శివకేశవులకు ఇష్టమయిన కార్తీకమాసం రేపటినుంచి - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 పురాణాలు, ఉపనిషత్తులు మనకు ఋషులు ఇచ్చిన అద్భుత సంపద. చిన్నచిన్న కధలతో మనకు, మానవాళికి, ప్రపంచానికి ఏది మంచో ఏది చెడో చక్కగా తెలియచేయబడ్డాయి. కార్తీకపురాణం లో ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి. ఒక సందర్భంలో సరస్వతీదేవి గాయత్రీదేవిని ఉద్దేశించి ఇలా అంటారు: " అపూజ్యా యత్రపూజ్యంతే పూజ్యానాంచ వ్యతిక్రమః, త్రీణిత్రత్ర భవిష్యంతి దుర్భిక్ష్యం మరణం భయం" " ఎక్కడైతే పూజార్హతలేనివారు పూజింపబడుతూ ఉంటారో, పూజనీయులు పూజింపబడడంలేదో అక్కడ కరువు, మరణం, భయం అనే మూడు విపత్తులు కలుగుతాయి " అని. ఇప్పుడు పూజార్హతలేనివారికి కూడా పాలాభిషేకాలు జరుగుతున్నాయి. అందువల్లే ఈ విపత్తులన్నీ అని అనుకోవచ్చు. ఈ పురాణంలోనే కృష్ణపరమాత్మ సత్యభామతో ఇలా అంటారు: " దేశగ్రామకులానిస్యుః భోగభాంజికేతాదిషు, కలౌతు కేవలం కర్తా ఫలభుక్పుణ్యపాపయోః ". అంటే " కృతయుగంలో పాపపుణ్యాలు ఎవరు చేసినా గ్రామానికి చెందేవి. ద్వాపరంలో వారి వంశానికి చెందేవి. కలియుగంలో మాత్రం ఎవరి కర్మఫలాలు వారికే చెందుతాయి " అని. స్వామి ఎన్నో అద్భుతమైన ఇతర విషయాలు కూ...