Posts

Showing posts from September, 2023

మిత్రులు - ఉత్తములు

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఉత్తమానాం స్వభావోయం,    పరదుఃఖః అసహిష్ణుత,    మయం దుఃఖంచ సంప్రాప్తం,  ‌  మన్యతే అన్యస్యవార్యతే "  ‌.       - వ్యాసర్షి, మహాభారతం ఉత్తములు ఇతరుల దుఃఖాన్ని తట్టుకోలేరు. తాము బాధపడతారు ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడానికి. మిత్రులు అందరూ ఉత్తములే, తోటి మిత్రుల బాధలను పంచుకునేవారే. కిం సంశయం? పూజ్యులు చాగంటివారి దగ్గరకు ఓ పెద్ద కాలేజి నడిపే ఆయన వచ్చి " మా కాలేజీ ఆడిటోరియంలో మహాభారతం ప్రవచనం చేయమని మిమ్మల్ని అడగడానికి వచ్చాను " అన్నారుట ( ఈ విషయం చాగంటివారే చెప్పారు ). " భేష్ మంచి ఆలోచన, తప్పకుండా చేస్తాను " అన్నారు గురువుగారు.  కాలేజీ ఆయన అన్నారు " అందరూ యువతీ యువకులు కనుక మీరు దయచేసి ద్రౌపదీ వస్త్రాపహరణం, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టడం లాంటివి వదిలేసి మిగతావి చెబితే బాగుంటుంది " అనడంతో ఈయన నవ్వి " మహాభారతం అంటే అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటేనే భారతం, అందుకని అన్నీ చెబుతాను " అన్నారుట. అలాగ వాట్సప్ అన్నాక అన్నీ ఉంటాయి. మనకు నచ్చేవి నచ్చనివి అన్నీ ఉంటాయి. ఎవరికి కావలసినవి వారు చూసి ఆనందిస్తారు. పట్టుబట్టకట్టుకుని...

స్వధర్మం

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " నాహం వేదైః నతపసా    నదానేన నచేజ్యయా,   శక్యా ఏవంవిధో ద్రష్టుం    దృష్టవాన్ అసి మాంయధా "                  - భ.గీత 11.53 గీతలో పరమాత్మ అంటారు " వేదాలు చదవడం తపస్సుచెయ్యడం దానంచెయ్యడం పూజలుచెయ్యడం లాంటివాటితో నన్ను చూడడం/పొందడం సాధ్యమైన పనికాదు " అని. తనయందు అచంచలమైన భక్తితో మాత్రమే అది సాధ్యమని తెలియచేసారు. జాబాలి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన అద్భుతమయిన తపస్సు చేసేవారు. ఓ సారి ధ్యానంలో అలా ఉండిపోవడం, ఆయన తలపై పిట్టలు గూడుకట్టుకుని జీవించడం జరిగింది. ఆయన ధ్యానంలోంచి బయటకువచ్చి తలను చూసుకుని ఓహ్ " గొప్ప తపస్వి " ని అయిపోయాను అనుకున్నాడు. అప్పుడు పిట్టలు కిలా కిలా నవ్వి " కాశీలోని తులాధారుడి తపస్సు ముందు నీ తపస్సు ఎంత " అనడంతో జాబాలి ఆశ్చర్యపోయాడు. కాశీలోని తులాధారుడి ఆశ్రమమంతా పుట్టలు పిట్టలతో నిండిపోయి ఉంటుందేమో, ఓ సారి వెళ్ళి చూడాలి అనుకుని కాశీ వెళ్ళాడు. తులాధారుడు ఎవరు అని ఒక్కొక్కరిని అడుగుతూ వెడితే చివరకు ఓ కిరాణాకొట్టుకు చేరాడు జాబాలి. కొట్లో కూర్చుని ఉన్నాయనను " తులాధారుడు " ఎవరని అ...

శ్రీలలితానామం77

 🌺🙏"శ్రీమాత్రేనమః"🙏🌺 " కామేశ్వరముఖాలోక కల్పితగణేశ్వరా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 77వ నామం.  అమ్మవారు( కామేశ్వరి ) కామేశ్వరుడు ముఖంలోకి చూడగానే స్వామి విఘ్నేశ్వరుడిని అనుగ్రహించారు అని. అమ్మవారు ఓరకంటితో చూసిందిట. ఆవిడ చిరునవ్వు ఎలా ఉందంటే పలువరసలు కూడా కనిపించనంత చిన్ననవ్వు. స్వామి ముగ్ధుడు అవకుండా ఎలా ఉండగలరు. అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేస్తున్నారు. అతను విఘ్నాస్త్రాన్ని ప్రయోగించాడు. అన్నీ విఘ్నాలే. తొలగించాలంటే విఘ్నాలకు ప్రభువైన విఘ్నేశ్వరుడు రావాలి, పైగా వెంటనే. అందుకని భర్త కామేశ్వరుడివైపు అలా చూసిందిట. ఎంత అద్భుతమైన విషయం. పార్వతీదేవి నలుగుపిండితో బొమ్మచేసి ప్రాణం పొయ్యడం, శివుడు ఆ బాలుడి తల ఖండించడం, గజాననుడి తలపెట్టడం తెలుసు మనకు. మరి ఈ విఘ్నేశ్వరుడు ఎవరు, అసలు విఘ్నేశ్వరుడు ఎప్పటివారో చూద్దాం. పరమాత్మ వ్యాసర్షితో " కలియుగం వచ్చేస్తూంది, జీవులు చాలా కష్టాలు పడతారు, సులువుగా మనశ్శాంతిని పొందడానికి, వేదాలను ఓ క్రమపద్ధతిలో పెట్టు " అనడంతో వ్యాసర్షి వేదవిభజనకు, 18 పురాణాలు, 18 ఉపపురాణాల రచనకు శ్రీకారం చుట్టారు. కాని...

భారతదేశం

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అగ్నిమిచ్ఛధ్వం భారతాః " - ఓ భారతులారా మనం అగ్నిని ఆశ్రయిద్దాం - వేదం. " భరత్వ రమణత్వాత్ భరతః " - అంది వేదం. అంటే పోషించేవాడు, ఆనందాన్నిచ్చేవాడు భరతుడు అని అర్ధం. భరత్వం అంటే భరించుట, రక్షించుట. ఈ రెండూ చేస్తున్నది పరమేశ్వరుడు. అందుకే ఆయన్ని " భరతుడు " అంది వేదం.  ఆ భరతుడిని పూజించేవారు భారతీయులు అంటే మనం. ఆ యజ్ఞాలను ఆచరించి, యజ్ఞాలద్వారా జీవించే యజ్ఞభూమికి " భరతవర్షం/భరతదేశం " అని పేరు. భారతదేశంలో జీవించేవారికి భారతీయులు అని పేరు. ఆ రకంగా మనమందరం భారతీయులుగా అయాం, జీవిస్తున్నాం, పిలువబడుతున్నాం, గౌరవించబడుతున్నాం. ఇతరదేశాల్లో మతం వేరు, విజ్ఞానం వేరు. ఆ రెండూ వేరు వేరు వ్యక్తులచేతుల్లో ఉంటాయి. మన దేశంలో అలాగకాదు. ఋషులే మతాన్ని, అందులోనే అత్యంత అద్భుతమైన, సాటిలేని విజ్ఞానాన్ని ఇచ్చారు. హమారా భారత్ మహాన్ - సూర్య. శుభం భూయాత్

శ్రీలలితానామం909

🙏"శ్రీమాత్రేనమః"🙏 " సామగానప్రియా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 909 వ నామం. " సామ " అంటే మనస్సుకు శాంతి. కీర్తనలు/పాటలు మనస్సుకు శాంతి కలిగిస్తాయి. అమ్మవారు కీర్తనలను, వాటిని గానం చేసేవారిని ఇష్టపడుతుంది. శివుడిని కూడా " సామగానప్రియాయనమః " అని పూజిస్తాం అష్టోత్తరశతనామాలపూజలో. గౌరీఅష్టోత్తరశతనామావళిలో రెండు నామాలు అద్భుతంగా అనిపిస్తాయి. అవి " గద్యపాద్యాదికారణాయైనమః, పదవాక్యార్ధనిలయాయైనమః " అన్నవి. గద్యం పద్యం లకు కారణం అమ్మవారు. పదం వాక్యంల అర్ధాలలో కొలువై ఉంటుంది అమ్మవారు. అందుకే వాటి సాహిత్యం అంత అద్భుతంగా ఉంటుంది. మరి సినీమాపాటల, లలితగీతాల సాహిత్యమే అద్భుతంగా అనిపిస్తే అమ్మవారిని కీర్తిస్తూ చేసే కీర్తనలలోని సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుంది. ముత్తుస్వామిదీక్షితులుగారు అమ్మవారి ఉపాసకులు. అమ్మవారి రూపం, స్వభావం పూర్తిగా తెలిసినవారు. వాటిని దృష్టిలో పెట్టుకుని సాహిత్యం, దానికితగ్గ రాగంలో అద్భుతమయిన కీర్తనలు చేసారు.  అందరూ ఎంతో తరచుగా వినే " వాతాపి గణపతిం భజే " కీర్తన దీక్షితార్ విరచితమే. ఆయన చేసిన నవగ్రహ...