Posts

Showing posts from May, 2023

రమణమహర్షి 1

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 రమణమహర్షి సందేశాలన్నీ అద్భుతమే. ఇతరవిషయాల గురించి ఆలోచనచేసే ముందు " నేనెవరు " అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యమన్నారు మహర్షి. కాని " నేనెవరు " అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అంత సులభంకాదు. 100 కోట్లమందిలో అందుకే ఓ 100మందినికూడా " నేనెవరు " అని తెలుసుకున్నటువంటివారిని చూడం - మహర్షి, పరమహంస, కంచిపరమాచార్య వంటివారిని అప్పుడప్పుడు చూస్తూంటాం. చిన్నపిల్లవాడి నోట్లో తేనె రాస్తే చప్పరిస్తాడు. చేదుది పెడితే ఉమ్మేస్తాడు. పిల్లవాడికి ఎలా రుచులు తెలుస్తున్నాయని అడిగితే గతజన్మ " వాసనలు " పోవు, అలాగే ఉంటాయన్నారు. భ.గీతలో ఆఖరి అధ్యాయం " మోక్షసన్యాసయోగం " - అదేమిటండీ, సన్యాసం అంటేనే మోక్షంకోసం అన్నీ వదిలేయడంకదా, మళ్ళీ ఇదేమిటి అన్నారు పెద్దలు. సన్యాసి అయినా గత " వాసనలు " పోవు కొందరికి . ఒకాయన పీఠాన్ని పెడతాడు, అమ్మవారికి పూజలు చేస్తాడు, చేయిస్తాడు. " అతన్ని మాత్రం ముఖ్యమంత్రిని అవనివ్వను " అంటాడు. మహామాయ. అందుకే నరసింహశతక కర్త అంటారు " బ్రతికినన్నాళ్ళు నీభజన చేతును, మరణకాలమునందు ( నిను ) ...

రమణమహర్షి A

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 ఈరోజు పూజ్యులు రమణమహర్షి జయంతి. జ్ఞానప్రదాత. ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టడానికి అవతరించిన మహానుభావుడు. శరీరం మీద ధ్యాసలేదు, లౌకికవిషయాలపై ఆశక్తిలేదు. " బ్రహ్మసత్యం, జగన్మిధ్య " అని సంపూర్ణంగా నమ్మిన జీవన్ముక్తులు. ఒకరిపై ద్వేషం/కోపం లేదు. అసలు ఎవరిపైనా ఇష్టం/అభిమానమే లేదు. దేశంలోనే కాదు విదేశాలలోనూ ఎందరో శిష్యులు. ఈయన సందేశాలతో తరించినవారు ఎందరో. మొదట్లో మహర్షి బట్ట ఏమీ కట్టుకునేవారు కాదుట. ఈ శరీరం నేను కాదు అని తెలుసుకున్నాయన కనుక. దగ్గరగా ఉండే ఒకాయన " మీకు తేడా ఏమీ లేకపోవచ్చు కాని మీ దర్శనానికి వచ్చేవారికి ముఖ్యంగా స్త్రీలకి ఇబ్బందికరంగా ఉంటూంది " అని చెప్పడంతో అప్పటినుంచీ ఓ కౌపీనం ( గోచి ) పెట్టుకోవడం మొదలెట్టారుట. ఓ సారి దగ్గరగా మసిలే ఒకాయన " ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటే ఎలాగండి. కేదారినాధ్, బదరినాధ్, హరిద్వార్ అవీ వెళ్ళివస్తే అన్నీ చూసినట్లు ఉంటుంది " అంటే ఈయన " నాకూ వెళ్ళాలనే ఉంది, ఎక్కడైనా పంచభూతాలు ( భూమి నీరు గాలి నిప్పు ఆకాశం ) కాక 6వది కనిపిస్తే చెప్పు, వెళ్ళి చూసివస్తాను " అన్నారుట.  ఎప్పుడూ మౌనంగా ధ్య...

రామాయణం

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 రామాయణం చదవడంవల్ల ప్రయోజనమేమిటండీ అంటూంటారు కొందరు మేధావులు. రామాయణం పూర్తిగా చదువుతే దానిలో ఉన్న అద్భుతవిషయాలు తెలుస్తాయి.  అలాకాకుండా ఏవో కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ వ్రాసిన " రామాయణ విషవృక్షం " లాంటి పుస్తకాలు చదువుతే జాతి ఎదుగు బొదుగూ లేకుండా ఇలాగే ఉంటుంది. జీవితమన్నాక దుఃఖాలేకాదు, సుఖాలూ ఉంటాయి. ఇది మర్త్యలోకం. సుఖానికి దుఃఖస్పర్శ, దుఃఖానికి సుఖస్పర్శ ఉంటాయి ఇక్కడ. స్వర్గంలో దుఃఖస్పర్శ ఉండదు. అదే రెండు లోకాలకీ తేడా.  హనుమ సీతమ్మతో అంటారు " ఇలాంటిచోట ఇటువంటి మనుషులమధ్య ఎలా ఉండగలుగుతున్నావమ్మా " అని. సీతమ్మవారు హనుమతో అంటుంది " నూరేళ్ళబ్రతుకులో పోయేక్షణాన్నయినా ఆనందం కలిగించే వార్త వింటావు. అందుకే బ్రతుకును కొనసాగించాలి. నువ్వుంటేనే కదా ఆ క్షణాన్ని ఆస్వాదించగలవు " అని.  సీతమ్మ అంటారు " సుఖాలు చిన్నసెలయేరుల్లాగ, చిన్నకొండల్లాగ చిన్నవిగా అనిపిస్తే కష్టాలు సముద్రాలలాగ, ఆకాశంలాగ పెద్దవిగా కనిపిస్తాయి " అని. అంటే ఆత్మహత్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దంది సీతమ్మ. ఎటువంటి అద్భుతమయిన సందేశం. అందుకే అది ఇతిహాసం ( ఇ...

నాగభట రాజు

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అహింసా పరమో  ధర్మః ,    ధర్మ హింసా  తథైవచ " అహింసే అత్యుత్తమమయిన ధర్మం అయినా ధర్మాన్ని నిలపడంకోసం చేసే హింస కూడా అహింసే అని చెబుతున్నారు. ఇది వేదాల్లోనూ ఇతరాల్లోనూ లేకపోయినా పరమాత్మ స్వయంగా చెప్పారు కదా: " పరిత్రాణాయ సాధూనాం,     వినాశాయచ దుష్కృతాం " అని. సరిహద్దుల్లో సైనికులు చేసేది హింస అనరాదు. చరిత్రలో జరిగిన ఓ అద్భుత సంఘటన చూద్దాం. 733 వ సం.లోనే మహమ్మదీయులు దండయాత్రకు వచ్చి కనౌజ్ రాజ్యాన్ని ముట్టడించారు. చీకటి పడడంతో రాజ్యం బయట విశ్రాంతి తీసుకుంటున్నారు. తెల్లవారగానే రాజ్యం మీద పడదామని. వారి అభిప్రాయం ఏమిటంటే హిందూరాజులు ధర్మయుద్ధమే చేస్తారు, రాత్రి దాడిచెయ్యరు అని. ఎంత నమ్మకం.  అందుకని హాయిగా తిని నిద్రపోతున్నారు. కనౌజ్ రాజు నాగభట(1), సేనాని తక్షకుడు. శత్రువుల సైన్యం అధికంగానే ఉంది అని చారులు తెచ్చిన వార్త కలవరపాటును కలిగించింది. ఓటమి ఖాయం, ఏమి చెయ్యాలి. సేనాని తక్షకుడు రాత్రి ఒంటిగంటకు సైన్యంతో వెళ్ళి పడుకున్నవారి తలలు నరకడం మొదలెట్టారు. అలజడికి లేచి పారిపోతూన్న మిగతావారిని రాజు తరిమి తరిమి చంపేసారు.  ఆద...

అణుబాంబు1944

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 ఈరోజు 1944లో తయారుచేయబడిన " అణుబాంబు " సమయంలో జరిగిన కొన్ని వింతలు తెలుసుకుందాం. " తదేజతి తన్నైజతి తద్దూరే           తద్వంతికే,   తదంతరస్య సర్వస్యతదు           సర్వస్యాస్య బాహ్యతః " ఉపనిషద్ మంత్రం ఇది, శంకరుడిని స్తుతిస్తూ ( చిజ్జడక్రాంతి - చిత్ చైతన్యం + జడం చైతన్యంలేని - ని వర్ణిస్తూ, క్రాంతి అంటే ముడి ). దీని అర్ధం " కదులుతూ ఉంటుంది, కదలదు. దూరంగా ఉంటుంది, అదే దగ్గరగా ఉంటుంది. అన్నిటిలోపలా ఉంటుంది, అన్నిటి బయటా ఉంటుంది " అని. 1944 లో మన్హట్టన్ " అణుబాంబు " ప్రోజెక్టులో " ఓపెన్ హైమర్ " అనే అణుశాస్త్రవేత్త ఒక భాగస్వామి. ఈయనని " అణుబాంబు పిత " అంటారు. అణుబాంబును పరీక్షించినప్పుడు ఆయన తెలుసుకున్న " అణువు " లక్షణాలు పై మంత్రంలోలా ఉన్నాయని ఆశ్చర్యపోవడం జరిగింది. 1930లో అమెరికాలోని బర్కిలీలో ఉపాధ్యాయవృత్తిలో ఉన్నప్పుడు ఈ హైమర్ ఆసక్తివల్ల సంస్కృతం నేర్చుకుని భగవద్గీతని పూర్తిగా చదివారు.  1944లో ఎడారిలో అణుబాంబు పరీక్ష జరిగినప్పుడు హైమర్ ని " మీ అభిప్రాయం చెప్పండి " అన్నప్పుడ...

వ్యాసర్షి 2

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 నేడు అక్షరతృతీయ.  ఈరోజే వ్యాసమహర్షి అద్భుతమయిన ఇతిహాసం " మహాభారతం " రచన ప్రారంభించారు అని చెబుతారు.. బ్రహ్మగారిని " భారతం నేను చెబుతూంటే వ్రాయడానికి ఎవరైతే బావుంటుందో చెప్పండి " అని అడుగుతే గణపతిని ప్రార్ధించమంటారు.  గణపతి ఒప్పుకుని ఒక్కక్షణమయినా నేను ఖాళీగా ఉండకుండేటట్లుగా చెప్పగలిగితే తప్పకుండా వ్రాస్తాను అన్నారు. అలాగే అన్నారు వ్యాసర్షి. మహాభారతం అసలు పేరు " జయ సంహిత ". 100700 శ్లోకాలు, ఎన్నో సంవాదాలు, నీతికధలు, చిత్రవిచిత్ర సంఘటనలు చెబుతూంటే గణపతి వ్రాస్తున్నారు. కాని గణపతి వ్రాసే వేగానికి ఈయన చెప్పే వేగం సరిపోవట్లేదు. అందుకని అప్పుడప్పుడు " చ, తు " లు వాడడం మొదలెట్టారు వ్యాసర్షి. ఇక్కడ ఈ " చ కాని, తు కాని " ఎందుకు చెప్పారు అని గణపతి ఆలోచనలో పడేవారుట. ఆ విరామం సరిపోయేది వ్యాసర్షికి. ఛందస్సుకోసం అక్షరం తక్కువయితే అర్ధం మారకుండా ఉండడానికి " చ, తు " వాడుతారు సాధారణంగా. చ అంటే మరియు, తు అంటే కాని. ఉదా: " రాముడు కృష్ణుడు వస్తున్నారు " ని " రాముడు మరియు కృష్ణుడు వస్తున్నారు ...

సత్యం అసత్యం

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " సత్యం- అసత్యం " ఆదిశంకరులు " బ్రహ్మసూత్రాలకు " భాష్యం వ్రాసారు. " బ్రహ్మ సత్యం, జగత్ మిధ్య " అన్నారు శంకరులు. కాని అందరూ ఈ కనిపించేదంతా సత్యం అనుకుంటున్నారు. భాష్యకారులు సమావేశమయారు. సత్యాన్వేషణ సులభమా, అసత్యాన్వేషణ సులభమా, వాదనలు బాగానే జరిగాయి. చివరికి అసత్యాన్ని గుర్తించడం సులభం, దానితో సత్యం ఏమిటో తెలుస్తుంది అని తేల్చబడింది. చీకటి అంటే ఏమిటి, వెలుతురు లేకపోవడం. చల్లదనం అంటే ఏమిటి, వేడి లేకపోవడం. సత్యం అంటే అసత్యం కానిది అని అనుకోవాలి. అమ్మవారి ఒకనామం " పరమాణుః " - అంటే అణువుకన్నా పరము/భిన్నము అయినది. అణువు అంటే చిన్నది/సూక్ష్మమయినది. పరమాణువు అంటే అతిచిన్నది అని. మరి ఎంత చిన్నది అంటే ఋషులకు కూడా కష్టమే చెప్పడం. అందుకని నేతి ( న+ఇతి - ఇది కాదు ), నేతి అనుకుంటూ వెడితే అసలు విషయం తెలుస్తుంది. ఇది అసత్యం, ఇది అసత్యం అనుకుంటూ వెడితే సత్యం బయటపడవచ్చు. బియ్యంలో రాళ్ళు ఏరేసినట్లుగా. మొదట పదార్ధమూలం ( ధాతువు ) చిన్నదనుకున్నారు. తరువాత ప్రోటాన్స్ అవీ చిన్నవనుకున్నారు. మొన్న హిగ్స్ బోసన్ ని కనిపెట్టి ఇదే చిన్నదని...

శివానందలహరి

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 " సదా మోహాటవ్యాం చరతి                 యువతీనాం కుచగిరౌ,    నట త్యాశాశాఖా స్వటతి ఝడితి                స్వైర మఖికః,   కపాలిన్ భిక్షో మే హృదయకపి               మత్యంత చపలం ,    ధృఢం భక్త్వా బద్ధ్వా శివ               భవదధీనం కురు విభో "  ఆదిశంకరులు " శివానందలహరి " చేస్తూ అంటారు " ఓ ఈశ్వరా - నా హృదయం ( మనస్సు ) మోహం అనే అడవిలో తిరుగుతూంది. నా మాట వినడం లేదు. అతి చపలమైన నా మనస్సనే కోతిని దయచేసి నా భక్తి ( అనే తాడు ) తో కట్టి నీ దగ్గర ఉంచుకో స్వామీ " అని. ఎంత అద్భుత పరిశీలన. సామాన్యమానవులు ఎంతటి మానసిక దౌర్బల్యంతో బాధపడుతూంటారో ఎంత చక్కగా తెలియచేసారు.  " చంచలం హి మనః కృష్ణ ప్రమాధి                  బలవద్దృఢం,    తస్యాహం నిగ్రహం మన్యే                  వాయోరి సుదుష్కరం...

మతం సమ్మతం

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " మతం - సమ్మతం " " ఇతితేజ్ఞానమాఖ్యాతం    గుహ్యతే గుహ్యతరం మయా ,    విమృశ్యైతదశేషేణ    యధేచ్ఛసి తధాకురు "                          - భ.గీత 18:63. పరమాత్మ " నేనునీకు చెప్పవలసిన రహస్యజ్ఞానమంతా చెప్పాను. ఏదో నేను చెప్పానని కాకుండా దీన్ని సమగ్రంగా నీ బుద్ధితో విమర్శచేసుకుని నీకు తోచిన/నచ్చిన విధంగా ఆచరించు " అన్నారు అర్జునుడితో. " మతం " అంటే అర్ధం అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వారివి. ఆశ్చర్యకరంగా ఒకరికే ఇప్పుడున్న అభిప్రాయం మరుక్షణంలో మారిపోవనూ వచ్చు.  పరమాత్మ గీతలో ( 6:32 ) " అన్నిజీవులను సమభావంతో చూస్తూ సుఖదుఃఖాలను ఒకేవిధంగా స్వీకరించేవాడే పరమశ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయం " అన్నారు. ఎంత అద్భుతం. స్వామియే " ఇదే సత్యం అనలేదు, నా అభిప్రాయం మాత్రమే " అన్నారు. గీతలో పలుచోట్ల " విద్వాంసులు, సాంఖ్యులు ఇలా అభిప్రాయపడ్డారు " అని నొక్కి చెప్పారు. నపుంసకత్వం, హృదయదౌర్బల్యం వదిలేయి అన్నారు, రాజుగా యుద్ధం చెయ్యడం నీ ధర్మం అన్నారు, అలా చెయ్యకపోతే నిన్ను అపహాస్యం చేస్తార...

హనుమ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " అంజనా నందనం వీరం జానకి                         శోకనాశనం,    కపీశమక్షహంతారం వందే లంకా                          భయంకరం ". " యత్రయత్ర రఘునాధకీర్తనం    తత్రతత్ర కృతమస్తకాంజలిం,    భాష్పవారి పరిపూర్ణలోచనం    మారుతిం నమత రాక్షసాంతకం "  మొదటి శ్లోకం లో సీత శోకాన్ని పోగొట్టిన అరివీరభయంకరుడు. రెండవ శ్లోకంలో తలవంచుకుని చేతులు కట్టుకుని కళ్ళనిండుగా నీళ్ళతో నుంచుని ఉన్న హనుమ. ఎక్కడ రామకీర్తన జరుగుతూన్నా హనుమ అక్కడ అలా నుంచుని ఉంటాడు. ఎంత తేడా. భక్తికి పరాకాష్ఠ. అందుకే " భక్తానాం అగ్రగణ్యం " అని కీర్తింపబడ్డాడు. లంకకు నిప్పుపెట్టేసాక హనుమ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటాడు. అయ్యో ఎంతపని చేసాను, కోపం ఎంత చెడ్డది, మనిషి విచక్షణజ్ఞానాన్ని నశింపచేస్తుంది కదా, రావణుడిమీద కోపంతో అలా అంటించేయడమేమిటి, ఇప్పుడు సీతమ్మ పరిస్థితి ఏమిటి. ఆమె కూడా అగ్నికి ఆహుతి అవుతే రామలక్ష్మణులు సుగ్రీవుడు వానరవీరుల పరిస్థ...

వృక్షోరక్షతి

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏 వృక్షో రక్షతి రక్షితః అమ్మవారి " సృష్టి " ఎంతలయబద్దంగా ఉంటుందో 10 రకాల పుష్పాలను పరికిస్తే చాలు తెలుసుకోవచ్చు. మనస్సు ప్రశాంతతను పొందుతుంది. వాటి రంగు, సువాసన, రేకలకూర్పు ( కొన్నింటిలో మకరందం ) - దేనికదే సాటి - ఎంత అద్భుతవిషయం.  శ్రీకృష్ణుడి కాలం కనీసం 5000 ల సంవత్సరాల క్రితం అని అందరూ ఒప్పుకున్నారు ( మనం ద్వాపరయుగం వారు అంటాం ). ఇప్పుడు తరచు వార్తలు చూస్తూ ఉంటాం - దారికి అడ్డుగానో ప్రయాణానికి అసౌకర్యంగానో ఉన్న పెద్దచెట్టును జాగ్రత్తగా తీసుకెళ్ళి వేరే చోట ప్రాతడం జరిగింది అని. అటువంటి వార్తలు చదివినా విన్నా కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది.  కనీసం 5000 ఏళ్ళ క్రితం శ్రీకృష్ణుడు సత్యభామకోసం ఇంద్రలోకం నుంచి " పారిజాత " వృక్షాన్ని పెకిలించి తీసుకుని వచ్చి సత్యభామ ఇంటిపెరట్లో ప్రాతించారు అని పురాణాలు చెబుతున్నాయి.  అంటే అటువంటి ప్రక్రియ సాధ్యమే అని మన ఋషులు వేలఏళ్ళక్రితమే గ్రహించారని తెలుసుకోవాలి. మా ఇంటిపెరట్లో నా చిన్నప్పుడు అవిశిచెట్టు ఉండేది. కాయలు పువ్వులు కూడా కూరచేసుకునేవారం. ఆశ్చర్యకరంగా అది కొబ్బరిచెట్టులా నిటారుగా పెద్దగా అయిపోయ...

భగీత 10.25

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏   " యజ్ఞానాం జపయజ్ఞోస్మి " - ( భ.గీత 10:25 )        అన్నారు  పరమాత్మ భ.గీతలో. ఏదయినా మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. కాని ముక్తినిచ్చే తారక మంత్రం ఒకటే. అది రామనామం.రామనామం ఎందుకు అంత పవిత్రమయినది/ఉత్కృష్టమయినది/శక్తివంతమయినది అయింది. రామ లో " ర+అ+మ " - 3 అక్షరాలు ఉన్నాయి. ర అగ్నిబీజం, అ సూర్యబీజం, మ చంద్రబీజం.  మనసా(మ) వాచా(ర) కర్మణా(అ) అంటారు - రామ నామంలో ఈ మూడూ ఉన్నాయి. విష్ణుసహస్రంలో " రామః విరామః " అని నామాలు చదువుతాం. ఆదిశంకరులు రామః కి " నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు " అని భాష్యం చెప్పారు. వేదం ఇలా చెబుతూంది: " రకారో అగ్నిబీజంశ్చాత్, అకారో సూర్యబీజకం,         మకారాశ్చంద్రబీజంచ " అని. కుండలినీయోగాలో కూడా చక్రాలను 3 మండలాలుగా విభజించారు. మూలాధారం నుంచి అనాహతచక్రం వరకూ అగ్నిమండలం అని, అక్కడనుంచి ఆజ్ఞాచక్రం వరకూ సూర్యమండలం అని, ఆపైనదానిని చంద్రమండలం అనీ తెలియచేసారు. రామ అని జపిస్తే ఈ 3 మండలాలూ జాగృతి/చైతన్యం చెందుతాయి. అందుకే రామనామం అంత శక్తివంతమయింది. వాక్కుని శరీరాన్ని మనస్సుని చైతన...

భగీత 18.37

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " యత్తదగ్రే విషమివ           పరిణామే2మృతోపమం,    తత్సుఖం సాత్వికం ప్రోక్తం           ఆత్మబుద్ధిప్రసాదజం "                   - భ.గీత 18.37. " ప్రారంభమునందు విషతుల్యముగా అనిపించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమై భగవంతునికి సంబంధించిన విషయములలో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్వికసుఖము అందురు " అని పరమాత్మ తెలియచేసారు. ఓ పిల్లవాడిని చదువుకోమంటారు తల్లిదండ్రులు, గురువులు. కాని సినీమాలు, సెల్ ఫోనులు, చెడుస్నేహాలు మొదలైనవి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవిగాను చదువు విషం, గుదిబండగానూ అనిపిస్తుంది. చదువుమీద శ్రద్ధపెడితే జీవితమంతా ఆనందమయంగా ఉంటుంది. అలాకాక మిగతా విషయాలవైపే మ్రొగ్గితే ఇప్పుడు సంతోషంగా అనిపించినా జీవితమంతా బాధపడవలసి వస్తుంది. రామకృష్ణపరమహంస అమ్మవారి ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నారు ఓరోజు. ఒకాయన వచ్చి గట్టిగా అరుస్తున్నాడు అమ్మవారి ముందు నుంచుని. విషయమేమిటంటే ఆముందరరోజు ఆలయంలో దొంగతనం జరిగింది, అమ్మవారి నగలన్నీ పోయాయి. ఆనగలని సమర్పించినది ఈ అరిచే ఆ...

భగీత 3.5

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " నహి కశ్చిత్ క్షణమపి    జాతు తిష్ఠతి అకర్మకృత్,   కార్యతే హి అవశః కర్మ    సర్వః ప్రకృతిజైః గుణైః "                       - భ.గీత 3:5  " జీవుడు కర్మ చెయ్యకుండా క్షణం కూడా ఉండలేడు. అది ప్రకృతిపరంగా వచ్చిన గుణాలు ( సత్వ తమో రజోగుణాలు ) కారణంగా " అని పరమాత్మ సెలవిచ్చారు గీతలో. " న హి దేహభృతా శక్యం   త్యక్తుం కర్మాణ్యశేషతః,    యస్తు కర్మఫలత్యాగీ స     త్యాగీత్యభిధీయతే "                   - భ.గీత 18:11 శరీరధారి కర్మలు చెయ్యకుండా ఉండడం అశక్యం ( త్రిగుణాల కారణంగా ). కనుక కర్మలనుగాక కర్మఫలాలను విడిచిపెట్టినవాడే నిజమైన త్యాగి అని స్వామి తెలియచేసారు.  అందుకే ఆయన అన్నది " కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన " అని అంటే " కర్మ చేసేయ్, ఫలితం గురించి ఆలోచించకు " అని. ఎందుకు ఆలోచించకు అన్నారంటే తను అనుకున్న ఫలితం రాకపోతే బాధపడవలసి వస్తుందని. ఏ కర్మకైనా ఫలితం ఉండి తీరుతుంది కాని ఆ ఫలితం తను ఆశించినట...

నమ్మకం దేముడు

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 దేవుడు ఉన్నాడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటూ కొందరు మేధావులు తెగ ఆలోచన చేస్తూంటారు. యజ్ఞం అంటే నమ్మకంతో చేసే కర్మ. సత్కర్మలు అసత్కర్మలు అని రెండురకాలు. అసత్కర్మలు అంటే  అపనమ్మకంతో చేసేపనులు. దొంగతనం హత్యలు లాంటివి కావు.  మా మేనత్తగారు దృష్టి ( దిష్టి ) మంత్రం వేసేవారు. వీభూతి మంత్రించి ఇచ్చేవారు. ఓ గ్రహణసమయంలో నేను మాగ్రామంలో ఉండడంతో ఆవిడ " రేపు గ్రహణసమయంలో స్నానం చేసి రా, మంత్రోపదేశం చేస్తాను " అన్నారు. వెళ్ళాను. మొదట ఆవిడ అన్నది " మంత్రం వినగానే ' ఇదేమిటి, ఇదామంత్రం ' అనే ఆలోచన రానీయకు " అని. నమ్మకం ముఖ్యం, ఆరోజు మొదలుకుని గత 40 ఏళ్ళుగా రోజూ కనీసం 11 సార్లు దానిని మననం చేస్తాను. నేను పదో పదకొండో చదువుతూన్నప్పుడు తీవ్రమైన కరువు. 15,16 నెలలుగా వర్షాలు లేవు. నిండుగా ఉండే మా చెరువు కూడా 5,6 పాంచాలు క్రిందకు వెళ్ళిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ప్రక్కగ్రామాల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది ఏదో ఒక కార్యక్రమం తలపెట్టండి మహాశయా అని. శివుడికి సహస్రఘటాభిషేకం చెయ్యడానికి నిర్ణయం జరిగింది. చెరువు నుంచి గుడికి 2 ఫర్లాంగులు ఉం...

భగీత 18.63

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఇతితే జ్ఞానమాఖ్యాతం     గుహ్యాత్ గుహ్యతరం                  ‌   మయా,   విమృశ్యైతదశేషేణ    యధేచ్ఛసి తధాకురు "                 - భ.గీత 18:63 పరమాత్మ అర్జునుడితో అంటారు " నీకు రహస్యజ్ఞానమంతా చెప్పేసాను. నీ బుద్ధితోకూడా ఆలోచించుకుని నీకు ఇష్టమైన రీతిగా ఆచరించు " అని. " వినదగు నెవ్వరు చెప్పిన " అన్నారు సుమతీశతకాచార్యుడు. విన్నదానిలో మంచిని పాటించడమన్నది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.  మేము అమెరికా వెళ్ళినప్పుడు బాగా మంచుపడుతూంది. 3,4 వారాల తరువాత ఎండపొడ వచ్చింది. ఓ అరగంట బయటనడిచి వస్తాను అంటే మాకోడలు మీకు కొన్ని విషయాలు చెప్పాలి, కూర్చోండి అంది.  1. నడక మన కాలనీలోనే చెయ్యండి. ప్రక్క కాలనీలకు వెళ్లవద్దు. కాలనీలో కొత్తవారు కనిపిస్తే ఇక్కడ పొలీసులకు తెలియచేస్తారు వెంటనే. భయపడవలసినది ఏమీ లేకపోయినా జాగ్రత్తగా ఉండడం మంచిది. 2. మనం నడుస్తూన్నప్పుడు ఎవరయినా ఎదురుపడి అరనవ్వు నవ్వితే మనంకూడా అరనవ్వే నవ్వాలి. హాయ్ అంటే హాయ్ అని మాత్...

భగీత 6.35

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 " అసంశయం మహాబాహో మనో                      దుర్నిగ్రహం చలం,    అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ                             చ గృహ్యతే "                               - భ.గీత 6:35 అర్జునుడు అంటాడు " మనస్సును నిగ్రహించడం అంత సులువుకాదు కదా " అని. అప్పుడు పరమాత్మ అంటారు " కష్టమే కాని అభ్యాసంతోనూ మరియు వైరాగ్యంతోనూ నిగ్రహించుకోవడం సులభమే " అని. ఇక్కడ స్వామి " వైరాగ్యేణ చ " అన్నారు. చ అంటే మరియు అంటే వైరాగ్యం కూడా అవసరం అన్నారు. ఒక స్వామిని " ధైర్యం " అంటే ఏమిటి అని అడిగితే " వైరాగ్యం " అన్నారు.  ధైర్యం అనేది మానసికం. అది వ్యాయామాలు కసరత్తులు చేస్తే వచ్చేదికాదు. వైరాగ్యం వల్లే వస్తుంది. ఏది జరిగినా మనమంచికే అనుకుంటూ అన్నీ పరమాత్మ ప్రసాదాలే/అనుగ్రహాలే అనుకుంటే అంతా సచ్చిదానందమే. మొన్న గరికిపాటివారు పూజ్యులు శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి ని...

భగీత 1.41

 🙏 " శ్రీరస్తు శుభమస్తు "🙏 " అధర్మాభిభవాత్ కృష్ణ,    ప్రదూష్యంతి కులస్త్రియః,    స్త్రీషు దుష్టాసు వార్షేయ,    జాయతే వర్ణసంకరః " - భ.గీత 1:41 అంటే " అధర్మం పాపం పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు ఎక్కువ దూషితలగుదురు. అప్పుడు వర్ణసంకరము ఏర్పడును " అని. ఇక్కడ కులస్త్రీలు అంటే సత్యం ధర్మం నిష్ఠ గలవారు.  సంప్రదాయకుటుంబాలలో పుట్టినా కొందరు స్త్రీలు లవ్ జిహాద్, పరకులవివాహాలు వంటి వాటికి గురవుతున్నారంటే నేరం వారిది కాదు, సమాజంలో పెరిగిపోయిన " అధర్మం పాపం " లది.  5000ల సంవత్సరాల క్రితమే ఈవిషయాన్ని ఎంత స్ఫష్టంగా తెలియచేసారు. మన సనాతనధర్మం గొప్పదనం అది. శుభం భూయాత్

భ.గీత 16.21

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 " త్రివిధం నరకస్యేదం    ద్వారం నాశనాత్మనః,   కామక్రోధః తధా లోభః    తస్మాత్ యేతత్ త్రయం త్యజేత్ "                          ( భ.గీత 16:21 ) " కామక్రోధలోభాలు నరకద్వారాలు - కనుక వాటిని వదిలేయాలి " అని తెలియచేసారు పరమాత్మ గీతలో. అసలు నరకం అంటే ఏమిటి. ఎప్పుడయినా ప్రయాణంలో తుఫాన్ లో చిక్కుకుంటే " అమ్మో నరకం చూసాం/కనబడింది " అంటారు. అంటే అధికకష్టాలు అనుకోవాలి. ఏ చెడుపని చేసారో పాపాన్ని అనుభవిస్తున్నారు అంటూంటారు. అంటే పాపం, కష్టాలు ఒకటే అనుకోవాలి. వ్యాసమహర్షి మహాభారతంలో అసలు పాపాలకి ( కష్టాలకి ) మూలం ఏమిటి అన్నది అద్భుతంగా తెలియచేసారు: " పాపశ్చతు యదధిస్టానం    తత్ శృణుష్వ నరాధిపా,    ఏకో లోభో మహాగ్రాహో    లోభాత్ పాపం ప్రవర్తతే ". అంటే పాపాలన్నిటికీ మూలం " లోభం " అని. లోభం అంటే కావాలనుకోవడం. అది అక్కడితో ఆగదు - తనకే కావాలనుకోవడం, ఇంకెవరికీ ఉండకూడదనుకోవడం, అసూయ, కోపం, హింస అన్నీ ఒకటి తరువాత ఒకటి కలుస్తూంటాయి. అంటే పాపభవంతులకి పునాది "లోభం". మరి...

దానం దయ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 దానం - దయ అంటే ఏమిటి? అన్నంలేనివారికి అన్నం, నీరులేనివారికి నీరు, వస్త్రం లేనివారికి వస్త్రం ఇవ్వడాన్ని దయ అంటారు. దానం అంటే సంకల్పం చేసుకుని గ్రహదోషానికో మరొకపాపపరిహారానికో చేసేది. తెలియకుండా అందరూ కొన్ని పాపాలు చేస్తూంటారు. వాటి పరిహారంకోసమే వీటిని చెయ్యమన్నారు. అంతేకాని 4 హత్యలు చేసి 200 మందికి అన్నం/వస్త్రం దానం చేస్తానంటే కుదరదు. పాపఫలం పుణ్యఫలం వేరువేరుగా అనుభవించవలసి వస్తుంది. అంతేకాని బేలన్స్ షీట్ లో లాగ " నెట్ " ఫలం ఉండదు. దానం చేసేవారూ తీసుకునేవారూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దానం తీసుకునే ఆయన యోగ్యుడయి ఉండాలి. దానం తీసుకుంటే దోషాలు వస్తాయి. దాని విరుగుడుగా జపమో తపస్సో లేక వేరొక పరిహారమో చేసుకోవాలి. ఒకాయనకి కిడ్నీకాని కన్నుకాని కావాలి. ఎలా వస్తుంది. ఇంకొకతను పోగొట్టుకుంటే వస్తుంది. ఇతని పాపం పోవాలంటే ఇంకొకతను ఆ పాపాన్ని మొయ్యాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. " హిరణ్యం భూమిమశ్వం గామన్నం వాసస్తిలాన్    ఘృతం ప్రతిగృహ్ణన్ అవిద్వాంసు భక్తీవంతి   దారువత్ " -  అన్నాయి శాస్త్రాలు. అందుకే " అపాత్రదానం " కుదరదన్నారు. ...

సౌభాగ్యభాస్కరం

 🙏"శ్రీమాత్రేనమః"🙏 శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం వ్రాసిన భాస్కరరాయలవారు దానికి " సౌభాగ్యభాస్కరం " అని పేరుపెట్టారు. అమ్మవారికి అష్టోత్తరం చేసినప్పుడు " సౌభాగ్యదాయైనమః " అని ప్రార్ధిస్తాం. ఎంత చక్కటి పేరు. ఈయన మరాఠారాజ్యంలో నివశించేవారు. రాజుకు పిల్లల్లేరు. ఈయనవద్దకు వచ్చి విషయం చెప్పి బాధపడ్డారు. ఈయన అమ్మవారి నామం ఒకటి చెప్పి శ్రద్ధగా పారాయణ చెయ్యండి అన్నారు రాజుని రాణిని. వారుకూడా భక్తులు, శ్రద్ధగా పారాయణ చెయ్యడం మొదలుపెట్టారు. రాణి గర్భవతి అయింది. రాజు మహదానందంతో భాస్కరరాయల వారిని కలిసి విషయం చెప్పారు. ఈయన " శుభం, చక్కటి కొడుకు పుడతాడు " అన్నారు. రాజు తిరిగి వెడుతూంటే రాయలవారి శిష్యుడు కనిపించాడు. మానవనైజం కదా, రెండో అభిప్రాయం మంచిదనుకున్నాడేమో, రాజు శిష్యుడికి కూడా విషయం చెప్పి " కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా " అని అడుగుతే శిష్యుడు " కూతురు " పుడుతుంది, వెళ్ళిరా అన్నాడు. రాయలవారి శిష్యులంటే వారుకూడా ఎంతటి మహాపండితులయి ఉంటారు. సరే రాణికి " నపుంసకుడు " పుట్టాడు. రాజు ఏడుస్తూ వచ్చి పెద్దాయన కాళ్ళమీద పడి విషయం చెప్...

కామాక్షీదయ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 నేను 1980లలో మద్రాస్ లో ఉన్నప్పుడు మాంబళంలో ఓ ఇంట్లో మకాం ఉండేవారం. గేటు తీయగానే ఎదురుకుండా ఉండే పోర్షన్లో మేము, పై పోర్షన్లో ఓ ఉత్తరదేశీయకుటుంబం, క్రింద వెనుక పోర్షన్లో యజమాని కుటుంబం మకాం. గేటులోంచి లోపలికి రాగానే కుడిపైపుకి తిరిగి 15 అడుగులు వేసి ఎడమవైపుకి తిరిగి వెనక్కువెడితే యజమానుల పోర్షన్. యజమాని పూర్వీకులది మచిలీపట్నం. తెలుగు తమిళ్ యాసతో బాగానే మాట్లాడేవారు. వెనుక పోర్షన్లో ఎందుకంటే దానికి ప్రక్కనే వారి ఖాళీ స్థలంలో హాస్పిటల్ కడుతున్నారు. ఆయన భార్య డాక్టర్, ఈయన ప్రభుత్వ సివిల్ ఇంజనీర్. ఈయనకు దైవభక్తి ఎక్కువే. ఇంటిపైన పెద్దపాకవేసి " ఓంశక్తి " పీఠం పెట్టించారు. పూజలు అవీ అవుతూ ఉండేవి. మా పోర్షన్ ప్రక్కనే వారి ఆవును కట్టి ఉంచేవారు. రోజూ లేవగానే మాకు గోదర్శనం. బావుండేది. హాస్పిటల్ రెడీ అయింది. వారు దాని ప్రారంభోత్సవానికి కంచిపీఠాధిపతి పరమాచార్యులని ఆహ్వానించారు. పెద్దాయన రాలేనని జయేంద్రసరస్వతిని పంపిస్తానన్నారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. స్వామివారు సాయంత్రం 6 కి వస్తానన్నారు. ఎలాగూ సాయంత్రంకదా అని నా శ్రీమతి ఆవుపేడతో కళ్ళాపి చల్ల...

భ.గీత 2.66A

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 " అశాంతస్య కుతః సుఖం " - " శాంతిలేనివారికి సుఖం ఎక్కడిది " - అన్నారు స్వామి భ.గీతలో (2:66). మరి శాంతి ఎక్కడనుంచి వస్తుంది. సంకల్పాలు మంచివైతే అదే వస్తుంది.  " తన్మే మనః శివసంకల్పమస్తు " - " మా మనస్సులో ఎప్పుడూ మంచి సంకల్పాలే కలిగించు స్వామీ " అని భగవంతుడిని వేడుకో మంది వేదం. ఎప్పుడూ మంచి సంకల్పాలు/పనులు చేస్తూంటే సత్ + చిత్+ ఆనందమే. అన్నీ మంచిరోజులేగా. సర్వేజనాః సుఖినోభవంతు. సమస్త సన్మంగళాని సంతు - సూర్య.  శుభం భూయాత్

త్రయి త్రింశతి

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 హిందువులకు ఇంతమంది దేవుళ్ళేమిటండి, 33 కోట్లదేవతలా అని ఆశ్చర్యపోతూంటారు చాలామంది. " త్రయి త్రింశతి " అంటే 33 విధాలయిన/వర్గాలయిన దేవతలు. కోటి అనేపదానికి సంస్కృతంలో అర్ధం వర్గము/విధము. ఈ 33 వర్గాలు ఏమిటంటే - 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 ( అష్ట ) వసువులు , ఇంద్రుడు, ప్రజాపతి - మొత్తం 33 వర్గాలు. 12 ఆదిత్యులు - ద్వాదశాదిత్యులు. ఒక్కో నెలకు ఒక ఆదిత్యుడు ఉంటారు. వీరు ధాత ( చైత్రం మొదలు ), అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, త్వష్ట, విష్ణువు, భగుడు, పూషుడు, క్రతువు.  భగవద్గీతలో పరమాత్మ " ఆదిత్యానాం అహం విష్ణుః ( 10:21 ) " అన్నారు. 11 మంది రుద్రులు ( శివతత్వరత్నాకరం ప్రకారం ) - శివుడు, మహేశ్వరుడు, శంభుడు, శ్రీకంఠుడు, భవుడు, ఈశ్వరుడు, మహాదేవుడు, పశుపతి, నీలకంఠుడు, వృషధ్వజుడు, పరమేశుడు. అష్టవసువులు - ఆపుడు ( వరుణుడు ), ధృవుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. ఇంద్ర ప్రజాపతి మొత్తం 33 వర్గాలు. " రాముడితో కపివరుండు ఇట్లనియే " అన్న వాక్యం ముద్రణాదోషంతో " రాముడి తోక పివరు.......

దేవుడున్నాడా

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 దేముడు ఉన్నాడా అనేది మానవుడికి ఎప్పుడూ సందేహమే. పూజ్యులు గరికిపాటివారు ఆదిత్యహృదయం మీద ప్రవచనం చేస్తూ " హిరణ్యగర్భః " అనే నామాన్ని వివరించారు. ఆనామానికి అర్ధం తేజస్సుని తనలో కలిగినవాడు అని అని. మరి బ్రహ్మగారిని కూడా హిరణ్యగర్భః అని కొలుస్తారుగా.  సృష్టి జరగడానికి, నిలవడానికి, అంతమవడానికి తేజస్సు అవసరం. ఆఖరికి సూర్యుడి పుట్టకకు కూడా ఆ తేజస్సే కారణం. ఆ తేజస్సే వేదాలలో చెప్పబడిన " తత్వమసి " - " అది నువ్వే ( నువ్వుగా ఉన్నావు ) " అన్నది.  ఆ తేజస్సునే ఈశ్వరుడు, విష్ణువు, సూర్యుడు, ప్రవక్త, యేసు, గురువు అని వేరు వేరు పేర్లతో కొలుచుకుంటున్నారు. పేరు ఏదయినా మూలం తేజస్సే. అదే మన సనాతనధర్మం తెలియచేస్తున్నది. వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ తేజస్సు గురించిన ఆరాధనే ఉంది. ఫలానా రూపంలో ఉన్న దేముడి గురించి కాదు. ఉ.దా చూద్దాం. రాత్రి కలగంటున్నాం. కలలోకి అమ్మాయి, ప్రక్కింటావిడ, పాము, ఎద్దు అలా రకరకాల జీవులు వస్తున్నాయి. నిజంగా వారు వస్తున్నారా?. మరునాడు నాకలలోకి ఎందుకు వచ్చి అలా చేసావు అని ఎవరినయనా అడగగలమా?. లేదు, ఎందుకంటే కలలో కనబడినవన్నీ ...

మూకశంకరులు

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 మూకశంకరులు కామాక్షీ అమ్మవారిమీద పంచశతి చేసారు. పాదారవిందశతకంలో ఇలా ప్రార్ధించారు: " దధానో భాస్వత్తామృతనిలయో                 లోహితవపుః,   వినమ్రాణాం సౌమ్యో గురురపి                 కవిత్వంచ కలయన్!   గతౌ మందో గంగాధరమహిషి                 కామాక్షి భజతాం,   తమః కేతుర్మాతస్తవ చరణపద్మో                 విజయతే !!" అమ్మా, శివుని ఇల్లాలా, కామాక్షీ, నీ పాదకమలము ప్రకాశకత్వమును ధరించునది, మోక్షమును ఇచ్చునది, ఎర్రని ఆకృతి కలది, శాంతమైనది, గురువైనది, కవిత్వము నొనర్చునది, నడకయందు మాంద్యము కలది, తమస్సును బోగొట్టునది. ఈపద్యంలో ఓ అద్భుతం దాగి ఉంది.  1. భాస్వన్ అంటే ప్రకాశమనేకాక సూర్యుడు అని ఇంకొక అర్ధం ఉంది. భాస్వత్త అంటే అమ్మవారి చరణమునందు సూర్యత్వమున్నది అని భావం. 2. అమృతనిలయం - అమృతమంటే దేవతల ఆహారం. చంద్రుడు దేవతలకు అమృతనిలయమైన భోజనపాత్ర అనవచ్చును. అమ్మవారి పాదంలో చంద్రుడున...

సుబ్రహ్మణ్యషష్టి

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 ఈరోజు పరమపవిత్రమయిన శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి. స్వామి జ్ఞానప్రదాత. తండ్రికే ప్రణవం గురించి బోధనచేసిన గురుగుహ. ముత్తుస్వామి దీక్షితార్ ని తిరుత్తణిలో అనుగ్రహించారు స్వామి. అప్పటినుంచీ ఆయన కీర్తనలలో " గురుగుహ " అనే పదం ఉంటూవచ్చింది. చిన్నప్పుడు ఈరోజు వస్తూందంటే 15 రోజుల ముందరనుంచీ సందడే. పెద్ద తీర్థం జరిగేది అందుకని. తెల్లవారకట్ట 4 గం.లకే మాగ్రామానికి 1.5 కి.మీల దూరంలో ఉన్న కౌశికకి స్నానానికి నడిచి వెళ్ళేవారం. సైకిల్ ష్టాండ్ కి.మీ దూరంలో ఉండేది, పైగా 10 పైసల టికట్. అందుకని నడిచే పోయేవారం. అక్కడ సుబ్రహ్మణ్యుడిగుడి, శివాలయం ఉండేవి. స్నానం చేసి వచ్చేసేవారం. దర్శనానికి మధ్యాహ్నం భోజనం అయాక వెళ్ళేవారం. ఎందుకంటే తీర్థం అప్పుడే మొదలయేది. తీర్థంలో రంగులరాట్నం, చక్రం ఆట, పీచుమిఠాయి, జీళ్ళు అన్నీ ఉండేవి. 2 గం.కు వెడితే మళ్ళీ రాత్రి 7 గం.లకే రావడం ( తిట్లు తినడం ). ఎంత హాయిగా ఆనందంగా ఉండేదో. మధురస్మృతులు. స్వామిని అందరికీ ఆనందాన్ని ప్రసాదించమని కోరుకుంటూ - సూర్య.  అందరికీ శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి శుభాకాంక్షలు. శుభం భూయాత్

వైదికవిజ్ఞానం

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 వైదికవిజ్ఞానం, మహాభారతం, రామాయణం మొ.గునవి మహాసముద్రాలు. శ్రద్ధగా లోపలికి వెళ్ళేకొలదీ ముత్యాలు అపురూపమైన శంఖాలు లాంటి విలువైనవి దొరుకుతాయి. ఒడ్డున కూర్చుని చూస్తూంటే ఏమి ఒరుగుతుంది, గుల్లలు ఏరుకోవడం జరుగుతుంది తప్ప. మన సంస్కృతి/విజ్ఞానం గురించి మాట్లాడడం ఒడ్డునకూర్చుని సంపాదించే " మిడిమిడిజ్ఞానం " తోనే.  జీవితాంతం కష్టపడితే ఒక వేదంలో నాలుగవ వంతు అర్ధంచేసుకోగలరు. సామవేదం వంటివారే " నాకు తెలిసినంతవరకూ " అని చెబుతారు. అమెరికా పండితుడు " మీనార్డ్ " మన దేశానికి వచ్చినప్పుడు అమెరికా గ్రంధాలయాల్లో 6700 సంస్కృతలిఖితగ్రంధాలు ఉన్నాయని తెలియచేసారు. మన ఋషులు వ్రాసిపెట్టారు. మనల్ని చదవనివ్వలేదు, వారు మన ఋషుల గ్రంధాలు చదివి " ఆ విషయాలనే " ప్రపంచానికి తెలియచేస్తున్నారు. లార్డ్ మెకాలే ( 1935 ) జిందాబాద్.  మన ఋషులు వారి జ్ఞాననేత్రంతో చూసి అర్ధంచేసుకుని మన ఉన్నతికోసం ఇచ్చిన సంపద మన సనాతనధర్మం. దీనికి సాటి అయినది లేదు, రాదు. అందరికీ " కనుమ పండుగ " శుభాకాంక్షలు - సూర్య.  శుభం భూయాత్

బంగారులేడి

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 " న నిర్మితో వై నచ దృష్ట పూర్వో   న శ్రూయతే హేమ మయం                                    కురంగ:   తథా2పి తృష్ణా రఘు నందనస్య   వినాశ కాలే విపరీత బుద్ధి: " " బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది. మనమిత్రుడు " నిజమేనండి, నేనంత తెలివైనవాడిని కాదు " అన్నారు. అసలు తెలివితేటలు అంటే ఏమిటి. ఎవరికన్నా తక్కువ, ఎవరికన్నా ఎక్కువ. సృష్టిలో అన్నీ తమతమ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాయిగా. రాముడు వాలిని చంపగానే సుగ్రీవుడు మొ.గువారు అందరూ " అహా ఏమి తెలివితేటలు " అనుకున్నారు. సుగ్రీవుడు, హనుమ అందరూ శూరులేకదా, పర్వతం మీద దాక్కున్నారు. హనుమ రావణుడితో సభలో " వాలిగురించి తెలుసుగా, రాముడు అతన్ని ఎలా చంపాడో కూడా వినే ఉ...

మనుస్మ్రుతి

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " యత్ర నార్యస్తు పూజ్యంతే                   రమంతే తత్ర దేవతాః "    యత్రైతాస్తు న పూజ్యంతే                   సర్వాస్తత్రాఫలాః క్రియః"                         - మనుస్మృతి 3:56  ఎక్కడ స్త్రీలు గౌరవింప/పూజింపబడుతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు అని. మేము అమెరికా దోహా మీదుగా వెళ్ళాము. కాబిన్ లగేజ్ ఏమీ లేకపోవడంతో ముందరగా దిగిపోదామని దోహాలో విమానం ఆగగానే లేచి ముందరకు బయలుదేరాము.  ఇది మనకు బాగా అలవాటు. బస్, రైల్లో ఉన్నా సినీమాకు వెళ్ళినా ఎంతసేపయినా కూర్చుంటాం కాని ఇంక 2 ని.ల్లో వస్తుంది/అయిపోతుంది అంటే లేచి ద్వారం వేపు బయలుదేరిపోతాం. సినీమా అయితే స్క్రీన్ వైపే చూస్తూ తన్నుకుంటూ తోసుకుంటూ కూడా వెళ్ళిపోతాం.  ముందర ఒక అమెరికా ఆయనలా ఉన్నాడు, నడుస్తున్నాడు. షడన్ గా ఆగేడు, నేను కొద్దిగా ఎడంగా నడుస్తూన్నా నాచేతిలోని చిన్న బేగ్ ఆయనకు తగిలింది. అతను తోకత్రొక్కబడిన త్రాచులా వెనక్కు తిరిగి...

కొద్దిగా దోషం ఉన్నట్లు కనబడినా స్వధర్మమే మేలు, పరధర్మం ఏమీ ఎక్కువ మేలు చేయదు

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " శ్రేయాన్ స్వధర్మో విగుణః             పరధర్మాత్ స్వనుష్ఠితాత్,    స్వభావనియతం కర్మ             కుర్వన్నాప్నోతి కిల్బిషం "                             -  భ.గీత 18:47 " బాగుగా ఆచరించబడిన పరధర్మంకంటే గుణరహితమైన స్వధర్మాచరణమే మంచిది/శ్రేష్ఠమయినది. స్వధర్మరూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యులకు ఎట్టిపాపములును ఏమాత్రమూ అంటవు ". ఎలా అనిపించినా  స్వధర్మమే ఉత్తమమని చెప్పారు పరమాత్మ.  వైద్యుడు అత్యవసరమయితే ప్రాణానికే ముప్పు అయినప్పుడు కాలో చెయ్యో తొలగిస్తాడు. అంతేకాని " అయ్యోపాపం " అని ఊరుకోడు. అది వృత్తిధర్మం. ఒక విషయం చూద్దాం. ఒకాయన మాంసంకొట్టు నిర్వహిస్తున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన కుటుంబీకులు దానిని నిర్వహిస్తున్నారు. స్వామి చెప్పినది అదేమీ జీవహింస క్రిందకూరాదు, అతనికి పాపమూ అంటదు అని.  ఆ కొట్టుముందర బ్రతికున్న ప్రాణులను వ్రేలాడదీసి ఉంచుతాడు. ఒకాయన వచ్చి ఓ ప్రాణిని...

పండితరాజ 3

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  డిల్లీ బాదుషా మా ఊరి పండితుడు , మా బంధువు ( 17వ శతాబ్దం ) అయిన శ్రీ జగన్నాధపండితరాయలుకి " పండితరాజ " అని బిరుదు ఇచ్చి గౌరవించినట్లుగా ఓ సారి వ్రాయడం జరిగింది. ఆ సత్కారం సందర్భంగా ఓ సన్మానసభను ఏర్పాటు చేసారు. ఆ సభలో ఈయన్ని ఓ చక్కటి పద్యం/శ్లోకం చెప్పమన్నారు. మనం తెనాలి రామలింగడు కధల్లోనూ , సినీమాల్లోనూ చూసాం. తోటి కవులు ఆయన్ని ఎన్నివిధాలుగా అవమానించాలని చూసారో, ఈయన తన తెలివితేటలతో ఎలా బయటపడ్డారో.  ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది, జగన్నాధుని కాలంలోనూ ఉంది.  ఈయన అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఆశువుగా ఒక శ్లోకం చెప్పారు: " త్రపశ్యామ జంబూర్దళిత          హృదయం దాడిమీఫలం,    సశూలం సంధత్తే          హృదయమభిమానేన పనసః,    భయాదంతస్తోయం తరుశిఖరజం         లాంగలిఫలం,    సముద్భూతే చూతే జగతి         ఫలరాజే ప్రసరతి " ఓ సారి అడవిలోని పళ్ళ చెట్లన్నీ కలిసి ఓ పండురాజుని ఎన్నుకుందామనుకున్నాయిట. సహజంగానే మంచిరంగు, మంచి సువాసన, మ...

పండితరాజ 4

క్రమశిక్షణ గురించి పండితరాయలు ఇంకో అద్భుతవిషయం చెప్పారు. కుండ కి ఒక పరిమాణం (సైజ్) ఉంటుంది. నదిదగ్గరకు తీసుకెళ్ళినా సముద్రం దగ్గరకు తీసుకెళ్ళినా దానిలో పట్టే నీళ్ళనే తెచ్చుకోవచ్చు. కుండ కొడుకు కుండే అవుతాడు. కాని మా తండ్రిగారు ( కుండ ) అమలుపరిచిన క్రమశిక్షణ, మహాగురువుగా నాకు నేర్పిన విద్య నన్ను " కుంభసంభవుడు " గా చేసాయి. అగస్త్యుడు కూడా కుంభసంభవుడే. ఈ అగస్త్యుడు మొత్తం సముద్రాన్ని 3 పురుషిళ్ళతో ( గుటకలు )త్రాగేసాడు. అంటే కొద్ది నీళ్ళతో సరిపెట్టుకోకుండా మొత్తం సముద్రాన్నే త్రాగగలిగే విద్వత్తుతో నన్ను మాతండ్రి ఇచ్చిన క్రమశిక్షణ, విద్య తీర్చిదిద్దాయి అని.  ఎంత అద్భుత అలంకారం. అందుకే ఆయన వ్రాసిన అలంకారకావ్యం " రసగంగాధరం " అంత పేరుగడించింది. శుభం భూయాత్

పండితరాజ 1

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " క్రమశిక్షణ " ( Discipline ) ఒక మనిషి జీవితంలో అద్భుతస్థాయికి వచ్చారంటే వారి బాల్యదశ ఎంతటి క్రమశిక్షణతో గడిచి ఉంటుందో తెలుసుకోవాలి. మాగ్రామవాసి, బంధువు పండితరాజ జగన్నాధరాయలు ( 17వ శతాబ్దం ) క్రమశిక్షణ విలువ గురించి, అవసరం గురించి కొన్ని అద్భుతమయిన శ్లోకాలు చెప్పారు. తన 25వ ఏటకే పండితరాజ బిరుదుతో గౌరవింపబడి ఢిల్లీబాదుషా అర్ధసింహాసనాన్ని అలంకరించారంటే ఎంత క్రమశిక్షణతో పెరిగారో ఊహించుకోవచ్చు. " పాషాణదపి పీయూషం    స్యందతే యస్య లీలయా,    తంవందే పేరుభట్టా2ఖ్యం,    లక్ష్మీకాంతం మహాగురుం "                     రసగంగాధరం,          ప్రధమాననం 3వ శ్లోకం. ఆయన రచించిన అద్భుత అలంకారకావ్యం " రసగంగాధరం " లో " తన తండ్రియొక్క పాండిత్య ప్రభావలీలకు బండరాయి ( తను ) కూడా అమృతాన్ని స్రవిస్తుంది. మహాగురువైన తండ్రి పేరుభట్టుగారికి తల్లి లక్ష్మీకాంతంగారికి నమస్కారములు " అని మొదటి వందనములు తెలియచేసారు. తనను తాను " బండరాయి " తో పోల్చుకున్నారు పండితరాయలు.  " గీర్భిర...

పండితరాజ 5

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " గురుర్భ్రహ్మః గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః,    గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః "  గురువును ఎలా గౌరవించాలో తెలియచేసింది మన సనాతనధర్మం. " పండితరాజ " జగన్నాధపండితులు ( 17వ శతాబ్దం ) రచించిన " రసగంగాధరం " గ్రంధంపై 400 సం లు అయినా ఎవరూ " ఖండన " చెయ్యలేదు. అది అంతటి అద్భుతగ్రంధం అని వ్రాయడం జరిగింది. వ్యాకరణశాస్త్రాన్ని " శ్రీపాణిని " వ్రాసారు. ఈ రసగంగాధరం చదువుతే పాణిని వ్యాకరణశాస్త్రంతో పని ఉండదని పండితుల అభిప్రాయం.  ఏ గ్రంధమైనా అందరికీ నచ్చాలని లేదు, కొందరికి అభ్యంతరకరంగా కూడా అనిపించవచ్చు. వారు " ఖండన " చేస్తారు. అది ఒక గ్రంధరూపంలో కూడా రావచ్చు. ఉదా: విశ్వనాధ సత్యనారాయణ గారు " శ్రీమద్రామాయణ కల్పవృక్షం " అనే గ్రంధం వ్రాసారు. దానికి " ఖండన " గా ముప్పాళ రంగనాయకమ్మ గారు " రామాయణ విషవృక్షం " వ్రాసారని అనుకోవచ్చు. జగన్నాధ పండితులు ఒక " ఖండన " గ్రంధం వ్రాసారు. దానికి " మనోరమా కుచమర్దనం " అని పేరు పెట్టారు. ఆశ్చర్యం కలగవచ్చు, అంతటి ...

భ.గీత 2.68

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " తస్మాద్యస్య మహాబాహో                  నిగృహీతాని సర్వశః,    ఇంద్రియాణీంద్రియార్ధేభ్యస్తస్య               ప్రజ్ఞా ప్రతిష్ఠితా "                           - భ.గీత 2:68 పరమాత్మ గీతలో " ఇంద్రియార్ధాలనుంచి నిగ్రహించుకోమన్నారు ". ఇంద్రియాలనే నిగ్రహించుకుంటే అంతకన్నా కావలసినదేమీ లేదు. కాని అది అంత సులభం కాదు.  17వ శతాబ్దంలో దిల్లీ బాదుషా అర్ధసింహాసన గౌరవం, పండితరాజ మరియు కవిసార్వభౌమ బిరుదులు పొందిన మాగ్రామవాసి బంధువు అయిన జగన్నాధపండితులు తమ " శృంగారవిలాస " కావ్యంలో ఇలా వ్రాసారు: " గరిమాణ మర్పయిత్వా,    లఘిమానం    కుచతటాత్కురంగ దృశాం,    స్వీకుర్వతే నమస్తే యూనాం     ధైర్యాయ నిర్వివేకాయ "        - శృంగార విలాసం శ్లో.46 యువకులు యువతులను చూడగానే వారి కుచతటములకు తమ వివేకజనితమైన " గురుత్వమును " అర్పించేసి ఆ కుచతటముల నుండి వారు " లఘి మా...

పండితరాజ 2

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " కస్తూరికాం తృణభుజా                    మటవీచరాణాం,    వినస్య నాభిషు వధాయ వృధా                   చకార,    మూఢో విధి స్సకిల                   దుర్జనలోలజిహ్వా,    మూలేషు నిక్షిపతిచేత్                   సకలోపకారః "  17వ శతాబ్దంలో దిల్లీ బాదుషా అర్ధసింహాసన గౌరవం, పండితరాజ మరియు కవిసార్వభౌమ బిరుదులు పొందిన మాగ్రామవాసి బంధువు అయిన జగన్నాధపండితులు పైవిధంగా అలంకార పద్యం వ్రాసారు: " కస్తూరిమృగం పిరికిది. ఎక్కడో అడవిలో గడ్డితింటూ తిరుగుతూ ఉంటుంది. దాని బొడ్డులో అద్భుతమైన కస్తూరి అనే సుగంధాన్ని పెట్టాడు దేముడు. ఈ సువాసనతో దాని జాడను పసిగట్టి దాన్ని చంపేసి కస్తూరిని దొంగిలిస్తారు వేటగాళ్ళు. దేముడా అంతటి సాధుజంతువుకి అలాంటిచోట పెట్టడానికి నీకు మనసెలా వచ్చిందయ్యా. నన్ను అడిగినా సలహా ఇద్దును కదా. కొందరు వితండవాదం చేసే మూర్ఖులు ఉంటారు...

అప్పయ్యదీక్షితర్

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 మహాపండితుడు అప్పయ్యదీక్షితర్ గురించి కొన్ని అద్భుతమయిన విషయాలు నెమరువేసుకుందాం. ఆయన 1554 లో తమిళ్ నాడులోని విరించిపురంలో జన్మించారు. " విరించి " అంటే విష్ణువు. " శివరహస్య " అనే గ్రంధంలో శివుడే స్వయంగా తన అంశతో దీక్షితర్ అనే ఆయన జన్మిస్తాడు అని తెలియచేసారు. అంటే శివాంశ విష్ణుపురంలో జన్మించారన్నది అద్భుతవిషయం. శివవిష్ణువులు ఒక్కరే అన్నది ఈయన బోధన. ఆయన చిన్నతనంలోనే 14విద్యలూ నేర్చుకున్నారు. ఆయన వేదాంతం, శివాద్వైతం, మీమాంస, వ్యాకరణం, అలంకారాలపై 104 గ్రంధాలు వ్రాసారు. ఆయన అద్వైతాన్ని అనుసరించారు.  అప్పుడు చోళరాజుల సంస్థానంలో " రత్నఖేత శ్రీనివాస " అని పండితుడు ఉండేవారు. ఆయన అప్పయ్యగారి విద్వత్తుగురించి విని ఆయన్ని ఓడించి తనకాళ్ళు పట్టించుకోవాలని తలచి కంచి కామాక్షిని అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. అమ్మవారు " అది సులువుకాదు కాని నీ కూతురిని ఆయనకిచ్చి వివాహం చెయ్యి, నువ్వు మామ అవుతావు, ఆయన నీకాళ్ళు ఎలాగూ పట్టుకుంటాడు " అన్నారు. అదేరాత్రి శివుడు అప్పయ్యగారి కలలో కనబడి " వెంటనే కంచి కి వెళ్ళి కామాక్షీదేవి దర్శనం చేస...

మైఖేల్ మమస్

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 మైఖేల్ మమస్ అని ఒకాయన అమెరికాలో పుట్టారు. చిన్నప్పటినుంచి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండేవారు. ఈయన మానసికశాంతికోసం మనదేశానికి వచ్చి హిమాలయాలలో తిరగడం మొదలెట్టారు. ఒకరోజున ఈయన అలా తిరుగుతూండగా ఓ గుహలోంచి ఒక ముని బయటకు వచ్చి ఈయనకు ఒక శివలింగం శ్రీచక్రం ఇచ్చి, అమెరికాలో ప్రతిష్ఠించు, శాంతి కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయారు. వాటిని జాగ్రత్తగా భద్రపరచుకుని ఈయన మనదేశమంతా తిరిగారు. ఎందరో పండితులని కలిసి ఇష్టంతో సంస్కృతం నేర్చుకుని ఎన్నో గ్రంధాలను చదివారు. వేదాలను వేదవిజ్ఞానాన్ని అద్భుతసంపదగా భావించి అవే ప్రపంచశాంతిని ఇవ్వగలవనే నమ్మకంతో అమెరికాకి తిరిగివెళ్ళి నార్త్ కరోలినాలోని బ్లూ రిడ్జ్ పర్వతాలలో ఒక ఓ పర్వతాన్ని కొన్నారు. అది 450 ఎకరాలు. దానికి సోమపర్వతం అనిపేరుపెట్టి దానిమీద శ్రీసోమేశ్వర దేవాలయాన్ని కట్టారు. అందులోనే గణపతి హనుమ నవగ్రహాల విగ్రహాలను ప్రతిష్ఠించి వేదపాఠశాలను స్థాపించారు. ఇప్పుడు అక్కడ ఎందరో సంస్కృతవిద్యను అభ్యసిస్తున్నారు. కొందరు పండితులనేది మన ఋషి ఒకరు ప్రపంచమంతా మన వేదవిజ్ఞానాన్ని వ్యాప్తిచేయడానికని ఈయనగా పునర్జన్మ తీసుకున్నారని. పూజ్యులు స...

పండితరాజ 6

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " కిం మాలతి! మ్లాయసి మాం                                విహాయ,    చు చుంబ తుంబీకుసుమం                                షడంఘ్రిః,    లోకే చతుర్భి శ్చరణైః పశుస్యాత్,    స షడ్భిరత్యర్ధ పశుర్న కిం స్యాత్ "  మాలతీ పువ్వుమీద తుమ్మెద వాలదు. తుమ్మెదకు ఆరుకాళ్ళు ఉంటాయి, " షడంఘ్రి " అన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని జగన్నాధపండితరాయలు ( 17వ శతాబ్దం - మాబంధువు, మాగ్రామవాసి ) ఇలా వ్రాసారు: " ఓ మాలతీ, 4 కాళ్ళు ఉన్న జీవిని పశువు అంటారు. ఆరుకాళ్ళు ఉన్న తుమ్మెద ఇంకో అరపశువు ( 2 కాళ్ళు ఎక్కువ ) ఎక్కువ. అంటే 1 1/2 పశువు. అటువంటిది నీ మీద వాలటం లేదని నువ్వు బాధపడతావెందుకు " అని. పండితుల అభిప్రాయమేమిటంటే సహజంగానే ఈయనపై అసూయతో ఉన్న మిగతాపండితులు ఈయనతో సఖ్యంగా ఉండేవారుకాదేమో అందుకని ఈయన ఈవిధంగా వ్రాసి ఉంటారు అని. " జగత్ప్రాణే ప్రౌఢే నికట             ...

ఋషీ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు "🙏  " ఋషి " అంటే అతీంద్రియమయిన జ్ఞానాన్ని దర్శించినవారు. శాస్త్రజ్ఞులు కూడా ఋషులే. గెడ్డంపెంచుకుని ముక్కుమూసుకుని ఓమూల కూర్చుని ఉంటారు అని సామాన్యుల భావన. సినీమాలు మనల్ని అలా అనుకునేలా చేసాయి. వారు కారణజన్ములు. వారు ఏది చేసినా లోకకళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకునే. అటువంటివారు జీవించేది లోకకళ్యాణంకోసం.  రామాయణంలో 27 రకాల ఋషుల వివరణ ఉంది. 27 ఋషులుకాదు, 27 రకాల ఋషులు. కొందరు నీరునుమాత్రమే, కొందరు గాలినిమాత్రమే, కొందరు గాలిలో తేలుతూ, కొందరు సూర్యరశ్మినే అహారంగా తీసుకుంటూ ఇలా అనేక ఋషులు లోకకల్యాణం కోసం తపస్సు చేస్తున్నారు అని. మాతంగ మహర్షి శబరితో " నేను వచ్చినపని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, త్వరలో రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారు, వారిని సేవించుకుని తరించు " అని చెబుతారు. వస్తున్నారని తెలిసినా రామలక్ష్మణులకోసం ఆగలేదు మహర్షి. ఓ సమయంలో భరతవర్షమంతా విపరీతమయిన కరువుకాటకాలు. వర్షాలు లేవు, నీటిచుక్కలేదు. గౌతమమహర్షి వరుణదేవుడి గురించి తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే " వెంటనే వర్షాలు కురిపించు, ప్రజలు అల్లాల్లాడిపోతున్నా...

పండితరాజ 8

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " వానరాణాం వివాహేషు,   తత్ర గార్దభ గాయకాః,   పరస్పరం ప్రశంసంతి,   అహోరూప మహోధ్వనిః " కోతుల వివాహానికి గాడిదలు గానం చేసాయిట. గాడిదలు కోతులని " మీరు ఎంత అందంగా ఉన్నారు " అని అంటే కోతులు " మీగాత్రం ఎంత అద్భుతంగా ఉంది " అని గాడిదలను మెచ్చుకున్నాయిట.  డబ్బాకొట్టుకోవటం 3 రకాలుట. ఒకటి తనను తాను " స్వ ". రెండోది ఇతరులను " పర ". ఇక మూడోది ఒకళ్ళని ఒకరు " పరస్పర ". పై పద్యం మూడో రకం కనుక " పరస్పరం " వాడారు జగన్నాధ పండితరాయలు. వీరి విద్వత్తుకు అసూయపడిన తోటి పండితుల " కవిత్వాల, పరస్పర పొగడ్తల " గురించి ఆయన అలా అని ఉంటారని పండితుల/విమర్శకుల అభిప్రాయం. ఇలాంటి " అలంకార " శ్లోకాలు చాలా వ్రాసారు కదా అసలు ఆయన మనస్సులో ఏముందని తెలుసుకోవడానికి కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఆయన వ్రాసిన " శాంత విలాసము " లో ఓ శ్లోకం చూద్దాం: " సపది విలయమేతు రాజ్యలక్ష్మీః,   ఉపరి పతంత్వధ వా కృపాణ                            ధారాః,    అపహరతుతరాం శిరఃకృతాంతో,    మమ తు మతి ర్నమనాగపైత...

పండితరాజ 7

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 17వ శతాబ్దంలో మాబంధువు, గ్రామవాసి అయిన జగన్నాధరాయలకు " పండితరాజ " బిరుదునిచ్చి గౌరవించారు. " పండితరాజ " బిరుదు అంటే ఏమిటి, ఆకాలంలో ఏ అర్హతలున్నవారికి ఆ బిరుదును ఇచ్చేవారు లాంటి విషయాలను " జస్టీస్ మహాదేవగోవిందరానడే " అనే పండితుడు తనువ్రాసిన " మహారాష్ట్ర చరిత్ర " అనే అద్భుతగ్రంధంలో తెలియచేసారు. మరాఠా, రాజస్థానీయం, కన్నడ భాషలలో " పండితరాజ జగన్నాధరాయలు " మీద అద్భుత గ్రంధాలు రచించబడ్డాయి అని తెలుస్తూంది. ఫ్రాంచెస్ బర్నియర్ వంటి విదేశీయాత్రీకులు ఈయనగురించి విశేషంగా ప్రస్తావించారు. బర్నియర్ " ఆయన శాస్త్రపాండిత్యం అనితరసాధ్యం " అని గౌరవించారు. " శాస్త్రపాండిత్యం అనితరసాధ్యం " గురించి ఓ ఉదాహరణ. 17వ శతాబ్దంలో అప్పయ్యదీక్షితులు, భట్టోజీదీక్షితులు ఇద్దరూ ఉద్దండపండితులు. ఇద్దరి కావ్యాలకీ ఖండనలు వ్రాసారు పండితరాజ. అప్పయ్యగారు వ్రాసిన " చిత్రమీమాంస " కు ఖండన వ్రాసి చివరలో పండితరాజ ఇలా వ్రాసారు: " సూక్ష్మం   ........చరణౌతవహామి " అంటే " ఏ ఒక పండితుడైనను మత్సరమును విడిచి న...

పండితరాజ 9

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " దిగంతే శ్రూయంతే          మదమలినగండాః కరటినః,     కరిణ్యః కారుణ్యా2స్పద            మనమశీలాః ఖలు మృగాః,     ఇదానీంలోకే2స్మిన్ననుపమ          శిఖానాం పునరయం,      నఖాణాం పాండిత్యం           ప్రకటయత్య కస్మిన్మృగపతిః " " మృగరాజు అనిపించుకున్న సింహం తన వాడిగోళ్ళ పాండితిని ప్రదర్శించుటకు సరిపడిన దిగ్గజాలు తనకు అందుబాటులో లేకపోవటం చేతను, లేళ్ళు మొదలగునవి ఉజ్జీగా తనకు సరిపడకపోవటం చేతను తన వాడిగోళ్ళ పాండితిని ప్రదర్శించుటకు తగిన ఉజ్జీ లేదని బాధపడుతూంది " అని. మాగ్రామవాసి, బంధువు పండితరాజ జగన్నాధరాయలు ( 17వ శతాబ్దం ) వ్రాసిన ఈ శ్లోకం చదివిన పండితులు, విమర్శకులు ఈ శ్లోకం గురించి అభిప్రాయపడినది " ఏకసంథాగ్రాహి అవడంవలన తన 16 ఏళ్ళకే వేదవేదాంగాలను, శాస్త్రాలను, మీమాంస, వ్యాకరణాదులను ఔపాసన పట్టేయడం వలన తన పాండిత్యప్రకటనకు సరైన ఉజ్జీలేదే అని విచారిస్తూ వ్రాసినది అయి ఉంటుంది " అని. ఈయన వాదనలోకి దిగినప్పుడు పండితులు ఉక్కి...

పండితరాజ10

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా,    మనోరధాన్ పూరయితుం                                  సమర్ధః,    అన్యైః నృపాలైః పరిధీయమానం,    శాకాయ వాస్యాల్లవణాయ                                  వాస్యాత్ " అనగా " కోరికలను తీర్చేవారు ఇద్దరే ఇద్దరు. ఒకరు డిల్లీకి ఈశ్వరుడు/ప్రభువు. ఇంకొకరు జగత్తుకు ఈశ్వరుడు/ప్రభువు పరమేశ్వరుడు. మిగతా రాజులు నాకు ఇచ్చే ద్రవ్యం నాకు ఓరోజు పప్పుకో ఉప్పుకో సరిపోతుంది " అని అన్నారు మాగ్రామవాసి, బంధువు పండితరాజ జగన్నాధరాయలు ( 17వ శతాబ్దం ). ఆ సమయంలో ఈయన సనాతనధర్మానికి పూర్వపువెలుగు తేవడానికి చాలా శ్రమించారని, సఫలీకృతులయారని పండితుల/విజ్ఞుల/విదేశీయాత్రీకుల అభిప్రాయం. ప్రసిద్ధ ఫ్రెంచ్ వైద్యుడు అయిన " ప్రాంచెస్ బర్నియర్ " తన యాత్రా గ్రంధంలో " పండితరాయలు " అనే ఆయన ముఖ్యపండితుడుగా ఉండేవారని, పండితులందరిలోనూ ముఖ్యాచార్యుడిగా ఉండేవారని వ్రాసారు. ఈయన విద్వత్త...

అంజనా నందనం

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  " అంజనా నందనం వీరం జానకి                          శోకనాశనం,    కపీశమక్షహంతారం వందే లంకా                         భయంకరం ". " యత్రయత్ర రఘునాధకీర్తనం    తత్రతత్ర కృతమస్తకాంజలిం,    భాష్పవారి పరిపూర్ణలోచనం    మారుతిం నమత రాక్షసాంతకం "  మొదటి శ్లోకం లో సీత శోకాన్ని పోగొట్టిన అరివీరభయంకరుడు. రెండవ శ్లోకంలో తలవంచుకుని చేతులు కట్టుకుని కళ్ళనిండుగా నీళ్ళతో నుంచుని ఉన్న హనుమ. ఎక్కడ రామకీర్తన జరుగుతూన్నా హనుమ అక్కడ అలా నుంచుని ఉంటాడు. ఎంత తేడా. భక్తికి పరాకాష్ఠ. అందుకే " భక్తానాం అగ్రగణ్యం " అని కీర్తింపబడ్డాడు. లంకకు నిప్పుపెట్టేసాక హనుమ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటాడు. అయ్యో ఎంతపని చేసాను, కోపం ఎంత చెడ్డది, మనిషి విచక్షణజ్ఞానాన్ని నశింపచేస్తుంది కదా, రావణుడిమీద కోపంతో అలా అంటించేయడమేమిటి, ఇప్పుడు సీతమ్మ పరిస్థితి ఏమిటి. ఆమె కూడా అగ్నికి ఆహుతి అవుతే రామలక్ష్మణులు సుగ్రీవుడు వానరవీరుల ...

దమేన సదృశం

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 వ్యాసమహర్షి మానవుల సమస్త బాధలకి మూలం " లోభం " అని మహాభారతంలో తెలియపరిచారు. ఈ లోభమే/మోహమే జీవుణ్ణి మాయలో పడేసి నానా కష్టాలూ పడేలా చేస్తుంది. మరి దీనిప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో కూడా ఆయనే తెలియచేసారు: " దమేన సదృశం ధర్మం నాన్యం     లోకేషు శుశృమః " అంటే " పుణ్యానికి మూలం " దమం ". పుణ్యభవంతులకి పునాది " దమం ". దమం అంటే " ఇంద్రియనిగ్రహం ". స్పందించేముందు ఒక్క క్షణం ఆలోచనచేస్తే ఏ కష్టాలు దరిచేరవు. ఈ " దమం/ఇంద్రియనిగ్రహం " అంటే " 18 దోషాలు " లేకపోవడమే అని తెలియచేసారు. ఆ దోషాలు ఏమిటో చూద్దాం: 01. అనృతం : అబద్ధం ఆడడం. 02. పైసునం : పరదూషణ అంటే         చాడీలు చెప్పడం. 03. తృష్ణ : విషయాభిలాష 04. ప్రాతికూల్యం : అందరికీ          వ్యతిరేకంగా జీవించడం. 05. తమం : అజ్ఞానం, తమస్సు 06. అరతి : దేనియందు తృప్తి         లేకపోవడం 07. లోకద్వేషం : జనులపట్లద్వేషం 08. అభిమానం : ఏదో ఒక          విషయంకోసం పట్టుబట్టడం,        ...

ఋషులు

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 ఋషులు ఏపనిచేసినా, తపస్సు చేసినా లోకకల్యాణం కోసమే. తెలిసి వారు ఏతప్పూ చేయరు. కాని వారికి తెలియకుండానే కొన్ని దోషాలు వారికి తగులుకుంటూంటాయి. వారు "తపస్సు " చేసేది ఇలాంటి దోషపరిహారాల కోసం కూడా. మహర్షులుకూడా ఒక్క చిన్న అసత్యమాడితే వారి తేజస్సు హరించుకుపోతుంది. అందుకే ఋషులు తెలిసో తెలియకో ఎప్పుడయినా అసత్యమాడి ఉండవచ్చు అని తలచి ఆ అసత్యదోషనివారణ కోసం సరస్వతీవ్రతం, ' సారస్వతేష్టి ' యజ్ఞం చేస్తారు. ఈవిషయం రాముడు తనతల్లి కౌసల్యకు అరణ్యవాసానికి వెళ్ళేముందర చెబుతాడు, తనతండ్రికి తనవల్ల అసత్యదోషం రాకూడదని. ఓ ఋషి ఒక అత్యవసరపని మీద వేరే ప్రదేశానికి వెడుతున్నారు. ఎండబాగా ఎక్కువగా ఉంది. కమండలంలోని నీరుత్రాగి ఏదయినా పండు ఒకటి తింటేనయమని చుట్టూ చూస్తే ఓ పెద్ద చెట్టు ఒకటి పలుకొమ్మలతో ఆకుపచ్చటి ఆకులతో కనిపించింది కొద్దిదూరంలో. దాని దగ్గరకు వెళ్ళారు, ఓ పండో కాయో తిందామని. ఆశ్చర్యంగా దానికి ఓ పువ్వుకాని కాయకాని లేదు. మనభాషలో అది మగచెట్టు. సరేలే అనుకుని ఎదరకి వెళ్ళిపోయారు. 3,4 రోజుల తరువాత పని అయిపోవడంతో తిరుగుప్రయాణమయారు. దారిలో ఆచెట్టును చూస్తే మాడిపోయి...

భ గీత 12.1

 🙏 "శ్రీరస్తు శుభమస్తు" 🙏 " ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం                         పర్యుపాసతే,    యే చాప్యక్షర మవ్యక్తం తేషాం కే                       యోగవిత్తమాః "                         - భ.గీత 12:1 విగ్రహారాధన మంచిదా, అవసరమా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది ఇప్పటి సమస్యకాదు. పరమాత్మ గీతను బోధించినప్పుడే అర్జునుడికి ఈ సందేహం వచ్చింది.  " నీ విశ్వరూపాన్ని ( దివ్యమంగళవిగ్రహాన్ని ) పూజించేవారు కొందరు, అవ్యక్తము నాశనరహితము అయిన పరబ్రహ్మరూపాన్ని కొలిచేవారు కొందరు వీరిలో ఎవరు శ్రేష్ఠులు " అని అడిగాడు అర్జునుడు. ఒకరిమీద అభిమానం కలగాలంటే అతని విభూతులు ( శక్తులు ), రూపం తెలియాలి. అప్పుడు పని సులభమవుతుంది. అందుకే పరమాత్మ తన విభూతులు తెలియచేసి తన విశ్వరూపాన్ని చూపించి తరువాతే భక్తి గురించి తెలియచేసారు. నన్ను నమ్ముకో, అన్నీ నేను చూసుకుంటానన్నారు. విగ్రహము " అంటే విశేషంగా గ్రహించేది అ...

ఘంటాపధం

 " ఘంటాపథం " గా చెబుతున్నాను/చెప్పారు అంటూంటారు. " ఘంటాపథం " అంటే ఏమిటి. పూర్వం చక్రవర్తులు/రాజులు నగరవీధుల్లోకి రధం మీద కాని గుర్రం మీదకాని వచ్చేటప్పుడు అడ్డంకులు లేకుండా ఉండడానికి ఓ ఏర్పాటు ఉండేది. ముందర ఒకతను ఓ ఘంటను పట్టుకుని వాయిస్తూ పరిగెత్తుకుని వెళ్ళేవాడు. ఘంటానాదం వినబడగానే పెద్దాయన వస్తున్నారని జనాలు సర్దుకునేవారు. ఘంటతో దారి కనుక ఘంటాపథం అని పేరొచ్చింది.  ఇప్పుడు ఎస్కార్టులు, లేటెష్టుగా వలలు కంచెలు కట్టేయడం చేస్తున్నారు. కీడెంచి మేల్కాంచమని అయి ఉంటుందని ఎవరైనా అనుకుంటే నేరం వారిది కాదు - సూర్య. శుభం భూయాత్ 

గరిటెలు

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " ప్రవచనాలు బాగానే వింటున్నారు, దేవాలయాలకు బాగానే వెడుతున్నారు. అభిషేకాలూ అష్టోత్తరాలూ బాగానే చేయించుకుంటున్నారు. దానధర్మాలూ బాగానే చేస్తున్నారు. కాని మనుషుల్లో రావలసినంత మార్పు రాలేదనీ మంచితనం తగ్గిపోయిందనీ బాధపడుతూంటారు కొందరు. నేరం మనుషులది కాదు " గరిటెలది ". గరిటె వంటగదిలో ఉంటుంది. బిర్యానీ చేసినప్పుడు బాగా కలుపుతుంది, సాంబారుని కలుపుతుంది, బాదంఘీర్ ని పాయసాన్ని కలుపుతుంది, కారంపెట్టి వండిన కూరలని కలుపుతుంది, కొత్త ఆవకాయని బాగా కలుపుతుంది - విశేషమేమిటంటే అన్నింటిలోనూ అది పాలుపంచుకున్నా ఈ అద్భుత రుచులేవీ గరిటెకు అంటవు. ఇప్పుడు ఈ భక్తి విషయంలోనూ జరుగుతూన్నది అదే. ఏదో మొక్కుబడి అయిపోయి " గరిటె " లా మిగిలిపోతున్నాం. ఓ ఉదాహరణ చూద్దాం. వైకుంఠఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా గుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటే పుణ్యమంది శాస్త్రం. చూడకపోతే పాపమని ఎక్కడా చెప్పలేదు. దీన్ని అనుకూలంగా మలుచుకోవడానికి కొంత రుసుం పెడతారు గుడి అధికారులు. పరవాలేదు. గుడికి గుడిలోని దేవుడికి డబ్బు అవసరం లేకపోయినా " వేరే " అవసరాలకోసం అధికార్లు ...

మూకపంచశతి

 🙏" శ్రీమాత్రేనమః"🙏  " సధ్రీచే నవమల్లికాసుమనసాం      నాసాగ్రముక్తామణేః,   ఆచార్యాయ మృణాలకాండ        మహసాం నైసిర్గికాయ త్విషే,   స్వర్ధున్యా సహ యుధ్వనే      హిమరుచేరర్ధాసనాధ్యాసినే,   కామాక్ష్యాః స్మితమంజరీ       ధవలిమాద్వైతాయ తస్మై నమః"  అమ్మవారి చిరునవ్వు ఎంత నిర్మలంగా అందంగా ఉంటుందంటే ఆ నవ్వుముందు మల్లెపూలు, చంద్రవంక, ఆకాశగంగ కూడా దిగతుడుపే అని తెలుసుకోవాలి. మూకకవి/మూకశంకరులు కామాక్షీ అమ్మవారి దర్శనకటాక్షంతో ఆశువుగా 500 శ్లోకాలతో అమ్మవారిని ప్రార్ధన చేసారు. అది " మూకపంచశతి " గా ప్రసిద్ధిచెందింది. అమ్మవారి చిరునవ్వుమీదే 100 శ్లోకాలు చెప్పారు. అదే మూకపంచశతి లోని " మందస్మితా శతకం ". వాటిలో ఒక శ్లోకం ఇది. శివుడు చంద్రవంకను, గంగను ధరించి విభూతిని శరీరమంతా పూసుకుంటాడు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఓ కవి మూకశంకరుల పై శ్లోకానికి చమత్కారంగా ఇలా భాష్యం చెప్పారు: కైలాసంలో కొలువై ఉన్నప్పుడు శివుడు ఓ సారి ఎడమవైపున ఉన్న అమ్మవారివైపు చూసారుట. అమ్మవారు ఓ చిరునవ్వు నవ్విందిట. ఈయన " ఎంత అద్భుతంగా అంద...

భ.గీత16.18

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " అహంకారం బలం దర్పం    కామం క్రోధంచ సంశ్రితాః,    మమాత్మపరదేహేషు    ప్రద్విషంతో2భ్యసూయకాః "                     - భ.గీత 16:18 అహంకారం అహంభావం లోభం కోపం తో నిండినవారు దెయ్యంపట్టిన వారిలా తనలోనూ పరుల్లోనూ ఉన్న పరమాత్మని కూడా దూషిస్తారు అని  వ్యాసమహర్షి మానవుల సమస్త బాధలకి మూలం " లోభం " అని మహాభారతంలో తెలియపరిచారు. ఈ లోభమే/మోహమే జీవుణ్ణి మాయలో పడేసి నానా కష్టాలూ పడేలా చేస్తుంది. పాపపు భవంతులకు పునాది " లోభం ". మరి దీనిప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో కూడా ఆయనే తెలియచేసారు: " దమేన సదృశం ధర్మం నాన్యం      లోకేషు శుశృమః " అంటే " పుణ్యానికి మూలం " దమం ". పుణ్యభవంతులకి పునాది " దమం ". దమం అంటే " ఇంద్రియనిగ్రహం ". స్పందించే ముందు ఒక్క క్షణం ఆలోచనచేస్తే ఏ కష్టాలు దరిచేరవు. ఈ " దమం/ఇంద్రియనిగ్రహం " అంటే " 18 దోషాలు " లేకపోవడమే అని తెలియచేసారు. ఆ దోషాలు ఏమిటో చూద్దాం: 01. అనృతం : అబద్ధం ఆడడం. 02. పైసునం : పరదూషణ అంటే        ...