Posts

Showing posts from October, 2023

రామాయణం - ఇతిహాసం - సూర్య

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 రామాయణం ఎంతటి అద్భుత కావ్యం. అందుకే ఇన్ని వేల ఏళ్ళు అయినా నిత్యనూతనంగానే ఉంది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాక భరతుడు ఆయన్ని ఎలాగైనా ఒప్పించి వెనక్కు తీసుకురావడానికి మందీమార్బలంతో వెడతాడు. దారిలో భరధ్వాజమహర్షి ఆశ్రమానికి వెడతాడు సైన్యాన్ని దూరంగా ఉంచి.  మహర్షి " మీకు అతిధిసత్కారాలు ఏర్పాటుచేస్తాను ఉండు " అంటారు. భరతుడు " మీకు శ్రమవద్దు, పళ్ళూ అవీ తిని కాలక్షేపం చేస్తాము " అని అంటాడు. అప్పుడు మహర్షి అంటారు " నువ్వు రాజువి, అలా చేయవచ్చు కాని నీక్రింద పనిచేస్తున్నవారిని సౌకర్యవంతంగా చూసుకోవాలి. వారికి అవసరమయిన/ఇష్టమయిన తిండి, వసతి చూడ్డం నీ బాధ్యత " అంటారు. వారి ఏర్పాట్లకోసం హోమం ముందు కూర్చుని దేవతలను ఆవాహన చేస్తారు పనులకోసం. విశ్వకర్మని ఇంద్రాది దిక్పాలకులను సోముడిని, కుబేరుడిని నదులను ఆహ్వానిస్తారు. అందరూ వచ్చి భవనాలను రుచికరమైన వంటలు ఏర్పాటుచేస్తారు.  ఇక్కడ వింత విషయమేమిటంటే " సోముడు " రకరకాల రుచికరమైన " మాంసపు వంటకాలు " ఏర్పాటు చేస్తాడు అతిధులకోసం.  మహర్షులు తాము తినేది పళ్ళూ, కందమూలాలయినా అతిథులకు వార...

శ్రీలలితానామం 754 - సూర్య

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అపర్ణా " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 754 వ నామం. " అపర్ణా "' అంటే సాధారణంగా ఆకులుకూడా ముట్టనిది అని చెబుతూంటారు. పార్వతిదేవి పరమేశ్వరుడిని వివాహం చేసుకోవడానికి ఘోరతపస్సు చేస్తుంది. " ఆకులు అలములు " తిని బ్రతుకుతున్నామంటూంటారు. ఆవిడ ఆకులు కూడా తినకుండా తపస్సు చెయ్యడం వల్ల " అపర్ణ " అని పిలవబడిందిట. మరి అంతకు ముందే " సనాతన/పురాతన " అయిన అమ్మవారి ఒకనామం " అపర్ణ " కదా. అందుకని ఈ నామానికి అర్ధం " ఋణం లేనిది/ఋణం తీర్చునది " అని భాష్యం చెప్పారు. " అపగత ఋణాయస్యా ........" - ఋణములు పోగొట్టే తల్లి అని భాష్యం చెబుతూ " శ్రీభాస్కరరాయులు " వారు అమ్మవారిని అద్భుతంగా ఓ కోరిక కోరారు. " అమ్మా రోజూ నిన్ను, నీ నామాలు స్మరించుకుంటూ పూజలు చేస్తున్నాను. అందరి ఋణాలు తీర్చే నువ్వు ఋణపడకూడదు కదా. నాకు నీ దర్శనభాగ్యం కలిగించి నీ ఋణం తీర్చేసుకోవచ్చుకదా. లేకపోతే నువ్వు అపర్ణవు ఎలా అవుతావు " అని. ఎంతటి చక్కటి కోరిక. ఇక్కడ ఓ చక్కటి సందేహం వచ్చిందిట. ఋణం తీసు...

శ్రీలలితానామం 866 867- సూర్య

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అజా, క్షయవినిర్ముక్తా " - అమ్మవారి అద్భుతనామాలు.  ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 866,867వ నామాలు. " అజా " అంటే పుట్టుక లేనిది. " క్షయవినిర్ముక్తా " అంటే మరణంలేనిది. " పుట్టుక లేనిది " అంటే పుట్టుక ఎప్పుడో కనిపెట్టలేకపోయారు అనుకోవాలి. మరి ఎలా తెలిసింది. మా ఇంటిముందర ఓ పెద్ద రావిచెట్టు ఉండేది. మా అమ్మగారిని " రావిచెట్టు మామ్మ " అని పిలిచేవారు మా బంధువులు. ఆ రావిచెట్టు ఎప్పటినుంచి ఉంది అంటే " ఏమో మీ తాతగారికే తెలీదు " అనేవారు మా అమ్మగారు. ఇప్పుడు భూమి పుట్టి ఎన్నాళ్ళయింది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో ఒక మార్గం యురేనియం రేడియేషన్ కొలవడం.  మన ఋషులు తమ తపశ్శక్తిని, జ్ఞాననేత్రాలను ఉపయోగించి " అమ్మ వారు " ఎప్పుడు పుట్టి ఉంటారూ " అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటారు. ఆ ప్రయత్నంలోనే వారు యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలను దాటి బ్రహ్మ వరకూ వెళ్ళి కాలగణన చేసి తెలియచేసారు. ఈ అద్భుత విషయాలను చదివేనేమో 1866 లోనే గ్రీకు జ్యోతిషపండితుడు " కీరో " - ...

" రాచకం - అరాచకం " సూర్య

 " రాచకం - అరాచకం " - సూర్య 1970/80 లలో ఓ చక్కటి కధ చదవడం జరిగింది. దేముడు " ఓరి మనిషీ, ఎంత ఎదిగావురా " అనుకుంటాడు కధలో. కొన్ని కధలు అలా గుర్తుండిపోతాయి. కధ అదే అయినా కధనం కొద్దిగా మార్చడం జరిగింది. తిరుపతి వెంకన్న భక్తుల దర్శనాలు, సేవలు అన్నీ అయిపోయాక దేవేరులతో ముచ్చట్లాడుతున్నారు ఓ రోజురాత్రి. శ్రీదేవమ్మ కొంచెం నిష్ఠూరంగా " పాపం అతను మీ వీరభక్తుడు కదా, ఇప్పుడు వచ్చిన సునామీకి తిండికూడా లేక అల్లల్లాడుతున్నాడు, కొంచెం సహాయం చేయవచ్చుకదా " అంటుంది. వెంకన్న " నాకూ ఏదో ఒకటి చెయ్యాలనే ఉంది. కానీ నా చేతులు కట్టేసాడు ఈ మనిషి. చూడు ఇప్పుడు ఏమి జరుగుతుందో " అని భక్తుడికి " ఫలానా అధికారిని కలు " అని కలలో చెబుతాడు. దేముడు చెప్పాడు బావుండదని ఆ అధికారిని కలుస్తాడు. వీడినుంచి రూపాయికూడా రాదు అని గ్రహించి ఆ అధికారి " నీకు 50 ఏళ్ళు, 60 దాటినా వృద్ధాప్యం పెన్షన్ ఇచ్చేవాడిని " అని తిప్పి పంపించేస్తాడు. ఇంకో అధికారిని కలుస్తాడు దేముడి సలహాతో. " నీకు 35 దాటిపోయాయి, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేకపోతున్నాను " అంటాడు ఇంకో అధికారి. ఇంకో...

అమ్మవారు తన కళ్ళను అటూ ఇటూ త్రిప్పుతూ అందరినీ గమనిస్తూ ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 " శ్రీమాత్రేనమః " 23+23 " దరాందోళితదీర్ఘాక్షీ " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 601వ నామం. " దరాందోళిత దీర్ఘాక్షీ " అంటే కొద్దిగా అటుఇటు కదులుతూన్న పెద్దకనులున్నది అని భాష్యం చెప్పారు. అమ్మవారు తన పెద్ద పెద్ద కళ్ళను అటూఇటూ కదుపుతూంటేనేకదా సృష్టిలో ఎక్కడెక్కడో ఉన్న జీవులన్నిటినీ గమనిస్తూ అనుగ్రహించగలుగుతారు. శంకరాచార్యులు " సౌందర్యలహరి " గానం చేస్తూ ఇలా అంటారు. " దృశా ద్రాఘీయస్యా దరదళిత        నీలోత్పలరుచా,    దనీయాంసం దీనం స్నపయకృపయా ‌ ‌‌      మామపి శివే,    అనేనా అయం ధన్యో భవతి న చ        తేహానిరియతే,    వనేవా హర్మ్యేవా సమకరనిపాతో        హిమకరః " - శ్లోకం 57 " అమ్మా నేనెక్కడో దూరంగా చివరలో ఉంటాను ( యోగులు ఆవిడకు దగ్గరగా ముందు వరుసలో ఉంటారని, అయోగ్యులు ఎక్కడో వెనుకవరుసలో ఉంటారని భావం ), నీ కన్నులు చాలాపెద్దవి కనుక నీ చూపుని నామీద కూడా పడేలా చూడమ్మా. యోగులనే చూస్తాను, అనుగ్రహిస్తాను అని అనకమ్మా ఎందుకంటే చంద్రకాంతి మేడలమీద అడవిలోనూ సమంగాన...

ధ్యానం దృష్టి భృకుటిమీద పెట్టి చేస్తే అద్భుత ఫలితం కలుగుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " సమం కాయశిరోగ్రీవం    ధారయన్నచలం స్థిరః    సంప్రేక్ష్య నాశికాగ్రం స్వం    దిశశ్చానవలోకయన్ "            - భ.గీత 6:13 పరమాత్మ మనస్సును నిగ్రహించుకోవడానికి యోగాభ్యాసం ఎలా చేయాలో చెబుతూ చూపును " నాశికాగ్రం " అంటే భృకుటిమీద నిలపాలన్నారు. ఇది కనుబొమలమధ్యన ఉంటుంది, అక్కడే శక్తివంతమయిన " ఆజ్ఞాచక్రం " ఉంటుంది. అందుకే సనాతనధర్మం అక్కడ బొట్టు పెట్టుకోమని తెలియచేస్తూంది మనకు. ముద్గలుడు అని ఓ మహర్షి ఉండేవారు. ఆ సమయంలోనే ఓ దొంగ ఉండేవాడు. ఆ దొంగ క్రూరుడు, పరుల డబ్బుమీదే బ్రతికేవాడు. ప్రజాధనం, ప్రభుత్వ సంపద, ప్రకృతివనరులు అన్నీ దోచేసేవాడు. వేలకోట్లు దోచేసాడు. అయినా తృప్తిలేదు. ఎంత నీచుడంటే ఎవరయినా బయటకు వెడుతూంటే ఇంట్లో ఏదయినా తిని వెడతారు, వీడు తినకుండానే వెడతాడు. ఎందుకంటే ఎవరో ఒక బాటసారి ఎదురుపడకపోడు కనుక వాడిని కొట్టి అవసరమయితే చంపేసి వాడి దగ్గరున్నది తీసుకుని తినడం అలవాటయిపోయింది వీడికి. ఓ రోజు అలాగే బయలుదేరాడు. ఆశ్చర్యంగా మధ్యాహ్నం దాకా ఎవరూ ఎదురుపడలేదు. బాగా ఆకలిగా ఉండడంతో ఏదయినా చిన్న జంతువు దొరుకుతుందేమో...

పదవీ వ్యామోహం

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అనన్యాశ్చింతయంతో    మాం ఏజనాః పర్యుపాసతే,   తేషాభియుక్తానాం    యోగక్షేమం వహామ్యహం "                   - భ.గీత 9:22 పరమాత్మ " ఇతరవిషయాల గురించి ఆలోచన చెయ్యకుండా నన్నే ఎవరు సేవిస్తారో వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను " అన్నారు. పాండవులను అలాగే ఆదుకున్నారు స్వామి. ఆఖరికి రాయబారానికి కూడా స్వయంగా వెళ్ళారు. " నరుతే శ్రాంతస్య సఖ్యాయదేవాః " - ఋగ్వేదం. ఎవరైతే కష్టపడరో వారికి దేవతలు కూడా సహాయపడరు అంది వేదం. దీని అర్ధం కష్టపడేవారికి దేవుడు తోడుంటాడు అని. చాగంటివారు, మెట్రో శ్రీధరన్, స్వామినాథన్ వంటివారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చాగంటివారు పరమాత్మను నమ్ముకున్నవారిలో ముఖ్యులు. మిగతా ఇద్దరు కష్టపడేవారిలో ముఖ్యులు. అలాంటివారి యోగక్షేమాలు చూడడానికి పరమాత్మ ఎప్పుడూ తయారుగా ఉంటారు. ఏదో ఒక బలహీనక్షణంలో పై ముగ్గురు పదవీవ్యామోహానికి లోనయి పదవులను తీసుకుని ఉంటే ఈ పాటికి ఏదో ఒక స్కాంలో ఇరుక్కుని కటకటాలు లెక్కిస్తూ ఉండేవారు. చాగంటివారు టిటిడిలో పదవి వద్దన్నదికూడా పరిస్థితులు గమనించే అనుకోవాలేమో. ప...