తాయి. వీటినుంచి బయటపడవేసేవారే అపవర్గప్రదాయని. అసలు ఎందుకు అలా బయటపడవేయమని కోరుకోవడం. సాధకుడు కోరుకునేది జీవన్ముక్తి, అంటే మోక్షం. స్వర్గం కాదు. పుణ్యఫలం అనుభవించడానికి మరణానంతరం స్వర్గంకి వెళ్ళినా ఆ పుణ్యఫలం అవగానే మళ్ళీ జన్మను తీసుకుంటాడు జీవుడు పాప ప్రక్షాళనకోసం. ఏసుఖానికైనా దుఃఖస్పర్శ ఉంటుంది. కాని స్వర్గం లో దుఃఖస్పర్శ ఉండదు. పాపం కూడా నశించాలంటే దుఃఖస్పర్శ తప్పదు. అందుకని మళ్ళీ జన్మతీసుకోవలసి వస్తుంది జీవుడికి. పాపపుణ్యాలు పూర్తిగా నశిస్తేనే జీవన్ముక్తి. మళ్ళీ జన్మ ...

కలికాలం అంటే ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " కల్యంతే కలహం కుర్వన్ యశ్మిన్ కలిః " - " కలికాలం ఎప్పుడూ కలహాలతో గడుస్తూ ఉంటుంది" అని భావం. కలి ప్రవేశిస్తే అంతా " రివర్స్ " లో ఉంటుంది. తల్లిదండ్రులు సరిగ్గానే ఉన్నారా అని పిల్లలు, గురువులు సరిగ్గానే ఉన్నారా అని శిష్యులు నిర్ణయం చేస్తారు. మొన్న సామవేదం షణ్ముఖశర్మగారి ప్రవచనం వినడం జరిగింది.  ధర్మాన్ని 4 పాదాలు ( పాళ్ళు ) చేస్తే సత్యయుగంలో 4 పాదాలు ఉంటాయి. త్రేతా అంటే 3- ఆ యుగంలో ధర్మం 3 పాదాలు అధర్మం 1 పాదం ఉంటాయి. ద్వాపర అంటే 2, ఆ యుగంలో చెరి 2 పాదాలు ఉంటే కలియుగంలో ధర్మం 1 పాదం , అధర్మం 3 పాదాలు ఉంటాయి. ఇక్కడ తెలుసుకోవలసినది కలిపురుషుడు 4 యుగాల్లోనూ ఉంటాడు. త్రేతాయుగంలో రావణాదులలోనూ, ద్వాపర యుగంలో దుర్యోధనాదుల్లోనూ, ఇప్పటి కలియుగంలో అత్యధిక జనుల్లోనూ చేరాడు అంతే. కలియుగం లో కూడా ధర్మపరులు ఉంటారు కాని వారు తక్కువగా ఉంటారు. అలాంటివారు ఉండబట్టే సమయానికి వానలూ అవీ పడి పంటలు పండుతున్నాయని అనుకోవచ్చు.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంతో ధర్మబద్ధమైన సత్యయుగంలో కూడా కలిపురుషుడు ఉన్నాడు. నలదమయంతుల కధ అందరం చదివినదే. దానిలో నలు...

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 దేవుడు ఉన్నాడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటూ కొందరు మేధావులు తెగ ఆలోచన చేస్తూంటారు. యజ్ఞం అంటే నమ్మకంతో చేసే కర్మ. సత్కర్మలు అసత్కర్మలు అని రెండురకాలు. అసత్కర్మలు అంటే చెడ్డపనులు కాదు, దొంగతనం హత్యలు లాంటివి అసలే కావు. అపనమ్మకంతో చేసేపనులు. " ఏమో నాకు నమ్మకం లేదు, ఈ పని అవుతుందని " అని అనుకుంటూ చేసే పనులు. మామేనత్తగారు దృష్టి ( దిష్టి ) మంత్రం వేసేవారు. వీభూతి మంత్రించి ఇచ్చేవారు. ఓ గ్రహణసమయంలో నేను మాగ్రామంలో ఉండడంతో ఆవిడ " రేపు గ్రహణసమయంలో స్నానం చేసి రా, మంత్రోపదేశం చేస్తాను " అన్నారు. వెళ్ళాను. మొదట ఆవిడ అన్నది " మంత్రం వినగానే ' ఇదేమిటి, ఇదామంత్రం ' అనే ఆలోచన రానీయకు " అని. నమ్మకం ముఖ్యం, ఆరోజు మొదలుకుని గత 40 ఏళ్ళుగా రోజూ కనీసం 11 సార్లు దానిని మననం చేస్తాను. నేను పదో పదకొండో చదువుతూన్నప్పుడు తీవ్రమైన కరువు. 15,16 నెలలుగా వర్షాలు లేవు. నిండుగా ఉండే మా చెరువు కూడా 5,6 పాంచాలు క్రిందకు వెళ్ళిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ప్రక్కగ్రామాల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది ఏదో ఒక కార్యక్రమం తలపెట్టండి మహాశయ...

నేరం మనదికాదు, గరిటెలది - చీమలపాటి సూర్యనారాయణ

సమస్తమూ విరాట్ పురుషుని నాభినుంచే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  ఉపనిషత్తులు ఇలా తెలియచేస్తున్నాయి : " ఆకాశాత్ వాయుః,     ‌ వాయోరగ్నిః,    అగ్నేరాపః, అద్భ్యః పృధివీ,    పృధివ్యాత్ ఔషధీయః,      ఔషధీభ్యో అన్నం,    అన్నాత్ పురుషః " అని. అంటే " ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమివలన ఔషధులు, వాటినుంచి అన్నం, అన్నం నుంచి జీవులు " అని అర్ధం. అన్నం వలననే జీవులు ( మనం ) జీవిస్తున్నాయంటే వీరి మనుగడకు మూలం ఆకాశం అని అనుకోవాలి. ఋగ్వేద భాగమైన " పురుషసూక్తం " లో ఇలా ఉంది: " చంద్రమా మనసో జాతః,    చక్షోః సూర్యో అజాయత,    ముఖాదింద్రశ్చాగ్నిశ్చ,    ప్రాణాద్వాయురజాయత,    నాభ్యా ఆసీదంతరిక్షం...... "  విరాట్ స్వరూపాన్ని ( సహస్రశీర్షాపురుషః సహస్రాక్షః సహస్రపాత్....) వర్ణిస్తూ ఋషులు తెలియచేసినది ఆయన " నాభి " లోంచి ఆకాశం పుట్టిందని. ఇప్పుడు పై రెండు విషయాలు పరికిస్తే అర్ధమయ్యేది " నాభి " యే మన మనుగడకు మూలం అని, జీవులకు కావలసినవి అనగా గాలి, నీరు, అగ్ని, అన్నం అన్నీ " స్వామి " నాభిలోంచే వస్త...

అతి మంచితనం కూడా మంచిది కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " అహింసా పరమో  ధర్మః ,    ధర్మ హింసా  తథైవచ " అహింసే అత్యుత్తమమయిన ధర్మం అయినా ధర్మాన్ని నిలపడంకోసం చేసే హింస కూడా అహింసే అని చెబుతున్నారు. ఇది వేదాల్లోనూ ఇతరాల్లోనూ లేకపోయినా పరమాత్మ స్వయంగా చెప్పారు కదా: " పరిత్రాణాయ సాధూనాం,     వినాశాయచ దుష్కృతాం "  - భ.గీత 4:8   అని. సరిహద్దుల్లో సైనికులు చేసేది హింస అనరాదు. చరిత్రలో జరిగిన ఓ అద్భుత సంఘటన చూద్దాం. 733 వ సం.లోనే మహమ్మదీయులు దండయాత్రకు వచ్చి కనౌజ్ రాజ్యాన్ని ముట్టడించారు. చీకటి పడడంతో రాజ్యం బయట విశ్రాంతి తీసుకుంటున్నారు. తెల్లవారగానే రాజ్యం మీద పడదామని. వారి అభిప్రాయం ఏమిటంటే హిందూరాజులు ధర్మయుద్ధమే చేస్తారు, రాత్రి దాడిచెయ్యరు అని. ఎంత నమ్మకం.  అందుకని హాయిగా తిని నిద్రపోతున్నారు. కనౌజ్ రాజు నాగభట(1), సేనాని తక్షకుడు. శత్రువుల సైన్యం అధికంగానే ఉంది అని చారులు తెచ్చిన వార్త కలవరపాటును కలిగించింది. ఓటమి ఖాయం, ఏమి చెయ్యాలి. సేనాని తక్షకుడు రాత్రి ఒంటిగంటకు సైన్యంతో చప్పుడుకాకుండా వెళ్ళి పడుకున్న శత్రువుల తలలు నరకడం మొదలెట్టారు. అలజడికి లేచి పారిపోతూ...

పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం గారి వర్ధంతి నేడు - చీమల పాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " యస్య దేవే పరాభక్తిః   యధా దేవే తధా గురౌ "              - కఠోపనిషద్ " ఏ దేవి అనుగ్రహం కోసం జపం చేస్తున్నామో ఆ దేవిమీద అఖండభక్తి ఉండాలి. అంతే భక్తి గురువుమీద ఉండాలి " అని కఠోపనిషద్ తెలియచేస్తూంది. శ్రీరంగం గోపాలరత్నం గారికి పద్మశ్రీ బిరుదు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో " ఈకాలం పిల్లలకు సంగీతం నేర్చుకోవడానికి, సాధనకు సమయమే లేదంటున్నారు. మీరు ఇలా ఎలా " అంటే ఆవిడ " అప్పుడూ ఇప్పుడూ రోజుకు 24 గంటలే. ఇప్పుడు సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందింది కూడా. మా కాలంలో కష్టపడినట్లుగా ఇప్పటి పిల్లలు కష్టపడక్కరలేదు కూడా. గురువును త్రికరణశుద్ధిగా నమ్మి సంగీతాన్ని సాధన చేస్తే తప్పక ఫలితం ఉంటుంది " అన్నారు. " మంచి గురువును పట్టుకుని, సేవ చేసుకుని, మంచిజ్ఞానం సంపాదించుకో ( భ.గీత 4:34 ) " అన్నారు పరమాత్మ గీతలో. శ్రీరంగం గోపాలరత్నం గారి కుటుంబం మాగ్రామంలో ఉండేవారు మా అమ్మగారి చిన్నతనంలో. వారి నాన్నగారు ఉపాధ్యాయులు.  ఎంత కష్టపడ్డారో, ఎంత సాధన చేసారో. కారణజన్ములు. అటువంటివారిని ఓసారి జ్ఞాపకం చేసుకున్నా తరిస్తాం. నేడు శ్రీరంగం...

కోరిక మహా చెడ్డది, తస్మాత్ జాగ్రత్త - చీమలపాటి సూర్యనారాయణ

  🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ధూమేనావ్రియతే వహ్నిః,    యధా దర్శో మలేనచ,    యధోల్బేనావృతో గర్భః,    తధా తేనేదమావృతం " - భ.గీత 3:38 " పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే కప్పివేయబడును " అన్నారు పరమాత్మ. ఇక్కడ కామము అంటే కోరిక. దీనికి అంతులేదు. ఒకటి తరువాత ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది. ఎలాగయినా తీర్చుకోవాలనుకున్నప్పుడు కోపం ద్వేషం అహం పెరుగుతాయి. ధర్మరాజుది ఎంతటి అద్భుత వ్యక్తిత్వమో చూద్దాం. 12 ఏళ్ల అరణ్యవాసానికి వెడుతూన్నప్పుడు ద్రౌపది " ఎప్పుడూ ధర్మం ధర్మం అంటారు. ధర్మంని అనుసరిస్తూన్న మీరు అరణ్యం పాలయ్యారు. అధర్మం చేస్తూన్నవాడు రాజ్యం ఏలుతున్నాడు " అని అంటే అప్పుడు ధర్మజుడు " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ - ధర్మం నా స్వభావం మరి ( ఏమి చెయ్యమంటావు )" అంటారు. అంతటి అమితధర్మపరుడు, అజాతశత్రువు ధర్మజుడు. రాజసూయ యాగం చేసాడు,  కృతజ్ఞతగా శ్రీకృష్ణుడిని గౌరవించుకున్నాడు, ఆ సభలోనే శిశుపాలుడిని సంహరించారు స్వామి.  అన్ని అద్భుతవిషయాలను చూసిన ఆయన " పాచికలాడుదాం రా "  అని దుర్యోధనుడు పిలుస్తే...

ఏపనీ చేయకుండా కూర్చోకూడదు, కూర్చోలేరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నైష్కర్మ్యా " - అమ్మవారి అద్భుతనామం . ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 900 వ నామం .  నైష్కర్మ్యా అంటే వేదోక్త కర్మలు కలిగియుండినను కర్మ సంబంధము లేకుండుట. సృష్టి స్థితి లయలు, జీవులకు వారివారి కర్మలకు అనుగుణంగా ఫలాలు ఇవ్వడం లాంటి విద్యుక్తకర్మలు చేస్తూన్నా ఆ కర్మల సంబంధాలేమీ అమ్మవారికి ఉండవు. " పద్మపత్రమివాంభసా " అంటే తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది అమ్మవారు. ఇదే విషయాన్ని పరమాత్మ భ.గీతలో చెబుతారు అర్జునుడికి: " న కర్మణామనారంభాత్     నైష్కర్మ్యం పురుషో2శ్నుతే.   న చ సన్న్యసనాదేవ                 సిద్ధిం సమధిగచ్ఛతి "                    - భ.గీత 3:4 మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠాసిద్ధి అతనికి లభింపదు.  దీని అర్థం కంచి పరమాచార్యులయినా లోకకళ్యాణంకోసం చంద్రమౌళీశ్వరునికి అభిషేకం, అమ్మవారు కామాక్షీదేవికి అర్చనలు నిత్యమూ చేస్తూంటారు. భక్తులు వస్తే నాలుగు మంచిమాటలు చెబుతూంటారు, ఎవరయినా భక్తితో సేవకు పిలిస్తే వెడుతూంటారు. ఏ కర...

భోగాలు అనుభవించవచ్చు, భోగాసక్తి ఉండకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఆపూర్యమాణమచలప్రతిష్ఠం    సముద్రమాపః ప్రవిశంతి యద్వత్,     తద్వత్ కామా యం ప్రవిశంతి    సర్వే స శాంతి  మాప్నోతి న కామకామీ "                         - భ.గీత 2:70 " సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింప జేయకుండగనే  అందులో లీనమగును. అట్లే సమస్తభోగములును స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును.  అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు " అన్నారు పరమాత్మ. కంచి పరమాచార్యులు ఎవరయినా " సేవ " కు తమ ప్రాంతానికి రమ్మని ఆహ్వానిస్తే వీలుని బట్టి సమ్మతిని తెలియచేసి వీలు చూసుకుని వచ్చేవారు. మాబాబయ్యగారు ( పిన్నిగారి భర్త ) సంస్కృతపండితులు. చాలా కావ్యాలు వ్రాసారు. ఆరోజుల్లోనే 1950-60 లలో 3000 ప్రవచనాలు చేసారు. అద్భుత విద్వత్తు వలన కంచి పరమాచార్యులకు ఆప్తమిత్రులయారు. మా బాబయ్యగారి చివరిరోజుల్లో ఊరిపెద్దలు కంచివెళ్ళి పరమాచార్యులను కలిసి పరిస్థితి వ...

వ్యాధులలోనూ అమ్మవారు కూర్చుని ఉంటారా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏 " త్రిస్థా " - అమ్మవారి అద్భుతనామాలు. శ్రీలలితాసహస్రరహస్యనామాలలో ఇది 874 వ నామం. " త్రిస్థా " అన్నది ఒక అద్భుతనామం. త్రిస్థా అంటే మూడింటిలోనూ ఉన్నది అని అర్ధం. ఆ 3 ఏమిటి అని భాష్యం చెప్పడానికి పూజ్యులు శ్రీభాస్కరరాయులవారు " మార్కండేయపురాణం " లోని శ్లోకాన్ని యధాతధంగా తీసుకున్నారు. ఆ శ్లోకంలో సరస్వతీదేవి ని స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు - " 3 వేదాలు ( ఋగ్ యజుర్ సామ ), 3 వర్గాలు (ధర్మ అర్ధ కామ), 3 లోకాలు ( స్వర్గ మర్త్య పాతాళ ), 3 విద్యలు ( సాంఖ్య యోగ వేదాంత ), 3 జ్యోతులు ( సూర్య చంద్ర అగ్ని ), 3 గుణాలు ( సత్వ రజో తమో ), 3 దోషాలు ( వాత పిత్త కఫ ), 3 ఆశ్రమాలు ( బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం ), 3 శబ్దాలు ( అ ఉ మ - ఓం ), 3 కాలాలు ( పగలు సంధ్య రాత్రి ), 3 అవస్థలు ( జాగృతి స్వప్న సుషుప్తి ) - అలా అన్నింటిలోనూ అమ్మవారు ఉన్నారు అని తెలియచేసేలా " త్రిస్థా " అనే నామంతో పూజిస్తున్నారు.  ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏమిటంటే " వాత పిత్త కఫ " లలో అంటే వ్యాధులలోనూ అమ్మవారు కూర్చుని ఉంటారు అర్ధమవుతూంది. వ్యాధి ఒకరకంగా వరం. ...

సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకుంటూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సామరస్యపరాయణా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 792 వ నామం. " సామరస్యపరాయణా " అంటే హెచ్చుతగ్గులు లేని శివశక్తి భావము నివాసముగా గలది. సామరస్యం అని తరచుగా వింటూంటాం. కొంచెం సామరస్యంగా వ్యవహారాన్ని పరిష్కారించుకుంటే నయమేమో అంటూంటారు పెద్దవారు, ఆలోచనాపరులు. ఎంత పెద్దవారయినా పరిస్థితులను చూసి ఎదరకు అడుగు వేయాలి. ఎల్లప్పుడూ " నాకు ఎదురు లేదు " అనే అహం పనికిరాదు. హనుమ " జ్ఞానినాం అగ్రగణ్యం ".‌ అమ్మవారి అనుగ్రహం ఎక్కువే. ఇటువంటి లక్షణాలన్నీ హనుమలో కనబడుతాయి. మొదటిసారి హనుమ రాముడితో మాట్లాడినప్పుడు రాముడు హనుమ మాటతీరుకి ఆశ్చర్యపోయి లక్ష్మణుడితో అంటారు " ఇటువంటి వారు ఎవరికి దూతగా ఉంటారో వారి పనులన్నీ చక్కగా అయిపోతాయి " అని. హనుమ " రామదూత " గా లంకకు వెళ్ళారు. దారిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళమని మైనాకుడు కోరితే " ఇప్పుడు సమయంలేదు నాయనా " అని మృదువుగా చెప్పి ఎదరకు వెళ్ళిపోయారు. దారిలో సురస ఎదురుపడి తన నోట్లోకి వెళ్ళవలసిందే అంటే సూక్ష్మరూపంలో అలా వెళ్ళి ఇలా బయటకు వచ...

అమ్మవారు ఇతర మంత్రాలను నాశనం చేసేస్తుందా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పరమంత్రవిభేదినీ " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 812 వ నామం. పరమంత్రవిభేదినీ అంటే ఇతర ( లోకకళ్యాణం కోసం కానివి ) మంత్రాలను ఛేదిస్తుంది.  మంత్రం లోకకల్యాణం కోసం ఉపయోగపడాలి. జీవితం ధర్మబద్ధంగా ఉండాలి. సాధన సాత్వికంగా ఉండాలి. ఆలోచనలు సాత్వికంగా ఉండాలి. అలా లేని మంత్రాలని అడ్డుకుంటుంది.  " మననాత్ త్రాయతే ఇతి మంత్రః " అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. మంత్రాలు రక్షణని ఇస్తాయి. ఎవరికి?. జపం చేసుకునే వారికి, లోకానికి కూడా. లోకం సురక్షితంగా ఉంటేనే కదా మనం సుఖంగా జీవించేది. ఎప్పుడూ కొట్టుకు చస్తూ ఉండే దేశాలలో ఆనందం ఎలా ఉంటుంది. అమ్మవారి ఈ నామ శక్తి/అనుగ్రహం హనుమ లంకలో ప్రవేశించినప్పుడు తెలుస్తుంది. చిన్నరూపంలో ( పిల్లి అంత వానరం ) హనుమ లంకలో ప్రవేశించి భవనాలని, రక్షణవ్యవస్థని, మనుషులనీ, అన్నివైపులా పరిస్థితులు ఎలా ఉన్నాయో అని నిశితంగా గమనిస్తున్నారు. ఆయుధాలు పట్టుకుని యోధులు తిరుగుతున్నారు. కొందరు మంత్రవేత్తలు దర్భలు పట్టుకుని తిరుగుతున్నారుట. దేనికి?. ఎవరయినా శతృవులు కనబడకుండానో సూక్ష్మరూపంలోనో లంకలో ప్రవేశిస్తే వీరి ...

ఇంద్రియాలను నిగ్రహించుకోమనలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " రాగద్వేషవియుక్తైస్తు    విషయానింద్రియైశ్చరన్ !   ఆత్మవశ్యైర్విధేయాత్మా    ప్రసాదమధిగచ్చతి "              ‌ - భ.గీత 2:64 అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును.  కంచిపరమాచార్యులు అమ్మవారి పూజకు తీసుకుని వచ్చిన గులాబీలు అద్భుతంగా ఉన్నాయి అని మెచ్చుకుంటారు. ఎవరయినా అమ్మవారు కామాక్షీదేవి కీర్తన పాడితే విని ఆనందిస్తారు. భక్తురాలు ప్రసాదం చేసి పట్టుకువస్తే తిని చాలాబాగుంది అంటారు. అంటే ఆయన ఇంద్రియముల ద్వారా విషయాలను గ్రహిస్తున్నారు అని తెలుస్తూంది. కానీ అవేమీ ఆయనను మాయలో పడేయవు. ఇక్కడ " మాయ " అంటే ఏవో రోగాలున్నా ఓ రసగుల్లా తినవచ్చు, కొత్తావకాయ కలుపుకుని 4 ముద్దలు తినవచ్చు. అంతేకాని మహారుచిగా ఉందని కొంచెం ఎక్కువ లాగిస్తే తరువాత బాధపడవలసినది తనే అనే ఎరుకలో ఉన్నవాడే సాధకుడు. ఒకరకంగా మనతోబాటు ఎక్కువ మంది సాధకుల క్రిందే లెక్క. స్నేహితులలో ఎంతోమంది మద్యపానం చేసేవారున్నా కొందరు త్రాగరు. చుట్టూ ఎందరో సిగరెట్లు త్రాగేవారున్నా క...

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 నేడు "ప్రపంచ మహిళామణుల దినోత్సవం"  ఒకాయన సంతకి వెళ్ళి ఓ మేకపిల్లని కొన్నాడు. నలుగురు దొంగలు అది గమనించి ఎలాగైనా ఆ మేకపిల్లని కొట్టేయాలని అనుకుని ఒక మంచి ఉపాయం ఆలోచించారు. ఆయన మేకపిల్లని తీసుకుని తన ఊరికి నడిచి వెడుతున్నాడు. అరమైలు వెళ్ళగానే ఒక దొంగ ఎదురుగా వచ్చి " కుక్కపిల్ల బాగుంది, ఎంతకు కొన్నారు " అన్నాడు. ఈయన ఇది మేకపిల్ల అని చెప్పి ఎదరకి వెళ్ళిపోయాడు. అరమైలు వెళ్ళగానే ఇంకోదొంగ ఎదురువచ్చి " కుక్కపిల్ల ఎంతముద్దుగా ఉందో, ఎంతకి కొన్నారు " అన్నాడు. ఈయన " ఇది మేకపిల్లండి బాబూ కుక్కపిల్లకాదు " అన్నాడు. మిగతా ఇద్దరు దొంగలూ కూడా అలాగే అనడంతో ఈయనకి అనుమానం వచ్చింది, ఇది నిజంగానే కుక్కపిల్లేమో, అందరూ ఎందుకు అలా అంటారు అని అనుకుని దాన్ని రహదారి ప్రక్క వదిలేసి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. దొంగలు ఆ మేకపిల్లని తీసుకుని చెక్కేసారు. ఇది అంతా ఇప్పుడు ఎందుకంటే మన వేదాలని ( 20500 మంత్రాలు ), ఉపనిషత్తులని, పురాణాలని, శాస్త్రాలని, రామాయణం ( 24000 శ్లోకాలు ), మహాభారతం ( 100700 శ్లోకాలు ), శృతులు, స్మృతులు ముఖ్యంగా మనుస్మృతిని ర...

శోకాన్ని పోగొట్టేవారు ఆనందాన్ని ఇచ్చేవారు శివుడు, మహాశివరాత్రి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " అక్షమాలాధరం రుద్రం    పార్వతీ ప్రియ వల్లభం,   చంద్రశేఖరమీశానం    ఏకబిల్వం శివార్పణం "  " రురుం ద్రావయతి ఇతి రుద్రః " - శోకాన్ని పోగొట్టేవాడు రుద్రుడు అని అర్ధం. " శం కరోతి ఇతి శంకరః " - శుభాలను/ఆనందాన్ని కలిగించే స్వామి శంకరులు. " త్రిగుణాతీతమై లోకాతీతమై సర్వాతీతమై శాంతమైన తత్వమే శివతత్వం " - ఆ స్థితిలో అంతా ఆనందమే. అదే సత్యం శివం సుందరం. " చిన్మాత్రం అమలం శాంతం " - నిర్మలమైన జ్ఞానమయమైన శాంతం వలన మాత్రమే శివుడిని తెలుసుకో గలుగుతారని వామన పురాణం/యోగవాశిష్ఠ మహారామాయణం తెలియచేస్తున్నాయి. ఈరోజు శివునికి అత్యంత ప్రీతికరమయిన, శుభకరమయిన రోజు. మహాశివరాత్రి.  శివుడిని ఋషులు అడిగారు " స్వామీ అందమైన కైలాసంలో పార్వతితో హాయిగా గడపక ఇలా శ్మశానాలలో తిరుగుతూంటావు, ఎందుకని " అని. స్వామి అన్నారు " జీవుడు పాపప్రక్షాళనకోసం, జన్మరాహిత్యం కోసం జన్మ తీసుకుని చాలా కష్టపడతాడు. వీలయినన్ని పుణ్యకార్యాలు చేస్తాడు. పెళ్ళిచేసుకుని కొందరికి జన్మనిచ్చి వారికోసం నానాపాట్లూ పడతాడు. తన సుఖాన్ని , తనముక్తినీ కూడా మరచి...

ఉపవాసాలు అవీ చేయవచ్చా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " నాత్యశ్నతస్తు యోగో2స్తి    న చైకాన్తమనశ్నతః,    నా చాతిస్వప్నశీలస్య    జాగ్రతో నైవ చార్జున "               - భ.గీత 6:16 " అతిగా తినేవారికి అస్సలు తినని వారికి, అతిగా నిద్రపోయే వారికి అస్సలు నిద్రపోని వారికి యోగాభ్యాసము అంటదు/పనికిరాదు " అన్నారు పరమాత్మ. యోగాభ్యాసము దేనికి. మనస్సు నిలకడగా అంటే అలలులేని సముద్రంలా నిశ్చలంగా ఉండడానికి. అప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి, ప్రశాంతంగా ఉంటుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అందుకని మితాహారం తీసుకోవాలన్నారు. అది ఎలాగో కూడా చెప్పారు. ఉదరాన్ని 4 భాగాలు చేసి 2 భాగాలు ఘనపదార్ధం ( అన్నం మొ.గునవి ) తో నింపి ఒకభాగం ద్రవంతో నింపమన్నారు. ఒకభాగం ఖాళీగా ఉంచితే మితాహారం తీసుకున్నట్లుగా భావించాలి. ఖాళీకడుపుతో అసలు చెయ్యకూడదన్నారు. ఎంత అద్భుతంగా విపులంగా చెప్పారో చూడండి. ఖాళీకడుపు అయినా పొట్టనిండుగా ఉన్నా నిద్ర రావడానికి అవకాశముంది. మరి ఎత్తుపీటమీద కూర్చుంటే నిద్రమత్తులో క్రింద పడితే ఏమవుతుందో అందరికీ తెలుసు. అలాగే క్రింద కూర్చోవడంకూడా కష్టమే కదా. అందుకని అంత ఎత్తు ...

డబ్బులేనివారు కూడా దానధర్మాలు చేయాలా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏  " ధర్మాధారా " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 884వ నామం " ధర్మాధారా " అంటే ధర్మమునకు ఆధారమైనది మరియూ ధర్మమును ఆధారముగా చేసినది. దేనికి ధర్మాన్ని ఆధారంగా చేసింది అని ఆలోచనచేస్తే " సృష్టి " కి అని తెలుస్తుంది.  " యతో ధర్మాణి ధారయన్ " అని చెప్పింది వేదం. సృష్టి అంతా ధర్మం మీదే ఆధారపడి ఉంది. అందుకే ఇంత లయబద్ధంగా అద్భుతంగా ఉంది. ధర్మబద్ధంగా ఏ పని చేసినా అది యజ్ఞంగా పిలవబడుతుంది.  ఈ నామం విష్ణుసహస్రంలో కూడా చెప్పబడింది. స్వామిని " ధర్మయూపా " అంటే " ధర్మములన్నీ తనయందే ఉన్నవాడు " అని పూజిస్తారు. " ధర్మగుబ్, ధర్మకృత్, ధర్మీ " అంటే " ధర్మాన్ని రక్షించేవాడూ, ధర్మాన్ని ఆచరించేవాడూ, ధర్మానికి ఆధారమై ఉన్నవాడు " అని పూజిస్తాం ఆయన్ని. " విశ్వధర్మములన్నిటికీ ఎవరు ఆధారమో ఆయనే పరమాత్మ " అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేయమని ఎవరు చెప్పినా ఆయన అయోధ్యకు తిరిగిరానంటే చివరిగా వశిష్టులని నచ్చచెప్పమంటారు అందరూ. వశిష్ట...

శక్తికిమించి పూజలు జపాలు చేయనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అశాస్త్రవిహితం ఘోరం    తప్యంతే యే తపో జనాః,    దంభాహంకారసమ్యుక్తాః    కామరాగబలాన్వితాః    కర్షయంతః శరీరస్థం    భూతగ్రామమచేతసః,    మాం చైవాంతఃశరీరస్థం    తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్                       - భ.గీత 17:5,6 " శాస్త్రవిహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను దంభాహంకారములతో ఒనరించువారును, కామరాగములచే ప్రేరేపింపబడినవారును, దేహమును దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టేవారిని అసురులుగా తెలియబడుదురు " అన్నారు పరమాత్మ. డాంబికము, అహంకారంతో ఎవరో చేసారు మనమూ చేద్దాం అనేకాని మనకు అవసరమా, శక్తి చాలుతుందా అనే ఆలోచన ఉండదు కొందరికి. ఎంత అద్భుత విషయం తెలియచేసారు పరమాత్మ. లలితాసహస్రనామాలను లలితాసహస్ర "రహస్య " నామాలు అంటారు. అవి ఎందుకు రహస్యము అంటే అవి చదవకపోవడంవలన నష్టంలేదు, అమ్మవారు కోప్పడరు. కాని వాటిలో నామాలు ఛందోబద్దంగా ఉంటాయి. బీజాక్షరాలు ఉంటాయి. తప్పుగా చదివితే నష్టం ఎక్కువ.  అలాగే గాయత్రీమంత్రం చాలా శక్తివంతమయినది. ఉపనయనసమయం...

కీర్తనల్లో అంత అంతరార్ధం ఉంటుందా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 వాగ్గేయకారుల కీర్తనలు సాధారణంగా 6/8 పంక్తులలో ఉంటాయి. పదాలు కూడా తేలికభాషలో ఉంటాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాని సరిగ్గా సాహిత్యాన్ని చదివి అర్ధం చేసుకుంటే వారి అత్యద్భత విద్వత్తు తెలుస్తుంది, అబ్బురంగా అనిపిస్తుంది. త్యాగయ్య ఓ కీర్తనలో ఇలా అంటారు: " ఆడమోడి గలదే రామయ్య   మాటలాడమోడి గలదే                             రామయ్య   చదువులన్ని దెలిసి      శంకరాంశుడై   సదయుదాశుగ సంభవుండు     మ్రొక్క గదలు తమ్ముని     బల్కజేసితివి గాకను      త్యాగరాజేపాటి మాటలా " ఎంతో సామాన్యంగా కనబడుతూంది ఈ కీర్తన. మోడి అంటే బింకం(ట), తెలుగు పదం.  కీర్తన అర్ధం: " ఎన్నో కీర్తనలతో నిత్యం నిన్ను పూజిస్తూంటే నాతో మాట్లాడవేమిటయ్యా. అంత బింకమేమిటయ్యా?. సకలశాస్త్రపారంగతుడు శంకరాంశుడు అయిన హనుమ ( ఆశుగసంభవుడు అంటే వాయుపుత్రుడు ) తోనే తమ్ముడు లక్ష్మణుడితో మాట్లాడించావు ( నువ్వు మాట్లాడకుండా ). ఇక నెనెంత అంటారు " త్యాగయ్య. ఈ కీర్తనలో ఒక అద్భుత...