Posts

Showing posts from November, 2023

" చింతామణి గణపతి - 3 "- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " చింతామణి గణపతి - 3 " గణుడు చింతామణిని బలవంతంగా తీసుకుపోగానే కపిలమహర్షి అమ్మవారిని ధ్యానించి జపం చేయగానే అమ్మవారు ప్రత్యక్షమై " దేనికి నాయనా పిలిచావు " అని అడిగితే మహర్షి అద్భుతమయిన విషయాలు ( మనకు కూడా ) చెప్పారు. " అమ్మా గణుడు మణిని తీసుకుపోయాడు. నాకు ఆ మణిమీద కోరికాలేదు, దాని అవసరమూ లేదు, అతను తీసుకుపోయాడని బాధాలేదు. కాని అటువంటి అద్భుతమైన మణి అటువంటివారి వద్ద ఉండకూడదు. అన్నీ మణివల్ల తేరగా వస్తున్నాయంటే రాజు, ప్రజలు సోమరులవుతారు. ఖాళీగా కూర్చుని సమయం ఎలా గడపాలో తెలియక వ్యసనపరులు అవుతారు. రాజ్యం ( దేశం ) ప్రజలు భ్రష్టుపట్టిపోతారు " అని చెప్పి ఎలాగయినా ఆ మణి తిరిగివచ్చేలా చెయ్యమ్మా అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇది ఎంత సత్యమో తెలుస్తుంది. అమ్మవారు ఓ మంత్రం చెప్పి " దీనిని జపం చేసి హోమం చెయ్యి. మణిని తీసుకొచ్చే ఆయన వస్తాడు " అని చెప్పారు. మహర్షి అలా చేయగానే హోమగుండంలోంచి సిద్ధీ బుద్ధీ సమేత మహాగణపతి వచ్చి " విషయం నేను చూసుకుంటానులే " అన్నారు. అవినీతి, అరాచకాలు చేసేవారు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ...

" చింతామణి గణపతి - 2 " - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " చింతామణి గణపతి - 2 " పూర్వం అభిజిత్ అనే చక్రవర్తి సింధుప్రాంతంలోని రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గణుడు అనే కొడుకు ఉన్నాడు. గణుడు విద్యావంతుడు, తపస్సుచేసి ఎన్నో వరాలు శక్తులు కూడా సంపాదించాడు. ఎంతటి శక్తిమంతుడంటే ఇంద్రుడుమీదకు యుద్ధానికి వెళ్ళి జయించి " నీ స్వర్గం నువ్వే తీసుకో, నీకన్నా గొప్పవాడిని అని తెలియచేయడానికే యుద్ధానికి వచ్చాను " అన్నాడు ఇంద్రుడితో. గణుడు ఓ సారి వేటకు వెళ్ళాడు పరివారంతో. అలసిపోయి ఎక్కడయినా సేదదీరుదామని చూస్తూంటే ఒక ఆశ్రమం కనబడింది. అది కపిలమహర్షి ఆశ్రమం.  మహర్షి వీరిని ఆహ్వానించి " మీరందరూ ఆ నదిలో స్నానం చేసిరండి, మంచి విందు ఏర్పాటు చేస్తాను " అంటే గణుడు మనస్సులో " ఈ మహర్షి విందు అంటున్నారు కాని ఏవో కొన్ని ఫలాలు ఇస్తారేమో తినడానికి. సరే ఏదో ఒకటిలే " అనుకుని స్నానానికి వెళ్ళారు అందరూ. వారికి వారి జీవితంలో రుచి కాదు కదా విననుకూడా వినని రకరకాల వంటకాలతో పసందైన భోజనం పెట్టారు మహర్షి. గణుడు ఆశ్చర్యపోయి " వంటసాల కూడా కనబడుటలేదు, ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ ఎలా ఏర్పాటుచేసారు. మీరు రో...

చింతామణిగణపతి 1 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏  చింతామణిగణపతి -1 మాగ్రామంలో " చింతామణిగణపతి " ని ప్రతిష్టించి, నవరాత్రి ఉత్సవాలు మొదలుపెట్టి, 120 సం.లు అయింది. అప్పటినుంచీ గణపతి నవరాత్రులు నిర్విఘ్నంగా, వైభవంగా, నిత్యనూతనంగా జరుగుతున్నాయి.  రాత్రి మహాపూజ, మహానివేదన అయాక మహామంత్రపుష్పం మొదలవుతుంది. అటు 10 మంది, ఇటు 10 మంది నుంచుని చదువుతూంటే మందిరం ప్రతిధ్వనిస్తుంది. చిన్నప్పుడు మేము కూడా " యో2పామాయతనం వేదా " అని అటుప్రక్కవారు అంటే " ఆయతనవాన్ భవతి " అని అందుకునేవారం ఇటుప్రక్కన( ఆ రెండే వచ్చు అప్పుడు ) సాయంత్రం మహాపూజకి 6,7 ప్రసాదాలు అంటే వేయించినసెనగలు, పోచినసెనగపప్పు, కొబ్బరిలస్కోరా లాంటివి ఒక్కొక్క ఇంటినుంచి వచ్చేవి. లస్కోరాకి చెయ్యిచాపితే మాకు ( పిల్లలకు) పెట్టేవారు కాదు, చేతిమీద రాసేవారు, ఎంతకోపం వచ్చేదో. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ రోజూ మధ్యాహ్నం మగవారికి, పిల్లలకి భోజనాలు పెట్టేవారు. నిమజ్జనం/వాలారింపు రోజు మాత్రం ఆడవారికి, కోమట్లకి కూడా భోజనాలు పెట్టేవారు. ఇప్పుడు కొన్ని ఏళ్ళుగా అన్నిరోజులూ ఊరంతా భోజనాలు. రెండో ఆదివారం ( ఒక ఆదివారమే వస్తే ఆరోజు ) లక్షగరికతో పూజ ...

లలితానామం 967- జ్వాలాతోరణం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సుమంగళీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రనామాలలో 967వ నామం. సుమంగళీ అంటే దీర్ఘసుమంగళత్వాన్ని ప్రసాదించేది. " సు + మంగళం " - లోకాలకు శుభములు కలుగచేస్తుంది. అమంగళం అంటే అజ్ఞానం, దాన్ని పోగొడుతుంది. శుభకార్యం అంటే అశుభాలను తొలగించమని చేసే కార్యం.  విష్ణుసహస్రంలో పూర్వపీఠికలో పరమాత్మని " పవిత్రాణాం చ పవిత్రం, మంగళానాం చ మంగళం " అని ప్రార్ధిస్తాం. మంగళాలలో కెల్లా మంగళమయినవారు అని. అమ్మవారు ఎంతటి కరుణామూర్తియో తెలుసుకోవాలంటే " జ్వాలాతోరణం " వెనక ఉన్న కధ చదవాలి. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు మొదట హాలాహలం పుట్టింది. దేవతలందరూ భయపడిపోయారు. ఎవరూ దానిదగ్గరకు కూడా రాలేనప్పుడు పరమశివుడు దాని అంతుచూడడానికి ఎదరకు వచ్చారు. అమ్మవారు ఏమీ మాట్లాడలేదు. అమ్మవారికి ఆవిడ సుమంగళత్వం మీద అంత నమ్మకం. దీర్ఘసుమంగళత్వాన్ని అనుగ్రహించే అమ్మవారికి లోటేముంది.  శివుడు హాలాహలాన్ని నోట్లో వేసుకున్నారు. లోకాలన్నీ ఎక్కడ ఉన్నాయి. స్వామి ఉదరంలో. హాలాహలం ఉదరంలోకి వెడితే ఏమవుతుంది, లోకాలన్నీ మసి అయిపోయి ప్రాణులన్నీ నశిస్తాయి. మరి ఎలా?...

వృక్షో రక్షతి రక్షితః - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 అమ్మవారి " సృష్టి " ఎంతలయబద్దంగా ఉంటుందో 10 రకాల పుష్పాలను పరికిస్తే చాలు తెలుసుకోవచ్చు. మనస్సు ప్రశాంతతను పొందుతుంది. వాటి రంగు, సువాసన, రేకలకూర్పు ( కొన్నింటిలో మకరందం ) - దేనికదే సాటి - ఎంత అద్భుతవిషయం.  శ్రీకృష్ణుడి కాలం కనీసం 5000 ల సంవత్సరాల క్రితం అని అందరూ ఒప్పుకున్నారు ( మనం ద్వాపరయుగం వారు అంటాం ). ఇప్పుడు తరచు వార్తలు చూస్తూ ఉంటాం - దారికి అడ్డుగానో ప్రయాణానికి అసౌకర్యంగానో ఉన్న పెద్దచెట్టును జాగ్రత్తగా తీసుకెళ్ళి వేరే చోట ప్రాతడం జరిగింది అని. అటువంటి వార్తలు చదివినా విన్నా కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది.  కనీసం 5000 ఏళ్ళ క్రితం శ్రీకృష్ణుడు సత్యభామకోసం ఇంద్రలోకం నుంచి " పారిజాత " వృక్షాన్ని పెకిలించి తీసుకుని వచ్చి సత్యభామ ఇంటిపెరట్లో ప్రాతించారు అని పురాణాలు చెబుతున్నాయి.  అంటే అటువంటి ప్రక్రియ సాధ్యమే అని మన ఋషులు వేలఏళ్ళక్రితమే గ్రహించారని తెలుసుకోవాలి. మా ఇంటిపెరట్లో నా చిన్నప్పుడు అవిశిచెట్టు ఉండేది. కాయలు పువ్వులు కూడా కూరచేసుకునేవారం. ఆశ్చర్యకరంగా అది కొబ్బరిచెట్టులా నిటారుగా పెద్దగా అయిపోయింది. ఓరోజు మా బాబయ్యగార...

క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు - సూర్య

 🙏" శ్రీమాత్రేనమః "🙏 శ్రీలలితాసహస్రం, శ్రీవిష్ణుసహస్రం నామాలు అనుష్టుప్ ఛందస్సులో చెప్పబడ్డాయి/వ్రాయబడ్డాయి. 4 పంక్తుల శ్లోకమైతే పంక్తిలో 8 అక్షరాలు 2 పంక్తుల శ్లోకం లో అయితే పంక్తిలో 16 అక్షరాలు ఉంటాయి. కాని కొన్ని పదాలు వచ్చినప్పుడు ఒక అక్షరం ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు " అ " కి బదులుగా " 2 " ( ప్రింటింగులో అదే వాడుతున్నారు ) గుర్తు వేస్తారు. 8 అక్షరాలే ఉంటాయి కాని ఉచ్ఛారణలో " అ " వినబడేలా ఉండాలి. ఉదా: ప్రద్యుమ్నో2మితవిక్రమః, క్షేత్రజ్ఞో2క్షర, సోమసో2మృతపః, పద్మనాభో2మరప్రభుః, సంకర్షణో2చ్యుతః మొగు నవి. " ప్రద్యుమ్నో అమితవిక్రమః " అని చదవాలి, ప్రద్యుమ్నో మితవిక్రమః అని కాకుండా. స్వామి మితవిక్రముడు కాదు, అమితవిక్రముడు. అలాగే ఆయన అక్షర అంటే క్షర/నాశనము లేనివాడు.  ఎక్కువగా ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారు పారాయణం చేసిన విష్ణుసహస్రమే వింటూంటాం ( భక్తి, ఎస్ వి బి సి టి వి లలో). వందలసార్లు విన్నా ఎప్పుడూ ఆవిడ " పద్మనాభో మరప్రభుః " అన్నట్లే అనిపిస్తుంది ఎంత జాగ్రత్తగా విన్నా.  మొన్న సామవేదం వారి ప్రవచనం వినడం జరిగింది. ఆయన ఒక అద్భుతవిషయం ...

భగవద్గీత - 18:37 - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " యత్తదగ్రే విషమివ    పరిణామే2మృతోపమం,    తత్సుఖం సాత్వికం ప్రోక్తం    ఆత్మబుద్ధిప్రసాదజం "              - భ.గీత 18.37. " ప్రారంభమునందు విషతుల్యముగా అనిపించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమై భగవంతునికి సంబంధించిన విషయములలో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్వికసుఖము అందురు " అని పరమాత్మ తెలియచేసారు. ఓ పిల్లవాడిని చదువుకోమంటారు తల్లిదండ్రులు, గురువులు. కాని సినీమాలు, సెల్ ఫోనులు, చెడుస్నేహాలు మొదలైనవి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవిగాను చదువు విషం, గుదిబండగానూ అనిపిస్తుంది. చదువుమీద శ్రద్ధపెడితే జీవితమంతా ఆనందమయంగా ఉంటుంది. అలాకాక మిగతా విషయాలవైపే మ్రొగ్గితే ఇప్పుడు సంతోషంగా అనిపించినా జీవితమంతా బాధపడవలసి వస్తుంది. రామకృష్ణపరమహంస అమ్మవారి ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నారు ఓరోజు. ఒకాయన వచ్చి గట్టిగా అరుస్తున్నాడు అమ్మవారి ముందు నుంచుని. విషయమేమిటంటే ఆముందరరోజు ఆలయంలో దొంగతనం జరిగింది, అమ్మవారి నగలన్నీ పోయాయి. ఆనగలని సమర్పించినది ఈ అరిచే ఆయనే. " ఆనగలు వేసుకుని ఎంత కళగా ఉండేదానివి. నగలను కాపాడుకునే బాధ్యత నీది కా...

శ్రీశంకరులు - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " న మంత్రం నో యంత్రం    తదపి చ న జానే    స్తుతిమహో, నచాహ్వానం    ధ్యానం తదపి చ న జానే      స్తుతికధాః, న జానే ముద్రాస్తే     తదపి చ న జానే విలపనం,      పరం జానే    మాతస్త్వదనుసరణం      క్లేశహరణం "  పూజ్యులు శంకరాచార్యులు " దేవీ అపరాధ క్షమా స్తోత్రం " చేస్తూ ఇలా అన్నారు - " అమ్మా నాకు నీ మంత్రం , యంత్రం తెలియదు, ఎలా స్తుతించాలో తెలియదు , నీ ముద్రలు తెలియవు, నిన్ను చేరేందుకు ధ్యానం( మెడిటేషన్ ) ఎలాచేయాలో తెలియదు , చివరకు ఏడవడం కూడా తెలియదు కానీ ఒకటిమాత్రం తెలుసుకున్నాను, నిన్ను అనుసరిస్తే ( నీ ఎరుక కలిగి ఉంటే ) చాలు నా కష్టాలన్నీ తొలగిపోతాయి " అని. అంతటి మహానుభావుడు తను ఏమీ తెలియని అమాయకుడినన్నారు. దేశంలో 4 దిక్కులా పీఠాలు ఏర్పరిచారు, ఎన్నో శక్తిపీఠాల్లో ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపచేయడానికి గుడులలో యంత్రప్రతిష్ఠ చేసారు. మదురమీనాక్షి కూడా ఒకప్పుడు ఉగ్రంగా ఉండి అర్ధరాత్రి ఊళ్ళో తిరుగుతూ జనాలని సంహరించేదిట. కొన్నిరోజులు గుడిలోనే ఉండిపోయి ఆవిణ్ణి స్త...

భగవద్గీత - 18:63 - మతం - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏‌ " మతం - సమ్మతం " " ఇతితేజ్ఞానమాఖ్యాతం    గుహ్యతే గుహ్యతరం                    మయా ,    విమృశ్యైతదశేషేణ    యధేచ్ఛసి తధాకురు "              - భ.గీత 18:63. పరమాత్మ " నేను నీకు చెప్పవలసిన రహస్యజ్ఞానమంతా చెప్పాను. ఏదో నేను చెప్పానని కాకుండా దీన్ని సమగ్రంగా నీ బుద్ధితో విమర్శచేసుకుని నీకు తోచిన/నచ్చిన విధంగా ఆచరించు " అన్నారు అర్జునుడితో. " మతం " అంటే అర్ధం అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వారివి. ఆశ్చర్యకరంగా ఒకరికే ఇప్పుడున్న అభిప్రాయం మరుక్షణంలో మారిపోవనూ వచ్చు.  పరమాత్మ గీతలో ( 6:32 ) " అన్నిజీవులను సమభావంతో చూస్తూ సుఖదుఃఖాలను ఒకేవిధంగా స్వీకరించేవాడే పరమశ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయం " అన్నారు. ఎంత అద్భుతం. స్వామియే " ఇదే సత్యం అనలేదు, నా అభిప్రాయం మాత్రమే " అన్నారు. గీతలో పలుచోట్ల " విద్వాంసులు, సాంఖ్యులు ఇలా అభిప్రాయపడ్డారు " అని నొక్కి చెప్పారు. నపుంసకత్వం, హృదయదౌర్బల్యం వదిలేయి అన్నారు, రాజుగా యుద్ధం చెయ్యడం నీ ధర్మం అన్నారు, అలా ...

లలితానామం 799,800 - రసజ్ఞా - సూర్య

 🙏" శ్రీమాత్రేనమః " 🙏 " రసజ్ఞా, రసశేవధిః " - అమ్మవారి అద్భుతనామాలు.  శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 799,800వ నామాలు. " రసజ్ఞా " అంటే రసములగురించి తెలిసినది అని అర్ధమయినా ఆవిడ " రసస్వరూపిణి ". వేదాలు పరమాత్మని " బ్రహ్మానందరస స్వరూపం " అని తెలియచేస్తున్నాయి. " రసశేవధిః " అంటే " రసములకు గని వంటిది " అని అర్ధం. రసలక్షణం లోపల ఉంటేనే మనిషికి ఉత్సాహం, ప్రేమ, ఆనందం, ఉల్లాసం ఉంటాయి. రసభావన లేకపోతే ఏదీ ఆనందించలేడు, అందుకే జీవితం వ్యర్ధం అంటారు. నవరసాలు + భక్తి తో కూడిన 10 రసాల సమాహారమే జీవితం. అందుకే తరచుగా ఈ భావన లేని మనిషిని " రసహీనుడు " అంటారు.  మహాకవి కాళిదాసు కూడా విద్వత్సభకి వెళ్ళేటప్పుడు " ప్రేక్షకుల్లో కొందరైనా రసజ్ఞులు ఉండేలా చూడు తల్లీ " అని ప్రార్ధించేవారుట. చాగంటివారైనా, గరికిపాటివారైనా ప్రవచనం చేసినప్పుడు కొందరైనా ఆనందించేవారు, ఆనందం వ్యక్తపరచేవారూ ఉండాలి కదా. ఆ భావన అందరిలోనూ ఉండాలి. అప్పుడే సర్వం ఆనందమయం. ఆ రసభావన ఇచ్చేది అమ్మవారే. మధురమైన ( రస ) సంభాషణ ఎంతటివారినైనా కట్టిపడేస్తుంది. మా గ్రామవా...

భగవద్గీత - 6:35 - వైరాగ్యం - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " అసంశయం మహాబాహో    మనో దుర్నిగ్రహం చలం   అభ్యాసేన తు కౌంతేయ    వైరాగ్యేణ చ గృహ్యతే "                 - భ.గీత 6:35 అర్జునుడు అంటాడు " మనస్సును నిగ్రహించడం అంత సులువుకాదు కదా " అని. అప్పుడు పరమాత్మ అంటారు " కష్టమే కాని వైరాగ్యంతో కూడిన అభ్యాసంతో నిగ్రహించుకోవడం సులభమే " అని. ఇక్కడ స్వామి " వైరాగ్యేణ చ " అన్నారు. చ అంటే మరియు అని, అంటే అభ్యాసంతో బాటు వైరాగ్యం కూడా అవసరం అన్నారు. ఒక స్వామిని " ధైర్యం " అంటే ఏమిటి అని అడిగితే " వైరాగ్యం " అన్నారు.  ధైర్యం అనేది మానసికం. అది వ్యాయామాలు కసరత్తులు చేస్తే వచ్చేదికాదు. వైరాగ్యం వల్లే వస్తుంది. ఏది జరిగినా మనమంచికే అనుకుంటూ అన్నీ పరమాత్మ ప్రసాదాలే/అనుగ్రహాలే అనుకుంటే అంతా సచ్చిదానందమే. గరికిపాటివారు క్రిందటేడాది పూజ్యులు శ్రీమల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి నివాళులు అర్పిస్తూ ఓ అద్భుతవిషయం తెలియచేసారు. పుట్టపర్తిసంస్థానం వారు శాస్త్రిగారికి స్వర్ణపుష్పాభిషేకం చేయ సంకల్పించి ఆహ్వానం పంపారుట. ఈయన అప్పటికే ప్రవచనాలూ అవీ మానేశారు. " నేను రాలేను...

భగవద్గీత 11:53 - సూర్య

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " నాహం వేదైః నతపసా    నదానేన నచేజ్యయా,   శక్యా ఏవంవిధో ద్రష్టుం    దృష్టవాన్ అసి మాంయధా "                    - భ.గీత 11:53 గీతలో పరమాత్మ అంటారు " వేదాలు చదవడం తపస్సుచెయ్యడం దానంచెయ్యడం పూజలుచెయ్యడం లాంటివాటితో నన్ను చూడడం/పొందడం సాధ్యమైన పనికాదు " అని. తనయందు అచంచలమైన భక్తితో మాత్రమే అది సాధ్యమని తెలియచేసారు. " యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ .గీత 10:25 ) " - యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను అన్నారు. స్వయంగా పరమాత్మే జపాన్ని చేసుకో చాలు అనడమే కాకుండా అలా చేసిన త్యాగయ్యను, అన్నమయ్యను, రమణమహర్షిని అనుగ్రహించి కారణజన్ములను చేసారు. ఓ సారి దగ్గరగా మసిలే ఒకాయన " ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటే ఎలాగండి. కేదారినాధ్, బదరినాధ్, హరిద్వార్ అవీ వెళ్ళివస్తే అన్నీ చూసినట్లు ఉంటుంది కదా " అంటే రమణమహర్షి " నాకూ వెళ్ళాలనే ఉంది, ఎక్కడైనా పంచభూతాలు ( భూమి నీరు గాలి నిప్పు ఆకాశం ) కాక 6వది కనిపిస్తే చెప్పు, వెళ్ళి చూసివస్తాను " అన్నారుట. కారణజన్ములు. గరికిపాటివారు తరచూ అంటూంటారు " దేవుళ్ళకు, నవగ్రహాలకు ఎవరిమీదయినా కోపం ఎంద...

శతమానం భవతి - సూర్య

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్ధించారు: " పాపోత్పాత విమోచనాయ    రుచిరైశ్వర్యాయ      మృత్యుంజయ   స్తోత్రధ్యాన నతిప్రదక్షిణ    సపర్యాలోకనాకర్ణనే |   జిహ్వాచిత్త శిరోరంఘ్రి    హస్తనయన శ్రోత్రైరహం    ప్రార్థితో మామాజ్ఞాపయ    తన్నిరూపయ      ముహుర్మామేవ    మా మేఽవచః " || ఓ మృత్యుంజయా, పాపములు నశించి కోరిన కోరికలు నెరవేరుటకు నిన్ను ప్రార్ధించుమని నాలుక, ధ్యానం చేయమని మనస్సు, నమస్కరింపుమని శిరస్సు, ప్రదక్షిణము చేయుమని పాదములు, పూజింపుమని చేతులు, చూడుమని కన్నులు, నీలీలలు వినుమని చెవులును నన్ను కోరుచున్నవి. నీ అనుగ్రహంలేనిదే నాకు అదెలా సాధ్యము. అనుగ్రహం ప్రసాదించడమే కాకుండా మూగ, కుంటి, గ్రుడ్డి, మందమతిత్వము మొదలైన లోపములు నాకు కలుగకుండా చూడు స్వామీ.  ఏలోపాలూ లేని చక్కటి ఆరోగ్యాన్నిచ్చి నిన్ను సేవించుకునేలా చెయ్యమని ఎంత లౌక్యంగా ప్రార్ధన చేసారో శంకరులు. వేదంలో ఆశీర్వచనం ఇలా చేయమని ఉంది: " పశ్యేమ శరదశ్శతం,    శృణువామ శరదశ్శతం,    జీవేమ ...

కార్తీకమాసం పవిత్రత - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 పురాణాలు, ఉపనిషత్తులు మనకు ఋషులు ఇచ్చిన అద్భుత సంపద. చిన్నచిన్న కధలతో మనకు, మానవాళికి, ప్రపంచానికి ఏది మంచో ఏది చెడో చక్కగా తెలియచేయబడ్డాయి. కార్తీకపురాణం లో ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి. ఒక సందర్భంలో సరస్వతీదేవి గాయత్రీదేవిని ఉద్దేశించి ఇలా అంటారు: " అపూజ్యా యత్రపూజ్యంతే    పూజ్యానాంచ వ్యతిక్రమః,   త్రీణిత్రత్ర భవిష్యంతి      దుర్భిక్ష్యం మరణం భయం ". " ఎక్కడైతే పూజార్హతలేనివారు పూజింపబడుతూ ఉంటారో, పూజనీయులు పూజింపబడడంలేదో అక్కడ కరువు, మరణం, భయం అనే మూడు విపత్తులు కలుగుతాయి " అని.  ఇప్పుడు పూజార్హతలేనివారికి కూడా పాలాభిషేకాలు జరుగుతున్నాయి. అందువల్లే ఈ విపత్తులన్నీ అని అనుకోవచ్చు. ఈ పురాణంలోనే కృష్ణపరమాత్మ సత్యభామతో ఇలా అంటారు: " దేశగ్రామకులానిస్యుః    భోగభాంజికేతాదిషు,   కలౌతు కేవలం కర్తా    ఫలభుక్పుణ్యపాపయోః ". అంటే " కృతయుగంలో పాపపుణ్యాలు ఎవరు చేసినా గ్రామానికి చెందేవి. ద్వాపరంలో వారి వంశానికి చెందేవి. కలియుగంలో మాత్రం ఎవరి కర్మఫలాలు వారికే చెందుతాయి " అని. స్వామి ఎన్నో అద్భుతమైన ఇతర విషయాలు ...

విష్ణుసహస్రం - 2 - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " వ్యవసాయో వ్యవస్థానః,    సంస్థానో స్థానదో ధృవః ". శ్రీవిష్ణుసహస్రనామాలలో ఈ నామాలు వస్తాయి. " వ్యవసాయః " అంటే " మానవాళి అభ్యున్నతికి కృషి చేసేవారు " అని అని భాష్యం చెప్పారు ఆదిశంకరాచార్యులు. ఎంతటి అద్భుతమైన నామం మరియు భాష్యం. పంటలు పండించడాన్ని వ్యవసాయమని, పండించేవారిని వ్యవసాయదారులని ఎంత అద్భుతమైన పేర్లు పెట్టుకున్నాం. ఉదయంలేస్తే రాత్రి పడుకునేవరకూ ఎంతటి కోటీశ్వరుడికైనా వ్యవసాయదారుడే దిక్కు. ఏపని చెయ్యాలన్నా శక్తి కావాలికదా.  అధర్వణవేదంలో ఓ మంత్రం ఉంది. దాని అర్ధం " నాగళ్ళతో దున్నాలి, విత్తులు నాటాలి, కంకులు పండాలి " అని. ఎలా పండాలంటే " బరువుతో కంకులు వంగిపోవాలి " అని కూడా చెప్పింది వేదం.  రుద్రచమకంలో " అన్నంచ మే, అక్షుశ్చ మే, వ్రీహయశ్చ మే, యవాశ్చ మే, మాషశ్చ మే, తిలాశ్చ మే, ముద్గాశ్చ మే, ఖల్వాశ్చమే గోధూమాశ్చ మే...." - అంటే వరి, మినుములు, నువ్వులు, గోధుమలు ప్రసాదించుస్వామీ అని. ఇంకోచోట " ఓషధశ్చ మే, కృష్టపచ్యంచ మే, అకృష్టపచ్యంచ మే " అంటే ఓషధులు - దున్ని పండించేవీ, దున్నకుండా వర్షా...

విష్ణుసహస్రం -1 - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 విష్ణుసహస్రనామ స్తోత్రం లో " భయకృత్ భయనాశనః " అనే నామాలు ఉన్నాయి - అంటే భయాన్ని కలిగించేదీ ఆయనే భయాన్ని నాశనం చేసేదీ ఆయనే. అదెలాగా భగవంతుడు మన భయాన్ని పోగొట్టాలి కాని కలిగించడం ఏమిటీ అన్నది ఒక మంచి ప్రశ్నే.  భయం అనేది ఒక వరం, అది లేకపోతే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. ఒకాయన ఇంకో ఆయనతో గొడవపడతాడు, అవతలి వాణ్ణి హత్యచేసేద్దామన్నంత కోపం వచ్చేస్తుంది. హత్య చేయడానికి కావలిసిన బలం, డబ్బు, బలగం అన్నీ ఉంటాయి. వీటితోపాటు అతని అదృష్టం కొద్దీ కొద్దిగా భయం కూడా ఉంటుంది. ఏమనీ అంటే ఎంతజాగ్రత్తగా హత్య చేసినా ఎలాగైనా పొలీసులు పట్టేస్తారు, కోర్టు ఉరిశిక్షో యావజ్జీవమో వేస్తుంది, ఇంతబ్రతుకు బ్రతికి అలాంటి శిక్ష తనకీ తన కుటుంబానికీ ఎంత అవమానకరం అని ఓ క్షణం భయపడతాడు , కోపం నుంచి బయటపడతాడు మళ్ళీ ఆనందమయమైన జీవితం గడుపుతాడు.  ఎక్కువమందిలో భగవంతుడు కలుగచేసిన భయం ఉంటుంది. దానివల్ల కష్టాలనుంచి తప్పించుకుంటారు.  కొద్దిమంది మాత్రమే ఈ భయాన్ని పట్టించుకోక తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తారు, ఎందుకంటే " ప్రారబ్దం భోగతో నశ్యేత్ " అన్నారు , అనుభవించడం వల్లే వారి ప్రారబ్...

నారదమహర్షి గొప్పదనం - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 నారదులవారు దేవర్షి. ఋషివ్యవస్థ అంటే ఈశ్వరసంకల్పాన్ని భూమిమీద ప్రవర్తింపచేసే వ్యవస్థ. ఋషుల్లో దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు ఉంటారు. " నారం దదాతి ఇతి నారదః " అన్నారు. నారం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్ధం. రత్నాకరుడు అనే కిరాతకుడికి " రామ " నామాన్ని ప్రసాదించడంతో అతను వాల్మీకిగా మారాడు. వాల్మీకి మనకు అద్భుతమైన రామాయణ ఇతిహాసాన్ని ప్రసాదించాడు.  మహాభారతం వ్రాసాక వ్యాసులవారు నారదుడితో " మనోవ్యాకులతతో బాధపడుతున్నాను, ఏమి చెయ్యమంటారు " అని అడిగితే " భాగవతం " వ్రాయి, అన్ని బాధలు తొలగుతాయి అన్నారు నారదులు. అలా భాగవతం వచ్చింది మనకు. ప్రహ్లాదుడికి " ఓం నమో నారాయణాయ ", ధృవుడికి " ఓం నమో భగవతే వాసుదేవాయ " మహా మంత్రాలని ప్రసాదించి చరితార్ధులయేలా అనుగ్రహించారు. సనకసనందనాదులకి " నారదపురాణం " ని అనుగ్రహించారు. దానిలోనిదే అద్భుతమైన " సంకటనాశన గణేశస్తోత్రం ".  దక్షప్రజాపతి తనకుమారులకు తత్వబోధచేసి వారిని విరక్తులుగా చేసాడని నారదులవారిని " నీకు ఏలోకంలోనూ స్థానం ఉండదు ...

హీరో - జీరో - మహాభారతం - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " ఏవం బుద్ధిశ్చ తేజశ్చ    ప్రతిపత్తిశ్చ భారత,    భవంతి భవకాలేషు    విపద్యంతే విపర్యయే "  పై శ్లోకం మహాభారతంలోనిది. వ్యాసమహర్షి అంటారు అర్జునుడితో " ఇవే బుద్ధి, తేజస్సు , ఇతర శక్తులు అంటే ఆయుధాలు, ధైర్యం, ఉపాయాలు, చురుకైన మనస్సు వంటివి అన్నీ ఉంటాయి కాని - కాలం కలిసివచ్చినప్పుడు రాణిస్తాయి, కాలం కలిసి కలిసిరానప్పుడు ఏవీ పనికిరాకుండా పోతాయి " అని. శ్రీకృష్ణుడు ఆజ్ఞ ప్రకారం ద్వారకలోని స్త్రీలని, పిల్లలని వెంటపెట్టుకుని హస్తినకు బయలుదేరుతాడు అర్జునుడు. దారిలో బందిపోటుదొంగలు అడ్డగించి నగలని దోచుకుంటారు, స్త్రీలని ఎత్తుకుపోతూంటారు. అర్జునుడికి ఒక్క మంత్రం జ్ఞాపకానికి రాదు, ఒక్క బాణం కూడా వెయ్యలేకపోతాడు. దొంగలు హేళన చేస్తారు, నవ్వుతారు అర్జునుడి పరిస్థితి చూసి. మిగిలినవారితో హస్తినకు వచ్చిన తరువాత అర్జునుడు వ్యాసుల వారి కాళ్ళపై పడి భోరున ఏడ్చి తనకీ దుర్గతి ఏమిటీ అన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి. 5000 ( కనీసం అందరూ అనుకుంటూన్నట్లుగా ) ఏళ్ళక్రితం చెప్పినవి, ఇప్పటికీ నిత్యసత్యాలు. ఇలాంటివి ఎన్నో తరచూ చూస్తూంటాం, వింటూంటాం. కాలం కల...

శ్రీభాస్కరరాయల " - సౌభాగ్యభాస్కరం " - సూర్య

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం " సౌభాగ్యభాస్కరం " వ్రాసిన శ్రీభాస్కరరాయలవారు అమ్మవారి ప్రియభక్తుడు. అద్భుతమయిన విద్వత్తు. ఆయన శ్రీలలితాసహస్రనామాలకే కాక త్రిపుర, భావనోపనిషత్తులకు కూడా భాష్యం వ్రాసారు. గణేశసహస్రంకి భాష్యం వ్రాసారు. అద్భుతమైన గణేశసహస్రం శివుడు ప్రసాదించినది. భాస్కరరాయలవారు నివసించే రాజ్యపు రాజు ఓసారి ఈయన దగ్గరకు వచ్చి " సంతానం లేదు " అని బాధపడ్డారు. ఈయన " దానిదేముంది, ఓ చక్కటి యాగం ఉంది, చేద్దాం. కొన్ని రోజులు ఇక్కడే ఉండు " అన్నారు. ఆ యాగానికి ఉదయం సాయంత్రం నదీస్నానం ముఖ్యం. అక్కడకు దగ్గరలో నది ఏదీ లేదు. భాస్కరులు " సరే సంకల్పం చేద్దాం, ఓ నదిని యాగం అయేదాకా మన గ్రామం మీదుగా ప్రవహించమని " అని సంకల్పం చేసారు. కొంచెం దూరంలో ప్రవహిస్తూన్న నది మహదానందపడిపోయింది. భాస్కరులు తనలో కొంతకాలం స్నానం చేస్తారని. వెంటనే దారి మరల్చుకుని ఆ గ్రామం మీదుగా ప్రవహించడం మొదలు పెట్టింది. నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి కాని నదులు కూడా ఎవరయినా పుణ్యాత్ములు స్నానానికి వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటాయి అని చెబుతారు పండితు...

శ్రీశంకరజయంతి - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 శ్రీశంకరాచార్యుల జయంతోత్సవాలలో వేదపండితులు ప్రవచనం చేస్తూ కొన్ని అద్భుతవిషయాలు తెలియచేసారు. ఒకసారి వివిధ మతాలగురించి కొందరు నాస్తికులు ప్రస్తావన తెస్తే ఓ వేదపండితుడు అన్నారు " వేరే మతగ్రంధాల్లో దంతధావన గురించి ఉందా " అని. వారు ఆశ్చర్యపోయి " అదేమిటి " అంటే ఈయన " మా వేదాల్లో ఉదయం ఎన్నింటికి లేవాలి, దంతధావనం వేటితో ఎప్పుడు ఎందుకు ఎలా చేసుకోవాలి, స్నానం ఎన్నింటికి ఎలా ఎందుకుచెయ్యాలో, భోజనం ఎప్పుడు ఎలా ఎందుకు చెయ్యాలో స్ఫష్టంగా ఉంది. మావేదాలు జీవనవిధానం తెలుపుతాయి. ధర్మాచరణ చెయ్యడానికి శారీరక ఆరోగ్యం ముఖ్యం కనుక ఆ విషయాలు కూడా తెలియచేసాయి. వేరేమత గ్రంధాల్లో ఇలాంటివి ఉన్నాయా " అని అడగడంతో వాదన అక్కడితో ముగిసిందిట. ఎంతటి అద్భుత విషయం. యజుర్వేదం/అధర్వణవేదాల్లో అధికసంపద కోసం చేసే యాగం ఉంది. కోరికలు తప్పుకాదు. వివిధరకాలైన కోరికలు తీర్చుకోవడానికి వీలుగా చాలా కార్యక్రమాలు తెలియచేసాయి మన శాస్త్రాలు. ఈ యాగంలో చివరన " సంపదను చేతిలో ఉంచు " అని కోరడం ఉందిట. " ఎవరి చేతిలో ఉంచాలి, ఎందుకు నా చేతిలో ఉంచు అని అనలేదు " అన...

మందారపువ్వు అంటే తెల్లజిల్లేడు పువ్వు, మనందరం అనుకునే మందారపువ్వు కాదు - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " పాటలీకుసుమప్రియా, మందారకుసుమప్రియా " అమ్మవారి అద్బుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 773, 776 వ నామాలు. అమ్మవారికి పాటలీకుసుమం అంటే ఇష్టం. పాటలీ అంటే గులాబీరంగు. గులాబీ పువ్వు అనుకోకూడదు. తెల్లవి, పసుపువి ఇప్పుడు నల్లవి కూడా గులాబీలు వస్తున్నాయి కనుక. దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని కీర్తిస్తాం. అగ్ని/మంట ఎరుపు పసుపూ కలిసిన రంగులో ఉంటుంది అమ్మవారు. ఆ రంగులో ఉన్న పువ్వులన్నీ గులాబీరంగులో ఉన్న పూవులుగా భావించాలి. అమ్మవారికి " మందారపువ్వు " అన్నా ఇష్టమే. మనకు చిన్నప్పటినుంచీ తెలిసిన విషయం " మందారం అనగానే ముద్దమందారం, రేకమందారం, ఎర్రమందారం, పసుపుమందారం " అని. కాని ఇక్కడ మందారం అంటే " తెల్ల జిల్లేడు పువ్వులు " అంతేకాని మనం సాధారణంగా అనుకుకునే మందారం కాదు. " మందారకుసుమప్రియా " అంటే అమ్మవారికి తెల్లజిల్లేడు పువ్వులంటే ఇష్టమని. ఒక్కో రహస్యనామానికి అర్ధం తెలుసుకుని వ్రాయడం అంటే ఎన్ని గ్రంధాలు తిరగెయ్యాలి, ఎంత కష్టపడాలి. శంకరులు బ్రహ్మసూత్రాలకి భాష్యం వ్రాసారు. తరువాత స్వయ...

శ్రీలలితానామం - 757 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏  " క్షరాక్షరాత్మికా " - అమ్మవారి అద్భుతనామం. శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 757 వ నామం. " క్షరాక్షరాత్మికా " ఒక అద్భుతనామం. క్షర అంటే నాశనమయ్యేది అని అక్షర అంటే నాశనము లేనిది అని సాధారణంగా చెప్పుకునే అర్ధం. కాని ఇక్కడ సంఖ్యలేనన్ని అంటే సంఖ్య " ఇంత " అని తెలుసుకోలేనన్ని అక్షరముల స్వరూపముగలది అమ్మవారు అని అర్ధం చెప్పుకోవాలి. వేదం చెప్పినవిషయం " ఓం ఇత్యేకాక్షరం (ఇతి+ఏక+అక్షరం ) బ్రహ్మ " - ఓంకారమనే అక్షరమే బ్రహ్మం, ఆ అక్షరాన్నుంచే అన్ని అక్షరాలు జనించాయి అని తెలుసుకోవాలి అని. " అ ఆ....." లకు " అక్షరం అంటే నాశనము లేనిది అని పేరుపెట్టడమే ఒక అద్భుత ప్రక్రియ.  అక్షరం ని అమ్మవారుగా భావించి కొలిచే అద్భుత సంప్రదాయాన్ని మనకు ఇచ్చింది మన సనాతనధర్మం. అక్షరాభ్యాసం దగ్గరనుంచి పిల్లలకు చదువులతల్లి సరస్వతీదేవి ని ఎలా గౌరవించాలో నేర్పించడం, పుస్తకాలను ఎంత జాగ్రత్తగా గౌరవప్రదంగా ఉంచుకోవాలో నేర్పడం కూడా జరుగుతూంది.  అద్భుతవిషయమేమిటంటే ప్రతి అక్షరానికి ఒక అధిస్టానదేవత ఉంటుంది. ఆవిడ ఏ రంగులో ఉంటుందో ఏ వస్త్రం ధరిస్తుందో ఆవిడన...

శ్రీశంకరజయంతి 2 - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 శ్రీశంకరజయంతి వేడుకలు  భాగ్యనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగాయి.  ఆ సందర్భంగా ఓరోజు శ్రీకంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకరవిజయేంద్రసరస్వతి మహాస్వామి వారు అనుగ్రహభాష్యం చేసారు. ఆదిశంకరుల గురించి అద్భుత ప్రవచనం చేసారు. ఆయనకు కుడిప్రక్క " దరహాసోజ్వలముఖి " కంచికామాక్షి అమ్మవారి చిత్రం, వేదపండితులు ఉంటే ఎడమప్రక్కన పూజ్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు ఆశీనులయి ప్రవచనాన్ని శ్రద్ధగా విన్నారు. పీఠాధిపతి సుమారు 2 గంటలు ప్రవచనం చేసి అద్భుతవిషయాలు తెలియచేసారు. ఆయన తెలియచేసినది అందరూ ఆలోచించవలసినది అయిన ఒక అద్భుతవిషయం - " మనలో ( హిందువుల్లో ) మానసిక ( భావ ) దారిద్ర్యం ఎక్కువయిపోతూంది. ఇదివరకు ఇలా లేదు. మానసికంగా చాలా ధృఢంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మనిషికి. నిరాశ, అత్యాశ రెండూ ఉండకూడదు " అని. శంకరాచార్యుల తత్వం అందరినీ కలుపుకునిపోయే తత్వం. ఆయన ఎప్పుడూ ఇంకొకరి అభిప్రాయాన్ని ( మతాన్ని ) కించపరచడం, అవమానించడం చేయలేదు. ఆయన అందరూ అంటే పండితులే కాదు పామరులు కూడా తరించాలనే భావన చేసేవారు. అందుకే శివానందలహరి, సౌందర్యలహరి లాంటివేకాకుండా ఎం...

శ్రీలలితానామం - 769 - సూర్య

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " యజ్ఞరూపా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 769 వ నామం.  ఆవిడ యజ్ఞస్వరూపురాలు.  లలితాసహస్రం లోనూ విష్ణుసహస్రం లోనూ చాలా నామాలు ఒకలాగే అనిపిస్తాయి. విష్ణుసహస్రం లో ఇలా ఉంది: " యజ్ఞో యజ్ఞపతిః యజ్వా    యజ్ఞాంగో యజ్ఞవాహనః "  - అంటే ఆయన యజ్ఞస్వరూపుడు. యజ్ఞం అంటే ఉపనిషత్తులు చెబుతూన్నది " త్యాగం " అని. దీనికి " నేను, నాది " అన్నది ప్రక్కనపెట్టి కొంత త్యాగం చేస్తూ ఉండాలి. ఏపని అయినా యజ్ఞం లా అంటే క్రమశిక్షణతో శ్రద్ధగా చెయ్యాలని చెబుతారు. తల్లిదండ్రులు, గురువులు, సన్నిహితస్నేహితులు ప్రతీరోజూ చేసేది యజ్ఞమే అని గ్రహించాలి. ఏదయినా పని అవకపోతే " దేనికయినా పెట్టిపుట్టాలి " అని అంటూంటారు. ఈ పెట్టడమే త్యాగం క్రిందకు వస్తుంది. " యధాశక్తి " మనకు ఉన్నదాంట్లో కొంత దానధర్మాలకి ఖర్చుపెడితే తిరిగి అదే మనల్ని అవసరమయినప్పుడు ఆదుకుంటుంది. శ్రీగరికిపాటివారు ప్రవచనం చేస్తూ ఓ చక్కటి విషయం చెప్పారు. ఓ పండితుడు జుట్టు బాగా పెరిగిపోవడంతో సెలూన్ కి వెళ్ళాడు క్షవరానికి. షాపతను " గురువుగారూ రండి ...

ఋషి వ్యవస్థ ఆవశ్యకత - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " ఋషి " అంటే అతీంద్రియమయిన జ్ఞానాన్ని దర్శించినవారు. శాస్త్రజ్ఞులు కూడా ఋషులే. గెడ్డంపెంచుకుని ముక్కుమూసుకుని ఓమూల కూర్చుని ఉంటారు అని సామాన్యుల భావన. సినీమాలు మనల్ని అలా అనుకునేలా చేసాయి. వారు కారణజన్ములు. వారు ఏది చేసినా లోకకళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకునే. అటువంటివారు జీవించేది లోకకళ్యాణంకోసం.  రామాయణంలో 27 రకాల ఋషుల వివరణ ఉంది. 27 ఋషులుకాదు, 27 రకాల ఋషులు. కొందరు నీరునుమాత్రమే, కొందరు గాలినిమాత్రమే, కొందరు గాలిలో తేలుతూ, కొందరు సూర్యరశ్మినే అహారంగా తీసుకుంటూ ఇలా అనేక ఋషులు లోకకల్యాణం కోసం తపస్సు చేస్తున్నారు అని. మాతంగ మహర్షి శబరితో " నేను వచ్చినపని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, త్వరలో రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారు, వారిని సేవించుకుని తరించు " అని చెబుతారు. వస్తున్నారని తెలిసినా రామలక్ష్మణులకోసం ఆగలేదు మహర్షి. ఓ సమయంలో భరతవర్షమంతా విపరీతమయిన కరువుకాటకాలు. వర్షాలు లేవు, నీటిచుక్కలేదు. గౌతమమహర్షి వరుణదేవుడి గురించి తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే " వెంటనే వర్షాలు కురిపించు, ప్రజలు అల్లాల్లాడిపోతున్నారు...

శ్రీశ్రీశ్రీభారతీతీర్థమహాస్వాముల పట్టాభిషేక శుభదినోత్సవం. - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 భాగ్యనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్రిందటేడాది జరిగిన శ్రీశంకరజయంతి వేడుకలు సందర్భంగా శ్రీశృంగేరీ ఉత్తరపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీమహాస్వామి వారు అనుగ్రహభాషణం చేసారు. అద్భుతమైన విషయాలు తెలియచేసారు. " జంతూనాం నరజన్మ దుర్లభం " అన్నారు. 84 లక్షల జీవరాసుల్లో మనిషే బుద్ధిజీవి. ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకువెళ్ళేదే జ్ఞానమార్గం. ఈ జ్ఞానాన్ని కలుగచేసేవే వేదాలు. అవి ఏమిచెయ్యలో కాదు, ఎలా చెయ్యాలో కూడా తెలియచేసాయి. ఒక మనిషి ఇంకో మనిషితో ఎలా నడుచుకోవాలో కూడా తెలియచేసాయి. ఎంతటి అద్భుత సంపద. కంటితో చూస్తాం, చెవితో వింటాం. ఎన్నియుగాలయినా అదే సత్యం. వేదాలు చెప్పేవి కూడా అటువంటి విషయాలే. గురువు ముఖ్యలక్షణం ఏమిటంటే శిష్యుడి సమర్ధత యోగ్యతను బట్టి చదువు చెప్పడం. మరి వేదాలు అందరూ నేర్చుకోగలరా?. వేదాల్లో " తస్య ప్రతిమ నాస్తి " అని ఉంది. ఇక్కడ ప్రతిమ అంటే విగ్రహం అని అనుకుని కొందరు అతనికి ( దేవుడికి ) విగ్రహం లేదు అని వేదాలే చెపుతున్నాయి కదా మరి విగ్రహారాధన ఏమిటీ అంటున్నారు. కాని ప్రతిమ అంటే " ఉపమానం/పోలిక " అని అర్ధం. అంటే ...